breaking news
free mobile phones
-
రైతుల సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో అక్కడి రైతులు, విద్యార్థులు, పేద మహిళలపై బీజేపీ హామీల వర్షం కురిపించింది. జాతీయ, సహకార బ్యాంకుల్లో లక్ష వరకు పంట రుణమాఫీ, సాగు నీటి ప్రాజెక్టులకు లక్షల కోట్ల వ్యయం, విద్యార్థులకు ఫ్రీ ల్యాప్టాప్లు, పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్లు వంటి హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ. 5 వేల కోట్లతో ‘రైతు బంధు మార్కెట్ మధ్యంతర నిధి’ని ఏర్పాటు చేసి పంట ధరల్లో వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఆ ప్రభావం రైతులపై పడకుండా చూస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప చెప్పారు. వ్యవసాయంలో అత్యుత్తమ పద్ధతులను అధ్యయనం చేసేందుకు రైతులను ఇజ్రాయెల్, చైనా వంటి దేశాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ బోర్లకు 10 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ మేనిఫెస్టోలోని ఇతర హామీలు ► దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు చెందిన యువతుల పెళ్లి సమయంలో ప్రభుత్వ కానుకగా ‘వివాహ మంగళ’ పథకం కింద రూ.25 వేల నగదు, 3 గ్రాముల బంగారం. ► బీపీఎల్ కుటుంబాల్లోని మహిళల కోసం ‘స్త్రీ సువిధ’ పథకం కింద ఒక్క రూపాయికే శానిటరీ న్యాప్కిన్ ► పేదలకు అందుబాటు ధరల్లో ఆహారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 ‘ముఖ్య మంత్రి అన్నపూర్ణ క్యాంటీన్ల’ ఏర్పాటు ► లోకాయుక్తను కాంగ్రెస్ అవినీతి నిరోధక విభాగంలో ఉపవిభాగం చేయగా, దానికి మళ్లీ పూర్వస్థితి కల్పిస్తామని హామీ. ► అవినీతిపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు సీఎం కార్యాలయంలోనే హెల్ప్లైన్. ► అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యక ర్తలకు రక్షణ కల్పించేలా కొత్త చట్టం. ► కళాశాలల్లో చేరే ప్రతి విద్యార్థికీ ‘ముఖ్యమంత్రి ల్యాప్టాప్ యోజనే’ కింద ఉచిత ల్యాప్టాప్. ► ‘ముఖ్యమంత్రి స్మార్ట్ఫోన్ యోజనే’ కింద పేద మహిళలకు ఉచిత స్మార్ట్ఫోన్. ► ఉద్యాన నగరి బెంగళూరును చెత్త రహిత నగరంగా మారుస్తామని హామీ. ► ఆవుల సంరక్షణ కోసం గతంలో బీజేపీ తీసుకురాగా కాంగ్రెస్ రద్దు చేసిన ‘గౌ సేవా ఆయోగ్’ పునరుద్ధరణ. -
మార్చి నుంచి ఉచిత సెల్ ఫోన్లు, ట్యాబ్లు!
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం.. గ్రామీణులకు ఉచిత మొబైల్ ఫోన్లు, విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్ కంప్యూటర్ల పథకాన్ని వేగంగా ముందుకు తెస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచిత సెల్ ఫోన్లు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్ కంప్యూటర్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు టెలికం కమిషన్ మంగళవారం విస్తృత ఆమోదం తెలిపింది. మొత్తం రూ. 10 వేల కోట్ల వ్యయం కాగల ఈ పథకాన్ని వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కొంచెం ముందుగా మార్చి నుంచి అమలులోకి తేవాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకం ప్రతిపాదనపై టెలికమ్యూనికేషన్స్ విభాగంలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయిన టెలికం కమిషన్ చర్చించిందని, ఇందులోని చాలా అంశాలకు ఆమోదం తెలిపిందని ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించి మరికొన్ని అంశాలపై త్వరలోనే చర్చిస్తామని.. ఆ తర్వాత ఈ ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర మంత్రివర్గానికి పంపిస్తామన్నాయి. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని రెండున్నర కోట్ల కుటుంబాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో 11, 12 తరగతులు చదువుతున్న 90 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని వివరించాయి. బీఎస్ఎన్ఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఉచిత మొబైల్ ఫోన్ల పథకాన్ని ప్రధానంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికుల కోసం ఉద్దేశించారు. ఈ పథకానికి రూ. 4,840 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ పథకాన్ని 2014 మార్చి తర్వాత అమలులోకి తెచ్చి ఆరేళ్లలో పూర్తిచేస్తారు. తొలి ఏడాది 25 లక్షల మంది లబ్ధిదారులు, రెండో ఏడాది 50 లక్షల మంది, మూడో ఏడాది 75 లక్షల మంది, నాలుగో ఏడాది కోటి మంది లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తారు.