-
రైతుల ఆత్మహత్యాయత్నంపై చలించిన జగన్
సాక్షి, వెల్దుర్తి : కృష్ణాజిల్లా నున్న పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం ఘటన అంశంపై ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన గురువారం ఫోన్లో పరామర్శించారు. ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని రైతులకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం తరఫున రూ.2.30 కోట్లు చెల్లిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఒక్క ఏడాది ఓపిక పట్టండి.. ఆ చెల్లింపులన్నీ వెంటనే చేస్తాం అని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని తన మాటగా నష్టపోయిన రైతులకు చెప్పాలన్నారు. అఘాయిత్యాలకు పాల్పడి కుటుంబాల్లో కన్నీళ్లు నింపొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే... రైతులను కాపాడాల్సిన ప్రభుత్వం వారిని వేధింపులకు గురిచేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతుల తమ వేదనను రాజన్న తనయుడికి వెలిబుచ్చారు...దాదాపు ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని, నకిలీ నార కారణంగా పంట నష్టపోయామని అప్పట్లో ధర్నా చేశామని, నార నకిలీదని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారించారని అన్నారు. ఎకరాకు రూ.91వేలు చెల్లించేలా కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారని, కాని చెల్లింపులు జరగలేదన్నారు. కంపెనీల యజమానులు కోర్టుకు వెళ్లి కలెక్టర్ ఉత్తర్వులు కొట్టేయించుకున్నారని, ఈ విషయాన్ని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నాలుగుసార్లు నివేదించామని, మరో మంత్రి దేవినేని ఉమకి రెండుసార్లు విన్నవించామని, గత ఏడాది అసెంబ్లీకి వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదుని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఇప్పుడు చలో అసెంబ్లీకి నిర్ణయించుకున్నామన్నారు. అయితే తమపై రౌడీషీట్లు తెరిచారంటూ వైఎస్ జగన్కు రైతులు ఫిర్యాదు చేశారు. కేసులు పెట్టి పత్రాలు రాయించుకుని నానా ఇబ్బందులకు గురి చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. రూ.2.30 కోట్ల చెల్లింపుల కోసం అలుపెరగని పోరాటం చేశామని, ఎవ్వరూ కనికరించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకున్నామని ఆ రైతులు వాపోయారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు తక్షణమే చెల్లించాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం ఇవ్వాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. అవసరం అయితే విత్తన కంపెనీల నుంచి ప్రభుత్వం రికవరీ చేసుకోవచ్చని అన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని అన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అధికారంలోకి రాగానే రైతులకు చెల్లించాల్సిన పరిహారం ఇస్తామని అన్నారు. -
రైతన్నల ఆత్మహత్యలు మాయని మచ్చలు
గత ప్రస్తుత ప్రభుత్వాల, విధానాల వలన నేడు తెలంగాణ రాష్ట్రంలో నిర్లి ప్తత, నిరాశతో కూడుకొని ఉన్న ఒక అనిశ్చిత వాతా వరణం నెలకొని ఉంది. మెదక్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో రైతుల ఆత్మహత్యలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. 1990 నుండి దేశవ్యా ప్తంగా ఉన్న గణాంకాలను పరిశీలిస్తే గత 20 ఏళ్లలో రైతుల ఆత్మహత్యలు 3 లక్షలపై మాటే అన్నది అతిశ యోక్తి కాదు. వ్యవసాయంలో వాణిజ్య పంటలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సాంప్రదాయక, సేం ద్రియ విధానాలకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వటం వలన మన దేశ వ్యవసాయ రంగం అతలాకుతల మవుతోంది. నానాటికీ అడుగంటుతున్న భూగర్భ జలాలు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభం లోకి నెట్టివేశాయి. మార్కెట్ రంగం మొత్తం దళారీల గుప్పెట్లో ఉండటం వలన రైతుల పంటలకు గిట్టు బాటు ధర అందకుండా పోయింది. తెలంగాణ విష యానికి వస్తే వర్షాభావం, గిట్టుబాటు ధర లేకపోవ టమే కాకుండా బ్యాంకులు ఎకరానికి రూ.20,000 లు మాత్రమే వడ్డీని ఇవ్వటం, ప్రైవేటు వ్యక్తులు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు ఇచ్చిన అప్పులకు చక్ర వడ్డీల రూపంలో తడిసి మోపెడయి రైతులను ఆత్మ హత్యలకు పురికొల్పుతున్నాయి. మైక్రోఫైనాన్స్, ప్రైవేటు వ్యక్తులపై ప్రభుత్వానికి ఎటువంటి నియం త్రణ లేదు. 35 నుండి 40 శాతం దాకా వడ్డీ కట్టవల సిన దురవస్థలో రైతు తనువును చాలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) తెలంగాణ కమిటీ క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలను పరిశీలించాలన్న తీర్మానాన్ని చేయ టం జరిగింది. అందులో భాగంగానే 16.10.2015 నాడు మహబూబ్నగర్ జిల్లాలోని అప్పనపల్లి, గంగాపురం, మిడ్జిల్, కొట్రు గ్రామాలను సందర్శిం చింది. పాలమూరు అధ్యయన వేదిక వారు అనేక మంది ఇతర మిత్రులు తమ సహకారాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రరవే నుండి జాతీయ కార్యదర్శి కాత్యాయనీ విద్మహే, భండారు విజయ, కవిని ఆలూరి పాల్గొనటం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలోని అప్పనపల్లి గ్రామ నివాసి 50 ఏళ్ల కొత్తకాపు సత్తిరెడ్డి కుటుంబానికి ఎకరన్నర సొంత భూమి, 3 ఎకరాల కౌలు భూమి ఉంది. వ్యవసాయం కోసం బ్యాంకు ఇచ్చిన లోను చాలక ప్రైవేటుగా రూ.3ల వడ్డీ చొప్పున అప్పు తీసు కున్నాడు. వడ్డీ 5, 6 రెట్లు పెరిగి 7 లక్షలు దాటింది. అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. గంగా పురం నివాసి అయిన శ్రీనివాసరెడ్డి 5 ఎకరాలలో పత్తి పంటను వేశాడు. 5 లక్షల పైన అప్పు పెరిగి పత్తికి గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య చేసుకున్నా డు. మిడ్జిల్ గ్రామంలోని జంగయ్య కుటుంబ పరి స్థితి మరీ దారుణంగా ఉంది. వీళ్లు ఇద్దరూ అన్నద మ్ములు. తమ్ముడు ప్రమాదవశాత్తూ చేతులు కోల్పో యాడు. అతని ముగ్గురు పిల్లలు అంధులు. జంగ య్యకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నాడు. తల్లితో సహా మొత్తం కుటుంబం బాధ్యత జంగ య్యదే. ఒకటిన్నర ఎకరం సొంత భూమి ఉండి, 7 ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. 4 లక్షల 50 వేలు పైగా అప్పు ఉంది. నీళ్లు లేక పత్తి చేలు ఎండిపోయి జంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కొట్రు గ్రామం లో చంద్రయ్య అనే 55 ఏళ్ల రైతుకు 4 లక్షల అప్పు ఉంది. 2 ఎకరాల పొలం. అప్పులు తెచ్చి 6, 7 సార్లు బోర్లు వేశాడు. బోర్లలో నీళ్లు పడక పత్తి పంట ఎండి పోయింది. ఈ కుటుంబాలకు దిక్కేమిటి? మనుగడ ఎలా? దాదాపుగా క్షేత్ర పర్యటనలోని అన్ని గ్రామాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అప్పుల బాధ, గిట్టుబాటు ధర లేకపోవటం, పశు వులకు నీళ్లు లేక పశుగ్రాసానికి కూడా అప్పు చేయ వలసి రావటం, కల్తీ ఎరువులు, పురుగుల మం దులు, పంటలు ఎండిపోయి మరోదారి లేక భూమినే నమ్ముకున్న రైతన్నలకు ఉరితాళ్లను నమ్ముకోవలసిన నికృష్ట పరిస్థితులు దాపురిం చాయి. దుర్భర దారిత్య్రంలో కొట్టుమిట్టాడుతున్న సన్నకారు, మధ్యతరగతి రైతు కుటుంబాలకు భరోసా ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. విజ్ఞులు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు వ్యవ సాయ అనుకూల మౌలిక విధానాలను, ప్రత్యామ్నా యాలను పాలకులు తీసుకువచ్చేలా బాధ్యత వహిం చాలి. ఈ విపత్కర పరిస్థితుల నుండి రైతాంగాన్ని కాపాడేలా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి. (వ్యాసకర్త: కవిని ఆలూరి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక సభ్యురాలు. 97016 05623) -
'వడ్డీ వ్యాపారుల ఒత్తిడితోనే ఆత్మహత్యలు'
హైదరాబాద్: రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా సంఘటితమై పోరాటాలకు సిద్ధం కావాలని సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. ప్రభుత్వం దళారీ వ్యవస్థను నిర్మూలించాలని చెప్పారు. ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నాగం జనార్ధన్ రెడ్డి చేపట్టిన కిసాన్ బచావో దీక్షను కే రామచంద్రమూర్తి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆత్మహత్యలపై సమాజం, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించడం మంచిదికాదన్నారు. వడ్డీ వ్యాపారుల ఒత్తిడి వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. రాజకీయాలకతీతంగా రైతుల శ్రేయస్సు కోసం ముందడుగు వేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. -
అసెంబ్లీ రేపటికి వాయిదా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. మంగళవారం సమావేశమైన అసెంబ్లీ రోజంతా రైతు ఆత్మహత్యలపైనే చర్చించిన విషయం తెలిసిందే. ప్రశ్నోత్తరాలతోపాటు ఇతర కార్యక్రమాలన్నింటిని రద్దు చేసి మరీ ఈ అంశంపై చర్చ మొదలుపెట్టారు. బుధవారం కూడా ఇదే అంశంపై చర్చించనున్నారు. మంగళవారం నాటి సమావేశంలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య కాసేపు మాటల యుద్ధం నెలకొనడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోపక్క, శాసన మండలి కూడా బుధవారానికి వాయిదా పడింది. -
కదం తొక్కిన ఎర్రదండు
మధిర: అరుణ పతాకాలు.. రెడ్షర్ట్ వలంటీర్ల కవాతుతో పట్టణం ఎరుపెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మధిరలో సీపీఎం జిల్లా 19వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు ముందు నడవగా కార్యకర్తలు వారిని అనుసరిస్తూ కొనసాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక రెడ్డి గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు వైఎస్ఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్బ్రిడ్జి, సీపీఎం కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణమైన టీవీఎం పాఠశాల వద్దకు చేరుకుంది. ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు, బుచ్చిరెడ్డిపాలెం చిన్నారుల కోలాటాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యహితంగా, కార్యకర్తల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీ సీపీఎం ఒక్కటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకెంతో మేలు జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని అన్నారు. తెలంగాణలో 6 నెలల్లో 680 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని బట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇంత మంది రైతులు మరణించినా సీఎం కానీ, ఒక మంత్రి కానీ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలనే మానవత్వం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొరలా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక రైతులు, పరిశ్రమల వారు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఉన్న పాఠశాలలనే తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1956 స్థానికత పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదన్నారు. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ స్థిరపడిన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు పంపిణీ చేయడమే కాకుండా, భూస్వాముల కోరలు పీకి వారి వద్ద ఉన్న భూమిని కూడా సేకరించి దళితులకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019 ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో డివిజన్ కార్యదర్శి లింగాల కమల్రాజ్, నాయకులు బుగ్గవీటి సరళ, హైమావతి, సోమయ్య, బి.వెంకట్, సుబ్బారావు, సామినేని రామారావు, బండారు రవికుమార్, కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్ పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement