-
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ ధరలు తగ్గింపు
స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్-సిరీస్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోడల్స్ గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ను విడుదల చేసిన అనంతరం, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం గెలాక్సీ ఎస్8 64జీబీ మోడల్ రూ.49,990కు, గెలాక్సీ ఎస్8 ప్లస్ 64జీబీ మోడల్ రూ.53,990కు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్8ప్లస్ 128జీబీ మోడల్ ధరను రూ.64,900కు తగ్గించింది. అంటే అంతకముందు ధరలతో పోలిస్తే గెలాక్సీ ఎస్8పై 8వేల రూపాయల డిస్కౌంట్ను, గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్ఫోన్పై 11వేల రూపాయల డిస్కౌంట్ను శాంసంగ్ ప్రకటించింది. ఈ తగ్గించిన ధరలు కంపెనీ అధికారిక వెబ్సైట్లోనూ, శాంసంగ్ అధికారిక రిటైల్ ఛానల్స్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలనుకునే వారు రూ.10వేల పేటీఎం క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు. గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8ప్లస్ వేరియంట్లు శాంసంగ్ ఎక్సీనోస్ 8895 ఎస్ఓసీతో రూపొందాయి. గెలాక్సీ ఎస్8 స్మార్ట్ఫోన్ 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉండగా.. గెలాక్సీ ఎస్8ప్లస్ స్మార్ట్ఫోన్ 6.2 అంగుళాల స్క్రీన్ షేరింగ్ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్ను కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మార్కెట్లోకి వచ్చాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లు కూడా 4జీబీ ర్యామ్నే కలిగి ఉన్నాయి. కానీ స్టోరేజ్ విషయంలో గెలాక్సీ ఎస్8 స్మార్ట్ఫోన్ 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 256జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్తో మార్కెట్లోకి రాగ, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 128జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఐరిష్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేసియల్ రికగ్నైజేషన్, 3000 ఎంఏహెచ్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీలతో రూపొందాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లను అతిపెద్ద హైలెట్ బిక్స్బీ వర్చ్యువల్ అసిస్టెంట్. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్లపై ధర కోత
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్లపై భారత్లో ధరలను తగ్గించింది. రూ.57,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 స్మార్ట్ఫోన్ను రూ.53,900కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాక రూ.64,900గా ఉన్న గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్ ధరను కూడా రూ.58,900కు తగ్గించింది. అంటే మొత్తంగా ఈ రెండు స్మార్ట్ఫోన్ ధరను రూ.4000, రూ.6000 మేర తగ్గించినట్టు ప్రకటించింది. నవరాత్రి సందర్భంగా ఈ రెండు హ్యాండ్సెట్లపై ప్రమోషనల్ డిస్కౌంట్ కింద రూ.4000ను కూడా ఆఫర్ చేసింది. అంతేకాక ఈ నెల మొదట్లో గెలాక్సీ జే7 ప్రైమ్, గెలాక్సీ జే5 ప్రైమ్ స్మార్ట్ఫోన్లపై కూడా శాంసంగ్ ధరలను కోత పెట్టింది. ధరల తగ్గింపు అనంతరం గెలాక్సీ జే7 ప్రైమ్ను రూ.14,900కు, గెలాక్సీ జే5 ప్రైమ్ను రూ.12,990కు అందుబాటులోకి తీసుకొచ్చింది. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ ఎస్8 ప్లస్ ఫీచర్లు... 6.2 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్. -
గెలాక్సీ ఎస్8, నోట్8 లలో కొత్త ఎడిషన్
న్యూఢిల్లీ : శాంసంగ్ కంపెనీ యూజర్లకు ఆశ్చర్యకరమైన కానుక ఇచ్చింది. అమ్మకాల్లో దూసుకుపోతున్న గెలాక్సీ నోట్8, గెలాక్సీ ఎస్8లలో 'ఎంటర్ప్రైజ్ ఎడిషన్' వేరియంట్లను శాంసంగ్ విడుదల చేసింది. ఈ కొత్త బిజినెస్ టూ బిజినెస్ ప్రొడక్ట్లు, బిజినెస్ వాడకాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్లోకి వచ్చాయి. గెలాక్సీ ఎస్8, నోట్ 8 ఎంటర్ప్రైజ్ ఎడిషన్ల తయారీ గ్యారెంటీని శాంసంగ్ మూడేళ్లు పొడిగించింది. అయితే ఈ కొత్త వేరియంట్ల ధరలను కంపెనీ వెల్లడించలేదు. సాఫ్ట్వేర్ను మినహాయిస్తే, మిగతా స్పెషిఫికేషన్లన్నీ ముందస్తు వెర్షన్లకు ఈ వేరియంట్లకు ఒకేవిధంగా ఉన్నాయి. గెలాక్సీ ఎస్8 ఫీచర్లు.. 5.8 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్ప్లే కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరుజ్ 12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గెలాక్సీ నోట్8 ఫీచర్లు... 6.3 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ప్లే ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ షూటర్ 3300 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఐఫోన్ ఎక్స్ లాభాలు ఆఖరికి శాంసంగ్కే..
శాంసంగ్, ఆపిల్ రెండూ స్మార్ట్ఫోన్ మార్కెట్లో నువ్వానేనా అంటూ తలపడుతుంటాయి. తమ లాభాలను అసలు పక్క కంపెనీకి వదలకుండా పోటీపడుతుంటాయి. ఇటీవల ఈ రెండు కంపెనీలు తమ ప్రీమియం స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్లను విడుదల చేస్తే, ఆపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆపిల్ నుంచి వచ్చిన ఆల్ట్రా-ప్రీమియం స్మార్ట్ఫోన్ ఐఫోన్ ఎక్స్. ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దీన్ని ప్రవేశపెట్టింది. మరో నెలలో ఇది విక్రయానికి వచ్చేస్తోంది. అయితే ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే ఎక్కువగా లాభపడేది శాంసంగ్ కంపెనీనేనట. అదేమిటి? ఐఫోన్ ఎక్స్ మార్కెట్లోకి వస్తే లాభాలు వచ్చేది ఆపిల్కి కదా..? శాంసంగ్కు ఎలా అనుకుంటున్నారా? ఐఫోన్ ఎక్స్ కు కావాల్సిన ఓలెడ్ ప్యానల్స్ను, ఎన్ఏఎన్డీ ఫ్లాష్, డీర్యామ్ చిప్లను శాంసంగ్ కంపెనీనే అందించింది. ఈ కాంపోనెంట్లను సరఫరా చేసిన ఏకైక సప్లయిర్ శాంసంగ్ కంపెనీనే. దీంతో 999 డాలర్ల విలువైన ఐఫోన్ ఎక్స్ ఒక్కో యూనిట్ విక్రయంపై 110 డాలర్లు వరకు శాంసంగ్ కంపెనీకే వెళ్లనున్నట్టు వాల్స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. అంటే ఐఫోన్ ఎక్స్ మొత్తం మార్కెట్ ధరల్లో 10 శాతం శాంసంగ్ కంపెనీకేనట. వచ్చే రెండేళ్లలో 130 మిలియన్ యూనిట్లను ఆపిల్ విక్రయించాలని చూస్తోంది. దీంతో గెలాక్సీ ఎస్ 8ల విక్రయం కంటే ఎక్కువ లాభాలు, ఆపిల్ ఎక్స్ నుంచే శాంసంగ్కు రానున్నట్టు రిపోర్టు పేర్కొంది. శాంసంగ్ కంపెనీకి 35 శాతం రెవెన్యూలు కూడా తను అందించే కాంపోనెంట్ల నుంచే వస్తున్నట్టు తెలిపింది. మొత్తం ఐఫోన్ ఎక్స్ నుంచి 14 బిలియన్ డాలర్ల వరకు లాభాలను ఆర్జించవచ్చని ఈ కొరియా కంపెనీ అంచనావేస్తోంది. ఇదే కాలంలో గెలాక్సీ ఎస్8 నుంచి 10 బిలియన్ డాలర్ల వస్తాయని తెలుస్తోంది. స్మార్ట్ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీదారిగా ఉన్న శాంసంగ్కు ఇంతమొత్తంలో రెవెన్యూలను అందించడం ఇష్టం లేని ఆపిల్, ఒకానొక సమయంలో మరో సప్లయర్ కోసం కూడా చూసిందని వార్తలు వచ్చాయి. 2019 నుంచి ఎల్జీని సప్లయర్గా ఎంపికచేసుకుంటుందని రూమర్లు ఉన్నాయి. అయితే మార్కెట్లో ఎంత పోటీ ఉన్నప్పటికీ, శాంసంగ్, ఆపిల్ మధ్య గత కొన్నేళ్లుగా ఉన్న స్వీట్ రీలేషన్షిప్ ఇదేనని టెక్ వర్గాలంటున్నాయి. -
గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్లపై స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్ మొదలైంది. కంపెనీలన్నీ వరుసబెట్టి తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీలైతే ఏకంగా భారీ భారీ డిస్కౌంట్లతో మెగా సేల్స్కు తెరలేపాయి. తాజాగా స్మార్ట్ఫోన్ల రారాజు శాంసంగ్ కూడా 'నవ్రాత్ర స్పెషల్ ఆఫర్' ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా తన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై ధరను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరను 4వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లాంచింగ్ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్8, 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్8 ప్లస్ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్బ్యాక్ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది. అయితే ఈ తగ్గించిన ధరలు ఇంకా కంపెనీ సొంత ఆన్లైన్ స్టోర్లో అప్డేట్ కాకపోవడం గమనార్హం. ఈ ఫోన్లు ఏప్రిల్లో భారత్లో లాంచ్ అయిన తర్వాత చేపట్టిన ఈ కోత, అత్యంత ముఖ్యమైన ధర తగ్గింపుగా కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్ వేరియంట్కు రెండు భిన్నమైన విధానాల్లో ధరల తగ్గింపు శాంసంగ్ చేపట్టింది. గెలాక్సీ ఎస్8 ప్లస్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్పై కేవలం రూ.1000 ధర మాత్రమే తగ్గించి, 64,900 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపు ఫెస్టివ్ సీజన్కు కాస్త ముందుగా కంపెనీ చేపట్టింది. అంతేకాక త్వరలోనే శాంసంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ నోట్ 8 మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఫోన్ గతవారమే భారత్లో విడుదలైంది. ప్రస్తుతం భారత్లో దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్21 నుంచి సరుకు రవాణా అవుతోంది. గెలాక్సీ నోట్ 8 ధర 67,900 రూపాయలు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement