-
Friendship Day: మైత్రి.. ఓ మాధుర్యం.. అండగా ఉంటూ, ఆదర్శంగా నిలుస్తూ..
సాక్షి, కరీంనగర్: బాల్యం.. స్నేహం ఎవరికైనా తీయని జ్ఞాపకం. విద్యార్థి దశలో మొదలైన స్నేహం.. జీవితంలో కలిసి సాగడం నిజంగానే అరుదు. అదో అదృష్టం కూడా. బతుకు బాటలో స్నేహ బంధానికి మించింది లేదు. స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు.. ప్రాణ స్నేహితులు చాలా అరుదుగా ఉంటుంటారు. స్నేహం తప్ప మరేదీ ఆశించకుండా కొనసాగే బంధాలు మాత్రమే కలకాలం ఉంటాయి. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. ఫ్రెండ్షిప్డే రోజున కేక్ కట్ చేస్తున్న స్నేహితులు అతివల ‘స్నేహం’ కోరుట్ల: స్నేహానికి వయో..లింగ భేదం లేదు. కోరుట్ల పట్టణానికి చెందిన ఓ పదిహేను మంది మహిళలు 15 ఏళ్లుగా తమ స్నేహ బంధాలను కొనసాగిస్తున్నారు. తమ గ్రూపునకు స్నేహం అనే పేరు పెట్టుకుని దాన్ని సార్థకత చేసుకునే దిశగా ఒకరికొకరు కష్టసుఖాల్లో కలిసికట్టుగా ముందుకు సాగుతున్నారు. కోరుట్లకు చెందిన గృహిణులు గరిపెల్లి మాధవి, కంటాల అనిత, రమాదేవి, సునీత, లీల తదితరులు పదిహేనేళ్లుగా ప్రెండ్స్గా ఉన్నారు. వీరంతా ఎవరి ఇంట్లో ఏలాంటి శుభ కార్యాలు ఉన్నా కలిసికట్టుగా ఒకరికొకరు సాయంగా పనులు చేసుకుంటారు. అంతే కాదు..గ్రూపు సభ్యుల్లో ఎవరికి కష్టం వచ్చినా తమకు తోచిన రీతిలో అవసరాలు తీర్చడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతీ ఫ్రెండ్షిఫ్ డే రోజున తమ అనుబంధాన్ని బలీయం చేసుకునేందుకు అంతా కలిసి కేక్ కట్ చేసి ఏడాదికి ఒకరి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి గడుపుతారు. నగదు అందజేస్తున్న క్లాస్మేట్స్ మిత్రుడికి అండగా క్లాస్మేట్స్ రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రానికి చెందిన పీసరి భూమానందం ఇటీవల అనారోగ్యం బారిన పడగా వైద్యం చేయించుకునే స్థోమత లేదు. ఈక్రమంలో తోటి మిత్రులైన క్లాస్మేట్స్ (2000–01 ఎస్సెస్సీ బ్యాచ్, రుద్రంగి జెడ్పీ హైస్కూల్) వైద్య ఖర్చులకు రూ.50వేలు ఆర్థికసాయం చేసి స్నేహభావాన్ని చాటుకున్నారు. నేను, ఎమ్మెల్యే ప్రాణ స్నేహితులం కోల్సిటీ(రామగుండం): రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నేను ప్రాణ స్నేహితులం. గోదావరిఖని తిలక్నగర్ డౌన్లో ఒకే వాడలో ఉంటాం. మేం బంధువులమైనా చిన్నప్పటి నుంచి పీజీ వరకు కలిసే చదివాం. మా ఇద్దరి మధ్య ఏరోజూ గొడవ జరగలేదు. చందర్కు చాలా ఓపిక. గతంలో మా ఏరియాలో కౌన్సిలర్గా గెలిచేందుకు ఇద్దరకీ అవకాశం ఉండడంతో చందర్ కోసం నేను పోటీ చేయకుండా త్యాగం చేశా. అదే ఏరియాలో ఇప్పుడు నేను కార్పొరేటర్. – పెంట రాజేశ్, 37వ డివిజన్ కార్పొరేటర్, రామగుండం కులమతాలకు అతీతం కోరుట్ల: స్నేహానికి కులమతాలు అడ్డుకాదు. ఇదే కోవలో కోరుట్లకు చెందిన ఖాలిక్ పాషా, ముక్క శ్రీనివాస్ చిన్ననాటి నుంచి స్నేహితులు. పది నుంచి ఇంజినీరింగ్ వరకు కలిసి చదువుకుని ప్రస్తుతం ఖాలీక్ పాషా దక్షిణాఫ్రికాలో జాబ్ చేస్తుండగా, శ్రీనివాస్ అమెరికాలో పనిచేస్తున్నారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా శనివారం ఇద్దరు కోరుట్లలో కలుసుకుని తమ స్నేహ జ్ఞాపకాలు పంచుకున్నారు. ఖాలిక్ పాషా, శ్రీనివాస్ ముగ్గురు వైద్యుల ముచ్చటైన స్నేహం సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన ప్రముఖ వైద్యులు పి.పెంచలయ్య, ఎన్.వి.రమణ రావు, పి.చంద్రశేఖర్ మంచి స్నేహితులు. 1984–85లో మెడిసిన్ చదువుతున్న రోజుల్లో కర్నూల్ మెడికల్ కాలేజీలో వీరి స్నేహం మొదలైంది. ముగ్గురి సొంత జిల్లాలు వేరైనా సిరిసిల్లలో స్థిరపడ్డారు. ప్రభుత్వ డాక్టర్లుగా నిజాయితీగా పని చేశారు. వీరి సతీమణులు శోభారాణి, లీలా శిరీష, శ్రీవాణిలు సైతం సిరిసిల్ల గైనాకాలజిస్ట్ డాక్టర్లుగా స్థిరపడ్డారు. రెండున్నర దశాబ్దాలుగా వైద్యసేవలు అందిస్తున్నారు. సాయికిరణ్, నరేశ్, సంతోష్, కరుణాకర్ మంచి స్నేహితులను వదులుకోవద్దు పెద్దపల్లి: మంచి స్నేహితులు లభించడంతో మంచి జీవితాన్ని పొందవచ్చు. అమ్మానాన్న జన్మను ఇస్తే స్నేహితులు మనకు బంగారు బాట చూపిస్తారు. మంచి స్నేహితులను వదలుకోకూడదు. రాజకీయాల్లో ఉన్న సమయాల్లో నా మిత్రుడు (ప్రస్తుతం అడిషనల్ డీజీపీ శ్రీనివాసరెడ్డి) నన్ను చదువుకోమని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతో నేను రాజకీయాలు వీడి ఉన్నత చదువులు చదివిన. యువత చెడు స్నేహాలు చేయొద్దు. మనకున్న మంచి స్నేహితులను విడిచిపెట్టొద్దు. – లక్ష్మీనారాయణ,అదనపు కలెక్టర్, పెద్దపల్లి స్నేహితులే నా ప్రాణం పెద్దపల్లికమాన్: స్నేహితుల సహకారంతోనే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్థాయికి వచ్చాను. చిన్ననాటి బాల్య మిత్రులు ముక్తార్ ఫ్యాషన్– డిజైనర్, సతీశ్– టీచర్, బాలు– బిజినెస్ చేస్తూ నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. రక్త సంబంధాలే దూరమవుతున్న ఈ కాలంలో నేను చేసే పనిలో అన్నీ వారై నా విజయంలో పాలు పంచుకున్నారు. జీవితాంతం వారు న్యాయవాద వృత్తిలో నాతోపాటు ఉండాలని ఈ విద్యా సంవత్సరంలో వారిని ఎల్ఎల్బీ చదివిస్తున్నా. – పి.రాకేశ్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పెద్దపల్లి పాతికేళ్ల స్నేహబంధం వేములవాడ: వాళ్లిద్దరూ చిన్ననాటి మిత్రులు.. కలిసే చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ప్రజాసేవలో తరిస్తున్నారు. వేములవాడ మున్సి పల్ 3వ వార్డు కౌన్సిలర్గా నిమ్మశెట్టి విజయ్, 27వ వార్డు కౌన్సిలర్గా గోలి మహేశ్ సేవలందిస్తున్నారు. వేములవాడ పట్టణంలో 1 నుంచి 12వ తరగతి వరకు గీతా విద్యాలయంలో చదువుకున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ కలిసే నడిచారు. రాష్ట్రం సాధించుకున్న అనంతరం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ కౌన్సిలర్లుగా గెలి చారు. నాటి నుంచి నేటి వరకు అరేయ్... ఒరేయ్ అంటూ భుజాలు తడుముకుంటూ దోస్తానా చలాయిస్తున్నా రు. అంతేకాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ 30కి పైగా రక్తదానాలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్లాస్మెట్లు.. జాబ్మెట్లు బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రానికి చెందిన మాడిషెట్టి సాయికిరణ్, వాసాల సంతోష్, మోగులోజి నరేశ్, సంబ కరుణాకర్లు స్థానిక హైస్కూల్లో 2008లో పదోతరగతి ఉత్తీర్ణులు అయ్యారు. తర్వాత ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నలుగురు ఒకేసారి పోలీసులుగా సెలక్ట్ అయ్యారు. పండుగలు, ఇతరత్రా సెలవుల్లో ఊరికి వచ్చినపుడు సందడి చేస్తామని చెప్పారు. ‘ఫ్రెండ్స్’ సేవాభావం మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లికి చెందిన సురిగి శ్రీనివాస్ స్నేహితులతో కలిసి ఫ్రెండ్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఐదుగురితో మొదలైన ట్రస్ట్లో ప్రస్తుతం 60మంది సభ్యులుగా ఉన్నారు. అందరూ తమ సంపాదనలో నుంచి కొంత మొత్తాన్ని ట్రస్ట్కు అందిస్తున్నారు. దీనికి తోడు పలువురు చేస్తున్న ఆర్థికసాయంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. -
సెక్యులర్ స్నేహం
పిల్లలమర్రి అనూరాధ మచిలీపట్నంలో పుట్టారు.షెహనాజ్ షరీఫ్ వైజాగ్లో పుట్టారు.సబితా ఎబినెజర్ చెన్నైలో పుట్టారు.ముగ్గురు జన్మించిందీ బంగాళాఖాతం తీరాన్నే.కానీ... వీరిని కలిపిన బంధం సముద్ర తీరం కాదు.‘భారతీయత’ చుట్టూ అల్లుకున్న స్నేహబంధం. సైనిక్పురి, వాయుపురి అంటే... ఒక కశ్మీరీ కుటుంబం, ఆ పక్కనే ఓ గుజరాతీ, పంజాబీ కుటుంబాలు, వాటికెదురుగా కేరళ వాళ్లు, వారి పొరుగున ఈశాన్య రాష్ట్రాల వాళ్లూ వీరి మధ్యన అక్కడక్కడా కొన్ని తెలుగు కుటుంబాలు నివసించే ప్రదేశం. ఓ మినీ మహాభారతం. దీనిని వదిలి బయట జీవించడం తమకు తెలియదంటారు ఈ స్నేహితులు. ‘వియ్ ఆర్ ఆల్ స్వీట్ సిక్ట్సీస్’ అని సరదాగా సంతోషంగా చెప్పే వీరి స్నేహానికి దాదాపుగా ముప్ఫై ఏళ్లు. ప్రాంతం, మతం, భాష వంటి పరిధులేవీ తమ స్నేహానికి ఆటంకాలు కాదంటున్నారు. సికింద్రాబాద్లోని సైనిక్పురి, రామకృష్ణాపురం, మారేడ్పల్లిల్లో ఉండే ఈ ముగ్గురినీ కలిపిన వేదిక ఆర్మీ పబ్లిక్ స్కూల్. వీరి భర్తలు భారత వైమానిక దళంలో అధికారులు కావడంతో వీరి కెరీర్ కూడా రక్షణ రంగానికి అనుబంధంగానే అల్లుకుంది. ఉన్నత విద్యావంతులైన అనూరాధ, షెహనాజ్, సబితలు ఆర్మీ స్కూల్లో లెక్కలు, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధించేవారు. సంతోషాలూ... దుఃఖాలూ... ‘ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్డీడ్’... అన్నట్లే కనిపిస్తారు ఈ స్నేహితులు. దీపావళి పండుగకు మిగిలిన ఇద్దరూ కుటుంబాలతో సహా అనూరాధ ఇంట్లోనే పండుగ చేసుకుంటారు. ఈద్ రోజుకు అంతా షెహనాజ్ ఇంట్లోనే. క్రిస్టమస్ వేడుకకు సబిత ఇల్లే వీరి వేదిక. ‘పుట్టిన రోజులు, పెళ్లి రోజులే కాదు, సత్యనారాయణ వ్రతం కూడా అంతా కలిసి చేసుకుంటాం’ అంటున్నారు. ‘‘నేను చెన్నైలో పుట్టి పెరిగాను, పెళ్లయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. ఈ ప్రదేశం, పరిసరాలు అలవాటు కావడానికి షెహనాజ్, అనూరాధ ఇద్దరూ సహాయం చేశారు’’ అన్నారు సబిత. ‘‘మా వారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో ఉంటే షెహనాజ్, సబిత కుటుంబాలే అండగా నిలిచాయి. నేను రాత్రంతా హాస్పిటల్లో ఉండి ఉదయం నేరుగా స్కూల్కి వెళ్లేదాన్ని. అప్పటికే నా కోసం ఒకరు ఫ్లాస్కులో టీ, మరొకరు బ్రేక్ఫాస్ట్ తెచ్చేవారు. సబిత భర్త ఎబినెజర్ అయితే మా వారికి ఆహారం తీసుకెళ్లడం నుంచి దగ్గర కూర్చుని ఆయనకు ధైర్యం చెప్పేవారు. అంతకంటే పెద్ద విషయం ఏమిటంటే... సబిత వాళ్లు ఇల్లు కట్టుకుని గృహప్రవేశానికి తేదీ నిర్ణయించుకున్నారు. ఆ సమయానికి మా వారు పోయారు. నేను బాధలో ఉన్నప్పుడు నన్నలా వదిలి వెళ్లలేక వాళ్లు గృహప్రవేశం తేదీ మార్చుకున్నారు. నా సంతోషాన్నే కాదు, నా దుఃఖాన్ని కూడా పంచుకున్న స్నేహితులు వీళ్లు’’ అంటూ షెహనాజ్, సబితలను దగ్గరకు తీసుకున్నారు అనూరాధ. స్వచ్ఛంద బృందం... ‘డిఫెన్స్ వెటరన్ వాలంటీర్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్’ అనే స్వచ్ఛంద బృందంలో వీరంతా చురుగ్గా పని చేస్తుంటారు. షెహనాజ్ ఇంగ్లిష్ పరిజ్ఞానం పెద్దగా లేని జవాన్లకు ఇంగ్లిష్ పాఠాలు చెప్తారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న పరికరాలను ఉపయోగించడంలో మెళకులవను వృద్ధులకు నేర్పిస్తుంటారు. ఇక అనూరాధ... పిల్లలు ఉద్యోగరీత్యా విదేశాల్లో లేదా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల కుటుంబాలను సందర్శిస్తూ వారికి అవసరమైన మందులు సమకూర్చడం, క్లినిక్కు తీసుకెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించడం వంటివి చేస్తారు. అవయవదానం, ఆస్తి వీలునామా రాయడం వంటి పనులతోపాటు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే పార్థివ దేహాన్ని వారి పిల్లలు వచ్చే వరకు భద్రపరచడం వంటి పనుల్లో సబిత పాల్గొంటారు. వీటితోపాటు ఈ బృందంలోని సభ్యులు... మరణించిన వారి ఇంటికి పది రోజుల పాటు భోజనాలు పంపిస్తారు. ఈ వివరాలు చెబుతూ ‘‘ఆనందంగా, సౌకర్యంగా, సంతోషంగా జీవించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటుంటాం. మా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రోత్సహిస్తాం. తుదిశ్వాస వరకు మా స్నేహం ఇలాగే ఉంటుంది’’ అని సబిత అంటుంటే... అనూరాధ బాధగా ఆమెను వారిస్తూ ‘‘స్నేహానికి మరణం ఉండదు’’ అన్నారు. స్నేహం అనే కొమ్మకు పూచిన పూలు అలా వికసిస్తూనే ఉంటాయి... ఎప్పటికీ... ఎన్నాళ్లయినా... ఎన్నేళ్లయినా. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేమెంట్స్ బ్యాంకులకు ఉజ్వల భవిష్యత్తు!
మేఘాలయలో హిట్లర్ను అరెస్టు చేసిన కెన్నెడీ?
మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తాం
పేదింట విషాదం
నూకాంబిక అమ్మవారి బాలాలయానికి పోటెత్తిన భక్తులు
రమేష్ రౌడీయిజంతో జల్లా ప్రజల్లో భయభ్రాంతులు
ఎన్. గజపతినగరంలో టీడీపీకి గట్టి షాక్
ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
‘చేనేత’ను ఆదుకున్నది జగన్ ప్రభుత్వమే
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement