-
‘బీసీ ఓవర్సీస్’కు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితా రాజేంద్ర సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలకు మించరాదని, కుటుంబ వార్షికాదాయం ఐదు లక్షల్లోపు ఉండాలని తెలిపారు. టోఫెల్, ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ, జీమ్యాట్లలో కనీస స్కోరు సాధించాలన్నారు. రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని తెలిపారు. అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
విద్యార్థులకు ఆధార్ గండం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి చేయూత అందించాలన్న మహోన్నత లక్ష్యంతో దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్ల నీరుగారుతోంది. సరైన ఏర్పాట్లు చేయకుండానే బయోమెట్రిక్ విధానం అమలు చేయటం, దీనికి ఆధార్ నంబర్తో ముడిపెట్టడంతో అటు ఫీజు రీయింబర్స్మెంట్, ఇటు ఉపకార వేతనాలు అందక వేలాది మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చాలామంది కనీసం దరఖాస్తు చేయలేకపోతున్నారు. శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల మంజూరుకు బయోమెట్రిక్ విధానం అమలు చేయటం, దీనికి ఆధార్ నంబర్ తప్పనిసరి కావటంతో బడుగు, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, మెడికల్, ఇతర వృత్తి విద్యాకోర్సుల కళాశాలలు 273 ఉన్నాయి. వీటిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు 72 వేల మంది చదువుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంఉపకార వే తనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పొందేందుకు వీరందరూ అర్హులే. కానీ కొత్త అడ్డంకుల కారణంగా సకాలం లో మంజూరు కాక వీరి చదువులు ముందుకు సాగడం లేదు. ఇదీ జరుగుతోంది.. గతంలో విద్యార్థుల దరఖాస్తులు, హాజరును సంబంధిత అధికారులు పరిశీలించి సంక్షేమాధికారులకు సిఫార్సు చేసేవారు. దీంతో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరయ్యేవి. ఈ ఏడాది నుంచి ఈ విధానానికి స్వస్తి పలికి బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం ఆయా కళాశాలల యాజమాన్యాలు సొంతంగా బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోవాలి. విద్యార్థుల వివరాలు, ఆధార్ నంబర్ నమోదు చేసి బయోమెట్రిక్ యంత్రంలో బొటనవేలి ముద్ర తీసుకోవాలి. అన్నీ సరిపోలితే విద్యార్థి దరఖాస్తు ఆన్లైన్లో అప్లోడ్ అవుతుంది. ఈ దరఖాస్తును సంబంధిత సంక్షేమ అధికారి ఆమోదిస్తే ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు మంజూరవుతాయి. అయితే చాలామంది విద్యార్థులకు ఇప్పటికీ ఆధార్ నంబర్ రాలేదు. మరోవైపు దాదాపు 30 కళాశాలలు బయోమెట్రిక్ యంత్రాలను సమకూర్చుకోలేదు. ఫలితంగా వేలాదిమంది విద్యార్థులు నష్టపోతున్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు గడువును ప్రభుత్వం పొడిగించినా ప్రయోజనం ఉండటం లేదు. ఒక్క బీసీ విద్యార్థుల బకాయే రూ.9 కోట్లు గతేడాదికి సంబంధించి జిల్లాలోని 3 వేల మంది బీసీ విద్యార్థులకు రూ.తొమ్మిది కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవటమే దీనికి కారణం. విద్యాసంవత్సరం పూర్తయి తొమ్మిది నెలలు గడిచినా సొమ్ము అందకపోవటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది రూ.100 కోట్లు అవ సరంజిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులకు 2013-14 విద్యాసంవత్సరానికి ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు చెల్లించేందుకు సుమారు రూ.100 కోట్లు అవసరం. బీసీ విద్యార్థులకు రూ.75 కోట్లు, ఈబీసీలకు రూ.7 కోట్లు, ఎస్సీ విద్యార్థులకు రూ. 12 కోట్లు, ఎస్టీ విద్యార్థులకు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇవీ లెక్కలు గతేడాది 36,398 మంది బీసీ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఈ ఏడాది రెన్యువల్ చేయించుకోవల్సి ఉండగా ఇప్పటివరకు 26,186 మంది మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఆధార్ కార్డులు రాని కారణంగా మిగిలినవారు ఇంకా దరఖాస్తు చేయలేదని సమాచారం. ఈ ఏడాది కొత్తగా 30 వేల మంది దరఖాస్తు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 12,920 మంది మాత్రమే చేశారు. గతేడాది 2,297 మంది ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేయగా వీరిలో 1882 మంది రెన్యువల్ చేయించుకున్నారు. కొత్తగా 1800 మంది వరకు దరఖాస్తు చేయాల్సి ఉండగా 545 మందే నమోదు చేయించుకున్నారు. గతేడాది 4,105 మంది ఎస్సీ విద్యార్థులు నమోదు చేసుకోగా వీరిలో 2,799 మంది మాత్రమే రెన్యువల్కు దరఖాస్తు చేశారు. కొత్తగా సుమారు రెండున్నర వేలమంది దరఖాస్తు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1356 మంది మాత్రమే ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు. అలాగే ఎస్టీ విద్యార్థులు 676 మంది మాత్రమే దరఖాస్తు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement