Ernst & Young
-
ఐటీ మినహాయింపు పరిమితి... రెట్టింపు చేయాలి
• కార్పొరేట్లకు రాయితీలు, మినహాయింపులు కొనసాగించాలి • ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రీ–బడ్జెట్ సర్వేలో అభిప్రాయం న్యూఢిల్లీ: మరో పది రోజుల్లో మోదీ సర్కారు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా వేతనజీవులకు భారీగా ఊరట కల్పించాలన్న డిమాండ్ ఎక్కువగా వినబడుతోంది. ఈసారి ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని(ఇప్పుడున్న రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు) ట్యాక్స్ కన్సల్టెన్సీ దిగ్గజం ఎర్నెస్ట్ అండ్ యంగ్(ఈవై) నిర్వహించిన ప్రీ–బడ్జెట్ సర్వేలో అత్యధికులు పేర్కొన్నారు. అంతేకాకుండా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్న రాయితీలు, మినహాయింపులను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) నేపథ్యంలో ప్రైవేటు పెట్టుబడులు, వినియోగ డిమాండ్ను పెంచాలంటే ఇవి తప్పనిసరి అని చెబుతున్నారు. వివిధ రంగాలకు చెందిన 200లకు పైగా సీనియర్ ట్యాక్స్ నిపుణులు, సీఎఫ్ఓల అభిప్రాయాలను సర్వేలో పొందుపరిచారు. ముఖ్యాంశాలివీ... ⇔ కార్పొరేట్ ట్యాక్స్ను ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని(సర్చార్జ్, సెస్లు కాకుండా) సర్వేలో 81.42 శాతం మంది పేర్కొన్నారు. ⇔ ‘మేకిన్ ఇండియా’కు ఊతమివ్వాలంటే రంగాలవారీగా పరిశ్రమలకు నిర్ధిష్టమైన రాయితీలు/మినహాయింపులు ఇవ్వాలని 72 శాతం మంది కోరారు. ⇔ వ్యక్తిగత ఐటీ మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని 60% మంది అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను గరిష్ట రేటులో 25 శాతం కోత విధించాలని 36% మంది అన్నారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి 30 శాతం పన్ను రేటు అమల్లో ఉంది. ⇔ ‘వినియోగ వ్యయాన్ని పెంచేందుకు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు కొన్ని పన్ను ప్రయోజనాలు అందించవచ్చన్న అంచనాలున్నాయి. డీమోనిటైజేషన్ తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలోకి నిధుల ప్రవాహం, ప్రతిపాదిత వస్తు–సేవల పన్ను(జీఎస్టీ) అమలుతో పన్ను పరిధి పెరగవచ్చు’ అని ఈవై ఇండియా పార్ట్నర్, నేషనల్ ట్యాక్స్ లీడర్ సుధీర్ కపాడియా చెప్పారు. -
డిజిటల్ రంగం @రూ.20,000 కోట్లు
ఎర్నస్ట్ అండ్ యంగ్ నివేదిక ముంబై: భారత డిజిటల్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని ఎర్నస్ట్ యంగ్ తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం రూ.8,490 కోట్లుగా ఉన్న ఈ రంగం 2020 నాటికి రూ.20,000 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. డిజిటల్ అడ్వర్జైజింగ్, ఓటీటీ(ఓవర్ ద టాప్) దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే..., ⇔ మొబైల్ ఫోన్ల వాడకం విస్తృతంగా పెరిగిపోతుండటంతో, సంప్రదాయ ఇంటర్నెట్, టీవీ సబ్స్క్రిప్షన్ సర్వీసులు ప్రపంచ సగటు కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, భారత డిజిటల్ మీడియా మార్కెట్లో అవకాశాలు అపారంగా ఉండనున్నాయి. ⇔ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 2020 నాటికి వీరి సంఖ్య 74.6 కోట్లకు పెరుగుతుంది. ⇔ భారీ సంఖ్యలో వినియోగదారులు డిజిటల్ ప్లాట్ఫామ్ను వినియోగిస్తారు. ⇔ ఓటీటీ, డిజిటల్ అడ్వర్టైజింగ్, వీడియో ఓటీటీ సబ్స్క్రిప్షన్, మ్యూజిక్ ఓటీటీ సబ్స్క్రిప్షన్, గేమింగ్– ఈ రంగాల నుంచి భారీగా ఆదాయం లభిస్తుంది. ⇔ 2015లో 31%గా ఉన్న స్మార్ట్ఫోన్ల వినియోగం 2020 కల్లా 59%కి పెరుగుతుంది. ⇔ డిజిటల్ ప్రకటనల వ్యయం 2020 కల్లా రూ.18,500 కోట్లకు చేరుతుంది. ⇔ భారత్లో 2020 కల్లా ఆన్లైన్ వీడియో వీక్షకుల సంఖ్య 45 కోట్లకు పెరుగుతుంది. ఆన్లైన్ వీడియో వీక్షకుల పరంగా రెండో అతి పెద్ద దేశంగా అమెరికాను తోసిరాజని భారత్ అవతరిస్తుంది. మొదటి స్థానంలో చైనా ఉంది. -
భారత్లో జోరుగా ఐపీఓలు
♦ ఊతమిచ్చిన సంస్కరణలు ♦ పెరిగిన ఇన్వెస్టర్ల విశ్వాసం ♦ ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్(ఐపీఓ)కు ప్రస్తుతం భారత్లో పరిస్థితులు అనుకూలంగా వున్నాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక వెల్లడించింది. యూరప్, మధ్య ఆసియా, భారత్, ఆఫ్రికా ప్రాంతాల్లో(ఈఎంఈఐఏ) భారత్లోనే ఎక్కువగా ఐపీఓలు వచ్చాయని ఈవై గ్లోబల్ ఐపీఓ ట్రెండ్స్: 2016 త్రైమాసిక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.... ⇒ భారత ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరగడం, కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలను తేవడం వల్ల భారత్లో ఐపీఓల సంఖ్య పెరుగుతోంది. ⇒ భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉండడం, మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ పలు సంస్కరణలు తీసుకు రావడం ఐపీఓలకు సానుకూలం. ⇒ ఈ ఏడాది ఇప్పటివరకూ భారత్లో 56 ఐపీఓలు 180 కోట్ల డాలర్ల నిధులు సమీకరించాయి. ఈఎంఈఐఏ ప్రాంతంలో ఇన్ని ఐపీఓలు రావడం, ఇంత భారీగా నిధులు సమీకరించడం భారత్లోనే అధికం. ⇒ కొన్ని భారీ ఐపీఓల కారణంగా ఈ ఏడాది చివరికల్లా భారత్లో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ 500 కోట్ల డాలర్లకు చేరే అవకాశముంది. -
పెరుగుతున్న బ్రాండ్ల ‘సోషల్’ ప్రచారం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే భారత కంపెనీల సంఖ్య పెరుగుతోంది.సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ప్రాధాన్యం, విస్తరణ పెరిగిపోతుండడమే దీనికి కారణమని ఎర్నస్ట్ అండ్ యంగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఎర్నస్ట్ అండ్ యంగ్ సంస్థ సోషల్ మీడియా మార్కెటింగ్ ఇండియా ఇండియా ట్రెండ్స్ పేరుతో ఒక నివేదికను వెలువరించింది. 2013లో సోషల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసిన కంపెనీల సంఖ్య 78 శాతంగా ఉందని, ఈ ఏడాది ఈ సంఖ్య 90 శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఈ కంపెనీలు తమ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్లో 15 శాతం వరకూ సోషల్ మీడియా ద్వారా ప్రచారానికి ఖర్చు పెట్టనున్నాయని వివరించింది.