breaking news
face to face discussion
-
పుతిన్ పైచేయి!
ఉక్రెయిన్పై దురాక్రమణ దండయాత్ర మొదలెట్టాక రష్యా అధ్యక్షుడు పుతిన్కు అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అమెరికాసహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ఆంక్షలు, యుద్ధ నేరాలకు పాల్పడ్డారంటూ అరెస్ట్ వారెంట్లు, సైబర్ దాడులతో శత్రుదేశాలు చుట్టుముట్టినా ఏమాత్రం బెదరక పుతిన్ తన తిరుగులేని ఆధిపత్యాన్ని ట్రంప్ సమక్షంలోనే ప్రదర్శించి రష్యాకు ఎదురులేదని నిరూపించారు. సంయుక్త ప్రకటన సమయంలోనూ ట్రంప్ కంటే ముందే మాట్లాడి తన వాదనను మొదటే గట్టిగా వినిపించారు. దాదాపు 13 నిమిషాలపాటు సంయుక్త ప్రకటన చేస్తే అందులో అగ్రభాగం 8 నిమిషాలు పుతినే మాట్లాడాడు. దాంతో ట్రంప్ చివర్లో మమ అనిపించి ప్రసంగాన్ని ముగించారు. ట్రంప్తో భేటీ పర్వంలో అడుగడుగునా పుతిన్ తన పైచేయిని ప్రదర్శించడం విశేషం.ఎర్రతివాచీ స్వాగతంలో తొలి గెలుపు ఉక్రెయిన్తో శాంతి ఒప్పందం కుదుర్చు కోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలను స్వీకరించిన ట్రంప్ నుంచే స్వయంగా రెడ్కార్పెట్ సాదర స్వాగతాన్ని పొంది పుతిన్ తన రష్యాకు అంతర్జాతీయంగా ప్రభ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. ఉక్రెయిన్ యుద్ధంలో లక్షలాది మంది అమాయక ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారన్న అపవాదు ఉన్న దేశాధ్యక్షునికి అలస్కా ఎయిర్పోర్ట్లో సాధారణ స్వాగతంతో ట్రంప్ ముగిస్తే సరిపోయేది. కానీ అత్యంత ఆప్తుడైన మిత్రుడు తరలివస్తే ఎంతగా ప్రేమతో ఆహా్వనం పలుకుతామో అదేతరహాలో పుతిన్కు ట్రంప్ ఎర్రతివాచీ పరిచి మరీ సాదరంగా ఆహా్వనించారు. ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు కూడా సమహోదా ఉన్న ట్రంప్ స్వయంగా వెళ్లి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకలేదు. కానీ యుద్ధనేరారోపణలు ఎదుర్కొ ంటున్నాసరే స్వయంగా ట్రంప్ వెళ్లి పుతిన్కు స్వాగతం పలకడం ద్వారా అగ్రరాజ్యాధినేతకు తాను ఏమాత్రం తీసిపోనని పుతిన్ బహిరంగంగా నిరూపించారు. ఉక్రెయిన్ మొదలయ్యాక దౌత్యపరంగా, ఆర్థికంగా, ఆంక్షల పరంగా రష్యా ఏకాకిగా తయారైందని పశి్చమదేశాల మీడియా చెబుతున్నదంతా ఒట్టిమాటలేనని, అమెరికా దృష్టిలో పుతిన్ ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన, శక్తివంతమైన ప్రపంచనేత అని రుజువైంది. ట్రంప్తో సోదరభావంతో మెలగడం, కరచాలనం, ఒకే కారులో ప్రయాణించడం ద్వారా తానూ ట్రంప్ ఒకేస్థాయి అని పుతిన్ అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా చేశారు.కాల్పుల విరమణ.. గప్చుప్ ఉక్రెయిన్తో దాడులు ఆపి కాల్పుల విరమణను అమల్లోకి తేవడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. అలాంటి కీలక ‘కాల్పుల విరమణ’పదాన్ని మాటవరసకైనా ట్రంప్ ప్రస్తావించకుండా పుతిన్ విజయవంతంగా కట్టడిచేశారు. మేమే ‘ఆ మార్గం’లో ఇంకా పయనించలేదు. అక్కడి దాకా వెళ్లేందుకు ఇంకొన్ని అవరోధాలను అధిగమించాల్సి ఉంది అని మాత్రమే ట్రంప్ వ్యాఖ్యానించారుగానీ ‘కాల్పుల విరమణ’అనే పదం పలకడానికి కూడా ఆయన సాహసించలేదు. తద్వారా పుతిన్ తన కనుసన్నల్లో, తాను అనుకున్నదే భేటీలో జరిగేలా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. పాక్షిక విజయం కూడా సాధించని ట్రంప్ ఈ భేటీలో మా ప్రతిపాదనలకు పుతిన్ ఒప్పుకోకపోతే రష్యాపై మరోదఫా ఆంక్షలు విధిస్తానని రెండ్రోజుల ముందు ట్రంప్ చేసిన భీష్మప్రతిజ్ఞ ఉత్తిదేనని తేలిపోయింది. ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే భేటీ ముగిసినా సరే ట్రంప్లో ఎలాంటి నిరసన, ఆందోళన కనిపించలేదు. పైగా పుతిన్ చేసిన మాస్కో పర్యటన ప్రతిపాదనకు ట్రంప్ సంతోషం వ్యక్తంచేయడం విచిత్రం. పైగా తాము అనుకున్న ఫలితాలు రాకపోయినా ట్రంప్.. పుతిన్తో చర్చలు సానుకూలంగా సాగాయని విరుద్ధమైన ప్రకటన చేయడం గమనార్హం. దీంతో భేటీపై ట్రంప్కు ఎలాంటి పట్టు సాధించలేకపోయారని అర్థమవుతోంది. భేటీ జరుగుతున్నాసరే రష్యా దాడులుచేసేలా పుతిన్ ఆదేశాలిచ్చి తన మొండి వైఖరిని మరోసారి చూపించారు. శాంతి చర్చలను వాణిజ్య చర్చలుగా మార్చిన పుతిన్ యుద్ధం ఆపాలన్న డిమాండ్తో ముందుకొచి్చన అమెరికాను వాణిజ్యచర్చలకు బలవంతంగా పుతిన్ కూర్చోబెట్టినట్లు ఈ భేటీ తర్వాత ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతోంది. ‘‘వాణిజ్యం, డిజిటల్, హై–టెక్, స్పేస్ వంటి రంగాల్లో అమెరికా–రష్యా పెట్టుబడులు, వాణిజ్య సహకారం మరింతగా బలపడనుంది. ఆర్కిటిక్లోనూ సహకారం బాగుంది’’అని సంబంధంలేని విషయాలనూ పుతిన్ చెప్పుకొస్తున్నా ఆయనను అడ్డుకోవాల్సిందిపోయి ట్రంప్ ఆయనకు వంతపాడటం విచిత్రం. పుతిన్తోపాటు ట్రంప్ ఆ తర్వాత గొంతు కలుపుతూ.. ‘‘రష్యా వ్యాపార భాగస్వాములు మాతో వాణిజ్యానికి ఉవి్వళ్లూరుతున్నారు’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా శాంతి చర్చలను పుతిన్ విజయవంతంగా వాణిజ్యచర్చలుగా మార్చేశారు. పదికి పది.. కానీ సున్నా సమావేశం ముగిశాక ఈ భేటీలో పూర్తి సత్ఫలితాలను సాధించామని, 10/10 మార్కులు కొట్టేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యానాల్లో పిసరంతైనా నిజం లేదని తేలిపోయింది. వాస్తవానికి ఆ పది మార్కులు పుతిన్ దోచేశారు. శాంతి ఒప్పందం దిశగా కనీసం ఒక్క షరతు విషయంలో పుతిన్ను ట్రంప్ ఒప్పించలేకపోయారు. ఎయిర్పోర్ట్లో ట్రంప్తో కరచాలనం, రెడ్కార్పెట్ స్వాగతం, ట్రంప్ కలిసి మీడియాకు ఫొటోలకు పోజులు, కలిసి కారులో ప్రయాణం, దారి పొడవునా కారులో నవ్వులు, భేటీ సందర్భంగా తమ వాదనను గట్టిగా వినిపించడం, సంయుక్త ప్రకటన వేళ తొలుత మాట్లాడం సహా ప్రతి సందర్భంలోనూ పుతిన్ పైచేయి సాధించారు. సాధారణంగా ఇతర దేశాల నేతలు మాట్లాడేటప్పుడు హఠాత్తుగా కల్గజేసుకుని, వెటకారంగా మాట్లాడి వారిని అవమానించే ట్రంప్.. ఈసారి మాత్రం పుతిన్ మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం గమనార్హం. యుద్ధం, శాంతి, ఉక్రెయిన్ ప్రాంతాల దురాక్రమణ, కాల్పుల విరమణ వంటి కీలక పదాలను కనీసం ట్రంప్ ప్రస్తావించేందుకు సైతం సాహసించకపోవడం పుతిన్ దౌత్యవిజయంగా చెప్పొచ్చు. సొంత గడ్డపై జరిగిన భేటీలోనే నోరుమెదపని ట్రంప్ ఇక రష్యాలో జరగబోయే రెండో రౌండ్ భేటీలో ఏపాటి మాట్లాడతారనే అనుమానాలు బలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎవరి పంతం నెగ్గుతుందో!
ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికి, శాంతి దూతగా పేరు సంపాదించాలన్నదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం. యుద్ధంలో ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను తమదేశంలో సంపూర్ణంగా విలీనం చేసుకొని, చట్టబద్ధత కల్పించుకోవాలన్నదే రష్యా అధినేత పుతిన్ ఆశయం. రెండు భిన్నమైన లక్ష్యాల సాధన కోసం ట్రంప్, పుతిన్ శుక్రవారం అలస్కాలో సమావేశం కాబోతున్నారు. ఇరువురు నేతల భేటీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు జరుగుతాయని పైకి చెబుతున్నా.. తెరవెనుక ఇతర అంశాలూ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తమ అధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాల విషయంలో పుతిన్ పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. అలస్కా భేటీతో ఇరువురు నేతలు ఆశిస్తున్నదేమిటో చూద్దాం.. అందుకే అలస్కా వేదిక ఉక్రెయిన్పై దండయాత్ర కొనసాగిస్తున్న పుతిన్ను ప్రపంచంలో ఏకాకిగా మార్చేందుకు పశ్చిమ దేశాలు చేసిన ప్రయత్నాలు చాలావరకు విఫలమయ్యాయి. అమెరికా నుంచి రష్యాను దూరం చేసేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అమెరికా వద్ద తన ప్రతిష్ట స్థిరంగా చెక్కుచెదరకుండా ఉందని నిరూపించుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. ఇందుకోసం అలస్కా సమావేశాన్ని అవకాశంగా వాడుకోవాలని నిర్ణయించారు. అంతర్జాతీయ రాజకీయాల్లో తన పట్టు ఏమాత్రం సడలలేదని ట్రంప్తో భేటీ ద్వారా పుతిన్ సంకేతం ఇవ్వబోతున్నారు. సమావేశానికి వేదికగా అలస్కాను ఎంచుకోవడం వెనుక ఒక వ్యూహం ఉంది. అలస్కాకు చేరుకోవాలంటే ఇతర దేశాల గగనతలం గుండా ప్రయాణించాల్సిన అసవరం లేదు. ఎవరినో అనుమతి కోరాల్సిన పనిలేదు. రష్యా నుంచి నేరుగా అలస్కాకు చేరుకోగలరు. అలస్కాను 19వ శతాబ్దంలో రష్యా పాలకులు అమెరికాకు విక్రయించారు. 21వ శతాబ్దంలో కొన్ని సరిహద్దుల్లో బలవంతంగా చేసిన మార్పులను సమర్థించుకోవడానికి అలస్కాను వేదికగా పుతిన్ ఎంచుకున్నారు. దేశాల సరిహద్దులు మార్చడం, భూభాగాల యజమానులు మారడం సాధారణ విషయమేనని ఆయన చెప్పదలిచారు. అలాగైతేనే కాల్పుల విరమణ ఉక్రెయిన్తోపాటు యూరోపియన్ దేశాల అధినేతలను పుతిన్ పక్కనపెట్టారు. ప్రత్యక్షంగా అమెరికాతోనే చర్చలకు సిద్ధమయ్యారు. ఇతర దేశాల పరిగణనలోకి తీసుకోవడం లేదు. చర్చలైనా, ఒప్పందమైనా అమెరికాతోనే అంటున్నారు. ఈ విషయంలో ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినా పుతిన్ పట్టించుకోలేదు. తాము ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలను రష్యాలో అంతర్భాగంగా అంతర్జాతీయ సమాజం గుర్తించాలని పుతిన్ డిమాండ్ చేస్తున్నారు. అలాగైతేనే ఉక్రెయిన్తో కాల్పుల విరమణకు సిద్ధమని చెబుతున్నారు. అయితే, పుతిన్ డిమాండ్ను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. కబ్జాదారులకు తమ భూమి ఇవ్వబోమని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ తెగేసి చెప్పారు. ఆక్రమిత ప్రాంతాలను రష్యాలో భాగంగా అధికారికంగా గుర్తించేలా ట్రంప్పై ఒత్తిడి పెంచాలన్నదే పుతిన్ వ్యూహంగా కనిపిస్తోంది. మొదట అమెరికా గుర్తిస్తే తర్వాత ఇతర దేశాలపైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. ఆక్రమిత ప్రాంతాలను వదులుకోకుంటే ఆర్థిక సాయం నిలిపివేస్తామంటూ అమెరికా బెదిరిస్తే ఉక్రెయిన్ దారికి రావడం ఖాయమని పుతిన్ వాదిస్తున్నారు. ఆర్థిక బంధం బలపడుతుందా? అమెరికా–రష్యా మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలపైనా ట్రంప్, పుతిన్ చర్చించబోతున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన రష్యాపై అమెరికా కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ఆంక్షలను సడలించి, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసుకొనే దిశగా ఇరువురు నేతలు ఏదైనా ఒప్పందానికి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. అమెరికా సాయంతో గట్టెక్కాలన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరిస్తే రష్యాకు ఆర్థికంగా అండగా ఉండడానికి ట్రంప్ ముందుకు రావొచ్చు. యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే తీవ్ర పరిణామాల ఉంటాయని ట్రంప్ తాజాగా రష్యాను హెచ్చరించడం గమనార్హం. అంటే ఈ విషయంలో ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. శుక్రవారం జరిగే భేటీలో పుతిన్ను ఆయన ఒప్పించడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని ఆపేసి శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి స్వీకరించాలని ట్రంప్ ఆరాపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ట్రంప్, పుతిన్ ఏకాంత చర్చలే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ ఈ నెల 15న అలస్కాలో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతోందని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో ట్రంప్, పుతిన్తోపాటు ఇద్దరు అనువాదకులు మాత్రమే ఉంటారని తెలిపాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండదని పేర్కొన్నాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేళ్ల తర్వాత ముఖాముఖి చర్చలు జరుపబోతున్నారు. ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2018 జూలై 16న ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో ట్రంప్, పుతిన్ మధ్య రెండు గంటలపాటు గోప్యమైన భేటీ జరిగింది. అప్పటి చర్చల్లో పెద్దగా ఏదీ సాధించలేకపోయారు. ఫల వంతం కాలేదు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో గోప్యంగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకోవడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పటిలాగే విఫలమయ్యే అవకాశం లేకపోలేదని విమర్శకులు అంటున్నారు. ట్రంప్, పుతిన్ తోపాటు ఇరుపక్షాల నుంచి ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొంటే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు. కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం పుతిన్తో ఏకాంత చర్చలకే ట్రంప్ మొగ్గు చూపడం వెనుక స్పష్టమైన కారణం ఉన్న ట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేలా పుతిన్తో గట్టిగా వాదించి, ఒప్పించడానికి ఏకాంత భేటీ దోహదపడు తుందని ఆయన భావిస్తున్నట్లు సమా చారం. ఎందుకంటే చర్చల గదిలో ఇతరు లు కూడా ఉంటే వారు అప్పటికప్పుడు పుతిన్ మనసు మార్చేసి, వెనక్కి లాగే ప్రమాదం లేకపోలేదు. అలాంటి పరిస్థితి లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. మధ్యవర్తులతో పని కాదన్న అంచనాతో స్వయంగా తానే రంగంలోకి దిగాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఉక్రెయిన్తో మొదట కాల్పుల విరమణకు, ఆ తర్వాత శాంతి ఒప్పందానికి రష్యా అధినేతను ఎలాగైనా ఒప్పించాలన్నదే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. పుతిన్ విజయమే: బోల్టన్ అలస్కాలో జరిగే భేటీని పుతిన్ విజయంగా డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ అభివర్ణించారు. సమావేశానికి ట్రంప్ను స్వయంగా రప్పిస్తుండడం ద్వారా పుతిన్ ఇప్పటికే పైచేయి సాధించారని అన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆపేస్తుందన్న నమ్మకం తనకు లేదని తేల్చిచెప్పారు. అయితే, జాన్ బోల్టన్ వ్యాఖ్యలను ట్రంప్ కొట్టిపారేశారు. అమెరికాకు అపజయం ఉండదని పేర్కొన్నారు. -
మా అభ్యంతరాలు వినాల్సిందే
కీవ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య ఈ నెల 15న జరుగబోతున్న భేటీ పట్ల ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అసహనం వ్యక్తంచేశారు. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వారిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ ఒప్పందం కుదుర్చుకున్నా అది తమకు సమ్మతం కాబోదని తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం ‘టెలిగ్రామ్’లో పోస్టు చేశారు. రష్యా ఆక్రమణలో ఉన్న తమ భూభాగాలను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. అవి ఏనాటికైనా ఉక్రెయిన్లో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఒకవేళ వాటిని రష్యాలో అంతర్భాగంగా అమెరికా ప్రభుత్వం అధికారికంగా గుర్తిస్తే సంఘర్షణ మరింత ముదురుతుంది తప్ప తగ్గబోదని స్పష్టంచేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. ట్రంప్–పుతిన్ చర్చల్లో ఈ అంశంపై చర్చ జరగదనే భావిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి కోసమే ఆ ఇరువురు నేతల చర్చలు పరిమితమైతే బాగుంటుందని వెల్లడించారు. రెండు దేశాల నడుమ శాశ్వత శాంతి సాధ్యం కావాలంటే తమ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఆక్రమణదారులకు తమ భూమి అప్పగించేందుకు సిద్ధంగా లేమన్నారు. ఉక్రెయిన్ ప్రమేయం లేకుండా ఇతర పక్షాలు తీసుకొనే ఏ నిర్ణయమైనా అది శాంతికి వ్యతిరేకమే అవుతుందన్నారు. పరిష్కారమార్గాలను చంపేసేలా ఎవరూ వ్యవహరించవద్దని జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్లోని ఖేర్సన్ సిటీపై రష్యా సైన్యం శనివారం డ్రోన్లతో దాడికి దిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. జపొరిజియాలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. రష్యా సైన్యం 47 డ్రోన్లు ప్రయోగించగా, వాటిలో 16 డ్రోన్లను మధ్యలోనే కూల్చివేశామని ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది. రెండు క్షిపణులు సైతం ప్రయోగించగా, ఒక క్షిపణిని ధ్వంసం చేశామని తెలియజేసింది. -
పుతిన్, ట్రంప్ భేటీ 15న
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ భేటీకి వేదిక, తేదీ ఖరారయ్యాయి. ఈ నెల 15వ తేదీన అలస్కాలో ఇరువురు నేతలు సమావేశం కాబోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం స్వయంగా వెల్లడించారు. పుతిన్తో తన భేటీ గురించి శనివారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వచ్చే శుక్రవారం రష్యా అధ్యక్షుడిని కలుసుకోబోతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేతలు ముఖాముఖి సమావేశం అవుతుండడం నాలుగేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా పుతిన్ను ట్రంప్ ఒప్పిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై ట్రంప్ టారిఫ్ల మోత మోగించారు. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. అంతేకాకుండా రష్యా ప్రత్యర్థి దేశమైన ఉక్రెయిన్పై సైనిక సాయం భారీగా పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో ట్రంప్, పుతిన్ భేటీ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్–రష్యా సమరమే. దీనికి సాధ్యమైనంత త్వరగా తెరదించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. పుతిన్ను కలుసుకోబోతున్నట్లు ఇటీవల హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఒకప్పటి రష్యా భూభాగమే అలస్కా పుతిన్, ట్రంప్ సమావేశానికి అలస్కా వేదిక అవుతుండడం మరో విశేష పరిణామం. అలస్కా 1867 దాకా రష్యా సామ్రాజ్యంలో అంతర్భాగమే. అప్పటి జార్ చక్రవర్తి అలెగ్జాండర్–2 ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించారు. బ్రిటిష్ సైన్యం దీన్ని ఆక్రమిస్తుందన్న భయంతో అప్పటికప్పుడు అమ్మకానికి పెట్టారు. ఎకరాకు ఒక డాలర్ చొప్పున అమ్మేసినట్లు చెబుతుంటారు. 19వ శతాబ్దంలో ప్రపంచంలో ఇది అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం అలస్కా భూభాగం విలువ 10 బిలియన్ డాలర్లు(రూ.8.75 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. బంగారం సహా సహజ వనరులకు లోటులేని ప్రాంతం అలస్కా. అమెరికా విస్తీర్ణంలో ఐదింట ఒక వంతు అలాస్కా ఉంటుంది. అలస్కాతో రష్యాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆగస్టు 15న సమావేశం ఎందుకు? ఇక ఇద్దరు కీలక నాయకుల భేటీ కోసం నిర్ణయించిన తేదీకి కూడా చెప్పుకోదగ్గ ప్రాధాన్యం ఉంది. ఆగస్టు 15వ తేదీ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ అని మనకు తెలుసు. కానీ, ఎక్కువ మందికి తెలియని సంగతి ఏమిటంటే.. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తేదీ ఆగస్టు 15. జపాన్ చక్రవర్తి హిరోహితో లొంగుబాటు ప్రకటనతో ఈ యుద్ధం ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. 1945 ఆగస్టు 15న రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడగా సరిగ్గా రెండేళ్లకు ఇండియాకు స్వాతంత్య్రం లభించింది. జపాన్లో మిత్రదేశాల సైన్యాన్ని లార్డ్ లూయిస్ మౌంట్బాటెన్ ముందుండి నడిపించారు. విజయం చేకూర్చి పెట్టారు. అదే మౌంట్బాటెన్ ఇండియా గవర్నర్ జనరల్ హోదాలో 1947లో స్వాతంత్య్ర దినాన్ని ఆగస్టు 15గా నిర్ణయించారు. అది ఆయనకు ఇష్టమైన తేదీ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆగస్టు 15వ తేదీన పుతిన్, ట్రంప్ కలుసుకోబోతున్నారు. -
USA Presidential Elections 2024: బైడెన్ను.. మార్చొచ్చా?
డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి. నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. బైడెన్పై తీవ్ర ఒత్తిడిఅవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు. దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు. బలవంతంగా తప్పించొచ్చా? పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్లో ఓటింగ్కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు. కమలా హారిస్కు ఛాన్స్ ఉందా? నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్ఎన్ నిర్వహించిన పోల్లో ట్రంప్కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు. బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే. – సాక్షి నేషనల్ డెస్క్ -
నేడే బైడెన్, ట్రంప్ బిగ్ డిబేట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన రాజకీయ ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇరువురు నేతలు గురువారం జరిగే ముఖాముఖి డిబేట్లో పాల్గొంటారు. బైడెన్, ట్రంప్ గత ఎన్నికల్లో పరస్పరం పోటీపడిన సంగతి తెలిసిందే. ఈసారి వారిద్దరూ మళ్లీ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు అభ్యర్థుల మధ్య ఆనవాయితీగా జరిగే డిబేట్ గురువారం జరుగనుంది. -
పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారు
బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్లో గ్రామస్తులు, బాధితులతో అధికారులు ఏర్పాటు చేసిన సమావేశం ఆద్యంతం భావోద్వేగంగా సాగింది. రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, కలెక్టర్ అనితా రామచంద్రన్ హాజీపూర్లో గురువారం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ బాధితురాలి బాబాయ్ ప్రవీణ్ ఏసీపీ భుజంగరావు కాళ్లపై పడి బోరుమన్నాడు. పోలీసు వ్యవస్థపై నమ్మకం కల్పించారని ప్రశంసల వర్షం కురిపించారు. ముగ్గురు బాలికల తండ్రులు మల్లేష్, నర్సింహ, తుంగని నందం మాట్లాడుతూ నిందితుడికి ఉరి శిక్ష త్వరగా అమలు చేయాలని, వాడి ప్రాణం పోయినప్పుడే తమ పిల్లల ఆత్మలు శాంతిస్తాయన్నారు. గ్రామానికి వంతెన మంజూ రు చేయాలనే ప్రజల వినతిపై కలెక్టర్ అనితా రామచంద్రన్ స్పందించి రూ. కోటి 70 లక్షలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. సాంకేతిక కారణాలతో ఓ కుటుంబానికి ప్రభుత్వసాయం అందడం లేదని, కోర్టు ద్వారా అíప్పీల్కు వెళితే తప్పక న్యాయం జరుగుతుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ గారూ ఆదుకోండి.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం మాది. పెద్ద కూతురుకు మానసిక సమస్య. ఉన్న ఒక్క కొడుకు వికలాంగుడు. ఉండేందుకు ఇల్లు కూడా సరిగా లేదు. ఇంటి పెద్ద పనిచేస్తేనే పూట గడుస్తుంది. చురుకుగా ఉన్న నా చిన్న కూతురు ను కిరాతకుడు శ్రీనివాస్రెడ్డి పొట్టన పెట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి వచ్చిన సాయం రూ.లక్ష దాటలేదు. ఇప్పుడేమో తమకు ప్రభుత్వ సాయం అందదని తెలిసింది. ఎలాంటి ఆధారం లేని తమను మీరే పెద్ద మనసు చేసుకొని ఆదుకోవాలి. జీవనోపాధి కోసం ఉద్యోగం ఇప్పించాలి. – మైసిరెడ్డిపల్లి బాలిక కుటుంబ సభ్యులు -
తక్కువ ఖర్చుతోనే సేంద్రియ ధ్రువీకరణ
తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ డైరెక్టర్ డా. కేశవులుతో ‘సాగుబడి’ ముఖాముఖి ప్రశ్న: ఏయే ఉత్పత్తులకు తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ సంస్థ ద్వారా ధ్రువీకరణ పొందవచ్చు? డా.కేశవులు: రైతులు రసాయనాలు వాడకాన్ని మాని పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే అన్ని రకాల ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పూలతోపాటు మిర్చి, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలకు మా వద్ద నుంచి సేంద్రియ ధ్రువీకరణను సులభంగా పొందవచ్చు. అంతేకాదు, అడవి నుంచి సేకరించే ఉత్పత్తులకు కూడా సేంద్రియ ధ్రువీకరణ ఇస్తాం. ప్రశ్న: సేంద్రియ వ్యాపారులకు లైసెన్స్ ఇస్తారా? డా. కేశవులు: సేంద్రియంగా పండించిన పంటలను శుద్ధి చేసే ప్రాసెసింగ్ సెంటర్లు, సేంద్రియ ఆహారోత్పత్తులను విక్రయించే టోకు, చిల్లర వ్యాపారులకు కూడా మా సంస్థ అనుమతి ఇస్తుంది. జీవన ఎరువులు, జీవన క్రిమి, కీటక నాశనులు వంటి సేంద్రియ ఉత్పాదకాలకు కూడా ధ్రువీకరణ ఇస్తాం. ప్రశ్న: ఈ ధ్రువీకరణతో∙ ఎక్కడైనా అమ్ముకోవచ్చా? డా. కేశవులు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో ఎక్కడ సాగు చేసే రైతులైనా మా నుంచి సేంద్రియ ధ్రువీకరణ పొంది, తమ ఉత్పత్తులను మన దేశంలో, విదేశాల్లో కూడా అమ్ముకోవచ్చు. ప్రశ్న: సేంద్రియ ధ్రువీకరణకు ఎంత ఖర్చవుతుంది? డా. కేశవులు: వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల సంస్థ(అపెడా) నుంచి ధ్రువీకరణ హక్కులు పొందిన రాష్ట్రాల్లో తొమ్మిదవది తెలంగాణ. ఇతర రాష్ట్రాలకన్నా తక్కువ ఫీజుతోనే ధ్రువీకరణ ఇస్తున్నాం. ఏడాదికి ఒక ఎకరానికైతే రూ. 1,860 అవుతుంది. 25 ఎకరాలకైతే రూ. 2,100 అవుతుంది. సేంద్రియ పంటగా ధృవీకరణ పొందడానికి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలకు రెండేళ్లు పడుతుంది. బహువార్షిక పండ్ల తోటలకు మూడేళ్లు పడుతుంది. ఈలోగా కూడా సేంద్రియ ఉత్పత్తిగానే అమ్ముకోవచ్చు. సేంద్రియ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ప్రతి ఏటా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు.. తెలంగాణ రాష్ట్ర సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ, హాకా భవన్, నాంపల్లి, హైదరాబాద్. ఫోన్స్: 040–23237016, 23235939, 91000 26624. – డా. కేశవులు, తెలంగాణ విత్తన, సేంద్రియ విత్తన ధృవీకరణ ప్రాధికార సంస్థ, హైదరాబాద్ -
‘బిగ్ డిబేట్’లో హిల్లరీ ఆధిక్యం!
♦ అధ్యక్ష అభ్యర్థుల మధ్య పోటాపోటీగా సాగిన తొలి ముఖాముఖి చర్చ ♦ వాదనలో హిల్లరీ ఆధిపత్యం.. అసహనంతో ట్రంప్ ♦ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థికి అధ్యక్షురాలయ్యే సామర్థ్యం లేదన్న ట్రంప్ ♦ ట్రంప్ది అవగాహనలేమి అంటూ హిల్లరీ ధ్వజం హంప్స్టెడ్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్ష, ముఖాముఖి పోరుకు తెరలేచింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్(68), ఆమె రిపబ్లికన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్(70)ల మధ్య తొలి ముఖాముఖి చర్చ మంగళవారం పోటాపోటీగా సాగింది. గంటన్నర పాటు ఆవేశకావేశాలు, వాదప్రతివాదాలు, వ్యక్తిగత విమర్శలు, ఎత్తిపొడుపులు, వ్యంగ్య వ్యాఖ్యలు, భావోద్వేగాలు, భిన్న హావభావాలతో రసవత్తరంగా సాగిన ఈ బిగ్ డిబేట్లో హిల్లరీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఎక్కువగా ఆవేశానికి లోనుకాకుండా.. జాతివివక్ష, ఐసిస్ ముప్పు, అమెరికా ఆర్థికరంగం, యువతకు ఉద్యోగిత తదితర విభిన్న అంశాలపై స్పష్టమైన వైఖరి వెల్లడిస్తూ.. ట్రంప్ను ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వివిధ అంశాలపై ట్రంప్ వైఖరిని ఎండగడుతూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ మరింత రెచ్చగొట్టారు. డిబేట్లో పలుమార్లు ట్రంప్ అసహనానికి లోనవడం, మంచినీళ్లు తాగడం కనిపించింది. హంప్స్టెడ్లోని హాఫ్స్ట్రావర్సిటీలో జరిగిన ఈ చర్చను టీవీల్లో 10 కోట్ల మంది చూశారు. ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోని మెజారిటీ ఓటర్లు ఈ ముఖాముఖిలతో నిర్ణయానికి వచ్చే అవకాశముంది. నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల కన్నా ముందు ఇటువంటివి మొత్తం మూడు ముఖాముఖి వాదనలు జరుగుతాయి. తొలి చర్చలో హిల్లరీ విజయం సాధించారని 62% ఓటర్లు పేర్కొనగా, 27% మాత్రం ట్రంప్దే విజయమని నిర్ధారించారనిసీఎన్ఎన్/ఓఆర్సీ సర్వే తేల్చింది. పలు అంశాలపై పూర్తి అవగాహనతో హిల్లరీ చర్చకు వచ్చినట్లు కనిపించిందని విశ్లేషకులన్నారు. అక్టోబర్ 9న రెండో, 19న మూడో డిబేట్ జరగనున్నాయి. ఎవరి సామర్థ్యం ఎంత?..: 68 ఏళ్ల హిల్లరీ ఇటీవల న్యుమోనియా బారిన పడిన నేపథ్యంలో.. కమాండర్ ఇన్ చీఫ్గా అమెరికా అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించగల శక్తిసామర్థ్యాలు ఆమెకు లేవని ట్రంప్ అన్నారు. ‘ఈ దేశ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి గొప్ప శక్తి సామర్థ్యాలు కావాలి. హిల్లరీ అలా కనిపించడం లేదు’ అన్నారు. దీనికి హిల్లరీ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘112 దేశాలు పర్యటించి, పలు శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకుని, 11 గంటల పాటు కాంగ్రెస్ కమిటీ ముందు వివరణ ఇచ్చిన తరువాత నాసామర్థ్యం గురించి ఆయన మాట్లాడవచ్చు’ అంటూ ఒబామా తొలి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా తను సాధించిన ఘనతను చెప్పుకున్నారు. ఒబామాపై జాతి వివక్ష వ్యాఖ్యలు.. అధ్యక్షుడు బరాక్ ఒబామాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేశారని హిల్లరీ ట్రంప్ను విమర్శించారు. ట్రంప్ జాతివివక్ష ఆరోపణలు చేయడం కొత్తేం కాదు కానీ, అమెరికాలో జన్మించిన వాడు కాదంటూ ఒబామాపై చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణం’ అన్నారు. మహిళలను,ముస్లింలను అవమానిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను హిల్లరీ గుర్తు చేశారు. ఐసిస్ అంతం ఎలా?: అమెరికాకు ప్రమాదకరంగా పరిణమించిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ను అంతం చేసేందుకు ట్రంప్ వద్ద సరైన ప్రణాళిక లేదని హిల్లరీ విమర్శించారు. అంతర్జాతీయంగా ఐసిస్ను ఏకాకిని చేసే చర్యలు తన ప్రణాళికలో ఉన్నాయన్నారు ట్రంప్ స్పందిస్తూ.. ఇరాక్పై ఒబామా విధానాల వల్లే ఐసిస్ ఆవిర్భవించిందని విమర్శించారు. ఇరాక్పై దాడి తొలి తప్పైతే.. మధ్యంతరంగా అక్కడినుంచి తప్పుకోవడం మరో తప్పని, దాంతోనే ఇసిస్ ఆవిర్భావానికి వేదిక ఏర్పడిందని ఆరోపించారు. అమెరికా ఉద్యోగాలను చైనా తదితర దేశాలు దొంగలిస్తున్నాయని, ఆ పద్దతి మారాన్నారు. అమెరికాను కుదిపేసిన గృహ నిర్మాణ సంక్షోభంతో లాభపడిన కొద్దిమంది సంపన్నుల్లో ట్రంప్ ఒకరని హిల్లరీ విమర్శించారు. వాతావరణ మార్పు అనేది ఒక భ్రమ అన్న ట్రంప్ కామెంట్ను హిల్లరీ ఎద్దేవా చేశారు. ఎన్బీసీ నైట్లీ న్యూస్ యాంకర్ లెస్టర్ హోల్ట్ ఈ ముఖాముఖికి సమన్వయకర్తగా వ్యవహరించారు. ‘నా ఆవేశమే నా బలం’ అని ట్రంప్ అనగా ‘ఓహో.. అవునా?’ అంటూ హిల్లరీ స్పందించిన సందర్భంతో పాటు పలు సందర్భాల్లో నవ్వులు కూడా చిందాయి. ఈమెయిల్స్ గుట్టు.. పన్ను రిటర్న్స్ రట్టు ప్రముఖ వ్యాపార వేత్త అయిన ట్రంప్ కొన్నేళ్లపాటు టాక్స్ రిటర్న్లను దాఖలు చేయలేదని హిల్లరీ విమర్శించారు. ‘రిటర్న్లను ట్రంప్ విడుదల చేయకపోవడం వెనుక కొన్ని కారణాలుండొచ్చు. ఆయన తను చెప్పుకుంటున్నంత సంపన్నుడు కాకపోవచ్చు.. లేదా చెప్పుకుంటున్నంత స్థాయిలో దానాలు చేసి ఉండకపోవచ్చు.. లేదా తన అప్పుల గురించి మనకు తెలియకూడదని అనుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన సమాచారం మేరకు ట్రంప్ వాల్స్ట్రీట్కు, విదేశీ బ్యాంకులకు 650 మిలియన్ డాలర్లు అప్పు ఉన్నారు’ అని ధ్వజమెత్తారు. దానిపై ట్రంప్ స్పందిస్తూ.. ‘టాక్స్ రిటర్న్స్ను బహిరంగపర్చేందుకు నేను సిద్ధమే. అయితే, ముందు విదేశాంగ మంత్రిగా ఉండగా హిల్లరీ ప్రైవేటు ఈమెయిల్ సర్వర్ను ఉపయోగించి చేసిన 33 వేల మెయిల్స్ను బహిరంగ పర్చాలి. డిలీట్ చేసిన ఆ ఈమెయిల్స్ను ఆమె బహిరంగపరిస్తే.. ఆ మరుక్షణమే నేను నా ట్యాక్స్ రిటర్న్స్ను విడుదల చేస్తాను’ అన్నారు. దీనికి ప్రతిగా.. విదేశాంగ మంత్రిగా అధికార పదవిలో ఉన్న తాను ప్రైవేట్ ఈ మెయిల్ సర్వర్ను ఉపయోగించడం తప్పేనని, ఈ విషయంపై గతంలోనే వివరణ ఇచ్చానని హిల్లరీ వివరించారు. హిల్లరీకి పాలనలో అనుభవం ఉంది కానీ.. అది మంచి అనుభవం కాదని, మరో నాలుగేళ్లు ఆమెను భరించలేమని ట్రంప్ అన్నారు. విధానపరమైన అవగాహన లేమితో ట్రంప్ ఉన్నారని హిల్లరీ బదులిచ్చారు. డిబేట్ ముగిసిన తరువాత మద్దతుదారులకు హిల్లరీ అభివాదం. కార్యక్రమానికి హాజరైన హిల్లరీ భర్త, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, కూతురు చెల్సియా