-
ఎఫ్టీఐఐ అధ్యక్షుడిగా బీపీ సింగ్
పాపులర్ టెలివిజన్ సిరీస్ ‘సీఐడీ’ దర్శక, నిర్మాత బీపీ సింగ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ఈ ఉన్నారు. గత ఏడాది అక్టోబరులో అనుపమ్ ఖేర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాది పాటు సేవలు అందించిన తర్వాత 2018 అక్టోబరు 31న అనుపమ్ ఖేర్ ఈ పదవి నుంచి బయటకొచ్చారు. ఈ సందర్భంగా సింగ్కు ఎఫ్టీఐఐ పుణె డైరెక్టర్ భూపేంద్ర కైన్థోలా స్వాగతం పలికారు. ‘ఇన్స్టిట్యూట్లో జరిగే అన్ని విషయాలపై సింగ్కు అవగాహన ఉంది. మే 2017లో ఎఫ్టీఐఐ తరఫున దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఎడ్యుకేషన్ ‘స్కిల్ ఇండియా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్’ ఆలోచన సింగ్దే. దీని ద్వారా దేశంలోని దాదాపు 24 నగరాల్లో 120 షార్ట్ కోర్సులను నిర్వహించాం’ అని ఆయన అన్నారు. బీపీ సింగ్ దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తోన్న ‘సీఐడీ’కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ సిరీస్ 21 ఏళ్లుగా బ్రేక్ లేకుండా సోనీ టీవీలో టెలికాస్ట్ అవుతోంది. 2004లో సింగ్ పేరు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. ‘సీఐడీ’లోని 111 నిమిషాల షాట్ను సింగిల్ టేక్లో రికార్డు చేసిన ఘనత కూడా సింగ్కే దక్కింది. -
అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. !
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ టెలివిజన్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్టీఐఐ) చైర్మన్గా ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అనుపమ్ ఖేర్ మంచి నటుడే కానీ.. ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయపరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎఫ్టీఐఐ చైర్మన్గా అనుపమ్ను నియమించడంపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీఎన్ సింగ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నటుడిగా అనుపమ్ చాలా గొప్ప పాత్రలు పోషించారని, ఎఫ్టీఐఐ పురోగతి కోసం ఆయన పనిచేసే అవకాశముందని పేర్కొన్నారు. 'ఆయన టీవీలోనూ, వెండితెరపై మంచి అభినయాన్ని కనబర్చారనే విషయంలో సందేహం లేదు. కానీ ఆయనను ఎఫ్టీఐఐ చైర్మన్గా ఎందుకు నియమించారో మీకు, నాకు దేశం మొత్తానికి తెలుసు. కేవలం ఆయన నటన నైపుణ్యం మీద ఆధారపడి ఈ నియామకం జరగలేదు. ఆయన ఇటీవల సినిమాల కన్నా రాజకీయాల గురించే ఎక్కువగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే' అని ఆర్పీఎన్ సింగ్ అన్నారు. ఐదు వేలకుపైగా సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరొందిన అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్రమోదీకి గట్టి మద్దతుదారు. మోదీకి, బీజేపీకి అనుకూలంగా వ్యవహరించినందుకే ఆయన ఎఫ్టీఐఐ చైర్మన్గా పదవి లభించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. -
గజేంద్ర చౌహాన్ స్థానంలో అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. బాలీవుడ్ లో విభిన్న పాత్రలతో అలరించిన ఆయనను ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు (ఎఫ్ టీ ఐ ఐ) చైర్మన్గా నియమించారు. పుణెలో ఉన్న ఈ ఇన్సిస్టిట్యూట్ కు ఇన్నాళ్లు బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో అనుపమ్ ఖేర్ కు బాధ్యతలు అప్పగించారు. అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించిన అనుపమ్ ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. చైర్మన్ గా గజేంద్ర చౌహాన్ నియామకం రాజకీయ వత్తిడి కారణంగా జరిగిందంటూ ఇన్సిస్టిట్యూట్ విద్యార్ధులు ఆందోళన చేయటంలో మార్చిలో ఆయన పదవి నుంచి తప్పుకన్నారు. -
సినీ విద్య!
సినిమా అనేది పిల్లలకు ఇష్టమైనదే కాదు బలమైన సామాజిక మాధ్యమం కూడా. ఇప్పుడు ఈ ‘సినిమా’ను విద్యారూపంలో మన దేశంలోని అన్ని ప్రాంతాల పిల్లలకు చేరువచేయడానికి నడుం కట్టారు అమితాభసింగ్. సినిమాటోగ్రాఫర్, నిర్మాతగా అమితాభసింగ్కు చిత్రపరిశ్రమలో పది సంవత్సరాల అనుభవం ఉంది.‘‘అతి పెద్ద పట్టణం నుంచి అతి చిన్న పల్లె వరకు అందరినీ ఆకట్టుకునే బలమైన మాధ్యమం సినిమా. చెప్పాలంటే ఇది పిల్లల మాధ్యమం. భవిష్యత్ మాధ్యమం. సృజనాత్మకతకు మెరుగులుదిద్దే మాధ్యమం. అందుకే దీన్ని పిల్లల దగ్గరకు తీసుకువెళ్లాలనుకుంటున్నాను’’ అంటున్నారు అమితాభసింగ్.ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్టీఐఐ) విద్యార్థి అయిన అమితాభసింగ్ ‘ఖోస్లా కా ఘోస్లా’ ‘ది గుడ్ రోడ్’ ‘చిల్లర్ పార్టీ’ ‘షార్ట్ కర్ట్ సఫారీ’....మొదలైన సినిమాలకు పనిచేశారు.తన కెరీర్లో భాగంగా ఎంతో మంది చిల్ట్రన్ ఆర్టిస్ట్లతో కలిసి పనిచేసిన అనుభవం అమితాభసింగ్కు ఉంది. ‘‘స్కూళ్లలో రాయడం, పెయింటింగ్, డ్యాన్స్...ఇలా రకరకాల కళారూపాల గురించి నేర్పిస్తుంటారు. అందులో ఫిల్మ్ మేకింగ్ మాత్రం కనిపించదు’’ అంటున్న అమితాభసింగ్ పది నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు ఫిల్మ్మేకింగ్ గురించి అవగాహన పరచడానికి ‘సినీ విద్య’ పేరుతో స్కూళ్లలో మూడు రోజుల పాటు వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్షాప్లో భాగంగా పిల్లలకు సినిమాలు చూపించడంతో పాటు స్క్రీన్–ప్లే రైటింగ్, ఎడిటింగ్...మొదలైనవి నేర్పిస్తారు. షార్ట్ ఫిల్మ్ల కోసం పిల్లలు కథలు తయారుచేస్తారు.‘‘మూడు రోజుల్లోనే పిల్లలకు అంతా వచ్చేస్తుంది అనే భ్రమలో నేను లేను. ఇది ప్రాథమిక పరిచయం మాత్రమే’’ అంటున్న అమితాభసింగ్ పాఠశాలల యాజమాన్యాలు అనుమతిస్తే వర్క్షాప్ కాలవ్యవధిని మూడు రోజుల నుంచి పదిరోజులకు పెంచగలనని అంటున్నారు.‘‘ప్రేక్షకులుగా ఉన్నప్పుడు రకరకాల ఊహలు వస్తుంటాయి. ఇలాంటి వర్క్షాప్ల ద్వారా ఆ ఊహలు రెక్కలు తొడుగుతాయి’’ అంటున్నారు అమితాభసింగ్. ఎంత సినీ విద్య అయినప్పటికీ దీన్ని కూడా స్కూళ్లలో పాఠ్యాంశంలా బోధిస్తే ‘ ఆసక్తి’ బదులు సీరియస్నెస్ పెరుగుతుందని, అందుకే ఆడుతూ పాడుతూ మాత్రమే దీన్ని నేర్పాలి అనేది అమితాభసింగ్ అభిప్రాయం.‘సినీ విద్య’ వర్క్షాప్కు హాజరైన పిల్లల్లో కొందరు అనాసక్తిగా హాజరై ఉండొచ్చు. ఆసక్తిగా హాజరైన పిల్లల్లో కొందరు... ఆ తరువాత ఆ ఆసక్తికి దూరమై...ఎప్పటిలాగే చదువులో పడిపోవచ్చు.అయినప్పటికీ అమితాభసింగ్లో ఆశావహదృక్పథం ఉంది. ‘సినీ విద్య’ నుంచి ప్రభావితమైన వారిలో కొందరు పిల్లలైనా దేశం గర్వించదగ్గ ఫిల్మ్ మేకర్స్ అవుతారనే సంపూర్ణ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే అమితాభసింగ్ను చురుగ్గా ముందుకు నడిపిస్తుంది. -
నిరసనల మధ్యే చౌహాన్ బాధ్యతలు
నియామకం జరిగిన 7 నెలలకు ఎఫ్టీఐఐ చైర్మన్గా పగ్గాలు * ఆయన్ను అడ్డుకునేందుకు విద్యార్థుల విఫలయత్నం * విద్యార్థులతో ‘రాజీ’కి ఎఫ్టీఐఐ సంకేతాలు పుణే: ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎఫ్టీఐఐ) చైర్మన్గా ఏడు నెలల కిందట నియమితులైన ప్రముఖ టీవీ నటుడు, బీజేపీ నేత గజేంద్ర చౌహాన్ నాటకీయ పరిస్థితుల మధ్య గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సంస్థతో ఏమాత్రం సంబంధంలేని చౌహాన్ను ఈ పదవిలో నియమించడాన్ని వ్యతిరేకిస్తున్న ఎఫ్టీఐఐలోని కొందరు విద్యార్థులు... ఆయన్ను అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. పుణేలోని సంస్థ కార్యాలయం వద్ద సుమారు 40 మంది విద్యార్థులు చౌహాన్ ‘డౌన్ డౌన్’ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. చౌహాన్ కారును అడ్డగించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిపై లాఠీచార్జి చేసి అదుపులోకి తీసుకున్నారు. గతేడాది జూన్లో చౌహాన్ను కేంద్రం ఈ పదవిలో నియమించగా అప్పటి నుంచీ విద్యార్థులు నిరసనగళం వినిపిస్తూనే ఉన్నారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ విద్యార్థులు గతేడాది 139 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేశారు. నూతన బాధ్యతలు చేపట్టే ముందు చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ సంస్థ ఎజెండా ప్రకారం పనిచేస్తానని చెప్పారు. మరోవైపు విద్యార్థులతో రాజీకి వచ్చినట్లుగా సంకేతాలిస్తూ ఎఫ్టీఐఐ సొసైటీ...సంస్థ పూర్వ విద్యార్థి, నిర్మాత, దర్శకుడు అయిన బీపీ సింగ్ను ఎఫ్టీఐఐ వైస్ చైర్మన్గా నియమించింది. అలాగే అకడమిక్ కౌన్సిల్ చైర్మన్గా కూడా ఆయన్ను నామినేట్ చేసింది. కాగా, సంస్థ పాలక మండలి సభ్యులుగా ఫిల్మ్మేకర్ రాజ్కుమార్ హిరాణీ, నటుడు సతీష్ షా, సినీ విమర్శకురాలు భావనా సౌమయ్య, అస్సామీ నటుడు ప్రంజాల్ సైకియా తదితరులు నామినేట్ అయ్యారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement