breaking news
Family abandons
-
ఫోన్ ఆఫ్.. బంధాలు ఆన్!
సెల్ఫోన్..సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యావత్ ప్రపంచాన్నీ గుప్పిట పెట్టేసింది. ఇది లేకపోతే ఎలా అన్నంతగా దైనందిన జీవితంలో మమేకమైంది. అయితే ఈ అద్భుత ఉపకరణం ఇతరత్రా దుష్ప్రభావాల మాటెలా ఉన్నా..కుటుంబ సభ్యుల అంతరాన్నీ గణనీయంగా పెంచుతోంది. అతిగా మొబైల్ ఫోన్ వాడకం కుటుంబ బంధాలు బీటలు పడడానికి కారణం అవుతోంది. ఇలాంటి సెల్ఫోన్ను కాసేపైనా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తే..! ఇతరత్రా ప్రయోజనాలతో పాటు జీవితంలోని అనేక మధుర క్షణాలను ఆస్వాదించే అవకాశమూ లభిస్తుందని స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో చెబుతోంది.చిన్న పనే..పెద్ద ప్రభావంఉరుకుల పరుగుల ఆధునిక జీవితంలో సాధారణంగా ఒక్క భోజన సమయంలోనే కుటుంబ సభ్యులంతా కలుస్తూ ఉంటారు. అయితే ఆ సమయంలో కూడా ఫోన్ మాట్లాడటం లేదా వీడియోలు చూస్తుండటం అలవాటుగా మారిపోయింది. అయితే కనీసం ఆ టైమ్లోనైనా ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసేస్తే.. బంధాలు బలపడటం ఖాయమని వివో స్విచ్ ఆఫ్ స్టడీ–2025 వెల్లడిస్తోంది.శ్రేయస్సు, వ్యక్తిగత వృద్ధిని పెంపొందించుకోవడానికే ప్రజలు సాంకేతికతను ఉపయోగించుకోవాలని, ప్రియమైనవారితో లోతైన సంబంధాలను ఏర్పరచుకోవాలని సూచిస్తోంది. ఫోన్లు లేని క్షణాలు తమకు మధురానుభూతులు మిగిలిస్తున్నాయని, బలమైన బంధానికి బాటలు వేస్తున్నాయని తల్లిదండ్రులు, పిల్లలు సైతం భావిస్తుండడం విశేషం. ‘స్విచ్ ఆఫ్’ ఆలోచన చాలా చిన్నదే కావొచ్చు. కానీ కాస్త పరిణితి ప్రదర్శిస్తే అదో శక్తివంతమైన విధానంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుండటం గమనార్హం.ఏం చేయాలి..?భోజన సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల పిల్లలతో ఎక్కువ అనుబంధం ఏర్పడినట్టు 81% మంది తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు ఫోన్లలో బిజీగా ఉండటం వల్లే తాము వారితో తక్కువగా మాట్లాడుతున్నామని, ప్రత్యామ్నాయంగా ఏఐ వైపు మొగ్గు చూపుతున్నామని 67% మంది పిల్లలు చెబుతున్నారు.ఏది ఏమైనా గ్యాడెŠజ్ట్స్ను పక్కన పెట్టినప్పుడు కుటుంబంలో సంభాషణలు సులభంగా, అర్థవంతంగా అనిపిస్తాయన్నది 91% మంది పిల్లల మాట. నోటిఫికేషన్స్ను తగ్గించేలా ఫోన్ సెట్టింగ్స్ మార్చడం, అందరూ కూర్చునే ప్రదేశాలకు దూరంగా ఉపకరణాన్ని ఉంచడం వంటి చిన్నచిన్న మార్పులతో తల్లిదండ్రులు, పిల్లలు ప్రయోగాలు చేస్తున్నారు. ఫోన్ రహిత అలవాట్లను ఎంత ఎక్కువగా పాటిస్తే నిజమైన మధుర క్షణాలను పదిలపర్చుకోవచ్చని వారు అంటున్నారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..స్మార్ట్ఫోన్ అధికంగా వాడడం వల్ల తల్లిదండ్రులు–పిల్లల సంబంధాలపై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మార్కెట్ రీసెర్చ్ కంపెనీ సైబర్ మీడియా రీసెర్చ్తో కలిసి వివో ఈ అధ్యయనం చేపట్టింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల నుంచి 1,017 మంది తల్లిదండ్రులు, 500 మంది పిల్లలు ఇందులో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్ఫోన్ యూజర్లలో పెద్దల వయసు 35–50 కాగా, పిల్లలు 10–16 ఏళ్లవారు.