father-in-law
-
‘నాన్న నన్ను క్షమించండి.. నా చావుకు మామ, వదినే కారణం’
మొరాదాబాద్: అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి. నేను ప్రేమ వివాహం చేసుకుని తప్పు చేశాను. నా భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు. నా ఆడపడుచు, మామ వేధింపులు భరించలేకపోతున్నా. ఈ జన్మకు మిమ్మల్ని ఆనందంగా చూసుకోలేకపోయాను. మళ్లీ జన్మంటూ ఉంటే మీకు బిడ్డగా జన్మిస్తాను అంటూ వీడియో రికార్డు చేసి నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. మొరాదాబాద్కు చెందిన అమ్రీన్ జహాన్(23) నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. తన భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో అతడు అక్కడికి వెళ్లాడు. అమ్రీన్ అత్తారింట్లోనే ఉంది. ఈ క్రమంలో ప్రేమ వివాహం చేసుకున్న కారణంగా అత్తంట్లో ఆమెకు వేధింపులు ప్రారంభమయ్యాయి. ఇంట్లో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సాకుతో ఆమెను వేధించడంతో బాధను తట్టుకోలేకపోయింది. దీంతో, ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు భర్త, ఆడపడుచు, మామనే కారణమని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తన ఆవేదనను వీడియోలో రికార్డు చేసింది.వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నా భర్త కొన్నిసార్లు నా ఆహారపు ఆటవాట్ల గురించి సెటైర్లు వేస్తారు. నా ఆడపడుచు ఖతిజా ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటుంది. ఏ పని చేసినా వారికి నచ్చదు. కొన్నిసార్లు వారు నా గదికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. నా మామ షాజిద్ నాతో అనుచితంగా ప్రవరిస్తాడు. నా ఆరోగ్యం బాగా లేనప్పుడు కూడా నా బాధను అర్థం చేసుకోలేదు. వారి వేధింపుల గురించి నా భర్తకు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదు. పైగా నన్నే తిడుతున్నాడు. నువ్వు ఎందుకు చచ్చిపోవడం లేదని అంటున్నాడు. నా ఆడపడుచు, మామ కూడా ఇలాగే అంటున్నారు. చచ్చిపో.. చచ్చిపో అని అంటున్నారు. వీరి వేధింపులను నేను సహించలేకపోతున్నాను. నేను చనిపోయేటప్పుడు ఎంత బాధ ఉంటుందో తెలియదు.. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. నా చావుకు నా భర్త, ఆడపడుచు, మామనే కారణం’ అని చెప్పుకొచ్చింది. అనంతరం, ఆత్మహత్య చేసుకుంది.తన బిడ్డ చావు అమ్రీన్ తల్లిదండ్రులకు తెలియడంతో కన్నీటిపర్యంతమవుతున్నారు. అనంతరం, ఆమె తండ్రి సలీం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్రీన్ నిన్న తనకు ఫోన్ చేసి ఏడ్చాడని అతను చెప్పాడు. తనపై దాడి జరుగుతోందని, తనను కాపాడమని వేడుకున్నట్టు తెలిపాడు. ఇంటి వచ్చేలోపే బిడ్డ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సలీం.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సలీం ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్రీన్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. -
కోడలికి రెండో పెళ్లి చేసి, కన్నీటితో సాగనంపిన ‘మామగారు’
కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి, కోటి ఆశలతో అత్తింటికి చేరే కోడళ్లను కన్న కూతురిలా చూసుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. కానీ కొడుకు మరణం తరువాత కోడల్ని అక్కున చేర్చుకుని ఆదరించడమే కాకుండా, ఆమెకు మరో జీవితాన్ని ప్రసాదించిన కుటుంబాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి ఒక హృద్యమైన కథనం నెట్టింట వైరల్గా మారింది. అనేక ప్రశంసలు దక్కించుకుంది. గుజరాత్లోని అంబాజీ నివాసి ప్రవీణ్ సింగ్ రాణా. ముదిమి వయసులో ఆదు కుంటాడనుకున్న పెద్ద కుమారుడు సిద్ధరాజ్ సింగ్ అర్థాంతరంగా కన్నుమూశాడు. దీంతో తనతో పాటు కోడలు, నెలల వయస్సున్న చిన్న బిడ్డ అనాథలైపోయారు. కానీ ఇక్కడే ప్రవీణ్ సింగ్ తన పెద్దరికాన్ని చాటుకున్నాడు. కోడలికి తండ్రి స్థానంలో నిలబడ్డాడు. చక్కగా పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపాడు. కోడలి, మనవరాల్ని కన్నీటితో సాగనంపడం విశేషంగా నిలిచింది.చదవండి: Attari Border Closure : పెళ్లి ఆగిపోయింది! కొడుకు మరణం2024లో దీపావళి పండుగ సందర్భంగా ఆకస్మిక గుండెపోటు రావడంతో కన్నుమూశాడు. ఈ సంఘటనతో సిద్ధరాజ్ భార్య కృష్ణ, చిన్నారి దీక్షితతో సహా కుటుంబం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఇక జీవితాంతం భర్తలేకుండా గడపాల్సి ఉంటుందని, తండ్రి లేకుండా తన కుమార్తెను ఎలా పెంచాలంటూ కృష్ణ అంతులేని శోకంలో మునిగిపోయింది. చుట్టుపక్కల సమాజం కూడా అలానే అనుకుంది.కానీ ప్రవీణ్ మనసు వేరేలా ఆలోచించింది. తన కుమార్తెలా చూసుకున్నాడు. సమాజం అభిప్రాయాలను, భయాలను పట్టించుకోకుండా, తన కొడుకు ప్రాణ స్నేహితుడు సంజయ్తో తన కోడలి కృష్ణకు వైభవంగా పెళ్లి జరిపించాడు. కోడలితో పాటు, మనవరాలు దీక్షిత తరలి పోతోంటే, తన తల్లితో వెళ్లిపోయినప్పుడు తాత భావోద్వేగంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో నెటిజన్లు ప్రవీణ్,కుటుంబంపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలు కదా నేటి సమాజానికి కావాల్సింది అంటూ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: రూ. 40 లక్షల నుంచి 20 కోట్లకు ఒక్కసారిగా జంప్.. ఎవరీ నటుడు?కృష్ణను రెండో పెళ్లి చేసుకున్న సంజయ్ ప్రవీణ్కు ధన్యవాదాలు తెలిపారు. సిద్ధరాజ్ తన చిన్ననాటి స్నేహితుడనీ, కృష్ణను కొంతకాలంగా తనకు తెలుసునని చెప్పారు. కృష్ణ, దీక్షితను కంటికి రెప్పలా చూసుకుంటానని సిద్ధరాజ్ కుటుంబానికి సంజయ్ హామీ ఇచ్చాడు. తన స్నేహితుడి కుమార్తె , కోడలికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను. దీని గురించి ప్రవీణ్ సింగ్తో మాట్లాడాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. అటు కృష్ణ కూడా అత్త మామలకు కన్నీటితో కృతజ్ఞతలు తెలిపింది. -
అల్లు అర్జున్ మామకు చేదు అనుభవం!
హైదరాబాద్, సాక్షి: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత, నటుడు అల్లు అర్జున్కు పిల్లనిచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్రెడ్డి.. పార్టీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఆయనకు భంగపాటే ఎదురైంది. సోమవారం ఉదయం గాంధీభవన్కు చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ని కలిసేందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. కంచర్ల చంద్రశేఖర్రెడ్డి చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో బీఆర్ఎస్లోనూ పని చేశారు. ప్రస్తు కాంగ్రెస్ నుంచి నాగార్జున సాగర్ సెగ్మెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన కూతురు స్నేహారెడ్డిని అల్లు అర్జున్కు ఇచ్చి 2011 మార్చి 6వ తేదీన వివాహం జరిపించారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు.అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అల్లు అర్జున్కు మద్ధతుగా నిలిచాయి. రేవంత్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ మాత్రం పోలీసుల చర్యలను సమర్థిస్తూ..అల్లు అర్జున్దే మొత్తం తప్పు అంటూ వాదిస్తూ వస్తోంది.ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో హైడ్రామా -
కోడలిపై మామ అరాచకం.. పొట్టి షార్ట్ వేసుకుందని వేడి వేడి సూప్ పోసి..
ఆధునిక కాలంలో అనేక మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. అయినా కొంతమంది ప్రజల ఆలోచన విధానాల్లో మార్పు రావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుత్ను ఇంకా పితృస్వామ్య మూస ధోరణిలోనే జీవిస్తున్నారు. మా మాటే వినాలి, మేము చెప్పిందే చేయాలనే విధంగా స్త్రీలపై అధిపత్యం చెలాయిస్తున్నారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో అలాంటి ఓ సంఘటనే తాజాగా వెలుగు చూసింది. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తన కోడలిని వేధింపులకు గురిచేశాడు. పొట్టి బట్టలు వేసుకుందని ఆమెపై వేడి వేడి సూప్ పోసి దాడి చేశాడు. ఈ ఘటన జూన్ 12 న జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. కోడలు సరైన బట్టలు వేసుకోలేదని మామ ఆమెపై అరిచాడు. ఆమె ధరించిన హాట్ ప్యాంట్( పొట్టి షార్ట్) చాలా చిన్నగా ఉందని తిట్టాడు. ఇలాగే బయటకు వెళ్తే ఇరుగు పొరుగు వారు చూస్తే తమ పరువు పోతుందని అన్నాడు. దీనిపై కోడలు స్పందిస్తూ.. ‘నా డబ్బులతో నేను దుస్తులు కొనుకున్నాను. నాకు నచ్చినట్లు వేసుకుంటాను’ అని సమాధానం చెప్పింది. ఈ మాటలు విన్న ఆమె మామయ్య ఒక్కసారిగా హింసాత్మకంగా మారాడు. కోడలు ముఖంపై వేడి సూప్ గిన్నెను విసిరాడు. అంతటితో ఆగకుండా ఈ గొడవను పెద్దది చేస్తూ ఆమె జుట్టు పట్టుకొని లాగి ‘ నేను నిన్ను ఈరోజు చంపేస్తాను’ అంటూ బెదిరించాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మహిళ కొడుకు.. తల్లిని రక్షించేందుకు ఆమెను బెడ్రూంలోకి తీసుకెళ్లి తాళం వేశాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుకుంది. వారు ఇంటికి చేరుకొని మహిళ దుస్తుల వల్ల ఎవరికి ఏ నష్టం లేదని దుస్తుల పేరుతో ఆమెను వేధించడం మానేయాలని మామను హెచ్చరించారు. అయితే ఈ విషయం అక్కడితో ఆగలేదు. మామ వేధింపుల గురించి భర్తకు తెలియజేయగా అతను సైతం తండ్రి వైపే నిలిచాడు. అలాంటి దుస్తులు ధరించవద్దని భార్యను వారించాడు. తనకు అండగా ఉంటాడనున్న భర్త సైతం తండ్రి వైఖరితోనే ఉండటంతో తాను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో ఆమె ముఖంపై గాయాలు, మచ్చలు ఉన్నాయి. వీటిని చూస్తుంటే మామ ఆమెను తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారడంతో నెటిజన్లు మామ ప్రవర్తనపై మండిపడుతున్నారు. ‘ఆమెను చంపేస్తానని బెదిరించడానికి అతనికి ఎంత ధైర్యం? చాలా భయంకరంగా ఉంది ఇది. మనం ఇంకా రాజుల కాలంలో జీవించడం లేదు. ఆమె ఆ దుస్తులు ఎందుకు ధరించవద్దంటూ ప్రశ్నిస్తున్నారు. -
అల్లుడు బైక్ అడిగినందుకు చెప్పుదెబ్బలతో సాగనంపిన మామ
-
ఇదేం విడ్డూరం.. కోడలిని పెళ్లి చేసుకున్న మామా, అసలేం జరిగిందంటే!
-
సంగారెడ్డి: అత్తామామల హత్యకు అల్లుడి షాకింగ్ స్కెచ్
సాక్షి, సంగారెడ్డి: చిన్న చిన్న విషయాలే.. ఒక్కోసారి తీవ్ర నిర్ణయాలు తీసుకునేలా ఉసిగొల్పుతాయి. అలా ఓ అల్లుడు ఏకంగా తనకు పిల్లనిచ్చిన అత్తామామల్ని చంపేయాలని ప్లాన్ వేశాడు. అది మామూలు స్కెచ్తో కాదు.. షాకింగ్ స్కెచ్తో!. చివరకు ఆ కుట్ర బయటపడడం, అందుకు కారణం ఏంటో తెలిసి పోలీసులతో పాటు స్థానికులు షాక్ తినడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. అత్తమామల హత్యకు షాకింగ్ స్కెచ్ వేసిన ఓ అల్లుడు కటకటాల పాలయ్యాడు. రమేష్ అనే వ్యక్తి తన భార్య తల్లిదండ్రుల్ని చంపడానికి ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగా.. ఈ నెల 12వ తేదీన ఇంటి తలుపులకు కరెంట్ షాక్ పెట్టాడు. అయితే రమేష్ అనుకున్నట్లు జరగలేదు. అత్తామామలకు బదులుగా.. తల్లీకూతుళ్లు ఆ తలుపును తాకడంతో షాక్కి గురయ్యారు. కరెంట్ షాక్తో విలవిలలాడుతూ.. వాళ్లు వేసిన కేకలకు స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే కరెంట్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఇక ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించగా.. విచారణలో తాజాగా అల్లుడు రమేష్ కుట్రదారుడని తేలింది. ఇంతకీ ఎందుకు చంపాలని ప్రయత్నించాడో తెలుసా?.. గతంలో ఓసారి ఇంటికి వెళ్లినప్పుడు ఆ అత్తామామలు, అల్లుడు రమేష్ను మందలించలేదనట. పలకరించలేదన్న ఆ కోపంతో అప్పటి నుంచి రగిలిపోతున్న రమేష్.. ఎలాగైనా వాళ్లను చంపేయాలని అనుకున్నాడట. చివరకు కరెంట్షాక్తో యత్నిస్తే తన మీదకు రాదని అలా చేశానని రమేష్ వెల్లడించడం గమనార్హం. ప్రస్తుతం ఆ అల్లుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. ఇదీ చదవండి: మంచిర్యాలలో దారుణం.. ఊరంతా చూస్తుండగానే.. -
మంత్రి కేటీఆర్ మామ మృతి
-
గుండెపోటుతో మంత్రి కేటీఆర్ మామ మృతి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంట విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8.30 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హరినాథరావు మృతితో మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన పార్ధివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో ఉన్న నివాసానికి తరలించారు. హరినాథరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వియ్యంకుడికి నివాళులు అర్పించేందుకు సీఎం కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు. చదవండి: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ -
వృద్ధుడనే కనికరం లేకుండా సొంత మావపై దాడికి పాల్పడ్డ మహిళా పోలీసు
న్యూఢిల్లీ: ఒక మహిళా పోలీసు సొంత మావపై బౌతిక దాడికి దిగింది. ఐతే ఈ ఘటనను మరొక పోలీసు వీడియో తీయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన ఢిల్లీలోని లక్ష్మీ నగరంలో నివాసం ఉంటున్న బాధిత వృద్ధుడి ఇంట్లో చోటు చేసుకుంది. ఆ వీడియోలో ఒక మహిళా పోలీసు పదేపదే తన మామాగారి చెంప చెళ్లుమనిపిస్తుంది. పైగా అందుకు ఆమె తల్లి కూడా మద్దతిచ్చింది. ఈ ఘటన జరగడానికి ముందు ఆమె తన తల్లితో కలిసి వృద్ధుడైన తన మావతో గొడవకు దిగింది. ఇద్దరి మద్య పెద్ద వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా మరొక పోలీసు జోక్యం చేసుకునేలోపే ఆ మహిళా పోలీసు పదే పదే ఆ వృద్ధుడి చెంపపై కొట్టింది. సదరు మహిళా పోలీసు ఢిల్లీలోని ఢిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సబ్ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈ ఘటన పై సీరియస్ అయిన పోలీసు అధికారులు సదరు మహిళా పోలీసుపై కేసు నమోదు చేయడమే కాకుండా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. #WATCH | Case registered under section 323/427 IPC after a video of Sub-Inspector thrashing her in-laws in Delhi's Laxmi Nagar went viral. Info shared with concerned authority to take suitable departmental action against the erring police official: Delhi Police (CCTV Visuals) pic.twitter.com/VUiyjVtZQl — ANI (@ANI) September 5, 2022 (చదవండి: వరద నీటిలో స్కూటీ స్కిడ్.. కరెంట్ స్తంభం పట్టుకోవడంతో) -
ప్రియుడి మోజులో పడి: చెల్లెకు సహకరించిన అన్న, బావ
మదనపల్లె టౌన్ : మామ హత్య కేసులో కోడలు, ఆమెకు అండగా నిలచిన సోదరుడు, బావను అరెస్ట్ చేసినట్లు శుక్రవారం టూటౌన్ సీఐ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. వారి కథనం.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఎస్సీ కాలనీకి చెందిన వేణుగోపాలు పెయింట్ పనులు చేస్తూ తన భార్య తులసమ్మను ఉన్నత చదువులు చదివించాడు. ఆపై, ఆమెకు స్థానిక బర్మావీధిలోని 9వ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాక ఆమె తీరు మారింది. తరచూ ఫోన్లో ఎవరితోనే ఆమె మాట్లాడుతుండడంతో వేణుగోపాలు అనుమానించాడు. ఈ నెల 2న ఆమె కార్యాలయం వద్ద ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో వేణుగోపాలు ఆ ఫోన్ లాక్కుని పరిశీలించాడు. ఆమె ప్రియునితో మాట్లాడుతోందని తెలుసుకుని తనతండ్రితోపాటు తులసమ్మ తల్లిదండ్రులు, బావకు సమాచారం ఇచ్చాడు. ఈ వ్యవహారమేమిటో తేల్చాలని అక్కడే పంచాయితీ పెట్టాడు. ఇందుకోసం వచ్చిన వేణుగోపాలు తండ్రి బి.ఓబులేసు (64)పై తులసమ్మ (30), ఆమె సోదరుడు రెడ్డెప్ప (43), ఇసుకనూతిపల్లెకు చెందిన ఆమె బావ ఆదెప్ప (45) దాడిచేసి కొట్టారు. దాడిలో ఓబులేసు మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేశారు. -
తిరుగుబోతు భర్త.. కీచక మామ: బాత్రూమ్లో సీసీ కెమెరాలు
గుంటూరు ఈస్ట్: తిరుగుబోతు భర్త.. కీచక మామల నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఓ మహిళ పోలీసులను వేడుకుంది. అర్బన్ ఎస్పీ సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వచ్చిన ఓ మహిళ తన గోడు వెల్లబోసుకుంది. వారు తెలిపిన వివరాలు.. డొంకరోడ్డుకు చెందిన ఎలినేని సందీప్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. 2016 సంవత్సరంలో శ్రీనగర్కు చెందిన స్వాతితో వివాహం అయింది. సందీప్ టిక్టాక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని జల్సాగా తిరిగేవాడు. స్నేహితురాలు అంటూ ఓ మహిళను తరచూ ఇంటికి తీసుకువచ్చేవాడు. సందీప్ తల్లి పద్మావతి కూడా అతనికే వత్తాసు పలికింది. 2017 సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసే పద్మావతి అనారోగ్యంతో మృతి చెందింది. కంభంపాడులో నివసించే సందీప్ తండ్రి శ్రీనివాసరావు తరచూ మా ఇంటికి వచ్చి స్వాతితో అసభ్యంగా ప్రవర్తించే వాడు. భర్తకు చెబితే తండ్రినే వెనుకేసుకుని వచ్చాడు. పద్మావతి ఉద్యోగం కుమారుడికి రావాలంటే శ్రీనివాసరావు ఎన్ఓసిపై సంతకం చేయాలి. ఈ కారణంగా తన తండ్రికి సహకరించమంటూ నా భర్త ప్రోత్సహించాడు. మామ శ్రీనివాసరావు బాత్రూమ్లో రహస్యంగా సీసీ కెమెరాలు పెట్టాడు. కుమారుడిని ఇతర మహిళలతో తిరగకుండా బుద్ది చెప్పాలని, నాకు న్యాయం చేయాలని నా మామను కోరితే నాతో ఉండు నీకు న్యాయం చేస్తానంటూ దుర్మార్గంగా ప్రవర్తించాడు. అనంతర కాలంలో స్వాతికి, ఆమె కుమార్తెకు సరిగా తిండి పెట్టలేదు. మామ లైంగిక దాడికి యత్నించగా ఆమె ఎదురుతిరిగి ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తింది. నువ్వు లొంగక పోతే నీ కుమార్తె (2 సంవత్సరాల పాప) తో కోరిక తీర్చుకుంటానని పాపను లాక్కుని బెదిరించాడు. శారీరకంగా చిత్రహింసలు పెట్టాడు. 2018 డిసెంబర్లో బంధువుల సహాయంతో శ్రీనగర్లోని పుట్టింటికి చేరింది. ఒకరోజు భర్త ఇంటి ముందు ఉన్నాను బయటకు రమ్మంటే వెళ్లింది. కొందరు వ్యక్తులు ఆమెపై రాళ్లు విసిరారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్నానని తెలిసి చంపుతామని బెదిరించారు. నాకు, నా కుమార్తెకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించాలని కోరింది. -
కోడలితో కోరికలకు కన్నకొడుకే అడ్డు.. తట్టుకోలేక తండ్రి
పాట్నా: కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు మరచిపోతున్నారు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనై సొంత కుటుంబసభ్యులనే కడతేరుస్తున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ తండ్రి తన సొంత కుమారుడి భార్యపై కన్నేశాడు. ఆమెతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడుఅయితే. కోడలితో లైంగిక జీవితానికి అడ్డుగా ఉన్నాడని భావించి కుమారుడినే దారుణంగా హత్య చేసిన సంఘటన బిహార్లో చోటుచేసుకుంది. చేసిదంతా చేసి మళ్లీ ఏమీ ఎరగనట్లు తన కుమారుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బిహార్ రాజధాని పాట్నా సమీపంలోని కొద్రాకు చెందిన మిథిలేశ్ రవిదాస్ కుమారుడు సచిన్. ఇటీవల కొన్నేళ్ల కిందట కుమారుడికి వివాహమైంది. భర్త, మామతో కలిసి ఆమె జీవిస్తోంది. ఈ క్రమంలో మామ ఆమెపై కన్నేశాడు. మెల్లగా ఆమెకు దగ్గరై వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. అలా మామ, కోడలు కొన్నాళ్లుగా సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని రోజులకు కుమారుడికి తన ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఒకసారి తన భార్యకు చేరువగా ఉండడాన్ని గమనించి తండ్రిని నిలదీశాడు. తన భార్యతో తండ్రి సాగిస్తున్న సంబంధం తెలుసుకుని హతాశయుడయ్యాడు. దీనిపై కుటుంబంలో గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో కోడలితో సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించి కొడుకు హత్యకు ప్రణాళిక రచించాడు. కొడుకు సచిన్తో జూలై 7వ తేదీన గొడవపడిన తండ్రి మిథిలేశ్ రవిదాస్ కొద్దిసేపటికి కత్తితో గొంతుకోసి అతి దారుణంగా హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ఓ తోటలో పడేశాడు. అయితే తన కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటనను తప్పుదోవ పట్టించాడు. కొంతమందిపై అనుమానం ఉందని ఓ ఐదుగురి పేర్లు కూడా చెప్పారు. వారిని విచారణ చేస్తుండగానే తండ్రి చేసిన ఘాతుకం బహిర్గతమైంది. నిందితుడు మిథిలేశ్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రాజీవ్ సింగ్ తెలిపారు. -
భార్యను చితకబాది, మామ పక్కటెముకలు విరగ్గొట్టిన భర్త
తిరువనంతపుంర: ఓ వైపు కేరళ ప్రభుత్వం వరకట్న నిషేధంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తుంటే మరోవైపు గృహహింస వేధింపులు ఎక్కువయ్యాయి. తాజాగా 31 ఏళ్ల మహిళను కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతోపాటు ఆమె తండ్రిని చితకబాది అతని పక్కటెముకలను విరగొట్టిన దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళలోని కొచ్చికి చెందిన మహిళను ఏప్రిల్ 12న ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరిద్దరికి ఇది రెండో వివాహం. కానీ పెళ్లైనప్పటి నుంచి మహిళను భర్త వేధించడం మొదలు పెట్టాడు. అదనపు కట్నం కావాలని. బంగారం కావాలని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో మహిళ బంగారాన్ని భర్త తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నాడని తెలిసి ఆమె తల్లిదండ్రులు ఆ బంగారాన్ని బ్యాంక్ లాకర్కు మార్చారు. ఈ విషయం కాస్తా భర్తకు తెలియడంతో తన తల్లితో కలిసి భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. అంతేగాక భార్యకు అన్నం కూడా పెట్టకుండా బాధపెట్టారు. అక్కడితే ఆగకుండా భార్య బంగారంలో తన వాట తనకు ఇవ్వకపోతే కొల్లాంలో వరకట్న వేధింపులతో బలైన విస్మయ లాగే తను కూడా అదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని భర్త బెదిరించాడు. ఈ క్రమంలో జూలై 9 న తిండి కూడా పెట్టకుండా ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేశారు. దీంతో వివాహిత సరాసరీ తన తండ్రి ఇంటికి వెళ్ళడంతో ఈ విషయంపై చర్చించడానికి జూలై 17న మహిళ తండ్రి కూతురు అత్తగారింటికి వచ్చారు. అయితే ఇదే అదునుగా భావించిన అల్లుడు భార్యపై ఇష్టారీతిగా చేయిచేసుకున్నాడు. మధ్యలో అడ్డు వచ్చిన మామని చితకబాది పక్కటెముకలు విరగొట్టాడు. చివరికి బాధిత కుటుంబం జూలై 23 న పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్లు 498 ఎ, 323, 506, 34తో పాటు వరకట్నం నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద భర్త, అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా కేరళ ప్రభుత్వం వరకట్నానికి వ్యతిరేకంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పెళ్లి అవ్వని పురుష ఉద్యోగులు వరకట్నం తీసుకోవడం లేదా ప్రోత్సహించడం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు పెళ్లయిన నెలరోజుల్లో సంబంధిత విభాగాల అధిపతులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్లో భార్య సంతకంతో పాటు వధువు తండ్రి, వరుడి తండ్రి సంతకాలు ఉండాలని తెలిపింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే సర్క్యలర్ జారీ చేసింది. అయితే తప్పుడు సమాచారాన్ని అందిస్తే చట్టపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. -
భర్త పోయి మూడేళ్లు: ఆస్తి కోసం ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్..
లక్నో: ఏడేళ్ల పాటు అన్యోన్యంగా సాగిన జీవితం. హఠాత్తుగా భర్త మరణించడంతో పిల్లలతో ఆమె ఒంటరైంది. అయితే భర్త మృతిచెందిన అనంతరం వేరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. కొన్నాళ్లకు ఆమె తన భర్తకు సంబంధించిన ఆస్తిపై కన్నుపడింది. న్యాయంగా అడగాల్సి ఉండగా.. అడగకుండా లాక్కోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి మామను హతమార్చింది. కిరాయి హంతకులను మాట్లాడి మామను అంతమొందించిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మావనా పోలీస్స్టేషన్ పరిధిలోని తాటిన గ్రామానికి చెందిన సత్పాల్ కుమారుడు సంజీవ్కు పాలి గ్రామానికి చెందిన శాలినితో 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2018లో భర్త సంజీవ్ మరణించాడు. దీంతో భార్య శాలిని పుట్టింపటికి వచ్చేసి ఉంటోంది. ఈ క్రమంలో ఆమె తన చిన్ననాటి స్నేహితుడు విపిన్తో వివాహేతర సంబంధం కొనసాగింది. కొన్ని రోజులకు తన భర్తకు సంబంధించిన ఆస్తిపై మనసు పడింది. ఈ విషయమై మామ సత్పాల్తో వివాదం కొనసాగుతోంది. మామ నుంచి ఎలాగైనా ఆస్తి కొట్టేయాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని తన ప్రియుడు విపిన్కు చెప్పింది. మామ సత్పాల్ను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. సత్పాల్ను హతమార్చేందుకు ఓ కిరాయి ముఠాను సంప్రదించారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని కొంత ముందస్తుగా డబ్బులు చెల్లించారు. సత్పాల్ హత్యకు రెక్కీ నిర్వహించి ముహూర్తం కూడా నిర్ణయించారు. అందులో భాగంగా జూన్ 29వ తేదీన పొలం నుంచి తిరిగివస్తున్న సత్పాల్ను ముఠా వెంబడించి తుపాకీతో కాల్చి అతి దారుణంగా హతమార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా కోడలి ఉదంతం వెలుగులోకి వచ్చింది. సత్పాల్ హత్యకు శాలిని తండ్రి భోపాల్ సింగ్, సోదరుడు లలిత్ కూడా సహకరించారు. వీరితో పాటు ప్రియుడు విపిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హంతక ముఠా ఆచూకీ మాత్రం లభించలేదు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీరట్ జిల్లాలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు 20 రోజుల వ్యవధిలో చేధించడం విశేషం. -
ఎలా మోయగలిగావ్?
ఆపద కాలం ఉంటుంది. కానీ ఆదుకోలేని కాలం ఒకటి ఉంటుందని మొదటిసారిగా చూస్తున్నాం. ఒక కోడలు.. అపస్మారక స్థితిలో ఉన్న తన మామగారిని వీపు పైన మోసుకుంటూ ఆసుపత్రులకు తిరిగిన ఫొటోలు వారం రోజులుగా నెటిజన్ల చేత బరువైన ఒక దీర్ఘ శ్వాసను తీయిస్తున్నాయి. ఏమైనా ఆ కోడలు నీహారిక ప్రయత్నం ఫలించలేదు. కరోనా ఆయన్ని తీసుకెళ్లిపోయింది. ‘‘ఎలా మోయగలిగావ్?’’ అన్నారట.. ఆసుపత్రి బెడ్డుపై ఉండగా ఆ ఫొటోలు చూసిన ఆమె మామగారు. అవే ఆయన ఆఖరు మాటలు. ‘‘ఎవరూ సహాయానికి రాలేదు. ఎవరికీ ఇలా జరగకూడదు’’. ప్రస్తుతం కరోనా చికిత్స పొందుతున్న నీహారిక ఆవేదన ఇది. ఎవరూ సహాయానికి రాలేదని ఆమె ఎవరినీ నిందించడం లేదు. ఎవరికీ ఇలా జరగకూడదని మాత్రమే ఆమె కోరుకుంటోంది. ‘ఇలా’ అంటే?! తన మామగారు తుళేశ్వరదాసుకు జరిగినట్లుగా! ఆయనకు ఈ నెల 2 న కరోనా పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రికి ఆటో ఎక్కించడం కోసం.. స్పృహలో లేని మామగారిని వీపుపై మోసుకుంటూ వెళ్తున్న నీహారిక ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలను ఆసుపత్రి సిబ్బంది ఒకరు తుళేశ్వరదాసుకు చూపించినప్పడు ఆయన అన్నమాటే.. ‘‘ఎలా మోశావ్?’’ అని. ∙∙ అస్సాంలో ఉంటుంది వీళ్ల కుటుంబం. నగావ్ జిల్లాలోని రహా పట్టణం పక్కన బటిగావ్ గ్రామంలో ఉంటారు. నీహారిక మామ తుళేశ్వరదాసుకు 75 ఏళ్లు. ఊళ్లోనే వక్కలు అమ్ముతుంటాడు. నీహారిక భర్తకు పశ్చిమబెంగాల్లోని సిలిగురిలో చిన్న ఉద్యోగం. నీహారిక కొడుక్కి ఆరేళ్లు. ‘దేవుడా.. కరోనా కాదు కదా..’ అని అనుకునే లోపే మామగారి ఆరోగ్యం విషమించడంతో నీహారిక కాలూచెయ్యీ ఆడలేదు ఆ రోజు! భర్త ఊళ్లో లేడు. కొడుకు చిన్నపిల్లాడు. ఇల్లు కదలొద్దని పిల్లవాడికి జాగ్రత్తలు చెప్పి, నీహారిక ఆటో మాట్లాడుకొచ్చింది. రహా ఆరోగ్య కేంద్రం అక్కడికి 2. కి.మీ. దూరంలో ఉంది. పేషెంట్ని తీసుకెళ్లడానికి ఆటోని ఒప్పించ గలిగింది కానీ.. ఇంటివరకు ఆటో రావడానికే వీల్లేని విధంగా మట్టి దిబ్బల దారి. నీహారికకు మిగిలిన దారి ఒక్కటే. చీర కొంగును నడుముకు బిగించి, మామగారిని భుజాలపై ఆ ఎడుగు దిగుడు దిగుళ్లలో ఆటో వరకు మోసుకుంటూ వచ్చి భద్రంగా ఆటోలో పడుకోబెట్టింది. ఆరోగ్య కేంద్రం దగ్గర మళ్లీ మామగారిని తన వీపు మీద మోసుకుంటూ లోపలికి తీసుకెళ్లడమే! సాయానికి వచ్చిన వారే లేరు. కరోనా అని నిర్థారణ అయింది. ‘‘ఇక్కడ లాభం లేదు, నగావ్లోని కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అన్నారు. నగావ్ ఆసుపత్రి అక్కడికి 21 కి.మీ.! అంబులెన్స్ లేదు. ప్రైవేటు వ్యానులో మామగారిని నగావ్ తీసుకెళ్లింది. ఆ ఆసుపత్రిలోంచి, వ్యాన్లోకి మళ్లీ తన వీపు మీద మోస్తూనే!! ఆ సమయంలోనే ఒకరు నీహారిక పడుతున్న పాట్లను ఫొటో తీసినట్లున్నారు. తర్వాత కొద్ది గంటల్లోనే అవి సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. నీహారికకు ఆ సంగతి తెలీదు. ∙∙ నగావ్లోని కోవిడ్ ఆసుపత్రి తీసుకెళ్లాక, అక్కడ కూడా నీహారిక తన మామగారిని వాహనం నుంచి దింపి మోసుకెళ్లవలసి వచ్చింది! పేషెంట్ పరిస్థితిని చూడగానే ‘‘ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు. నగావ్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లండి’’ అని వైద్యులు చెప్పారు. అక్కడ కూడా మామగారిని మోస్తూనే ఆసుపత్రి మెట్లను ఎక్కిదిగవలసి వచ్చింది నీహారికకు. ‘‘మా మామగారి బరువు నాకు కష్టం కాలేదు. కానీ ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగుతున్నప్పుడు మానసికంగా చాలా కుంగిపోయాను’’ అని ఆ తర్వాత తనను కలిసిన పత్రికా ప్రతినిధులతో చెప్పింది నీహారిక. ‘‘బహుశా ఆ రోజు నేను కనీసం రెండు కి.మీ.ల దూరమైనా ఆయన్ని ఎత్తుకుని నడిచి ఉంటాను’’ అని 24 ఏళ్ల నీహారిక ఆనాటి ఒంటరి ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. జూన్ 7 రాత్రి ఆయన చనిపోయారు. తర్వాత టెస్ట్ చేయించుకుంటే నీహారికకూ పాజిటివ్! ∙∙ ‘‘తల్లిదండ్రులైనా, అత్తమామలైనా, అపరిచితులే అయినా.. మనం ఒకరికొకరు సహాయం చేసుకోగల పరిస్థితులు లేకపోడం దురదృష్టం. మనిషి ఒంటరితనాన్ని ఇంకో మనిషి మాత్రమే పోగొట్టగలరు’’ అంటోంది నీహారిక. మామగారు తనను కూతురిలా చూసుకునేవారట. ‘‘అందుకేనేమో ఆయన్ని మోసేంత శక్తి నాకు వచ్చినట్లుంది’’ అంటోంది దిగులుగా. ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి.. వాహనం ఎక్కి దిగిన ప్రతిసారీ తన మామగారు తుళేశ్వరదాసును వీపుపై మోసుకెళుతున్న నీహారిక. ఆసుపత్రిలో నీహారిక, ఆమె మామ తుళేశ్వరదాసు -
కోడలిని 80 వేలకు అమ్మేసిన మామ.. భర్త లబోదిబో
లక్నో: సొంత కుమారుడి భార్యను విక్రయించాడో మామ. అది కూడా రూ.80 వేలకు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే పరుగులు తీసి రైల్వే స్టేషన్లో ఆమెను ఆ ముఠా నుంచి రక్షించారు. కొంచెం ఆలస్యమై ఉంటే ఆమె అతడికి దక్కకుండాపోయేది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని బరాబంకీ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఆ మామకు ఇలా మహిళలను ముఠాకు విక్రయించడం ఓ వృత్తి కావడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బారబంకి జిల్లాలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన చంద్రరామ్ వర్మ మహిళలతో వ్యాపారం చేస్తుంటాడు. వస్తువులను విక్రయించినట్టు మహిళలను ఓ ముఠాకు అమ్మేసుకోవడం ఈయన ప్రధాన వృత్తి. ఈ విధంగా ఇప్పటివరకు దాదాపు 300 మంది మహిళలను విక్రయించాడు. తాజాగా అతడికి కుమారుడి భార్యపై కన్నుపడింది. కోడలిని విక్రయించాలని నిర్ణయించుకుని గుజరాత్కు చెందిన ఓ ముఠాను సంప్రదించాడు. రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 5వ తేదీన కోడలిని ఆ ముఠాకు అప్పగించేశాడు. ఈ ఘటనతో షాకయిన కోడలు భర్తకు సమాచారం ఇచ్చింది. పోలీసుల సహాయంతో భర్త వెంటనే రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. గుజరాత్కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఆ ముఠా నుంచి ఆమెను రక్షించి భర్తకు అప్పగించారు. అయితే ప్రధాన నిందితులు మామ చంద్రరామ్, మరొకరు రామ్గౌతమ్ తప్పించుకున్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రరామ్పై ఓ హత్య కేసు కూడా నమోదై ఉందని పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. చదవండి: ఇంజెక్షన్లతో కామవాంఛ.. 8 ఏళ్లుగా యువతిపై -
కోడలిపై అనుమానం.. స్నేహితులతో కలిసి
ముంబై: ముంబైలోని అక్షా బీచ్లో గోనె సంచిలో వారం రోజుల క్రితం ఓ మృతదేహం లభించిన విషయం తెలిసిందే. గోనె సంచిలోని మృతదేహం ఈస్ట్ కాందివ్లీ, పోయిసర్కు చెందిన నందినిగా గుర్తించిన పోలీసులు మిస్టరీ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు నందిని మామగా పోలీసులు తేల్చారు. వివరాల్లోకి వెళితే.. ఈస్ట్ కాందివ్లీకి చెందిన పంకజ్ని మూడు సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే పంకజ్ వాళ్ల తండ్రి కమల్ రాజ్కు కొడుకు నందినినని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అంతేగాక ఆమె క్యారెక్టర్పై అనుమానం పెంచుకున్నాడు. చదవండి: గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పని నిమిత్తం పంకజ్ వేరే ఊరికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన మామ కమల్ రాజ్ కోడలిని ఎలా అయినా అంతమొందించాలని పన్నాగం పన్నాడు. దీంతో డిసెంబర్ 9న కమల్.. ఇద్దరు స్నేహితులతో కలసి నందిని నిద్రిస్తున్న సమయంలో ఆమె చేతులు కాళ్లు కట్టేసి దిండుతో నొక్కి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో వేసి ప్యాక్ చేసి దానిని కండివిల్లి ప్రాంతంలోని నాలాలో విసిరేశారు. డిసెంబర్ 24న మృతదేహం కలిగిన గోనె సంచి ఆక్షా బీచ్కు చేరుకుంది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి దానిని తెరిచి చూడగా అందులో మృతదేహం కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసులో మామతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
తండ్రిని దిద్దిన కూతురు
అమెరికన్ టీనేజ్ టెన్నిస్ సంచలనం.. పదిహేనేళ్ల కోకో గాఫ్.. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్లో దుమ్ము రేపుతోంది. ఆ దుమ్ముల్లోంచి కూతురి రాకెట్ విన్యాసాలను తిలకిస్తూ పుత్రికోత్సాహంతో పరమానంద భరితుడౌతున్న ఆమె తండ్రి కోరి గాఫ్.. ఆమె కొట్టే ప్రతి షాటుకీ ‘డామ్ (ఇట్)’.. ‘డామ్ (ఇట్).. అని అరుస్తున్నాడు. అది ఆమెకు నచ్చలేదు. ‘కొట్టు.. అద్దీ.. అలాగ..’ అని బరి బయట ఉన్నవాళ్లు అరుస్తుంటారు కదా.. అలా అంటున్నాడు ఆయన. బ్రేక్లో బయటికి వచ్చి.. ‘డాడీ!!’ అంది.. గుసగుసగా కోకో. ‘‘ఏంటమ్మా!’’ అన్నాడు. ‘‘అలా నువ్వు డి–వర్డ్ని యూజ్ చెయ్యకు. బాగుండదు’’ అంది. ‘‘తప్పేముందమ్మా.. ఆటే కదా..’’ అన్నాడు తండ్రి. ‘‘ఆట కాబట్టే అనకూడదు డాడీ..’’ అంది. ‘‘సర్సరే.. ఐయామ్ సారీ.. ఇక అనను. ఒకేనా’’ అన్నాడు తండ్రి. మళ్లీ ఆ డి–వర్డ్ని యూజ్ చెయ్యలేదు ఆయన. సోమవారం ఉమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో 7–6, 6–3 తేడాతో ముప్పై తొమ్మిదేళ్ల సీనియర్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ని కోకో గాఫ్ పరుగులు పెట్టిస్తున్నప్పుడు కూడా ఆయన చూస్తూ ఆనందించారు తప్ప, చప్పుడు చెయ్యలేదు. -
కర్రతో కొట్టి చంపింది
లక్నో: తన పాలిట కీచకుడిగా మారిన మామను కోడలు కొట్టి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని మధోతండా పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుక్రవారం తన కొడుకు పనికి వెళ్లిన సమయంలో కోడలిపై మామ అత్యాచారం చేశాడు. తర్వాత రోజు మరోసారి అకృత్యానికి ఒడిగట్టడంతో బాధితురాలు భర్త సహాయంతో మామను కర్రతో కొట్టి చంపింది. తర్వాత వీరిద్దరూ స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. మృతుడి పెద్ద కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులు తెలిపారు. -
టీవీ నటి భర్త ఆత్మహత్య.. షాకింగ్ విషయాలు
చెన్నై: ప్రముఖ టాలీవుడ్ నటి జయసుధ భర్త ఆత్మహత్య మరువక ముందే మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ టివీ, సినీ నటి నందిని(30) భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. విరుగంబాక్కమ్లోని ఓ లాడ్జ్లో ఆయన విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హోటల్ సిబ్బంది ద్వారా మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఆర్ధిక ఇబ్బందుల వల్ల జిమ్ మూతపడంతో మనస్తాపం చెందిన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా లేఖ కూడా రాశారు. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలో జిమ్ నడుపుతున్న కార్తికేయన్ మొదటి భార్య చనిపోవడంతో గత ఏడాది జూన్లో నందినిని వివాహం చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా వీరిద్దరు కూడా విడిపోయారు. అయితే కార్తికేయన్ ఆత్మహత్యకు మొదట నందిని తండ్రి బాధ్యుడన్న వార్తలొచ్చాయి. కార్తీక్ ఆత్మహత్యపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన నందిని ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని ఖండించారు. తమిళ పత్రికల్లో మాట్లాడుతూ ఆమె విభిన్నమైన అంశాలను వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ చాలా మందివద్ద డబ్బులు తీసుకున్నాడని తెలిపింది. ఆ డబ్బులకోసం చాలా మంది తనను ఇబ్బంది పెట్టారని, దీంతో కార్తీక్ని తాను నిలదీసానని చెప్పింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో తన తల్లిదండ్రులు అతణ్ణించి తనను దూరంగా తీసుకెళ్లారని వివరించింది. ఈ ఘటనతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తోంది. అలాగే తన భర్తకు వేరే అమ్మాయితో వివాహేత సంబంధం ఉందని, ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కార్తీక్ ను గతంలో అరెస్ట్ చేశారని తెలిపింది. అయితే వీటన్నింటినీ ఎవరికీ చెప్పకుండా తన మనసులోనే దాచుకున్నాననీ.. కానీ కార్తీక్ ఆత్మహత్య కారణంగా తన పరువు బజారున పడిందని వాపోయింది. డబ్బుల కోసం తాను కార్తీక్ని వేధించలేదని కానీ అతను కేవలం డబ్బు కోసం తనను వివాహం చేసుకున్నాడని నందిని ఆరోపించింది. కాగా నందిని టీవీ సీరియల్ శరవణన్ మీనాక్షి లోని మైనా పాత్ర ద్వారా పాపులర్ అయ్యారు. వంశం, కేడి బిల్లా కిలాడి రంగ లాంటి తమిళ సినిమాల్లోకూడా నటించారు. -
'ఓ బాలిక మా మావయ్య ప్రాణాలు కాపాడింది'
ముంబై: గుర్తుతెలియని ఓ సాహస బాలిక తన మావయ్య ప్రాణాలు కాపాడిందని బాలీవుడ్ నటి రవీనా టాంటన్ వెల్లడించింది. మానవత్వం ఇంకా బతికేవుందనడానికి ఈ ఘటన అద్దం పట్టిందని తెలిపింది. డిసెంబర్ 18న చోటుచేసుకున్న ఈ ఘటన గురించి ట్విటర్ ద్వారా వెల్లడించింది. 'మా మావయ్య, అత్తయ్య కలిసి కారులో సినిమాకు బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక చీప్ జాక్ సమీంలోని జంక్షన్ లో ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అదే సమయంలో మా మావయ్య ఒంట్లో నలతగా అనిపించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. పక్కనే ఉన్న మా అత్తయ్య ఆయనకు సపర్యలు చేయసాగారు. ఆస్పత్రికి తీసుకెళదామంటే ట్రాఫిక్ లో కారు చిక్కుకుపోయింది. తర్వాత లైన్ లో ఉండి ఇదంతా గమనించి ఓ బాలిక తన కారులోంచి దిగి వాహనదారులందరినీ అప్రమత్తం చేసింది. ట్రాఫిక్ తొలగించి వారిని ఆస్పత్రికి వెళ్లేలా చేసింది. సమయానికి ఆయనను ఆస్పత్రికి తరలించకుంటే ఏం జరిగేదో తలచుకుంటేనే భయమేస్తోంది. ఆయన ఇప్పుడు బాగానే కోలుకుంటున్నారు. తన ప్రాణాన్ని నిలబెట్టిన సాహస బాలికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మానవత్వంపై నా నమ్మకాన్ని నిలబెట్టిన సాహస బాలికకు ధన్యవాదాలు' అని రవీనా టాండన్ ట్వీట్ చేసింది. A brave soul,a girl driving next lane saw my mum in law trying to massage dads heart,jumped out of her car realising emergency,cleared 3/4 — Raveena Tandon (@TandonRaveena) December 20, 2015 -
మామను ఫాలో అవుతున్న అల్లుడు