breaking news
Ginning mills
-
పత్తి కొనుగోళ్లపై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అమల్లోకి తెచి్చన కొత్త నిబంధనలు జిన్నింగ్ మిల్లుల యజమానులకు రుచించడం లేదు. రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు సీసీఐ నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో విక్రయించే పద్ధతి గత సంవత్సరం వరకు సాగింది. రాష్ట్రంలో గత సంవత్సరం వానాకాలం సీజన్లో 25 లక్షల మంది రైతులు సుమారు 43 లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేస్తే, సీసీఐ మద్దతు ధరకు కొనుగోలు చేసిన పత్తి 21 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, దాన్ని విక్రయించిన రైతులు 9 లక్షల మంది మాత్రమే.రైతుల ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాల జిరాక్స్లను ముందుగానే తీసుకొని తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసే దళారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు.. అదే పత్తిని నోటిఫైడ్ జిన్నింగ్ మిల్లులకు మద్దతు ధరకు విక్రయించే ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విభాగం దీనిని గుర్తించి, ఈ దందాలో భాగమైన సీసీఐ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో రైతు స్వయంగా మిల్లుకు వెళ్లి మద్దతు ధరకు పత్తిని విక్రయించేలా సీసీఐ నిబంధనలు విధించింది. ప్రతి రైతు ‘కపాస్ కిసాన్’అనే యాప్లో తన వివరాలను నమోదుచేసుకొని, దాని ద్వారానే లావాదేవీలు సాగించాలని ఆదేశించింది. ఈ యాప్ను రైతులు వినియోగించలేరని దళారులు, మిల్లర్లు భావించినప్పటికీ, ఇప్పటికే 23 వేల మంది రైతులు యాప్ ద్వారా రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఎకరాకు 7 క్వింటాళ్ల ఆంక్షలు అందుకే... దళారులు మార్కెట్లో తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, రైతుల పాస్పుస్తకాలు, ఆధార్ కార్డుల ద్వారా ఎకరానికి 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని సీసీఐ నోటిఫైడ్ సెంటర్లలో విక్రయించేవారు. ఒక రైతుకు ఐదెకరాల భూమి ఉంటే అందులో రెండెకరాల్లో పత్తి సాగు చేసినా, ఐదెకరాల్లో పత్తి సాగైనట్లు చూపి మాయ చేసేవారు. దీన్ని నివారించేందుకు సీసీఐ ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇచి్చన అంచనాల మేరకు రాష్ట్రంలో కూడా సగటున ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే దిగుబడి వస్తుందని తేల్చారు. ఈ మేరకు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వానికి సీసీఐ తెలిపింది. ఈ నిర్ణయం మిల్లర్లకు అశనిపాతంగా మారింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మిల్లుల్లోనే విక్రయాలు రాష్ట్రంలో గతంలో పత్తి కొనుగోళ్లలో అనేక వింతలు చోటుచే సుకున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఆదిలాబాద్కు చెందిన రైతు కొత్తగూడెం, వరంగల్లో పత్తిని విక్రయించినట్లు జిన్నింగ్ మిల్లర్లు ఆధార్, పట్టా పాస్పుస్తకాలతో మాయజాలం చేశారు. దీంతో ఈసారి ఏ జిల్లా రైతులు ఆ జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తిని విక్రయించాలని సీసీఐ నిబంధన విధించింది. కొత్త జిల్లాల వారీగా ఈ విక్రయాలు జరగాలని తొలుత సీసీఐ నిర్ణయించగా, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు విజ్ఞప్తి మేరకు ఆ పరిధిని ఉమ్మడి జిల్లాకు పెంచారు. దీంతోపాటే అన్ని మిల్లుల్లో ఏకకాలంలో కొనుగోళ్లు జరపకుండా ఎల్–1, ఎల్–2, ఎల్–3 కింద ఒక్కో జిల్లాలో మిల్లులను 10 నుంచి 12 కేటగిరీలుగా విభజించారు.రిజి్రస్టేషన్ చేసుకున్న రైతులు ఆయా జిల్లాల్లో సీసీఐ ఎల్–1గా ఎంపిక చేసిన మిల్లులకే తొలుత పత్తిని విక్రయించాల్సి ఉంటుంది. ఎల్–1 మిల్లుల సామర్థ్యం పూర్తయిన తరువాతే ఎల్–2కి, ఆ తరువాత ఎల్–3కి అలా ఎల్–12 వరకు మిల్లులను విభజించారు. రాష్ట్రంలో ఉన్న 322 మిల్లుల్లో ఇప్పటివరకు తెరుచుకున్నవి 220 కాగా, ఇందులో ఎల్–1 కింద ఎంపికైన మిల్లులు 117 మాత్రమే. రాష్ట్రంలో ఏ మిల్లులోనైనా పత్తిని దూది, గింజలుగా వేరు చేసేందుకు సీసీఐ చెల్లిస్తున్న మొత్తం ఒక బేల్కు రూ.1,440 అని, 322 మిల్లులు ఇదే ధరతో మిల్లింగ్ చేస్తున్నప్పుడు ఎల్–1, ఎల్–2, ఎల్–3 అంటూ విభజన ఎందుకని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అయితే, పారదర్శకత కోసమే ఈ విభజన అని సీసీఐ చెపుతోంది. మిల్లర్లను సముదాయించిన మంత్రి తుమ్మల సీసీఐ నిబంధనలతో మిల్లులను నడపలేమని యాజమాన్యాల సంఘం ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. గురువారం నుంచే నిరవధికంగా అన్ని మిల్లులను మూసివేస్తామని సంఘం అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి ప్రకటించగా, బుధవారం రాత్రి వరకు సంఘం నాయకులతో మంత్రి తుమ్మల, మార్కెటింగ్ అధికారులు చర్చలు జరిపి ఆంక్షలను ఎత్తివేసేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో బంద్ వాయిదా పడింది. కాగా, సీసీఐ నిబంధనలతో ఆదాయంపై దెబ్బ పడిందని భావిస్తున్న మిల్లర్లు త్వరలోనే మరోసారి అలి్టమేటం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. -
ఈసారీ వి'పత్తే'..!
సాక్షి, హైదరాబాద్: పత్తికి కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధర రైతుకు దక్కకుండా చేసేందుకు జిన్నింగ్ మిల్లుల యజమానులు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా రైతులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్’యాప్ను వెనక్కు తీసుకొనేలా ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఈ వానాకాలం సీజన్లో పత్తి విక్రయాలకు సంబంధించి జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు. గురువారంతో సీసీఐ పిలిచిన పత్తి టెండర్లకు చివరి తేదీ కాగా, బుధవారం వరకు ఏ మిల్లూ టెండర్లలో పాల్గొనక పోవడం గమనార్హం. గురువారం జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొంటేనే అక్టోబర్ నుంచి మద్దతు ధరతో పత్తి కొనుగోళ్లకు అవకాశం ఉంటుంది. పెరిగిన పత్తి సాగు రాష్ట్రంలో ఈసారి 46 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పత్తి మార్కెట్కు వస్తుందని భావిస్తున్నారు. పత్తికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఈసారి రూ.590 పెంచింది. దీంతో నాణ్యమైన పత్తి (లాంగ్ స్టేబుల్) మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110లకు చేరింది. రెండో శ్రేణి పత్తి (మీడియం స్టేబుల్) మద్దతు ధర రూ.7,710గా ఉంది. కానీ, సీసీఐ ద్వారా మద్దతు ధరతో జరిగే పత్తి కొనుగోళ్లకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరించే మార్కెటింగ్ శాఖ ఈసారి బహిరంగ మార్కెట్లో పత్తి ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు సగటు ధరను 4,255గా నిర్ణయించారు. ఇక్కడ గరిష్ట ధర క్వింటాలుకు రూ.7,251 కాగా, కనిష్ట ధర రూ.3,711. ఈ నేపథ్యంలో రైతులు సీసీఐ ద్వారా కనీస మద్దతు ధరకు విక్రయిస్తే తప్ప ప్రయోజనం ఉండదు. ఇక్కడే జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు చక్రం తిప్పుతున్నాయి. దళారుల ద్వారా రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి, సీసీఐ ఇచ్చే మద్దతు ధరను దక్కించుకునే విధానానికి కొత్త నిబంధనలు అడ్డు తగులుతుండడంతో వాటిని ఎత్తి వేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. టెండర్లకు దూరంగా జిన్నింగ్ మిల్లులు రాష్ట్రంలో 354 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటిలో 341 మిల్లులు సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు అర్హత సాధించాయి. సీసీఐ ద్వారా రైతుల నుంచి పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి జిన్నింగ్ చేసేందుకు ఈ మిల్లులు టెండర్లలో పాల్గొనాల్సి ఉంటుంది. గత సంవత్సరం 310 మిల్లులు టెండర్లలో పాల్గొన్నాయి. కానీ, ఈసారి టెండర్లలో పాల్గొనేందుకు మిల్లర్లు ఆసక్తి చూపటంలేదు. అందుకు సీసీఐ నిబంధనలే కారణమని అంటున్నారు. రైతులు వారం ముందే ‘కపాస్ కిసాన్’లో స్లాట్ బుక్ చేసుకోవడం, జిల్లాలో పత్తి సాగు, క్రాప్ బుకింగ్ ఆధారంగా ఒక రైతు ఎన్ని క్వింటాళ్ల పత్తిని విక్రయించాలో ముందే నిర్ణయించడం, 8 నుంచి 12 శాతం వరకు తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేయటం, ఏ జిల్లాలో పండిన పత్తిని ఆ జిల్లాలోనే విక్రయించడం వంటి నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు ఈసారి పత్తి సేకరణ పట్ల ఆసక్తి చూపటంలేదు. తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి.. గత సంవత్సరం రాష్ట్రంలో పత్తి విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్ శాఖతో జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇందుకోసం రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈసారి కపస్ కిసాన్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐ నిర్ణయించింది. అయితే, ఈసారి యాప్ ద్వారా కొనుగోళ్లను నిలిపివేయాలని సీసీఐని జిన్నింగ్ మిల్లర్లు కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి సీసీఐకి లేఖ ఇప్పించాయి. రైతులకు నష్టం కలగనీయం పత్తి కొనుగోళ్ల విషయంలో గతంలో జరిగిన అవకతవకలు ఈసారి లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. దళారులు, వ్యాపారుల జోక్యం లేకుండా నేరుగా రైతులే పత్తిని మద్దతు ధరకు విక్రయించేలా ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్, వ్యవసాయ శాఖ అధికారులకు సూచించాం. మద్దతు ధరకే పత్తిని అమ్ముకోవాలని రైతులను కోరుతున్నాం. దళారుల మాటలు నమ్మి, తక్కువ ధరకు పత్తిని విక్రయించుకోవద్దు. – తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ మంత్రి తక్కువకు కొని.. ఎక్కువకు అమ్మి..గత సంవత్సరం రాష్ట్రంలో పత్తి విక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది. సీసీఐ, మార్కెటింగ్ శాఖతో జిన్నింగ్ మిల్లుల యజమానులు, దళారులు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. ఇందుకోసం రైతుల పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులను వినియోగించుకున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈసారి కపాస్ కిసాన్ యాప్ ద్వారానే పత్తి కొనుగోళ్లు జరపాలని సీసీఐ నిర్ణయించింది. అయితే, ఈసారి యాప్ ద్వారా కొనుగోళ్లను నిలిపివేయాలని సీసీఐని జిన్నింగ్ మిల్లర్లు కోరారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చి సీసీఐకి లేఖ ఇప్పించాయి. -
పత్తి ధర చిత్తు
ఖమ్మం వ్యవసాయం: పత్తి ధర పతనమవుతోంది. 20 రోజుల క్రితం రూ. 5 వేల వరకు పలికిన రేటు క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్వింటాల్ పత్తి రూ.3,000 నుంచి రూ. 4,000 వరకు మాత్రమే పలుకుతోంది. పంట సీజన్ కానప్పటికీ ధర పడిపోవటం చర్చనీయాంశంగా మారింది. సరుకు తక్కువగా అమ్మకానికి వచ్చే సమయంలో ధర బాగుటుందని భావించి రైతులు నిల్వ ఉంచిన పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. పంటలకు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. కొత్త పత్తి అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉండటంతో నిల్వ ఉంచిన పాత పత్తిని అమ్మకానికి తెస్తున్నారు. ఇక్కడి పత్తిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల్లోని జిన్నింగ్ మిల్లుల యజమానులు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. విదేశాల్లో పత్తికి అంతగా డిమాండ్ లేకపోవటంతో ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కొత్త పత్తి వచ్చే సీజన్ దగ్గరలోనే ఉండటంతో జిన్నింగ్ మిల్లుల యజమానులు సరుకు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపటం లేదని అంటున్నారు. క్వింటాల్కు రూ.1500 వరకు తగ్గింపు.. 20 రోజుల క్రితం క్వింటాల్ పత్తి రూ.4,900 వరకు పలికింది. రోజుకు కొంత చొప్పున తగ్గుతూ వచ్చింది. సోమవారం జెండా పాట రూ.4,400 పలికింది. అయితే వ్యాపారులు ఆ రేటు పెట్టలేదు. జెండాపాటకు ఖరీదుదారులు ముందుకు రాలేదు. మార్కెట్ అధికారులు వ్యాపారులను పిలిపించి జెండాపాట నిర్వహించారు. సరకుకు డిమాండ్ లేదని, ధర పెట్టలేమని వ్యాపారులు అధికారులకు చెప్పారు. రూ.4,400 జెండాపాట పలుకగా మార్కెట్లో రైతులు తెచ్చిన సరకులో అధికభాగానికి రూ.3 వేల నుంచి రూ.3,500 వరకే ధర పెట్టారు. బాగా నాణ్యంగా ఉన్న కొంత సరుకుకు రూ.4 వేల వరకు ధర పడింది. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు దాదాపు 10 వేల బస్తాల పత్తి అమ్మకానికి వచ్చింది. అన్సీజన్లో ధర అధికంగా ఉంటుందని పంటను తెస్తే తీరా ఇక్కడికి వచ్చాక ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


