-
మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ సి63 ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.1.3 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఏఎంజీ క్లాస్లో భారత్లో తాము అందిస్తున్న పదో మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్హర్డ్ కెర్న్ చెప్పారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్తో లభించే ఈ 4.0 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ కారు ఇంతకు ముందటి మోడళ్లతో పోల్చితే 32 శాతం అధిక మైలేజీనిస్తుందని వివరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటుందని తెలిపారు. పెర్ఫామెన్స్ కార్ల సెగ్మెంట్లో ఈ కారుతో తమ స్థానం పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ : అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ... జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు మూడు కొత్త కార్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్ 500 కూపే, ఏఎంజీ ఎస్ 63 కూపే, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ కార్లను వినియోగదారుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల (ఢిల్లీ ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది. ఎస్500 కూపే ధర రూ.2 కోట్లుగా, ఏఎంజీ ఎస్ 63 కూపే ధర రూ.2.60 కోట్లుగా, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ ధర రూ.2.17 కోట్లుగా ఉంది. 2015లో 15 మోడళ్లను భారత మార్కెట్లో ఆవిష్కరించాలనే ‘15 లో 15’ వ్యూహంలో భాగంగానే ఈ కార్లను మార్కెట్లోకి తె చ్చినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే కంపెనీ వినియోగదారుల కోసం ‘డిజైనో’ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నచ్చిన ప్రత్యేక రంగు, హై క్వాలిటీ ఇంటీరియర్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వంటి తదితర ఆప్షన్లను అందిస్తోంది. -
బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్యూవీ.. కొత్త వేరియంట్
ధర రూ.59.9 లక్షలు న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ)మోడల్ ఎక్స్3లో కొత్త వేరియంట్ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ.59.9 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ పేర్కొంది. 3-లీటర్ ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజిన్తో అందిస్తున్న ఈ కారును చెన్నై ప్లాంట్లోనే అసెంబుల్ చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు. డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎంచుకోవడానికి వీలయ్యేవిధంగా వివిధ మోడ్ల్స్తో కూడిన బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి వినూత్నమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ ఎక్స్ల్స్3లో రెండు వేరియంట్లు (తాజాగా అందిస్తున్న బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్3 డ్రైవ్ 20డి) అందిస్తున్నామని వాన్ పేర్కొన్నారు. -
ఆడి క్యూ3 ఎస్యూవీ.. కొత్త వేరియంట్లు
ధరలు రూ. 29-38 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యూ3లో మూడు కొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త కార్లను 1968 సీసీ డీజిల్ ఇంజిన్తో రూపొందించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ చెప్పారు. వీటిల్లో బేస్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలని, మిడ్ వెర్షన్ ధర రూ.33.99 లక్షలని, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.37.50 లక్షలని(మూడు ఎక్స్ షోరూమ్ ధరలు, ఢిల్లీ) అని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్లతో భారత లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 3,139కు చేరాయని వివరించారు. మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఆడి కంపెనీ ఈ ఏడాది పది మోడళ్లను మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఆర్ఎస్ 6 అవాంట్ కారు(ధర రూ.1.35 కోట్లు), ఆర్8ఎల్ఎంఎక్స్, ఆడి టీటీ కూపే,ఆర్ఎస్ 7 స్పోర్ట్బ్యాక్ కార్లను విడుదల చేసింది. -
బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్.. కొత్త వేరియంట్
ధర రూ. 39.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో స్పోర్ట్ లైన్ కారులో అప్డేటెడ్ వేరియంట్ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ పరిచయ ధర రూ.39.90 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు. ఈ కొత్త వేరియంట్లో డ్రైవింగ్ పరిస్థితులను బట్టి వివిధ మోడ్ల డ్రైవింగ్ను ఎంచుకునే బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. ప్రస్తుతం భారత్లో 12కు పైగా మోడళ్లను విక్రయిస్తున్నామని, వీటిల్లో ఎనిమిదింటిని చెన్నై ప్లాంట్లోనే అసెంబుల్ చేస్తున్నామని వివరించారు. 2007 నుంచి భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటివరకూ రూ.490 కోట్లు పెట్టుబడులు పెట్టింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement