breaking news
donate 1 lakh
-
అభిమాని కూతురు పెళ్లికి మెగాస్టార్ సాయం
సాక్షి, వరంగల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండితో జీవనాన్ని సాగిస్తున్నాడు. గత 30 సంవత్సరాల నుంచి ఆయన మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. రాష్ట్రస్థాయిలో చిరంజీవి సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడంలో శేఖర్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్కి ఇద్దరు కూతుళ్ళు వర్ష, నిఖిత. వీళ్ళ పేదరికాన్ని చిరంజీవి స్వయంగా తెలుసుకొని వాళ్ళ పెద్దమ్మాయి (వర్ష) ఈ నెల డిసెంబర్ 19 న జరిగే పెళ్లికి 1,00,000 ఆర్ధిక సాయం చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల సహాయం చేయడం హర్షనీయమని అన్నారు. చిరంజీవిని దేవుడు చల్లగా చూడాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అభిమానులు ఎవరు కష్టాల్లో ఉన్నా సమాచారం ఇవ్వాలని చిరంజీవే స్వయంగా తమతో చెప్పారని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు తెలిపారు. నగదు సహాయం అందుకున్న చిరంజీవి అభిమాని శేఖర్ మాట్లాడుతూ.. రక్త సంబంధీకులు చేయని సాయాన్ని చిరూ చేశారని, ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేనిది అని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సీఈఓ రవణం రావణస్వామి నాయుడు, సంతోషం పత్రిక అధిపతి సురేశ్ కొండేటి, అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కె. ప్రభాకర్ గౌడ్, స్ధానిక మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, మహబూబాబాద్ చిరంజీవి యువత అధ్యక్షులు మునిర్, స్థానిక చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పెద్ద ఎతున్న పాల్గొన్నారు. -
యాచకుడి విరాళం రూ.లక్ష
మధురానగర్ (విజయవాడ సెంట్రల్): విజయవా డ ముత్యాలంపాడులోని షిర్డీసాయిబాబా మంది రానికి ఓ యాచకుడు భా రీగా విరాళం ఇచ్చాడు. సాయిబాబా సమాధి చెంది వంద ఏళ్లు పూర్తవు తున్న సందర్బంగా షిర్డీ సాయిబాబా మందిరం లో ఈనెల 26వ తేదీన నిర్వహించ నున్న లక్ష నారికేళ జలాభిషేకంకు యాచకుడు యడ్ల యాది రెడ్డి రూ.1,08,000 విరాళంగా అందజేశాడు. మందిర గౌరవాధ్యక్షుడు గౌతంరెడ్డి మాట్లా డుతూ.. యాదిరెడ్డి ఇప్పటికే ఆలయంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి వెండి ఆభరణాలు చేయించటమే కాకుండా నిత్య అన్నదానానికి రూ.లక్ష విరాళం అందజేసినట్లు గుర్తు చేశారు. యాదిరెడ్డి మాట్లాడుతూ.. తనకు భక్తులు వేసిన ప్రతీ రూపాయిని భద్రపరచి.. దేవాలయంలో సేవలకు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నట్టు తెలిపారు. -
వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి రూ.లక్ష విరాళం
హైదరాబాద్: హుదూద్ తుపాన్ వల్ల నష్టపో్యిన బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ముందుకొచ్చారు. తుపాన్ బాధితుల సహాయార్థం వైఎస్ఆర్ ఫౌండేషన్కు ఉమ్మారెడ్డి లక్ష రూపాయలు విరాళం అందజేశారు. పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుపాన్ బాధితులకు సహాయం చేసేందుకు విరాళాలు అందజేస్తున్నారు.