-
IndiGo Special offer: రూ.2వేలకే విమాన టికెట్!!
గురుగ్రామ్: ఇండిగో ఎయిర్లైన్స్.. మూడురోజుల వింటర్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులకు అందించబోతోంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరకు టికెట్లు అందించనున్నట్లు ప్రకటించింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4,999 నుంచి ప్రారంభ టికెట్ల ధరగా నిర్ణయించింది. 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లకు, అదీ టికెట్లు అందుబాటులో ఉన్నంతవరకు మాత్రమే ఈ వింటర్ సేల్ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో స్పష్టం చేసింది. టికెట్లు నాన్ స్టాప్ విమానాల మీదే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని తెలిపింది. ఏ ఆఫర్లు, ప్రమోషన్స్, స్కీమ్స్.. వీటికి వర్తించవు. భారతీయులు హెచ్ఎస్బీసీ కస్టమర్లైతే.. అదనంగా క్యాష్బ్యాక్ పొందొచ్చు. ఇండిగోకు మొత్తం 290 విమానాలు ఉండగా.. రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతుండగా.. ఇందులో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. విమానయాన రంగం మునుపటి కంటే పుంజుకుందని, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ ఆఫర్ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. -
అతి తక్కువ ధరకే టికెట్లు: గోఎయిర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సంస్థ గోఎయిర్ కూడా డిస్కౌంట్ ధరలో విమాన టికెట్లకు ఆఫర్ చేస్తోంది. అధికారిక వెబ్సైట్ (goair.in) అందించిన సమాచారం ప్రకారం అతితక్కువ ధరల్లో దేశీయ మార్గాల్లో టికెట్లను అందిస్తోంది. రూ.991 ప్రారంభధర (అన్నీకలుపుకుని)గా వివిధ మార్గాల్లో టికెట్లను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఏప్రిల్ 5,2018 వరకు అందుబాటులో ఉంటుంది. అంతేకాదు ఈ ప్రత్యేక ఛార్జీల పథకంలో మరో ఆఫర్ కూడా ఉంది. గోఎయిర్యాప్లో ప్రోమో కోడ్ 'GOAPP10' ద్వారా బుక్ చేసుకున్న టికెట్లపై అదనంగా 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. హైదరాబాద్ - బెంగళూరు.. రూ.1699 బెంగళూరు- హైదరాబాద్.. రూ.2,034 అహ్మదాబాద్-ముంబై రూ.1608 బాగ్డోగ్ర- గువహతి.. రూ.991 గోవాహతి- బాగ్డోగ్రా.. రూ.1,346 పాట్నా- కోలకతా.. రూ.1,505 ప్రారంభధరలుగా ఉన్నాయి. -
గో ఎయిర్ : ఫ్లై స్మార్ట్..డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: బడ్జెట్ విమానయాన సంస్థ గో ఎయిర్ దేశీయ మార్కెట్లో డిస్కౌంట్ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. దేశీయ రూట్లలోఈ టికెట్లను ఆఫర్ చేస్తోంది. వివిధ రూట్లలో టికెట్లపై రూ.2500 డిస్కౌంట్ ఆపర్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఫ్లై స్మార్ట్ పేరుతో ఈ డిస్కౌంట్ రేట్లను అందిస్తోంది. ఇందుకుగాను జూమ్కార్, లెన్స్కార్ట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 10వరకు చేసుకునే బుకింగ్లకు ఆఫర్ వర్తించనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 10, 2018 వరకు ప్రయాణాలకు అనుమతి. అలాగే గో ఎయిర్ మొబైల్ యాప్ లేదా, వెబ్సైట్ ద్వారా చేసుకున్న జూమ్కార్ బుకింగ్పై 1200 రూపాయలు, లెన్స్కార్ట్పై వెయ్యి రూపాయల డిస్కౌంట్ను గో ఎయిర్ అందిస్తోంది. దీంతో పాటు GOAPP10 ప్రోమోకోడ్ పై 10శాతం అదనపు డిస్కౌంట్ కూడా ఉంది. నోట్: ఫిబ్రవరి 23, మార్చి 4, ఏప్రిల్ 4, ఏప్రిల్ 15, జూలై 15, 2018 తేదీలకు ఈ ఆఫర్ వర్తించదని గోఎయిర్ వెల్లడించింది. Vacation mode ON! ✔#FlySmart from Mumbai at fares starting Rs 1844*. Book now: https://t.co/C1GFSeRXtz pic.twitter.com/D85CMAGe7K — GoAir (@goairlinesindia) February 1, 2018 -
రూ. 2,999తో విదేశీ ప్రయాణం!
► రూ. 999కే స్వదేశీ విమాన టికెట్ ► ఎయిర్ ఏషియా ప్రత్యేక ఆఫర్ ► ఇప్పటికే ప్రారంభమైన బుకింగ్ బెంగళూరు చౌక ధరలకే విమాన టికెట్లను అందించే ఎయిర్ ఏషియా సంస్థ మరోసారి అత్యంత చవకైన ఆఫర్ ప్రకటించింది. భారతదేశంలో ఉన్న నగరాలకైతే పన్నులన్నింటితో కలుపుకొని రూ. 999కి, విదేశాలకు అయితే రూ. 2,999కే టికెట్లు ఇస్తామని తెలిపింది. తాము 22 దేశాల్లోని 100 నగరాలకు విమానాలు నడిపిస్తున్నామని, తాము ఇప్పుడు అందిస్తున్న ఈ ప్రమోషనల్ ఆఫర్తో దేశ విదేశాలు చుట్టి రావాలనుకునేవారికి మంచి అవకాశం వచ్చినట్లు అవుతుందని ఎయిర్ ఏషియా కమర్షియల్ విభాగం అధిపతి స్పెన్సర్ లీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఆఫర్ కింద బుకింగ్స్ సోమవారమే ప్రారంభమయ్యాయి. ఈనెల 24 వరకు టికెట్లు బుక్ చేసుకోవ్చు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 1 నుంచి వచ్చే సంవత్సరం మే 22లోగా ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు టికెట్లు ఇస్తారు. మన దేశంలో విశాఖపట్నం, బెంగళూరు, ఢిల్లీ, కొచ్చిన్, చండీగఢ్, గోవా, గువాహటి, ఇంఫాల్, పుణె, జైపూర్ నగరాలకు రూ. 999 టికెట్తో వెళ్లొచ్చు. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, బాలి, మెల్బోర్న్, పెర్త్, మనిలా లాంటి 100 నగరాలకు రూ. 2,999 టికెట్తో వెళ్లొచ్చని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సాయిధరమ్ తేజ్పై దాడి జరగలేదు : డీఎస్పీ
తాటిపర్తి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వర్మ హస్తం
పొలంలో ధాన్యం రాశుల దగ్ధం
మిత్ర పురుగులతో తెల్లదోమ నివారణ
దంపతులను ఢీకొన్న లారీ
రత్నగిరికి ఉత్సవ శోభ
వాహనాల తనిఖీలో రూ.2.71 కోట్ల పట్టివేత
ట్రిపుల్ ఐటీ.. భవితకు మేటి
రేపటి నుంచి జిల్లా స్థాయి పోస్టల్ బ్యాలెట్
గూగుల్, ఓపెన్ఏఐ కంటే పెద్ద ఏఐమోడల్ తయారీ
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement