-
ఎన్ 95 మాస్క్ల పేరుతో భారీ మోసం
జార్జియా: కరోనా వైరస్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో కొత్త రకాల మోసాలు బయటపడుతున్నాయి. ఓ వ్యక్తి ఫేస్ మాస్క్లు విక్రయిస్తానంటూ విదేశీ సంస్థతో $317 మిలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకొని మోసం చేసిన ఘటన జార్జియాలో జరిగింది. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉండటంతో మాస్క్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ని ఆసరాగా చేసుకొని కొందరు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. సవన్నాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. జార్జియాకు చెందిన పౌల్ పెన్ మరో ఇద్దరు కలిసి 50 మిలియన్ ఎన్-95 మాస్క్లను ఓ విదేశీ ప్రభుత్వానికి విక్రయించడానికి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జరిగింది. అయితే పౌల్ పెన్ బృందం ప్రస్తుతం తమ వద్ద మాస్క్లు లేవని, ఒప్పందం ప్రకారం డబ్బులు వెంటనే చెల్లిస్తే మాస్క్లు త్వరలో ఇస్తామని సదరు విదేశీ సంస్థను ఒప్పించారు. మాస్క్ల ధర కూడా ప్రస్తుత మార్కెట్ ధర కన్నా ఐదు రెట్లు ఎక్కువ ఉన్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చదవండి: హాంకాంగ్పై మరింత పట్టు అయితే ఈ విషయాన్ని గుర్తించిన యూఎస్ సీక్రెట్ ఏజెన్సీ ఒప్పందానికి సంబంధించిన లావాదేవీలు పూర్తికావడానికి ముందే ఆపేసింది. సంఘటనపై జార్జీయాలోని యూఎస్ అటార్నీ బాబీ క్రిస్టిన్ మాట్లాడుతూ.. మాస్క్ల డిమాండ్ దృష్ట్యా కొందరు ఆగంతకులు వాటిని తమకు అవకాశాలుగా మలచుకొని ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు. ఈ చర్య క్షమించరానిది' అంటూ క్రిస్టిన్ ఓ ప్రకటనలో తెలిపారు. పెన్తో పాటు ఈ ఘటనకు సంబంధమున్న మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నారు. స్పెక్ట్రమ్ గ్లోబల్ హోల్డింగ్స్ ఎల్ఎల్సీ ద్వారా పెన్ ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరిపినట్లు న్యాయవాదులు తెలిపారు. 2018లో అట్లాంటా శివారు ప్రాంతాల్లో నోర్క్రాస్లో ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. సవన్నాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయవాదులు దాఖలు చేసిన పత్రాల ప్రకారం.. పాల్పెన్పై నేర నిరూపణ అయితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. చదవండి: ట్విట్టర్ను మూసేస్తా : ట్రంప్ -
అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో గుర్తు తెలియని వ్యక్తి 14 ఏళ్ల ముస్లిం బాలిక హిజాబ్ను చించేస్తూ, ఆమె ఉగ్రవాది అని ఆరిచిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలు సోమవారం రాత్రి అట్లాంటాలోని ఓ మాల్ వద్ద మరికొందరితో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నిందితుడి కోసం వెతుకున్నట్లు డన్వూడీ పోలీసులు తెలిపారు. పౌరులందరి రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఈ కేసులో సమగ్ర విచారణ జరుపుతామని డన్వూడీ పోలీస్ చీఫ్ బిల్లీ గ్రోగాన్ చెప్పారు. ఈ సంఘటనను దాడిగానే భావిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడి గురించి సమాచారం ఇచ్చే వారికి అమెరికన్–ఇస్లామిక్ సంబంధాల మండలి జార్జియా చాప్టర్(సీఏఐఆర్–జార్జియా) వేయి డాలర్ల నజరానా ప్రకటించింది. ఆ వ్యక్తి ముందుకొచ్చి క్షమాపణ చెబితే అతనిపై ఎలాంటి కేసు పెట్టమని బాలిక కుటుంబం తెలిపింది. అమెరికాలో హిజాబ్ ధరించిన మహిళలు లక్ష్యంగా దాడులు జరుగుతున్న తరుణంలో ఈ సంఘటన వెలుగుచూడటం గమనార్హం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement