ghee supply
-
బాబుదే మహాపచారం! ఇందాపూర్కు అవి‘నేతి’ విందు
సాక్షి, అమరావతి: నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అండ్ కో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటోంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో నెయ్యి రూ.529 చొప్పున విక్రయిస్తోంది. మరి ఇదే ఇందాపూర్ డెయిరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ, ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా రూ.638 చొప్పున సరఫరా చేస్తోంది. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీకి కిలోకు రూ.109 అధిక ధరకు విక్రయిస్తోంది. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించే నెయ్యిని ప్యాకింగ్ చేసి మరీ వినియోగదారులకు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ కిలోకు ఏకంగా రూ.109 అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో రూ.541 చొప్పున, హైదరాబాద్లో కిలో రూ.560 చొప్పున విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్ విధానంలో.. నెయ్యిని ప్యాకింగ్ చేసి, డెయిరీ హోల్సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ చార్జీలు, రవాణా చార్జీలతోపాటు హోల్సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకుని మరీ ధరను నిర్ణయిస్తారు. కానీ టీటీడీకి డెయిరీనే నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్, రవాణా వ్యయం తగ్గుతుంది. అందుకే బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డెయిరీ బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి నెయ్యిని కిలోకు రూ.97 అధిక ధరకు విక్రయిస్తోంది. అంటే ఆ విధంగా లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకుంది. అంటే ఏ స్థాయిలో దోపిడీ చేస్తోందనేది విభ్రాంతి కలిగిస్తోంది. ఈ దందా బయట పడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డెయిరీ అనే విషయాన్ని వెబ్సైట్లో తొలగించి, కో మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది. ఇందాపూర్’ రూటులోనే సంగం కల్తీ ‘వైష్ణవి’తో వ్యాపార బంధం» తిరుమల శ్రీవారి నిధులు కొల్లగొట్టేందుకు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు తలుపులు బార్లా తెరిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల టీడీపీ గోబెల్స్ ప్రచార టీమ్లో ముఖ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే. ఆయన సేవలకు మెచ్చి టీటీడీ నెయ్యి కాంట్రాక్టును బహుమతిగా ఇచ్చారు. సంగం డెయిరీకి కూడా కిలో రూ.599 చొప్పున కాంట్రాక్టు ఖరారు చేశారు. అంటే కిలోకు రూ.58 అధిక ధరకే కట్టబెట్టారు. ఆ విధంగా సంగం డెయిరీకి రూ.29.95 కోట్ల విలువైన 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. » ఇంతటి దోపిడీ సాగించేందుకే ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ముందస్తు కుట్రతోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారన్నది స్పష్టమవుతోంది. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కోసం టీటీడీ పిలిచిన టెండర్లను సంగం డెయిరీకి కట్టబెట్టాలని నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసేందుకు సానుకూలత వ్యక్తం చేసిన ఇతర డెయిరీల యాజమాన్యాలను ప్రభుత్వ పెద్దలు బెదిరించారన్న ఆరోపణలున్నాయి. అందుకే టీటీడీ మూడు సార్లు టెండర్లు పిలిచినా ఏ డెయిరీ కూడా బిడ్లు దాఖలు చేయ లేదని వినిపిస్తోంది. ఈ కారణం సాకుగా చూపి ఆ టెండర్ నోటిఫికేషన్లను టీటీడీ రద్దు చేసింది. » తిరుమల లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సరఫరా అంశంపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. గతంలో తిరస్కరించిన భోలేబాబా డెయిరీ అడ్డదారిలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసినట్టు వెల్లడైంది. తమ నెయ్యి ట్యాంకర్లను తిరుపతి జిల్లాలోని పెనుబాకలో ఉన్న వైష్ణవి డెయిరీకి పంపించి... అక్కడ నుంచి తమిళనాడులోని ఏఆర్ డెయిరీ ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్టు వెలుగు చూసింది.» టీటీడీ ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేవని వెల్లడైనా సరే అవే ట్యాంకర్లను కొన్ని రోజుల తరువాత తిరుమలకు పంపినట్టు కూడా వెల్లడైంది. దాంతో ఏఆర్ డెయిరీ, భోలే బాబా డెయిరీ ప్రతినిధులతోపాటు వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయకాంత్ చద్వాను అరెస్టు చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఈ వ్యవహారం బరితెగించి సాగించారు. అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో అంతా చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సాగిందన్నది స్పష్టమైంది. » తిరుపతి జిల్లా పెనబాకలో ఉన్న వైష్ణవి డెయిరీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందని సీబీఐనే నిగ్గు తేల్చింది. అసలు వైష్ణవి డెయిరీకి అంత అనుకూలంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎందుకు వ్యవహరించిందంటే... వైష్ణవి డెయిరీ టీడీపీ సిండికేట్లో సభ్య డెయిరీనే. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర చైర్మన్గా ఉన్న గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీ, వైష్ణవి డెయిరీ వ్యాపార భాగస్వాములు. ఆ రెండింటి మధ్య దృఢమైన వ్యాపార బంధం ఉందని తాజాగా వెల్లడైంది. వైష్ణవి డెయిరీ వెబ్సైటే ఆ విషయాలను పేర్కొనడం గమనార్హం. తిరుపతి జిల్లా పెనబాకలోని వైష్ణవి డెయిరీ ప్రధాన ద్వారంపై సంగం డెయిరీ ఎంబ్లమ్ కూడా ముద్రించి ఉంది. సంగం డెయిరీ ట్యాంకర్లు వైష్ణవి డెయిరీలోకి వెళ్తున్న వీడియోలు కూడా బయటపడ్డాయి.» చాలా జిల్లాల్లో వైష్ణవి, సంగం డెయిరీలు ఉమ్మడిగా రిటైల్ అవుట్ లెట్లను నిర్వహిస్తున్నాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సంగం డెయిరీకే టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అడ్డగోలుగా కట్టబెట్టిన వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే గతంలో భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని వైష్ణవి డెయిరీ ద్వారా సరఫరా చేశారు. భోలేబాబా డెయిరీ వ్యవహారం బయటపడటంతో ప్రస్తుతం సంగం డెయిరీ ద్వారా కథ నడపించాలని ఎత్తుగడ వేసినట్టు స్పష్టమవుతోంది. » అందుకోసం టీడీపీ కూటమి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా సాగించిన బాగోతం ఇలా ఉంది... కాగా వైష్ణవి – సంగం డెయిరీల బంధం బయటపడడంతో ఎంబ్లమ్ లు కనపడకుండా వైష్ణవి గేట్ల రంగులు మార్చేయడం గమనార్హం. అంతేకాకుండా రెండు డెయిరీల వెబ్సైట్లను కూడా తాత్కాలికంగా నిలుపుదల చేయడాన్ని చూస్తే.. వాటి మధ్య బంధం మరింతగా బట్టబయలైందని స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దల బెదిరింపులకు తలొగ్గిన జాతీయ డెయిరీలు» సంగం డెయిరీకి అనుకూలంగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేశారు. సంగం డెయిరీకి అనుకూలంగా నిబంధనలు విధించారు. అయిదేళ్ల అనుభవం ఉండాలి...వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లు ఉండాలన్న నిబంధనలే అందుకు తార్కాణం. పోటీలో ఉండకుండా ఇతర డెయిరీలను బెదిరించారు. ముందే రింగ్గా ఏర్పడి సంగం డెయిరీకి అనుకూలంగా సిండికేట్ వ్యవహారం నడిపారు. » సంగం డెయిరీకి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టాలని ప్రభుత్వం మొండి పట్టుదలతో ఉందని జాతీయ డెయిరీ సంస్థలకు అర్థమైంది. కాదని తాము బరిలో ఉంటే తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారని కూడా ఆ డెయిరీల యాజమాన్యాలు భయపడ్డాయి. దాంతో ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఆదేశించిన ధరకు బిడ్లు దాఖలు చేసి సంగం డెయిరీకి మార్గం సుగమం చేశాయి. ఎంత పక్కాగా కథ నడిపారు అంటే.. బిడ్లు దాఖలు చేసేందుకు గడువు తేదీ 2025, సెప్టెంబరు 4 తో ముగిసిన రెండు రోజుల్లోనే అంటే సెప్టెంబరు 6నే టీటీడీ టెక్నికల్ కమిటీ సభ్యులు సంగం డెయిరీని సందర్శించి సానుకూలంగా నివేదిక సమర్పించారు. » అంటే సంగం డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించినట్టు స్పష్టమవుతోంది. కర్ణాటక సహకార పాడి రైతుల ఫెడరేషన్ను పక్కనపెట్టేశారు. ఇక జాతీయస్థాయి డెయిరీలు కిలో నెయ్యి రూ.600 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేశాయి. ముందే నిర్ణయించిన స్క్రిప్ట్ ప్రకారం సంగం డెయిరీ ఒక్క రూపాయి తక్కువకు అంటే కిలో నెయ్యి రూ.599 చొప్పున సరఫరాకు బిడ్ దాఖలు చేసింది. దాంతో సంగం డెయిరీకి 5 లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఖరారు చేసింది. టీటీడీ పాలకమండలి చైర్మన్ బీఆర్ నాయుడు తోపాటు టీటీడీ పాలకమండలి అందుకు ఆమోదముద్ర వేసింది. ఏది కల్తీ... ఏది దోపిడీ చంద్రబాబూ.. తమ దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారు. టీటీడీకి నెయ్యి కిలో రూ.325 చొప్పున సరఫరా చేయగా ఆ ధరను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.638కి పెంచింది. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టడానికి ఇలా చేశామని వితండవాదం లేవనెత్తింది. రూ.638 చొప్పున అయితేనే నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేయగలమని చెబుతోంది. మరి అదే ఇందాపూర్ డెయిరీ ఆన్లైన్లో కిలో రూ.529 చొప్పున బహిరంగ మార్కెట్లో కిలో రూ.541 చొప్పున ఎలా విక్రయిస్తున్నట్టు? అంటే ఆన్లైన్, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తోంది కల్తీ నెయ్యి అని ఆ డెయిరీ ఒప్పుకుంటున్నట్టా? కాదు.. తిరుమల శ్రీవారి నిధులు కదా... బరితెగించి దోపిడీ చేసేందుకే కిలో నెయ్యి ఏకంగా రూ.638 చొప్పున ధర నిర్ణయించినట్టు సమ్మతించినట్టే కదా. అదే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు ముఠా బరితెగించి సాగిస్తున్న అవినీతి దందాతో యావత్ భక్తులు నివ్వెరపోతున్నారు. -
మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం
సాక్షి, అమరావతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భయం లేకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అసెంబ్లీని అబద్ధాలకు వేదికగా మార్చుకుందని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మతం ముసుగుతో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తిరుమల లడ్డూలో నెయ్యి అంశంపై ప్రభుత్వం చేసిన చర్చ అంతా వైఎస్ జగన్పై రాజకీయంగా బురదజల్లడానికేనని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్–ఇందాపూర్ డెయిరీల మధ్య ఉన్న అక్రమ సంబంధాలను కప్పిపుచ్చడానికి ఐదు రోజులు తాత్సారం చేసి, ఇవాళ లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని స్పష్టం చేశారు. గతంలో లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇవాళ అసెంబ్లీలో మాత్రం ‘కల్తీ జరిగింది’ అంటూ మాట మార్చడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. నిజంగా చంద్రబాబుకు దేవుడిపై భక్తి ఉంటే.. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీల మూలాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే.. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు ⇒ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం నారా చంద్రబాబు ఒక రిపోర్టులోని అంశాలను దురుద్దేశంతో మాజీ సీఎం జగన్పై ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూ తయారీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాషాయ బట్టలు కట్టుకుని గుడి మెట్లు కడిగారు. జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిపారని అన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ‘మాజీ సీఎం కలిపారని నేను అనలేదు, టీటీడీ ఉద్యోగులు కలిపారని అన్నాను’ అంటూ మాట మార్చారు. ఇప్పుడు కల్తీ జరిగిందని మాట్లాడుతున్నారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా వాడుతున్నారు. ⇒ జగన్ సీఎంగా ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు జరిగితే ఆయనకు రాజకీయ లాభం వస్తుందా? పవిత్ర విగ్రహాలు ధ్వంసం అయితే జగన్కు లాభం ఏంటి? ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు చేస్తాడు? జగన్ హయాంలో ఆలయాలపై దాడులు జరిగితే ఆయనకు లాభమా? ప్రత్యర్థి అయిన చంద్రబాబుకే లాభం కాదా? ఇదేనా మీ భక్తికి తార్కాణం బాబూ? ⇒ 2014–2019 మధ్య ఎన్ని గుడులను జేసీబీలతో కూల్చారో.. రాజధాని నడిరోడ్డున ఎన్ని ఆలయాలు కూల్చారో వీడియోలు ఉన్నాయి. ఇలా గుడులు కూల్చిన మీకు దేవుడి పట్ల భయం ఉన్నట్టా? ఇదేనా మీ భక్తికి తార్కాణం? ⇒ కూటమి ప్రభుత్వం వచి్చన తర్వాత కాశీనాయన ఆలయంలో కూల్చివేతలు ప్రారంభించింది ఎవరు? సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్కు ఇవి తెలియవా? అటవీ శాఖ ఆదేశాలు లేకుండా కూల్చివేతలు జరిగాయా? ప్రజలు నమ్ముతారా? శ్రీకాకుళంలోని శ్రీకూర్మం మందిరానికి మచ్చ తెచ్చారు. సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. గుడిలో మరణాలు అపచారం కాదా? ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కాదా? అంతకు ముందు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకున్నారా? ⇒ టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిశోర్ రెడ్డి ప్రోద్బలంతో అర్ధరాత్రి ఆలయ విధ్వంసం జరిగింది. తిరుచానూరులో వారాహి ఆలయాన్ని కూల్చింది ఎవరు? మీ పార్టీకి చెందిన వారు‡ కాదా? గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు మూడు మునకలు వేయడానికి 29 మంది భక్తులు ప్రాణాలు బలిగొన్నారు. తిరుమల తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చింది మీరు కాదా? రామతీర్థంలో స్వామివారి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నిధులు ఎలా ఇచ్చారు? ⇒ చంద్రబాబు ప్రభుత్వంలో కూల్చిన ఆలయాలను జగన్ ప్రభుత్వం పునర్ నిరి్మంచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కల్తీ నెయ్యి పాపం మీదే ⇒ మీరు సీఎం అయ్యాక పెట్టిన రెండో సంతకంతో టీటీడీ ఈవో శ్యామలరావును నియమించారుగా.. ఇప్పుడు ఆయన ఎందుకు కనిపించట్లేదు? మీరు చెప్పిన డెయిరీల దగ్గర నెయ్యి కొనడం లేదనే ఆయన్ను బదిలీ చేశారా? ⇒ 2024 జూన్లో ఆయన్ను నియమిస్తే జూలై 6న నాలుగు శాంపిల్స్, జూలై 12వ తేదీన మరో నాలుగు శాంపిల్స్ తీశారు. జూలై 16న 6వ తేదీన తీసిన శాంపిల్స్ రిపోర్ట్ వచ్చింది. జూలై 12న తీసిన శాంపిల్స్ రిపోర్ట్ జూలై 23న వచ్చింది. ఎన్డీడీబీ ఇచి్చన రిపోర్టులు జూలై 16, 23న వచ్చాయి. జూలై 25వ తేదీన ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఆ ట్యాంకర్లు ఎక్కడికి వెళ్లాయో సిట్ ఇప్పటికే బయటపెట్టింది. ⇒ ఆ ట్యాంకర్లు వైష్ణవీ డెయిరీకి సమీపంలోని రాఘవేంద్ర క్రషర్ వద్ద పెట్టడం, తిరిగి కొన్నాళ్ల తర్వాత వైష్ణవీ డెయిరీకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి టీటీడీకి అప్పగించడం వాస్తవం కాదా? పందికొవ్వు, గొడ్డు కొవ్వు కలిసిన ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేసి భక్తులకు పంచేశారు కదా. ఈ విషయాన్ని సిట్ తేల్చింది. అప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మీరే కదా.. ఈ పాపం వైఎస్ జగన్కు మీరు ఎలా అంటగడుతున్నారు? అసలు పాపం మీదే. వీళ్లు సరఫరా చేసింది కల్తీ నెయ్యా? తక్కువ రేటుకు నెయ్యి కొన్నారని ప్రశి్నస్తున్న మీరు.. మీ హయాంలో 2014–19లో రూ.278, రూ.264కు కేజీ నెయ్యి ఎలా కొన్నారో చెప్పండి. అప్పుడు టీటీడీ లడ్డూ ప్రసాదానికి అవసరమైన నెయ్యిలో 90 శాతం సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ ఆగ్రో డెయిరీ సరఫరా చేసింది. 2016 మార్చిలో కేజీ నెయ్యి రూ.332, సెపె్టంబర్ లో రూ.364కు, ఏప్రిల్ 2017లో రూ.411కు, అక్టోబర్ 2017లో రూ.378, జనవరి 2018 రూ.320, జూన్ 2018లో రూ.321కు సరఫరా చేసింది. ఇది కల్తీ నెయ్యా? మీ లాజిక్ ప్రకారమే చెప్పండి. ప్రీమియర్ డెయిరీకి చెందిన ఆశిష్ గుప్తా, రేణూ గుప్తాకు హెరిటేజ్ డెయిరీలో వాటాలుండటం నిజమో కాదో చంద్రబాబే చెప్పాలి. ఆల్ఫా డెయిరీకి కూడా హెరిటేజ్లో షేర్లు ఉన్నాయో లేదో చెప్పాలి. బయటపడ్డ హెరిటేజ్–ఇందాపూర్ బంధం ⇒ తమ డెయిరీకి బోలేబాబాతో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ పిటిషన్ వేసింది. బోలేబాబా ఆర్గానిక్కూ, సీబీఐ చార్జిషీట్లో ఉన్న బోలేబాబా ఆర్గోనిక్కూ సంబంధం లేదని అందులో చెప్పారు. తమకు ఢిల్లీ, రాజస్థాన్లో ఉన్న బోలేబాబా డెయిరీలతో సంబంధం ఉన్నట్లు చెప్పారు. కానీ ఐటీ శాఖ ఉత్తరాదిలో 35 డెయిరీల్లో 131 గంటల పాటు సోదాలు చేసి ఉత్తరాఖండ్, ధోల్ పూల్, రాజస్థాన్, ఢిల్లీ బోలేబాబా డెయిరీలన్నీ ఒకే గొడుగు కింద ఉన్న సంస్థలని తేల్చింది. ⇒ దీన్నిబట్టి భారత్లో పెద్ద డెయిరీ మాఫియా నడుస్తోందని అర్థమవుతోంది. దీనికి వైట్ కాలర్ డాన్ ఎవరు? ఇండియా మాఫియా డెయిరీకి పాబ్లో ఎస్కోబార్ ఎవరు? బాబూ ఇదేనా మీ భక్తి? ⇒ మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 2024 నవంబరు 16 న మరణిస్తే.. ఏడాది తిరక్కుండానే మార్చి 21, 2025న మీ మనవడి పుట్టిన రోజున తిరుమలకు వెళ్లి టీటీడీకి రూ.44 లక్షలు దానం ఇచ్చి పూజలు చేయలేదా? ⇒ చంద్రబాబు హయాంలో 2014 –19 మధ్య పవిత్ర జెరూసలెం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని ప్రభుత్వం రూపొందిస్తున్న పథకాలను ఆర్టీసీ టికెట్ వెనుక ముద్రించాలని జీవో ఇచ్చింది మీరు కాదా? అవి జగన్ వచ్చే వరకు చలామణీలో ఉన్నాయి. దానికి జగన్కు ఏం సంబంధం? ఈ పాపం ఎవరిది? మీ హయాంలోనే నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు ⇒ బోలేబాబా డెయిరీకి పొమిల్ జైన్, విపుల్ జైన్ ఓనర్లు. వైష్ణవీ డెయిరీ ఓనర్లు కూడా వాళ్లే. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన సంగం డెయిరీ వైష్ణవీ పార్ట్నర్. ఇవాళ అసెంబ్లీలో పెద్ద పెద్దగా రంకెలేసిన ధూళిపాళ్ల నరేంద్ర ఇప్పుడేం చెప్తారు? బోలేబాబా, వైష్ణవీ డెయిరీల ఓనర్లు పొమిల్ జైన్, విపుల్ జైన్ ఇద్దరికీ హెరిటేజ్లో వాటాలు ఉన్నమాట వాస్తవం కాదా? ఏఆర్ డెయిరీ చంద్రబాబుకు దగ్గరా, జగన్కు దగ్గరా? ఏఆర్ డెయిరీ ఓనర్ రాజు రాజశేఖర్ డిండిగల్లో హెరిటేజ్ఫ్యాక్టరీని కట్టించింది నిజమా కాదా? ⇒ నిబంధనలు సడలించి, నాణ్యతా ప్రమాణాలు తగ్గించారని చెబుతున్న చంద్రబాబు.. దాని నేపథ్యం కూడా చెప్పాలి. ఇవాళి్టకీ అవే నిబంధనలు అమల్లో ఉన్నాయి. సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో ఉన్న ప్రీమియర్ డెయిరీ, ఆల్ఫా డెయిరీ, మాల్ గంగా డెయిరీ, వైష్ణవీ డెయిరీలు 2025 జనవరి వరకు నెయ్యి సరఫరా చేశాయి. ఇప్పుడు మీ నిబద్దత ఏమైందో చెప్పండి. -
అవును.. ఇందాపూర్ డెయిరీ హెరిటేజ్ ‘కో మాన్యుఫాక్చరర్’
సాక్షి, అమరావతి: టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న ఇందాపూర్ డెయిరీ తమ కుటుంబ సంస్థ హెరిటేజ్కు కో–మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అని శాసన సభ సాక్షిగా సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇందాపూర్ డెయిరీలో హెరిటేజ్ ఉత్పత్తులు తయారవుతాయని వెల్లడించారు. తమకు కో–మాన్యుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఇందాపూర్పై ఆరోపణలు చేస్తున్నారని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంలో హెరిటేజ్కు ముడిపెడుతున్నారని, దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై శాసన సభలో మంగళవారం నిర్వహించిన లఘు చర్చలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తులను ప్రభుత్వానికి ఎన్నడూ సరఫరా చేయలేదని తెలిపారు. తిరుమల క్షేత్రం ఏడు కొండలపై వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన 746, 747 జీవోలను తానెప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని వాడారని ఎన్డీడీబీ అనుమానిత నివేదిక ఆధారంగానే ప్రకటన చేశానని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యితో తయారు చేసిన 20.01 కోట్ల లడ్డు ప్రసాదాలను విక్రయించారని ఆరోపించారు. సీబీఐ సిట్ సిఫార్సులు అమలు చేయడం కోసం ఏకసభ్య కమిషన్ను నియమించామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక టీటీడీ ప్రక్షాళనకు చర్యలు తీసుకున్నామన్నారు.గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి బైబిల్ పట్టుకున్నారని, కరుణాకర్రెడ్డి కుమార్తె వివాహం క్రైస్తవ సంప్రదాయంలో చేశారని విమర్శించారు. కాగా 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా తాను అధికారంలోకి వస్తే 746, 747 జీవోలను రద్దు చేస్తామని గుంటూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఆ విషయాన్ని కప్పి పుచ్చి, ఆ జీవోలను తాను వ్యతిరేకించలేదని అసెంబ్లీ వేదికగా తనకు అలవాటైన రీతిలో కళ్లార్పకుండా అబద్ధాలను వల్లె వేశారు. పెరుమాళ్లకే ఎరుక: పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తానెక్కడా అనలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి దీనికి బాధ్యత తీసుకోవాలన్నారు. రసాయనాలు కలిపిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని తేలిందన్నారు. ఇందులో లక్ష లడ్డూలు అయోధ్యకు పంపారని, అయితే ఇది రికార్డుల్లో నిరూపితం కావడం లేదన్నారు. రసాయనాల్లో ఏముందో పెరుమాళ్లకే ఎరుక అని వ్యాఖ్యానించారు. నిబంధనలు సవరించి, నచ్చిన సంస్థలకు గత ప్రభుత్వంలో నెయ్యి సరఫరా కాంట్రాక్ట్లు ఇచ్చారని విమర్శించారు. -
‘రివర్స్’తో నందిని నెయ్యి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. మహాపచారానికి పాల్పడ్డారని పచ్చి అబద్ధాలు వల్లిస్తూ శ్రీవారి సన్నిధిలో రివర్స్ టెండర్లు ఏమిటంటూ గద్దించిన సీఎం చంద్రబాబు తాజాగా అదే విధానంలో నిబంధనలకు విరుద్ధంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థకు కేటాయించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.టెండర్లో ఎల్ 1గా నిలిచిన కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి పూర్తి స్థాయిలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకుండా రివర్స్ టెండర్ పిలిచి అత్యధికంగా ఆల్ఫా మిల్క్ సంస్థకు కేటాయించడం గమనార్హం. నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కు కట్టబెట్టేందుకే లడ్డూలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి తెచ్చి రివర్స్ టెండర్ విషయాన్ని పక్కదారి పట్టించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ 1 కాదని ఎల్ 2కి ఎలా ఇస్తారు? ‘రివర్స్’ మతలబేంటి?తిరుమలలో స్వామి వారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమకు అనుకూలమైన వారికి కట్టబెట్టాలని కూటమి పెద్దలు ముందుగానే నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా టీటీడీ గత నెల 7 తేదీన మూడు నెలలకు సరిపడా నెయ్యి సరఫరాకు ఈ టెండర్లు పిలిచింది. ఇందులో కర్ణాటకకు చెందిన నందిని(కర్ణాటక కో–ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) కిలో నెయ్యి రూ.470 చొప్పున సరఫరా చేసేందుకు కోట్ చేసి ఎల్ 1గా నిలిచింది.ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ రూ.530 కోట్ చేసి ఎల్ 2గా నిలిచింది. నిబంధనల ప్రకారం ఎల్ 1గా నిలిచిన నందినికే టెండర్ దక్కాలి. అయితే నందినిని కాదని ‘ముఖ్య’ నేత ఆల్ఫా ఫుడ్స్ సంస్థకు నెయ్యి టెండర్ కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో టీటీడీ వెంటనే రివర్స్ టెండర్లు పిలిచింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఈ టెండర్లు పిలిచిన తరువాత తిరిగి టెండర్లు పిలవాల్సి వస్తే మళ్లీ ఈ టెండర్నే పిలవాలి.రివర్స్ టెండర్కి అవకాశమే లేదు. అయితే టీటీడీ ఈవో ఆదేశాల మేరకు గత నెల 9న రివర్స్ టెండర్స్ నిర్వహించారు. ఈసారి ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ కిలో నెయ్యి రూ.450 చొప్పున కోట్ చేయగా నందిని కిలో రూ.475కి కోట్ చేసింది. ఈ టెండర్లో ఆల్ఫా మిల్క్ ఫుడ్స్కి 65 శాతం నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఖరారు చేశారు. రివర్స్ టెండర్పై వివాదాన్ని తెరపైకి తేకుండా నందినికి 35 శాతం నెయ్యి సరఫరా అవకాశం కల్పించారు. -
నెల్లూరులో పాలు, నెయ్యి కల్తీ
నెల్లూరు సిటీ: నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఆహార పదార్థాల కల్తీపై మరోమారు కొరడా ఝుళిపించారు. నగరంలో కొంతకాలం క్రితం మున్సిపల్ శాఖ అధికారులు హోటల్స్, రెస్టారెంట్లు, బార్లు, చికెన్ స్టాల్స్, ఫ్రూట్ జ్యూస్ కేంద్రాలపై దాడులు చేశారు. నిల్వ మాంసం, ఆహార పదార్థాలు విక్రయిస్తున్న బయటపడడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. తాజాగా మంగళవారం జరిగిన దాడుల్లో మరో కల్తీ వ్యవహారం బట్టబయలైంది. మనం రోజూ వినియోగించే నెయ్యి, పాలు సైతం కల్తీకి గురవుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా.. నగరంలోని నవాబుపేట మహాలక్ష్మి ఆలయం వీధిలో ఓ వ్యక్తి కొన్నేళ్లుగా పాల ఉత్పత్తి కేంద్రం నిర్వహిస్తున్నాడు. అక్కడే నెయ్యి తయారీని కూడా చేస్తుంటాడు. రోజుకు సుమారు వెయ్యి లీటర్లకుపైగా పాలను నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన పాలను సేకరిస్తారు. వాటిలో నీళ్లు, పౌడర్ కలిపి కల్తీ చేసి నగర ప్రజలకు విక్రయాలు చేస్తున్నారు. అదేవిధంగా నెయ్యిని కూడా ఆ కేంద్రంలోనే తయారీ చేసి విక్రయిస్తున్నారు. పాలు, నెయ్యి కల్తీ వ్యవహారంపై నగరపాలకసంస్థ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణకు సమాచారం అందడంతో మంగళవారం తయారీ కేంద్రంపై దాడులు చేశారు. నెయ్యిలో ఓ కంపెనీకి చెందిన సన్ఫ్లవర్ ఆయిల్ను కలుపుతున్నారు. అధికారులు దాడులు చేయడంతో కేంద్రం నిర్వాహకుడు పరారయ్యాడు. దాడుల్లో సుమారు 200 లీటర్ల కల్తీ పాలు, పాల పౌడర్, 600 కేజీల నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్, తయారీ వస్తువులను స్వాధీనం చేసుకుని కేంద్రాన్ని సీజ్ చేశారు. కల్తీ పాలు, నెయ్యిని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే హానికరమైన కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా కల్తీ ఆహారంపై అవగాహన పెంచుకోవాలి. కల్తీ పదార్థాలు తయారు చేస్తున్నా, విక్రయిస్తున్నా నా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటా.– వెంకటరమణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ -
ప్రధానాలయాలకు విజయ నెయ్యి సరఫరా చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేయాలని విజయ డెయిరీ నిర్ణయించింది. ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి, భద్రాచలం రామాలయం, వేములవాడ రాజన్న, బాసర సరస్వతి దేవాలయాలకు విజయ నెయ్యిని సరఫరా చేస్తామని పేర్కొంది. వీటితోపాటు మరికొన్ని ముఖ్యమైన దేవాలయాలకు కూడా సరఫరా చేస్తామని, వీటికి నెలకు 50 టన్నుల నెయ్యి అవసరమవుతుందని తెలిపింది. దేవదాయశాఖ పరిధిలోని అన్ని ఆలయాలకు సరఫరా చేసేలా ఉత్తర్వులిస్తే మరింత లాభం చేకూరుతుందని, దీని కోసం ఆదేశాలివ్వాలని కోరింది. మార్కెట్ ధరకు లేదా అంతకంటే తక్కువకే నాణ్యమైన విజయ నెయ్యిని దేవాలయాలకు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొంది. -
హెరిటేజ్కూ చంద్రన్న ‘సంక్రాంతి కానుక’
-
సొంతవారికి సంతర్పణ
* ఏపీలో ఖజానాకు రూ. 26 కోట్ల కన్నం * హెరిటేజ్కూ చంద్రన్న ‘సంక్రాంతి కానుక’ * పేదలకు ‘గిఫ్ట్ ప్యాక్’ నెయ్యి కొనుగోళ్లలో అక్రమాలు * మార్కెట్ కన్నా రూ.200 ఎక్కువకు విక్రయం * విశాఖ డెయిరీ నెయ్యి కిలో ధర రూ. 320 మాత్రమే.. * భారీగా కొనుగోలు చేస్తే ధర మరింత తగ్గించే అవకాశం * కానీ.. సహకార డెయిరీలు, ఇతర డెయిరీల జోలికి వెళ్లని సర్కారు * టెండర్లు కూడా పిలవని వైనం * హెరిటేజ్ కిలో నెయ్యి ధరనే ప్రామాణికంగా తీసుకొనేలా చక్రం తిప్పిన నాయకులు * నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేలా డిపాజిట్లూ తీసుకోలేదు.. పైగా అడ్వాన్సు చెల్లింపులు నెయ్యి సరఫరా చేసే సంస్థ నుంచి నిబంధనల ప్రకారమైతే మొత్తం విలువలో 5 శాతం ముందస్తు డిపాజిట్ తీసుకోవాలి. నాణ్యత లోపించినా, ప్రమాణాలు పాటించకున్నా డిపాజిట్ నుంచి ఈ సొమ్ము మినహాయించుకునే అవకాశం ఉంటుంది. చంద్రన్న కానుక నెయ్యి సరఫరాలో ప్రభుత్వం డిపాజిట్ నిబంధనకు నీళ్లొదిలింది. సదరు సంస్థలకు అడ్వాన్సులు చెల్లించి మరీ నెయ్యి సరఫరా చేయాలని కోరింది. అంటే నెయ్యిలో నాణ్యత లోపించినా, తూకం తగ్గినా ప్రభుత్వం తప్పని సరిగా తీసుకోవాలే తప్ప చేయగలిగేదేం ఉండదు. గోధుమ పిండి, కందిపప్పు కొనుగోలులోనూ రూ.కోట్ల సంతర్పణ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: విశాఖ డెయిరీకి చెందిన గేదె నెయ్యి కిలో ప్యాకెట్ను రూ. 320 ధరకు మార్కెట్లో రిటైల్గా విక్రయిస్తున్నారు. వెయ్యి కిలోల నెయ్యి ఏకమొత్తంగా కొంటే.. అదీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే.. ఈ ధర మరింత తగ్గుతుందనేది నిర్వివాదాంశం. పోనీ ఇతర డెయిరీల ధరలు చూసినా.. గరిష్టంగా రూ. 375 ధరకు నెయ్యి సరఫరా చేసేందుకు చాలా డెయిరీలు సిద్ధంగా ఉన్నాయి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న కానుకగా రేషన్ కార్డుదారులకు అందించే నెయ్యిని మాత్రం కిలోకి ఏకంగా రూ. 200 అధికంగా చెల్లిస్తూ రూ. 575 (వ్యాట్తో కలిపి) ధర చెల్లించింది. అదికూడా.. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరి టేజ్ సహా.. అస్మదీయులకు చెందిన పలు సంస్థల నుంచి 1,301 కిలో లీటర్ల నెయ్యి కొనుగోలు చేసింది. రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందంటున్న సర్కారు పెద్దలు.. సహకా ర డెయిరీలు విక్రయించే ధరకన్నా చాలా అధికంగా చెల్లిస్తూ.. నెయ్యి కొనుగోలులోనే రూ. 26 కోట్లకు పైగా ప్రజా ధనాన్ని సంతర్పణ చేయటం విస్తుగొలుపుతోంది. నిబంధనల ప్రకారం మార్కెట్లో తక్కువ ధరకు సరఫరా చేసి వారి నుంచి టెండర్లు ఆహ్వానించి కొనుగోళ్లు చేయాల్సి ఉండగా.. అటువంటివేమీ లేకుండా అత్యవసర కొనుగోళ్ల పేరుతో అస్మదీయులకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించి రూ.కోట్లను దారపోశారని అధికార వర్గాల్లోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ ధరలు రూ.320 నుంచి మొదలు సంక్రాంతి పండుగకు చంద్రన్న కానుక కింద పేదలకు ఉచితంగా అందించే ‘గిఫ్ట్ ప్యాక్’లో మిగిలిన సరుకులతో పాటు ఒక కార్డుకు 100 గ్రాముల చొప్పున నెయ్యి కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం 1,301 కిలో లీటర్ల నె య్యి కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలోను, పొరుగు రాష్ట్రాల్లోను అనేక డెయిరీలు కిలో నెయ్యి ప్యాకింగ్తో సహా రూ. 320 నుంచి రూ. 420 వరకు విక్రయిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో విశాఖ డెయిరీ నెయ్యి కిలో రూ. 320 ధరకు, దొడ్ల డెయిరీ నెయ్యి రూ. 350, తిరుమల డెయిరీ నెయ్యి రూ. 375, నందిని డెయిరీ నెయ్యి రూ. 420 ధర చొప్పున రిటైల్ అమ్మకాలు జరుపుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రిటైల్ కొనుగోలు దారులకు కిలో గేదె నెయ్యి రూ. 372 ధరకు విక్రయిస్తామని బెజవాడలోని ఒక సూపర్ మార్కెట్ పత్రికా ప్రకటన ఇచ్చింది. వందల కిలోలు కొంటే ఈ ధర మరింత తగ్గించేందుకు సరేనంటోంది. ఇవన్నీ పరిశీలించి.. బహిరంగ టెండర్లు పిలవడం ద్వారా తక్కువ ధరకు నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు వచ్చే సంస్థకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు అప్పగించాల్సి ఉంటుంది. సహకార డెయిరీలను సంప్రదించకుండానే... చంద్రన్న కానుకలో భాగంగా 1,301 టన్నుల నెయ్యి కొనుగోలు కోసం సహకార రంగంలోని విశాఖ డెయిరీ, విజయ డెయిరీలతో ప్రభుత్వం బేరసారాలు జరిపినట్లయితే.. అవి మార్కెట్లో విక్రయించే ధరకన్నా మరింత తక్కువ ధరకే అంటే కిలో నెయ్యి రూ. 300 ధరకు సరఫరా చేసే అవకాశం ఉండేది. ధర తగ్గించకపోయినా విశాఖ డెయిరీ వాస్తవ ధరకుకొనుగోలు చేసినా.. రూ. 33 కోట్లు ప్రజాధనం ఆదా అయ్యేది. పోనీ తిరుమల డెయిరీ ధరకు కిలో రూ. 375 చొప్పున కొనుగోలు చేసినా.. రూ. 26 కోట్లు వృథా అయ్యేవి కాదు. వేయి టన్నులకు పైగా నెయ్యి కొనుగోలు కోసం బహిరంగ టెండర్లు నిర్వహించి పోటీ పెడితే కిలో నెయ్యి పన్నులతో కలిపి రూ. 350 ధరకే లభించే అవకాశం వుంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక పెద్ద నేత ఒత్తిడితో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు పద్ధతి ప్రకారం నెయ్యి సేకరణ జరపలేకపోయారని చెప్తున్నారు. హెరిటేజ్ డెయిరీ ధరే ప్రామాణికంగా... మార్కెట్లో చంద్రబాబు కుటుంబానికి చెంది న హెరిటేజ్ సంస్థ మాత్రం కిలో నెయ్యిని రూ. 499 ధరకు వినియోగదారులకు విక్రయిస్తోం ది. ఈ కారణంగానే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి హెరిటేజ్ తరఫున, తమ సంస్థల తరఫున చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది. నెయ్యి సరఫరాకు మిగిలిన డెయిరీలేవీ ముం దుకు రాకుండా అధికార పార్టీ ముఖ్య నేత తెరవెనుక వ్యవహారం నడిపారని తెలిసింది. ఇలా నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు లేకుండా చేసి.. హెరిటేజ్ నిర్ణయించిన ధరనే ఖరారు చేయించి తమకు, తమకు కావాల్సిన వారికీ ప్రయోజనం కలిగేలా కిలో నెయ్యి రూ. 499 ధరతో పాటు దీని మీద 14.5 శాతం విలువ ఆధారిత పన్ను కలిపి కిలో రూ. 575 చొప్పున కొనుగోలు చేయించే ఎత్తుగడ అమలు చేశారని సమాచారం. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ అస్మదీయులకు అయాచిత లబ్ధిచేకూర్చటమే లక్ష్యంగా.. హెరిటేజ్ ధరనే ప్రామాణికంగా నిర్ణయించి ఆ సంస్థతో పాటు, టీడీపీ నేతలు, వారి సన్నిహితులకు చెందిన మరికొన్ని ఇతర సంస్థలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టును అప్పగించారని చెప్తున్నారు. అత్యవసరం పేరు తో జరిపిన ఈ లావాదేవీ వల్ల ఒక్క నెయ్యి సరఫరాలోనే కిలోకు రూ. 200 చొప్పున 1,301 కిలో లీటర్ల కొనుగోళ్లలో రూ. 26 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని తెలుస్తోంది. ప్రభుత్వం అదనంగా చెల్లించే రూ. 26 కోట్లలో నీకింత నాకింత అనే ఒప్పందం జరిగినట్లు తెలిసింది. అయిన వారికే నెయ్యి కాంట్రాక్టులు... హెరిటేజ్ సంస్థ నిర్ణయించిన మేరకు కిలో నెయ్యి రూ. 499 లెక్కన నెయ్యి కొనుగోలు చేయడానికి నిర్ణయించిన సర్కారు తమకు కావాల్సిన సంస్థలు, టీడీపీ నేతల బినామీలకు ఇదే ధర చెల్లించేలా చక్రం తిప్పారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు కడప జిల్లాలో 70 కిలో లీటర్ల నెయ్యి సరఫరాను అప్పగించింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ. 3,49,30,000 చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. టీడీపీలోని ఒక ముఖ్య నేత కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలున్న కేంద్రీయ భాండార్ సంస్థకు శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో 545 కిలో లీటర్ల నె య్యి సరఫరాకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ. 27,19,55,000 చెల్లించనున్నట్లు పేర్కొంది. సంగం డెయిరీకి గుంటూరు జిల్లాలో కొంత భాగానికి 116 కిలో లీటర్ల సరఫరాకు గాను 5,78,84,000 రూపాయలు చెల్లించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గుడ్లైఫ్ ఎంటర్ ప్రజైస్ సంస్థ విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కొంత భాగానికి 503.063 కిలో లీటర్ల నెయ్యి సరఫరా బాధ్యత ఇచ్చింది. ఇందుకోసం ఆ సంస్థకు రూ. 25,10,28,437 చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఏలూరుకు చెందిన శ్రీ చక్ర మిల్క్ ప్రాడక్ట్ సంస్థకు విజయనగరం జిల్లాలో 67 కిలో లీటర్ల సరఫరాకు రూ. 3,34,33,000 చెల్లించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కొనుగోలు వ్యవహారంలోనే పౌరసరఫరా శాఖ ఉన్నతాధికారికి, ప్రభుత్వంలో కీలకమైన ఒక నేతకు మధ్య వార్ నడిచినట్లు సంబంధిత శాఖలోని కింది స్థాయి సిబ్బంది చెప్తున్నారు.


