-
ఇదేందయ్యా ఇది.. రూ.11 లక్షల కారు రిపేరుకు రూ.22 లక్షలు!
సాక్షి, బెంగళూరు: వరదలతో పాడైపోయిన కారును బాగు చేయించుకుందామనుకున్న ఓ వ్యక్తికి విచిత్రమైన సంఘటన ఎదురైంది. తన కారు రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ వాళ్లు ఇచ్చిన ఎస్టిమేట్ స్లిప్ చూసి అవాక్కయ్యాడు. రూ.11 లక్షల విలువైన వోక్స్వాగన్ పోలో హ్యాచ్బ్యాక్ కారును రిపేర్ చేసేందుకు రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేశారు. తనకు ఎదురైన ఈ సంఘటనను లింక్డ్ఇన్లో షేర్ చేశారు అనిరుధ్ గణేశ్. బెంగళూరులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గణేశ్ కారు పాడైపోయింది. పూర్తిగా నీటిలో మునిగిపోవటంతో ఇంజిన్ పనిచేయటం లేదు. దాంతో వోక్స్వాగ్ సర్వీస్ సెంటర్కు తీసుకెళ్లారు గణేశ్. సుమారు 20 రోజుల తర్వాత కారు సర్వీస్ కోసం రూ.22 లక్షలు అవుతుందని అంచనా వేసి పంపించారు. దీంతో ఇన్సూరెన్స్ సంస్థను సంప్రదించారు గణేశ్. కారు పూర్తిగా పాడైపోయిందని, దానిని రిపేర్ సెంటర్ నుంచి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. అయితే.. అక్కడి నుంచి తీసుకెళ్లాలంటే రూ.44,840 చెల్లించాలని సర్వీస్ సెంటర్ వాళ్లు చెప్పటంతో మరోమారు అవాక్కవ్వాల్సి వచ్చింది. కారు డ్యామేజ్ అంచనా వేసేందుకు పత్రాలు సిద్ధం చేసినందుకు గానూ ఆ ఫీజు కట్టాలని సూచించారు. ఈ విషయంపై వోక్స్వాగన్ సంస్థకు ఫిర్యాదు చేశారు గణేశ్. చివరకు రూ.5000 వేలు కట్టి కారు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. కారు రిపేరు కోసం ఇచ్చిన ఎస్టిమేషన్ స్లిప్ ఇదీ చదవండి: దసరా ఎఫెక్ట్: హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ -
దారి దారికీ ‘ధన ప్రవాహం’
(గుంటూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్ర రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం రూ.కోట్లు కొట్టేసే ప్రయత్నాలకు నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తోంది. రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న నేపథ్యంలో రోడ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజధాని ప్రతిపాదిత గ్రామాలను కలుపుతూ రూ.30 కోట్ల నిధులతో పలు ప్యాకేజీల కింద రోడ్ల నిర్మాణానికి ఆగస్టు 22న టెండర్లు పిలిచారు. ప్రకాశం బ్యారేజీ నుంచి రాజధాని శంకుస్థాపన జరిగే ఉద్దండ్రాయునిపాలెంకు వెళ్లేందుకు మూడు ప్యాకేజీలుగా, మంగళగిరి నుంచి రాయపూడి వరకు నాలుగు ప్యాకేజీలుగా పనులు విభజించి టెండర్లు ఆహ్వానించారు. బిడ్ వ్యాలిడిటీ గడువు 90 రోజులుగా పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారం రోజుల్లోనే టెండర్లు తెరిచి అధికార పార్టీ నేతలకు పనులు అప్పగించేశారు. పనులన్నిటినీ దాదాపు నామినేషన్ విధానంలోనే కట్టబెట్టడం గమనార్హం. పైగా టర్న్కీ విధానంలో (అంటే.. ఆర్అండ్బీ, విద్యుత్తు, పంచాయతీ రాజ్ శాఖల కింద చేపట్టే పనులన్నిటినీ ఒకే శాఖ చేపట్టడం) ఏకపక్షంగా అప్పగించారు. ఎస్టిమేట్ కాపీలో నిబంధనలేవీ? కిలోమీటరుకు రూ.కోటిన్నర ఖర్చుతో రూపొందించిన ఈ పనుల్లో ఆర్అండ్బీ అధికారులు అసలు నిబంధనలేవీ పేర్కొనలేదు. రోడ్డు విస్తరణ ఎంత వరకు.. సైడ్ డ్రెయిన్ల నిర్మాణం తదితరాలన్నీ అంచనా ప్రతిలో పొందుపరచలేదు. ఉండవల్లి-యర్రబాలెం వయా పెనుమాక వెళ్లే రహదారిని మూడు ప్యాకేజీల కింద రూ.12.96 కోట్లతో చేపట్టారు. సైడ్ డ్రెయిన్లు, సీసీ పేవ్మెంట్ల నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ.30 కోట్లతో చేపట్టే ఈ పనుల్లో 22 శాతం(రూ.6 కోట్ల మేర) అవినీతి జరుగుతోందని క్వాలిటీ కంట్రోల్ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. రాజధాని రోడ్ల పేరిట జరుగుతున్న ఈ అవినీతిపై వివరణనిచ్చేందుకు ఆర్అండ్బీ అధికారులు నిరాకరిస్తున్నారు. అసలు మతలబు... ఈ టెండరు ఖరారు కాకపోవడం వెనుక సత్తెనపల్లి నియోజకవర్గ ముఖ్యనేత కుమారుని హస్తం ఉందని తెలుస్తోంది. ఆ నియోజకవర్గానికి చెందిన ఒక నిర్మాణ సంస్థ టెండరులో పాల్గొన్నదని, దానికే ఆ టెండరు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించడంతో ఈ తతంగం జరుగుతోందని మిగిలిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ జయరాజ్ను ‘సాక్షి’ ప్రతినిధి వివరణ కోరగా, ఆ రోడ్డు అలైన్మెంట్ మార్చేందుకు నిర్ణయం తీసుకున్నామని, త్వరలో టెండరు రద్దు చేసి, నిర్మాణ సంస్థల ఈఎండీలు ఇచ్చేసి కొత్త టెండరు పిలుస్తామని తెలిపారు. ఐతే నామినేషన్.. లేకుంటే పెండింగ్ అర్హతలు, అనుభవం కంటే సిఫారసులున్న నిర్మాణ సంస్థలు రూ.కోట్ల విలువైన పనులు పొందుతున్నాయి. అంచనాలు, టెండర్లు, అగ్రిమెంట్లతో నిమిత్తం లేకుండా పనులు చేసేస్తున్నాయి. పాలకుల సూచనల మేరకు నిర్మాణ సంస్థల టెండర్లను పరిశీలించడమే లేదు. టెండర్ల ఖరారుపై కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఉపయోగం లేకపోవడంతో ఈఎండీ(ఎర్నెస్ట్మనీ డిపాజిట్)లనైనా తిరిగి ఇచ్చేయాలని నిర్మాణ సంస్థలు అధికారులను వేడుకుంటున్నాయి. గత నెలలో గుంటూరు పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆహ్వానించిన టెండరును ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. ఉద్దండరాయునిపాలెం గ్రామానికి వెళ్లే రహదారికి పంచాయతీరాజ్ అధికారులు టెండరు ఆహ్వానించారు. పెనుమాక నుంచి కృష్ణాయపాలెం, ఉద్దండరాయుని పాలెం వరకు రహదారి నిర్మించేందుకు రూ.8.75 కోట్లతో అంచనాలు రూపొందించారు. టెండర్ ప్రక్రియకు గత నెల 20న చివరిరోజు నాటికి ఐదు నిర్మాణ సంస్థలు... సాయినాథ్ కన్స్ట్రక్షన్స్(ఒంగోలు), వీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్(పిడుగురాళ్ల), పృథ్వీ కన్స్ట్రక్షన్స్(సత్తెనపల్లి), యూబీఎస్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్సు(గుంటూరు), రామ్మోహన్రెడ్డి కన్స్ట్రక్షన్స్(నెల్లూరు) ఈ టెండరులో పాల్గొన్నాయి. కొన్ని సంస్థలు అంచనా కంటే తక్కువ రేటుకు టెండరు వేశాయి. అయితే, వీటిని ఇప్పటి వరకు అధికారులు పరిశీలించనే లేదు. వాటిని పరిశీలించకపోవడంతో కనీసం ఈఎండీ మొత్తాలను తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. టెండరు అంచనా మొత్తంపై ఒక శాతం ఈఎండీగా ఒక్కో నిర్మాణ సంస్థ రూ.8.75 లక్షలను చెల్లించాయి. టెండర్లు ఖరారు చేయక, ఈఎండీని తిరిగి ఇవ్వకపోవడంతో నిర్మాణ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు నామినేషన్పై అనేక నిర్మాణ సంస్థలు అవే పనులను చకచకా చేసేస్తున్నాయి.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ డివైజ్తో క్షణాల్లో సిల్కీ హెయిర్ సొంతం!
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
గుడుల పేరుతో మేం ఓట్లడగలేదు: కేటీఆర్
తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
సుడిగాలి సుధీర్ బర్త్డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
అలాగే పెళ్లి కూడా చేసిపెట్టమని అడగండి మేడం!
ఆనంద్ మహీంద్రా సండే ట్వీట్.. 'సిటీ ఆఫ్ సీ' వీడియో
ఐశ్వర్య రాయ్ చేతికి సర్జరీ.. డాక్టర్స్ సూచనతోనే కేన్స్లో మెరిసిందా?
రెడ్ కార్పెట్పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
టీడీపీ అరాచకం.. సిట్ బృందాన్ని కలిసిన మంత్రి అంబటి
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement