breaking news
exchange reserves
-
త్వరలో ట్రావెల్ ట్యాక్స్.. విదేశాలకెళ్తే వాయింపే!
అంతర్జాతీయ పరిణామాలతో వేగంగా కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలను (డాలర్లు) కాపాడుకోవడం కోసం ‘బంగారం కొనడాన్ని తగ్గించుకోండి. పెట్రోల్ వినియోగాన్ని తగ్గించుకోండి. విదేశీ ప్రయాణాలను తగ్గించుకోండి అంటూ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకు అనుగుణంగానే ఇందులో మొదటి రెండింటినీ కట్టడి చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పసిడి కొనుగోళ్లకు కాస్త అడ్డుకట్ట వేసేందుకు బంగారంపై సుంకాలను పెంచింది. అలాగే పెట్రోల్ ధరలను తాజాగా పెంచింది. ఇక, ఇప్పుడు విదేశీ ప్రయాణాల వంతు వచ్చింది. అనవసర విదేశీ విహారయాత్రలు, పర్యటనలను తగ్గించే దిశగా ఫారిన్ ట్రావెల్ని మరింత ఖరీదైన వ్యవహారంగా మార్చబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలపై ట్యాక్స్లు/సెస్సులు/సర్చార్జీలు వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రేపో మాపో వడ్డించడమైతే ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కాలికంగా ఏడాది పాటు వర్తించేలా ట్యాక్స్ విధించవచ్చని భావిస్తున్నారు. విదేశీ పర్యటనలపై విధించే ట్యాక్సులు, సెస్సులు, సర్చార్జీల ద్వారా వచ్చే నిధులు మొత్తం కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ఖాతాలోకి కాకుండా నేరుగా కేంద్రం ఖాతాలోకే వెళ్లొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇలా వచ్చిన నిధులతో, క్రూడాయిల్ దిగుమతుల వ్యయాల భారాన్ని కాస్త భర్తీ చేసుకోవచ్చనే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నాయి. దీనిపై అత్యున్నత స్థాయిలో సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 232 బిలియన్ డాలర్ల టూరిజం పరిశ్రమ.. దాదాపు 231.6 బిలియన్ డాలర్ల విలువతో భారత్ టూరిజం రంగం ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ రంగం దేశీయంగా 10 శాతం మేర ఉద్యోగాలను కల్పిస్తోంది. పెరుగుతున్న ఆదాయాలు, వీసాల లభ్యత సులభతరం కావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం, డెస్టినేషన్ వెడ్డింగ్ల్లాంటి అంశాలతో విదేశీ ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఫారిన్ ట్రావెల్ సెగ్మెంట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2024లో విదేశీ పర్యటనల వ్యయాలు సుమారు 18.82 బిలియన్ డాలర్లుగా ఉండగా 2034 నాటికి 55.39 బిలియన్ డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. 2025లో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య 6 శాతం పెరిగి 3.27 కోట్లకు చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీ ప్రయాణాల విషయంలో 2019లో 10వ స్థానంలో ఉన్న భారత్ 2027 నాటికి అయిదో స్థానానికి చేరుకుంటుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ ప్రస్తుతం డాలర్ నిల్వలను కాపాడుకోవాల్సి వస్తుండటంతో అనవసర విదేశీ పర్యటనలకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశీ ట్రావెల్కి దన్ను.. విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపుతో దేశీయంగా పర్యాటకానికి ఊతం లభించవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రచార కార్యక్రమం ద్వారా విదేశీ టూరిస్టులను కూడా ఆకర్షించగలిగితే ఆ విధంగా ఫారెక్స్ని సమకూర్చుకునేందుకు వీలవుతుందని ట్రావెల్ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ ఫ్లైట్స్ రేట్లకు రెక్కలు.. ఇంధన వ్యయాలు, గగనతలాలపై ఆంక్షలు, నిర్వహణపరమైన అనిశి్చతులతో ఇప్పటికే పలు అంతర్జాతీయ రూట్లలో ఫ్లయిట్ చార్జీల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఎయిరిండియాలాంటి దేశీ విమానయాన సంస్థలు భారాన్ని భరించలేక కొన్ని రూట్లలో ఫ్లయిట్స్ని రద్దు కూడా చేస్తున్నాయి. వచ్చే మూడు నెలల వ్యవధిలో వారానికి దాదాపు వంద ఇంటర్నేషనల ఫ్లయిట్ సరీ్వసులను తగ్గించుకుంటున్నట్లు ఎయిరిండియా తెలిపింది. అలాగే ఏడు రూట్లలో సరీ్వసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనితో మొత్తం మీద విదేశీ రూట్లలో సీట్లు సుమారు 27 శాతం తగ్గుతాయని పేర్కొంది. పశి్చమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగినంత వరకు ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్పై ప్రభావం తప్పదని ట్రావెల్ బుకింగ్ అగ్రిగేటర్ సంస్థ ఇక్సిగో వర్గాలు పేర్కొన్నాయి. (సాక్షి బిజినెస్ డెస్క్) -
రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వల పరిమాణం రికార్డుల స్థాయిగా కదులుతోంది. జనవరి 12వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 1.63 బిలియన్ డాలర్లు పెరిగి 618.9 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2021 అక్టోబర్లో ఫారెక్స్ నిల్వలు ఆల్టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రూపాయి పటిష్టతను కాపాడడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లకుపైగా తగ్గినప్పటికీ తిరిగి కొంత ఒడిదుడుకులతో ఎగువదిశగా ఫారెక్స్ నిల్వలు ఎగశాయి. ప్రస్తుత దేశ ఫారెక్స్ నిల్వలు 13 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ► మొత్తం నిల్వల్లో ప్రధాన భాగంగా ఉన్న డాలర్ల రూపంలోని ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.859 బిలియన్ డాలర్లు ఎగసి 548.508 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి నిల్వల విలువ 242 మిలియన్ డాలర్ల పెరిగి 47.247 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)– స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వల 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే.. ► భారత్లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం. ► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. రేటింగ్స్ ఇలా... భారత్కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్లో నెగటివ్ అవుట్లుక్ నుంచి స్టేబుల్ అవుట్లుక్కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్లుక్) రేటింగ్ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
అంతర్జాతీయ షాక్లను తట్టుకోగలం
ముంబై: భారత్కు ఉన్న బలమైన విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ షాక్ల నుంచి రక్షణగా నిలవలేవు కానీ.. వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన వెబినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, అవి అంతర్జాతీయ కుదుపులకు రక్షణ అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ షాక్ల (సంక్షోభాలు) నుంచి మనకేమీ రక్షణ లేదు. అంతర్జాతీయ షాక్ల ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కాకపోతే మనకున్న విదేశీ మారక నిల్వలతో వాటిని ఏదుర్కొని నిలబడొచ్చు. ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి అవి సాయపడతాయంతే’’అని సుబ్బారావు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మానిటరీ పాలసీ సాధారణ స్థితికి చేరితే.. పెద్ద ఎత్తున విదేశీ నిధులు తిరిగి వెళ్లిపోతాయని చెప్పారు. అప్పుడు మారక రేటు అస్థిరతలను నియంత్రించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చన్నారు. నాస్డాక్లో హెల్త్కేర్ ట్రయాంగిల్ లిస్టింగ్ ముంబై: క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సెక్యూర్క్లౌడ్ టెక్నాలజీస్ తాజాగా తమ అనుబంధ సంస్థ హెల్త్కేర్ ట్రయాంగిల్ను అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజీ నాస్డాక్లో లిస్ట్ చేసింది. టెక్నాలజీ సంస్థలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజీలో లిస్ట్ కావడం వల్ల తమ సంస్థ ప్రాచుర్యం, విశ్వసనీయత మరింత పెరగగలవని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ త్యాగరాజన్ తెలిపారు. పబ్లిక్ ఇషఅయూ ద్వారా హెల్త్కేర్ ట్రయాంగిల్ 15 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు సెక్యూర్క్లౌడ్, హెల్త్కేర్ ట్రయాంగిల్ చైర్మన్ సురేష్ వెంకటాచారి తెలిపారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా పెట్టుబడుల అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలో రిజిస్టరై, సిలికాన్ వేలీ కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూర్క్లౌడ్ దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో చాలా కాలం క్రితమే లిస్టయ్యింది. లైఫ్సైన్సెస్, హెల్త్కేర్ విభాగాలకు సేవలు అందించేందుకు 2019లో కాలిఫోరి్నయా ప్రధాన కార్యాలయంగా హెల్త్కేర్ ట్రయాంగిల్ను ప్రారంభించింది. బీఎస్ఈలో బుధవారం సెక్యూర్క్లౌడ్ షేరు 1.3 శాతం క్షీణించి రూ. 216 వద్ద క్లోజయ్యింది. -
పెరిగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
ముంబై: రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు మార్చి4తో ముగిసిన వారంలో జోరుగా పెరిగాయి. ఈ నిల్వలు 407.5 కోట్ల డాలర్లు పెరిగి 35,086 కోట్ల డాలర్లకు చేరాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ) బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని ఆర్బీఐ పేర్కొంది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., అంతకు ముందటి రెండు వారాల్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. మార్చి 4తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 244.8 కోట్ల డాలర్లు పెరిగి 32,747 కోట్ల డాలర్లకు చేరాయి. ఇక బంగారం నిల్వలు 162.8 కోట్ల డాలర్లు పెరిగి 1,932.4 కోట్ల డాలర్లకు పెరగ్గా, అంతర్జాతీయ ద్రవ్య నిధి... భారత్కు కేటాయించిన స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 5 లక్షల డాలర్లు తగ్గి 147.9 కోట్ల డాలర్లకు పడిపోయాయి.


