-
వీడియో: పాతబస్తీలో విచ్చలవిడిగా కొట్టుకున్నారు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రెండు చిన్న గ్యాంగ్ల మధ్య వాగ్వాదం మొదలై గొడవగా మారింది. దీంతో రెండు గ్యాంగ్లు రోడ్డుపైనే విచ్చలవిడిగా కొట్టుకున్నాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు నమోదు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్సాబ్ కుంట వద్ద ఈ ఘటన జరిగింది. చిన్నరోడ్ ప్రమాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో ప్రారంభమైన చిన్న గొడవ పెద్దదై.. రెండుగ్రూపులుగా మారి యువకులు కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు 100కు డయల్ చేయడంతో ఫలక్ నుమా పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలో గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన రెండు గ్యాంగ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
నగరంలో మరో రౌడీషీటర్ హత్య
హైదరాబాద్ : నగరంలోని మరో రౌడీషీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. మంగళవారం తెల్లవారుజామున ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో టికల్కుంట ప్రాంతంలో రౌడీషీటర్ ఫైరోజ్ను ప్రత్యర్థులు హత్య చేశారు. అనంతరం ప్రత్యర్థులు అక్కడ నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లు ముహమ్మద్ ప్రూట్, ఆసిఫ్, బాబాఖాన్లతో ఉన్న వైరమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
బ్రెయిన్ లో బుల్లెట్
ఐదేళ్లుగా ప్రాణాలతో పోరాడుతున్న కానిస్టేబుల్ ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడి.. బుల్లెట్ బాధను భరిస్తున్న రాజేంద్రప్రసాద్ అతను ఏ క్షణాన కుప్పకూలిపోతాడో... ఏ నిమిషాన మృత్యువు కబళిస్తుందో తెలియదు. కుటుంబ సభ్యులు అనుక్షణం అతణ్ణి ఓ కంట కనిపెట్టాల్సిందే. ఐదేళ్ల క్రితం ఉగ్రవాది వికార్ చేతిలో గాయపడ్డాడు. మెదడులోకి దూసుకెళ్లిన తూటాను భరిస్తున్నాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోన్న తరుణంలో తన కుటుంబం ఏమవుతుందోనన్న బెంగతో బతుకుపోరాటం చేస్తోన్న ఓ కానిస్టేబుల్ దీనగాథ ఇది. ఆ రోజు ఏమైందంటే... 2009 మే 18న ఫలక్నుమా ఠాణాకు చెందిన కానిస్టేబుల్ దాసరి రాజేంద్రప్రసాద్(44), హోంగార్డు బాలస్వామి (27) ఫలక్నుమా బస్టాండ్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు వారిపై ఉగ్రవాది వికారుద్దీన్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో బాలస్వామి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కాగా రాజేంద్రప్రసాద్ తలతోకి బుల్లెట్ (32) దూసుకుపోవడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. 2007 మే 18న జరిగిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనకు ప్రతీకారంగా ఏటా పోలీసులను టార్గెట్ చేసుకుని వికారుద్దీన్ పంజా విసురుతూనే ఉన్నాడు. ఆ రోజు అతని టార్గెట్కు బాలస్వామి, రాజేంద్రప్రసాద్లు చిక్కారు. మెదడు నరాల మధ్యలో... గాయపడిన రాజేంద్రప్రసాద్ను కేర్ ఆసుపత్రికి త రలించారు. అతని తలలోని చిన్న-పెద్ద మెదడు మధ్యలోని నరాల్లోకి బుల్లెట్ దూసుకెళ్లిందని, అక్కడ నరాలు కాలిపోయాయని వైద్యులు చెప్పారు. ఆ బుల్లెట్ తీస్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆపరేషన్ చేయలేమంటూ నెల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం... అప్పటి నుంచి మెదడులో ఉన్న బుల్లెట్తో రాజేంద్రప్రసాద్ నరకయాతన అనుభవిస్తున్నాడు. బుల్లెట్ వెలికి తీయించేందుకు ఆయన తిరగని ఆసుపత్రి లేదు. చేయని ప్రయత్నంలేదు. నగరంలోని న్యూరోసర్జన్లను కలిసి నిరాశచెందిన రాజేంద్రప్రసాద్ జనవరి 2013న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి న్యూరోసర్జన్ ఎస్.సంపత్ను కలిశాడు. బుల్లెట్ తీస్తే పక్షవా తం, ఫిట్స్తోపాటు జ్ఞాపక శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆపరేషన్ చేయడం కూడా చాలా క ష్టమని చెప్పడంతో నిరాశతో వెనుతిరిగాడు. ప్రస్తుతం ఆయన నగర సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్నాడు. కోల్పోతున్న కంటి చూపు.. మెదడులో ఐదేళ్లుగా బుల్లెట్ మోస్తున్న రాజేంద్రప్రసాద్ తన కుడి కంటి చూపును 68 శాతం కోల్పోగా, ఎడమ కంటి చూపును 60 శాతం కోల్పోయాడు. బుల్లెట్ గాయంతో మెదడులో నరాలు దెబ్బతినడంతో దాని ప్రభావం కంటి చూపుపై పడింది. కంటి చూపు మెరుగు కోసం ఎన్ని ఆసుపత్రులు తిరిగినా లాభం లేకుండాపోయింది. బైక్ నడపడం, ఎత్తయిన ప్రదేశానికి వెళ్లడం, స్విమ్మింగ్ వంటి పనులు చేయరాదని డాక్టర్లు సలహా ఇచ్చారు. నిత్యం మూడు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాడు. ఈ ట్యాబ్లెట్లు వేసుకున్న వెంటనే ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అయినా తన విధులకు బైక్పైనే వెళ్తున్నాడు. అందరి మాదిరిగానే డ్యూటీ చేస్తున్నాడు. డాక్టర్ల సలహాలకు విరుద్ధంగా పనిచేస్తుండటంతో ఏ క్షణాన ఏమవుతుందోనని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగం మానేసిన భార్య.. రాజేంద్రప్రసాద్ భార్య ధనలక్ష్మి దిల్సుఖ్నగర్లోని ఓ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఈ ఘటన జరిగిన తరువాత ఆమె ఉద్యోగం మానేసి భర్తను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఎక్కువ దూరం నడిచినా, ఎక్కువ సేపు టీవీ చూసినా, ఎక్కువ సమయం స్నానం చేసినా ఫిట్స్ వచ్చి కింద పడి పోతాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో అతను గతనెల 19 నుంచి సిక్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇక పిల్లలు అభినవ్ (11), చంద్రిక (9) నాలుగో తరగతి చదువుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం బతుకుతున్నామని, తమకు ఏదైన జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆ దంపతులు అనుక్షణం భయపడుతున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
టీడీపీ నాయకుల దాష్టీకం..
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
తప్పక చదవండి
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
- Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
Advertisement