స్టడీ హైలైట్స్⇒ రాత్రి భోజనం సమయంలోనే 72% మంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు.⇒ డైనింగ్ టేబుల్ వద్ద ఫోన్లలో మునిగితేలడం సంభాషణకు ప్రధాన నిరోధకమని 72% తల్లిదండ్రులు, 30% పిల్లలు పేర్కొన్నారు.⇒ ఉదయం నోటిఫికేషన్లు చెక్ చేయడం, మధ్యాహ్నం ఓటీటీల వీక్షణం, రాత్రిపూట స్క్రోలింగ్.. ఇదీ యూజర్ల తీరు.⇒ ఫోన్ రహిత విందులు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన, నమ్మకం, భాగస్వామ్యం గణనీయంగా మెరుగుపరుస్తాయి.⇒ స్విచ్ ఆఫ్ సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడటానికి 87% మంది పిల్లలు మరింత సౌకర్యంగా ఉంటారు.⇒ తమ చుట్టూ ఉన్నవారు ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు పిల్లలు సైతం వారిని అనుసరిస్తున్నారు.అంకెల్లో యూజర్లు..ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు న్నారు. ఒక్కో వ్యక్తి రోజుకు సగటున నాలుగున్నర గంటలు ఫోన్లో విహరిస్తున్నారు. మనవాళ్లేం తక్కువ కాదు. మన దేశంలో 70 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ఫోన్లు ఉంటే.. రోజుకు సగటున 5–7.4 గంటలు స్క్రోల్ చేస్తున్నారు. -
కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన రాజ్నాథ్ సింగ్ (ఫొటోలు)
-
గుండెబరువు దించుకోవాలి.. పలకరిద్దాం పదండి
కోవిడ్ తుఫాను కొద్దిగా తెరిపి ఇస్తోంది.. అది కురిపించిన శోకవృష్టి అంతా ఇంతా కాదు. ఎవరికీ ఎవరితో మాట్లాడ బుద్ధి కాలేదు.. ఎవరికీ ఎవరూ సాయం చేయ వీలు కూడా లేదు. ప్రతి ఇల్లు తన సొంత బాధల్లో మునిగిపోయింది. భయంతో బెదిరిపోయింది. వాట్సప్ పలకరింపులు తప్ప ఫోన్లు కూడా చేయని నిరాసక్తత ఏర్పడింది.. ఇది కొనసాగకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడదీసుకోవాలి.. ఒకరిని ఒకరు పలకరించుకోవాలి. నేరుగా కాకపోయినా సరే మనసారా మాట్లాడుకుని గుండెబరువు దించుకోవాలి. ‘ఒకరికి ఒకరం ఉన్నాం’ అని ఓదార్చుకోవాలి. పలకరిద్దాం పదండి. సందర్భం–1: రామలక్ష్మి కాలేజీ లెక్చరర్. భర్త బ్యాంక్ ఎంప్లాయీ. ఇద్దరు పిల్లలు విదేశాలలో స్థిరపడ్డారు. కోవిడ్ మహమ్మారి చెలరేగిన ఏప్రిల్–మే నెలల్లో ఆమె కుటుంబంలో ఎవరికీ కోవిడ్ రాలేదు. కాని ఆమె పెదనాన్న కొడుక్కి కోవిడ్ వచ్చింది. 50 ఏళ్లు. చాలా ఖర్చు పెట్టినా మరణించాడు. ‘అక్కా అక్కా’ అని నోరారా పిలిచేవాడు. ఆమె అతన్ని చివరి చూపులు చూడలేకపోయింది. అతని మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతడి పిల్లల భవిష్యత్తు తలచుకుంటే ఆమెకు విషాదమే విషాదం. స్నేహితులు, ఇరుగుపొరుగువారు ఆమే ఆమె కుటుంబం బాగుంది కదా అనుకోవచ్చు. కాని ఇది కుటుంబానికి మాత్రమే సంబంధించిన వేదన కాదు. ఇలా అటాచ్మెంట్ ఉన్నవారు దూరమైనా వేదన ఉంటుంది. అయినా సమస్య ఏమిటంటే ఇది ఎవరి తో చెప్పుకుంటాం అందరూ ఇలాగే ఉన్నప్పుడు అని ఆమె అనుకోవడం. కాని ఆమె మాట్లాడాలి. ఆమెతో మాట్లాడాలి. మన చుట్టూ ఉన్నవాళ్ల మనసు లోపల ఏముందో తెలుసుకోవాలి. కోవిడ్ తగ్గుముఖం పడుతున్న ఈ సమయంలో ఆమె వంటి ఎందరికో పలకరింపు అవసరం ఉంది. సందర్భం›– 2: మురళీకృష్ణకి 70 ఏళ్లు. భార్య మరణించింది. కుమారుడు, కోడలు విదేశాలలో స్థిరపడ్డారు. తండ్రి ని తన దగ్గరకు రమ్మంటే ఇండియా వదిలి ఏం వస్తానని వెళ్లలేదు. దాంతో కొడుకే అక్కడి నుంచి ఇండియాకు రెండేళ్ల క్రితం షిఫ్ట్ అయ్యి తండ్రితోనే ఉంటున్నాడు. మొన్న మే మొదటివారం ఆ కొడుక్కి కరోనా వచ్చింది. ఎంత డబ్బు ఖర్చు చేసినా బతకలేదు. మరణించాడు. ఆ తండ్రికి అదెంత పెద్ద దెబ్బ. ఎంత భారం. ఎందరో బంధువులు. అయితే ఒక్కరూ వచ్చి ఆయనను గట్టిగా హత్తుకొని మనసారా ఏడ్వలేని స్థితి. ఆయన కూడా ఎవరితోనూ మాట్లాడలేకపోయారు. ఆయన కోలుకోవాలి. కోడలికి స్థయిర్యం ఇవ్వాలి. పిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి. ఎంతోమంది కలిసి ఎన్నోసార్లు పలకరిస్తూ, మాట్లాడుతూ, కలుస్తూ గట్టిగా ప్రయత్నిస్తే తప్ప ఈ పని జరగదు. కోవిడ్ చాలా నిర్లిప్తతను ఇస్తోంది. కాని నిర్లిప్తత వల్ల చనిపోయినవారు తిరిగి రారు. బతికి ఉన్నవారు నష్టపోతారు. ఒక్క పలకరింపు దీనికి సరైన వేక్సిన్. సందర్భం – 3: శ్రీలత ఐటి ఎంప్లాయి. భర్త కూడా అదే రంగం. కోవిడ్ వచ్చినప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇరువురికీ రాలేదు. కాని రోజూ పేపర్లో వార్తలు శ్రీలత మీద చాలా ప్రభావం చూపాయి. ముఖ్యంగా తల్లిదండ్రులను కోల్పోయిన పసిపిల్లలను చూస్తే ఆమె కళ్లు ధారాపాతంగా కారేవి. ఏమిటి ఈ జీవితం అని ఆమెకు అనిపించేది. ఇంతటి విషాదం ఆ పిల్లలకు దేవుడు ఎందుకిచ్చినట్టు అని విరక్తి అనిపించేది. ఆమె చాలా డిప్రెస్ అయిపోయింది. చుట్టూ ఉన్న సమాజం ఇంత కష్టాల్లో ఉంటే నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని చాలా ముభావం అయిపోయింది. పైకి ఆమె ఉద్యోగం చేసుకుంటోంది.. కుటుంబం బాగుంది అనుకోవచ్చు. మానసికంగా ఇలా తీవ్రమైన వేదన అనుభవించేవారు ఉంటారు. వారిని కూడా సరిగ్గా పలకరించడం, భవిష్యత్తు మీద ఆశ కల్పించడం అవసరం. ‘ఎలా ఉన్నావు?’ అని అడిగితే ‘బానే ఉన్నాను’ అని చెప్పాక ఫోన్ పెట్టేయడం పలకరింత కాదు. లోలోపలి గడ్డకట్టిన నెగెటివ్ భావనలను బద్దలు కొట్టగలగాలి. ఇందుకు సమయం పెట్టాలి. కన్సర్న్ చూపించాలి. లేకుంటే ఆ నిర్లిప్తత బావి లోపలికి లాగుతూనే ఉంటుంది. ఫోన్లు కలిసి మాట్లాడుకునే సందర్భాలను ఎలా అయితే తగ్గించాయో వాట్సప్ వచ్చి ఫోన్ మాట్లాడుకునే సందర్భాలను తగ్గించాయి. కోవిడ్ సమయంలో సమాజంలో అత్యంతగా మాటల ముభావం నడిచిందని చెప్పాలి. ఏదైనా పలకరింతకు వాట్సప్ను ఎక్కువగా ఉపయోగించారు. కోవిడ్ బారిన పడిన వారు ఓపిక లేక ఫోన్లు ఎత్తలేదు. ఆ పేషెంట్స్ను అటెండ్ చేస్తున్నవాళ్లు ఆందోళన వల్ల బిజీ వల్ల ఫోన్లు ఎత్తలేదు. మాటకు మాట వినిపిస్తే వచ్చే ధైర్యం వేరు. కోవిడ్ ఉధృతి ఉన్న రోజుల్లో కనీసం ఈ మాట్లాడుకునే ఉత్సాహం కూడా పరస్పరం కరువైందన్నది వాస్తవం. ఎలాగూ కోవిడ్ వల్ల ఒకరి ఇంటికి మరొకరు రావడం లేదు. ఒకరి స్పర్శ మరొకరికి అంటడం లేదు. మనిషి కనిపించినా ముఖం కనిపించక ‘మాస్క్’ అడ్డం కావడం వల్ల ఆ ఆత్మీయత తాలుకు గాఢత సగం తగ్గిపోతోంది. దానికి తోడు ‘మాట’ కూడా తగ్గిపోతే అందరం ప్రమాదంలో పడతాం. బాధ్యతే బంధం కోవిడ్ అనంతరం మనం ఎవరినైనా పలకరిస్తున్నాం అంటే వారి బాధ్యత మనం తీసుకుంటున్నట్టు. లేదా మన బాధ్యత వారికి అప్పజెప్తున్నట్టు. ఆ స్థాయి స్నేహితులుగా, బంధువులుగా, ఆత్మీయులుగా మనం మారకపోతే సమాజం పూర్తిగా కోలుకోవడం కష్టం. పైపై పెదాల మాటలు ఇప్పుడు వృధా. ప్రతి ఒక్కరికి లోతైన కష్టం ఉంది. మానసిక, భౌతిక, ఆరోగ్యపరమైన నష్టాలు ప్రతి కుటుంబం చవిచూసింది. దానికి ఏ విధంగా చేయూతనివ్వొచ్చో పరస్పరం తప్పనిసరిగా ఆలోచించాలి. మనం డబ్బు సహాయం చేయలేకపోతే మాట సహాయం తప్పనిసరిగా చేయగలగాలి. ఇంట్లోకి వెళ్లలేకపోతే గడప దాకా వెళ్లి డజను అరటిపండ్లు ఇవ్వగలగడం కూడా సంజీవిని కంటే తక్కువ కాదు. మనిషికి మనవాళ్లు ఉన్నారు మన కోసం నిలబడతారు అనే భావనే సగం బలం. చాలామందిమి అలా నిలబడలేకపోవచ్చు... కాని అలా నిలబడతామన్న భరోసా అన్నా ఇవ్వాలి. ముఖ్యంగా కరోనా బారిన పడి ఆర్థికంగా నష్టపోయిన వారిని కచ్చితంగా గమనించుకోవాలి. వారికి అప్పు ఇచ్చినవారు ఎవరు, వారు రేపెప్పుడైనా వొత్తిడి పెడతారా, వీరు దానిని తీర్చడం గురించి ఏం మార్గాలు ఉన్నాయి... చర్చించి వీలైన సలహా సహకారం అందించగలిగే స్థాయిలో మన వారితో మన అనుబంధం ఉండాలి. థర్డ్ వేవ్ రాకూడదనే ఆశిద్దాం. ఇప్పుడు ఒక నెల రెండు నెలల విరామం దొరికేలా ఉంది. కనుక కోవిడ్ తుఫాను తాకిడికి చెల్లాచెదురైన స్నేహితులు, ఆత్మీయులు, బంధువులలో మనకు విలువైనవారిని, మనం విలువైనవారుగా భావించేవారిని ‘పూర్తిగా పలకరించే’ బాధ్యతను మనం తీసుకోవాలి.లేకుంటే కోవిడ్ చేసిన నష్టం కంటే కోవిడ్ అనంతర పరిస్థితులు చేసే నష్టం ఎక్కువగా ఉంటుంది. అది మంచిది కాదు. – సాక్షి ఫ్యామిలీ -
అక్క ఆత్మహత్య.. తట్టుకోలేక హార్పిక్ తాగిన చెల్లెలు
సాక్షి, ఆదిలాబాద్: ఆవేశంలో అక్క ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. చెల్లెలు అక్క మృతిని తట్టుకోలేక టాయిలెట్ క్లీనర్ ద్రావణం తాగేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. అక్క మృతి చెందగా చెల్లెలు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్లో చోటుచేసుకుంది. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడడానికి కారణం కుటుంబ కలహాలేనని తెలుస్తోంది. . ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. సంజయ్నగర్లో ఉంటున్న అక్క రేఖశ్రీ మంగళవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యతో అక్క మృతి చెందడంతో ఆమె చెల్లెలు దీపశ్రీ తట్టుకోలేకపోయింది. అక్క మృతిని కళ్లారా చూసినా దీప తాను కూడా చచ్చిపోతానని బాత్రూమ్లో ఉండే టాయిలెట్ క్లీనర్ తాగేసింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే దీపశ్రీని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దీప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషాదానికి కారణం కుటుంబ కలహాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. చదవండి: నా భార్యకు భర్తగా కొడుకు పేరా?


