-
పంద్రాగస్టుకు పైసల్లేవ్!.. చాక్పీస్, డస్టర్కు ఇబ్బందులే
సాక్షి, కరీంనగర్: పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులన్నీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవడంతో స్కూల్ గ్రాంటు ఖాతాలు ఖాళీగా మిగిలాయి. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటికి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట దేవుడెరుగు కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల నిర్వహణకు విడుదలైన నిధులను తిరిగి ఏప్రిల్లో ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల బ్యాంక్ అకౌంట్ ఖాతాలన్ని ఖాళీ అయ్యాయి. జిల్లాలో కొందరు పాఠశాల గ్రాంటును వినియోగించుకోగా, మిగిలిన నిధులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపయోగించుకుందామని అనుకున్నారు. వెనక్కి తీసుకోవడంతో చాక్పీస్లు, డస్టర్ కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అవసరాలను తీర్చుకుంటున్నారు. స్కూల్ గ్రాంటు ఖర్చు ఇలా జిల్లాలో వివిధ విభాగాల్లో గల 652 పాఠశాలల్లో 42,218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గ్రాంటుతో ప్రధానోపాధ్యాయులు చాక్పీసులు, డస్టర్లు, విద్యార్థుల హాజరు పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తారు. గణతంత్ర దినం, రాష్ట్ర అవతరణ దినం, స్వాతంత్య్ర దినోత్సవం తదితర జాతీయ దినోత్సవాల్లో పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహణ, సున్నం వేయడం చిన్న మరమ్మతులను ఈ నిధులతో చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాలలకు ఆయా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు గ్రాంటు విడుదల చేస్తారు. ఈ నిధులను అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం అకస్మాత్తుగా పాఠశాలల ఖాతాల్లోని నిధులను వాపసు తీసుకోవడంతో చిన్న అవసరాలకూ తమ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, గిరిజన సంక్షేమ ప్రాథమిక, క్రీడా పాఠశాలలు, అంధ, మూగ, చెవిటి పాఠశాలలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను ఆధారంగా గ్రాంటు విడుదల చేస్తుంది.1–15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 16–100 మంది విద్యార్థులకు రూ.25,500, 101 నుంచి 250 మంది విద్యార్థులకు రూ.50 వేలు, 251–1000 మంది విద్యార్థులు ఉంటే రూ.75 వేలు, 1000కిపైగా విద్యార్థులు ఉంటే రూ.లక్ష చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి విచారకరం పాఠశాలల నిర్వహణకు వచ్చిన నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోవడం విచారకరం. తక్షణమే స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేయాలి. చిన్నపాటి అవసరాలకు పాఠశాలల్లో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు సతమతమవుతున్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేందుకు నిధులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. – పోరెడ్డి దామోదర్రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయులదే బాధ్యత... ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో పాఠశాలకు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. త్వరలోనే ప్రభుత్వం సంబంధిత పాఠశాలల ఖాతాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు జమ చేస్తుంది. అప్పటివరకు ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణకు సంబంధించి నిధులు ఖర్చు చేయాలి. నిధులు రాగానే ప్రధానోపాధ్యాయులకు చెల్లించడం జరుగుతుంది. – సీహెచ్ జనార్దన్రావు, జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్ -
రెనాల్ట్ డస్టర్ కారుపై భారీ తగ్గింపు
ఫ్రెంచ్ కారు మేకర్ రెనాల్ట్ ఇండియా డస్టర్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. బేసిక్, హై ఎండ్ మోడల్ కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. బేస్ మోడల్పై లక్షన్నర్. హై ఎండ్మోడల్పై రూ.2 లక్షల వరకు ధరను తగ్గించినట్టు తెలిపింది. అంతేకాదు ఎక్సేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. అయితే ప్రత్యేకంగా 'గ్యాంగ్ ఆఫ్ డస్టర్' (కంపెనీ అధికారిక మెంబర్ షిప్ ఉన్న సభ్యులు) సభ్యులకు మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయి. రెనాల్ట్ డస్టర్ కాంపాక్ట్ ఎస్యూవీపై 2.17 లక్షల వరకు డిస్కౌంట్ను అందిస్తోంది. బేస్ మోడల్పై రూ. 1.6 లక్షల తగ్గింపు ఉండగా, టాప్-ఎండ్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ.2 లక్షల మేర తగ్గనుంది. జీవోడీ సభ్యులకు రూ. 10వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్తోపాటు మరో రూ.7వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ తగ్గింపు ధరలు ఎక్స్-షోరూమ్ ధరలపై పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. క్యాప్చర్ అనే కొత్త వెహికల్ లాంచింగ్ కుముందు, ఉన్న స్టాకును క్లియర్ చేసే యోచనలో ఈ పరిమిత కాల ఆఫర్ను ప్రకటించింది. క్యాప్చర్ ను రానున్నపండుగ సీజన్లో లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కాగా బేస్ మోడల్ లో 35 యూనిట్లు, టాప్-ఎండ్ డస్టర్ అడ్వెంచర్ ఎడిషన్ 73 యూనిట్లు మాత్రమే అందుబాటులోఉన్నాయి. బేస్ మోడల్ వైట్ కలర్ ఆప్షన్లోనూ, టాప్ మోడల్ వైట్ అండ్ సిల్వర్ రంగుల్లోనూ లభ్యం. కాగా రెనాల్ట్ డస్టర్ భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ , హోండా బీఆర్-వీ లకు గట్టి పోటీగా నిలిచింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement