-
ఎంత ప్రమాదం తప్పింది!
కోల్కతా: హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికుడొకరు చురుగ్గా స్పందించి రైలు డ్రైవర్ను అప్రమత్తం చేయడంతో ముప్పు వాటిల్లలేదు. పశ్చిమ బెంగాల్ బుర్ద్వాన్ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుందని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. రైలు పట్టాలకు ఉండే ఫిష్ప్లేట్లు ఊడిపోవడాన్ని గమనించిన స్థానిడొకరు వెంటనే స్పందించి ఎరుపు రంగు వస్త్రాన్ని చేత్తో చూపిస్తూ అటుగా వస్తున్న రైలుకు ఎదురెళ్లాడు. ప్రమాదాన్ని పసిగట్టిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో రైలు అకస్మాత్తుగా ఆగిపోయింది. సడన్గా రైలు నిలిచిపోవడంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పట్టా విరిగిన ప్రాంతానికి కొన్ని మీటర్ల దూరంలో రైలు ఆగడంతో ప్రమాదం తప్పిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి అప్రమత్తంగా వ్యవహరించిన స్థానికుడికి ప్రయాణికులు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఈ ఘటనపై రైల్వే శాఖ ఇంకా స్పందించలేదు. -
ఒక్క చూపుతో పెను ప్రమాదం తప్పించాడు
ముంబయి: ఆ యువ ఇంజినీర్. అతడికి రైలన్నా.. రైల్వే వ్యవస్థ అన్న ఎంతో ఆసక్తి. రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అలా అతడు సహజంగా చేసుకున్న అలవాటే వేలమంది ప్రాణాలు కాపాడింది. పెద్ద రైల్వే ప్రమాదాన్ని నివారించగలిగేలా చేసింది. రెండు రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి తప్పించింది. జీ సక్పాల్ (23) అనే ఇంజినీర్ అంధేరిలోని తన ఆఫీసుకు వెళ్లేందుకు ఉదయం 7.30గంటలకు కుర్లా రైల్వే స్టేషన్కు రైలెక్కెందుకు వచ్చాడు. 7వ నెంబర్ ప్లాట్ పాంపై నిల్చుని అతడికి సహజంగానే ఉన్న అలవాటు ప్రకారం రైల్వే పట్టాల వైపు పరిశీలనగా చూస్తున్నాడు. హార్బర్ లైను వెంట ఉన్న పట్టాల్లో అతడికి సరిగ్గా మూడు నాలుగు మీటర్ల దూరంలో ఫిష్ ప్లేట్ ఊడిపోయి పైకి పొడుచుకొని కనిపించింది. దాని వల్ల జరిగే ఘోర విపత్తును ముందే ఊహించిన అతడు వెంటనే రైలు మోటర్ మేన్ కు సమాచారం అందించాడు. రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. అతడు అలా సమాచారం అందించగానే గ్యాంగ్ మెన్ ను అక్కడికి పంపించి ట్రాక్ ను సరిచేశారు. అక్కడే వదులుగా ఉన్న మరో ఫిష్ ప్లేట్ ను సరి చేశారు. దీంతో ఆ లైన్ లో కాసేపు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ట్రాక్ సమస్య తెలిసిన తర్వాత అన్ని రైళ్లకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో యథావిధిగా రైల్లు ప్రయాణం ప్రారంభించాయి. వందల ప్రాణాలు రక్షించడమే కాకుండా ఒక రోజు మొత్తాన్ని కాపాడాడంటూ పలువురు సక్పాల్ను అభినందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement