-
‘అదానీ’పై సుప్రీం నిపుణుల కమిటీ
న్యూఢిల్లీ: హిండెన్బర్గ్ నివేదిక తర్వాత దేశంలో 140 బిలియన్ డాలర్లకుపైగా సంపద ఆవిరైన నేపథ్యంలో మదుపర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ–హిండెన్బర్గ్ వ్యవహారంపై విచారణ జరపడంతోపాటు మదుపర్ల ప్రయోజనాలను కాపాడేలా చర్యలను సిఫార్సు చేయడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే నేత్వత్వం వహించే ఈ కమిటీలో ఎస్బీఐ మాజీ చైర్మన్ ఒ.పి.భట్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జె.పి.దేవధర్, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఇన్ఫోసిస్ లిమిటెడ్ మాజీ అధినేత కె.వి.కామత్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మాజీ అధినేత నందన్ నీలేకని, న్యాయవాది సోమశేఖర్ సుందరేశన్ సభ్యులుగా ఉంటారని తెలియజేసింది. స్టాక్ ధరల్లో అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లోగా పూర్తి చేసి, నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సెబీని ఆదేశించింది. హిండెన్బర్గ్ నివేదిక, అదానీ గ్రూప్ అక్రమాలపై దాఖలైన వివిధ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల మదుపరులు భారీగా నష్టపోయారని, మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా వారు నష్టపోకుండా నియంత్రణ సంస్థలను బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించడానికి ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. పెట్టుబడిదారులను చైతన్యవంతంచేయడానికి చేపట్టాల్సిన చర్యలను సైతం సిఫార్సు చేయాలని కమిటీకి స్పష్టంచేసింది. కమిటీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదానీ గ్రూప్ వ్యవహారాలపై దర్యాప్తునకు కమిటీని నియమించడానికి తమకు అభ్యంతరం లేదంటూ గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించినసంగతి తెలిసిందే. కేసు దర్యాప్తు పూర్తి పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నామని, తామే నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాసనం ఇప్పటికే తేల్చిచెప్పింది. కాగా, కోర్టు నిర్ణయంపై గౌతమ్ అదానీ స్పందించారు. నిర్దిష్ట గడువులోగా ఈ వ్యవహారమంతా ఒక కొలిక్కి వస్తుందని భావిస్తున్నామని వెల్లడించారు. సత్యం గెలుస్తుంది అని పేర్కొన్నారు. -
కోవావాక్స్ ‘మూడో దశ’కు నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కోవావాక్స్ను బూస్టర్ డోసుగా వినియోగించుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్కు అనుమతినివ్వాలని ఇండియా సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీ ఆదివారం సిఫారసు చేసింది. వయోజనుల్లో ఈ టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని తెలిపింది. ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను వినియోగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే స్పుత్నిక్ వీని కూడా బూస్టర్ డోసుగా వాడడానికి అనుమతులున్నాయి. ఇప్పుడు కొవొవాక్స్ ప్రయోగాలు పూర్తయితే మరో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!) -
ఫిరోజాబాద్లో డెంగ్యూ మహమ్మారి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో డెంగ్యూ మహమ్మారి చెలరేగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన నిపుణులు బృందం నిర్ధారించింది. ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో 200 శాంపిళ్లు సేకరించి పరీక్షించగా వాటిలో 50 శాతం మందికి డెంగ్యూ పాజిటివ్గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో గత 10 రోజుల్లో 60 మందికి పైగా డెంగ్యూ కారణంగా మరణించగా, అందులో 50 మంది చిన్నారులు ఉన్నారు. చిన్నారులకు ప్రమాదకరమైన హీమరాజిక్ ఫీవర్ వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. హీమరాజిక్ డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్ల సంఖ్య ఉన్నట్టుండి పడిపోతుంది. దీంతో పాటు రక్తస్రావం కూడా అవుతుంది. దీంతో చిన్నారులు తక్కువ సమయంలోనే మరణిస్తున్నట్లు నిపుణులు బృందం తెలిపింది. యూపీలో చిన్నారులకు వ్యాపిస్తున్న జ్వరాలు హీమరాజిక్ డెంగ్యూ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలిపినట్లు ఫిరోజాబాద్ కలెక్టర్ ఇటీవలే వెల్లడించారు. జనావాసాల పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని శుభ్రం చేయాలని తాజాగా ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆరుగురు సభ్యులతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ) బృందం ఫిరోజాబాద్ పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. ఈ బృందంలో ఎంటొమాలజిస్టులు సహా పలు వెక్టర్–బోర్న్ వ్యాధుల నిపుణుల ఉన్నారు. వారు పరిశీలించిన అంశాలను కేంద్రానికి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఎన్సీడీసీకి చెందిన తుషార్ ఎన్ నేల్ ఆధ్వర్యంలోని బృందం తమ ప్రాంతాన్ని పర్యటించి పరిస్థితులను పరిశీలించినట్లు ఫిరోజాబాద్లోని ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ అలోక్ కుమార్ శర్మ చెప్పారు. కేవలం ఫిరోజాబాద్లో మాత్రమేగాక మథుర, ఆగ్రా వంటి చోట్ల కూడా డెంగ్యూ ప్రబలుతోంది. మథురలో కేవలం 15 రోజుల్లోనే 11 మంది చిన్నారులు కన్నుమూశారు. కోవిడ్ అనంతర పరిస్థితుల నేపథ్యంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం నేర్చుకోలేదని, ఇప్పటికే వైరల్ ఫీవర్ కారణంగా 100 మందికి పైగా మరణించారంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. -
టీకా తీసుకున్న 60 మందికి సైడ్ ఎఫెక్ట్స్
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత సుమారు 60 మందిలో తీవ్ర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్లు కేంద్ర నిపుణుల బృందం నివేదిక తెలిపింది. ఈ మేరకు నేషనల్ యాడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ (ఏఈఎఫ్ఐ) కమిటీ మే 27వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖకు నివేదిక అందజేసింది. మొత్తం 60 కేసులకు గాను 55 కేసులకు టీకాతో స్థిరమైన సంబంధమున్నట్లు స్పష్టం చేసింది. ఇందులోని 36 కేసుల్లో ఆందోళన సంబంధ సమస్యలు, 18 ఉత్పత్తి సంబంధమైనవి, ఒక్కటి మాత్రం ఈ రెండింటికీ చెందినదిగా వర్గీకరించింది. మిగతా, ఒక మరణం సహా 5 కేసులకు టీకాతో సంబంధం ఉన్నట్లు నిరూపణ కాలేదని పేర్కొంది. టీకా అనంతరం సంభవించిన ఈ మరణాన్ని యాదృచ్ఛిక ఘటనగా పేర్కొంది. దేశంలో జనవరి నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి టీకా ఇచ్చారు. -
కరోనా చికిత్స : ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఫీజులపై పరిమితి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీ ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స రేట్లను తగ్గించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ సిఫార్సు చేసింది. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ రాజధాని వాసులకు ఊరట కల్పించే సిఫార్సులు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ బెడ్కు రోజుకు రూ. 8000-10,000, ఐసీయూలో ఉండే రోగులకు రూ 13,000-15,000, వెంటిలేటర్పై చికిత్సకు రూ 15,000-18,000 వరకూ ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేయవచ్చని ఈ కమిటీ పేర్కొంది. పీపీఈ ఖర్చులు కూడా కలిపి ఈ మొత్తానికి మించి ఏ ఒక్క ప్రైవేట్ ఆస్పత్రి వసూలు చేయరాదని సూచించింది. ప్రస్తుతం పలు ప్రైవేట్ ఆస్పత్రులు ఐసోలేషన్ బెడ్స్కు రూ 25,000, ఐసీయూల్లో రోగులకు రోజుకు రూ 40,000 వసూలు చేస్తుండగా, వెంటిలేటర్పై ఉన్న రోగులకు రోజుకు రూ 44,000-54,000 వరకూ వసూలు చేస్తున్నాయి. చదవండి : కరోనా ఎఫెక్ట్ : ఆ జంటకు డిజిటల్ విడాకులు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విషప్రచారం మానుకో కేటీఆర్
కూలర్లు ఏర్పాటు చేయండి
ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన
కార్మికులను ఆసాములుగా మార్చేది ఉండే..
ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
వరాల జల్లు కురిసేనా?
ప్రతి కుటుంబానికీ కాంగ్రెస్ గ్యారంటీ కార్డు అందించండి
సామాజిక న్యాయం కోసం బీజేపీని ఓడించాలి
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
విద్యుత్లోడ్కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement