breaking news
Diwali party
-
ప్రముఖ నటి షబానా అజ్మీ ఇంట్లో తారల దీపావళి సందడి (ఫోటోలు)
-
మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)
-
గేటుకు తాళం వేసి దివాలీ పార్టీకి రానీయ లేదు: బిలియనీర్ భార్య వైరల్ వీడియో
రేమండ్ సీఎండీ గౌతమ్ సింఘానియా తన భార్య నవాజ్ మోడీతో విడిపోయినట్లు ప్రకటించడం బిజినెస్ వర్గాల్లో సంచలనంగా మారింది. అయితే 53 ఏళ్ల ఫిట్నెస్ కోచ్ నవాజ్మోడీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల భర్త గౌతమ్ సింఘానియా నిర్వహించిన దీపావళి పార్టీకి హాజరయ్యేందుకు తనను అనుమతించలేదని చెబుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో భర్త నుంచి తనకు ఆహ్వానం ఉన్నప్పటికీ దీపావళి పార్టీకి రాకుండా ఒక 'బలవంతుడు' తనను గేటు వద్ద అడ్డుకున్నాడని గౌతమ్ సింఘానియా భార్య ఆరోపించారు. గత వారం తన భర్త నిర్వహించిన దీపావళి పార్టీకి హాజరవకుండా ఆపారనీ, దాదాపు మూడు గంటలకు పైగా లోపలికి వెళ్లకుండా గేటు వెలుపల వేచి ఉండేలా చేశారని ఆరోపించారు. ఇది ఇలా ఉండగా గత నెలలో, నవాజ్ మోడీపై గౌతమ్ బ్రీచ్ క్యాండీ ఇంట్లో దాడి చేయడంతో కాలర్ బోన్ విరిగిపోయిందనీ, ఆ తర్వాత ఆమెను ఆసుపత్రిలో చేర్పించారని, దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం తెలుస్తోంది. కాగా గతంలో కన్నతండ్రి విజయ్ సింఘానియా గౌతమ్ సింఘానియాపై ఆరోపణలు చేశారు. తనకు నిలువ నీడ లేకుండా చేసేందుకు తన కొడుకు గౌతమ్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడంటూ విజయ్ సింఘానియా బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముంబైలో తాను నిర్మించిన 37 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్ 'జేకే హౌస్' నుంచి తనను బయటకు గెంటేసి, దానిని సొంతం చేసుకోవాలని తన కుమారుడు చూస్తున్నాడంటూ ఆరోపించారు. అయితే తన తండ్రి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని గౌతమ్ సింఘానియా కొట్టి పారేశాడు. తన తండ్రి ఆస్తులకు కేవలం తాను మాత్రమే చట్టపరమైన వారసుడినని పేర్కొన్నారు. అయితే, ఈ సమస్యను కుటుంబసభ్యులు సామరస్యంగా,స్నేహాపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోర్టు సూచించింది. అంతేకాదు విజయపత్ సింఘానియాను చైర్పర్సన్-ఎమిరిటస్ పదవినుంచి రేమండ్ లిమిటెడ్ షాకింగ్ తొలగించడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఆస్తి వివాదం మధ్య దక్షిణ ముంబైలోని గ్రాండ్ పార్డి సొసైటీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. (విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్ షాకింగ్ ప్రకటన) It seems after dumping his father years back, now *Gautam Singhania* has locked out his wife *Nawaz Modi Singhania* from a company event. This was last night outside the Raymond House in Thane.#gautamsinghania#nawazmodisinghania pic.twitter.com/AHHwlKrSWd — The Cheshire Cat (@C90284166) November 13, 2023 -
ఆ వార్తలపై హిమజ రియాక్షన్
-
దీపావళి పార్టీలో బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
సినీ స్టార్స్.. దివాలీ సెలబ్రేషన్స్ అదుర్స్!
ముంబై: ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా బాలీవుడ్ ప్రముఖులు దీపావళి వేడుకలను సంబరంగా నిర్వహించుకున్నారు. సినీప్రముఖులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాలతో గడిపారు. బుధవారం రాత్రి ప్రముఖ దంపతులు జావేద్ అఖ్తర్, షబానా అజ్మీ ముంబైలోని తమ నివాసంలో దీపావళి వేడుకలు జరిపారు. ఈ వేడుకలకు బాలీవుడ్ తారాగణమంతా కదిలివచ్చింది. టాప్ స్టార్స్ అయిన అమితాబ్ బచ్చన్-జయబచ్చన్, శ్రీదేవి-బోనీకపూర్, ఆమిర్ఖాన్-కిరణ్రావు, హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్, షాహిద్ కపూర్-మీరా రాజ్పుత్, విద్యాబాలన్-సిద్ధార్థ్ రాయ్ కపూర్, కరణ్ జోహర్, రిషీకపూర్-నీతూసింగ్, శిల్పాషెట్టీ-రాజ్ కుంద్రా, అనిల్ కపూర్ తదితర ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. సంప్రదాయ వస్త్రాల్లో శ్రీదేవి ఈ వేడుకల్లో దర్శనమిచ్చి ఆకట్టుకున్నారు. -
బచ్చన్ ఇంట్లో తారల దీపావళి సందడి
ముంబై: బాలీవుడ్ మెగా స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దీపావళి రోజున బాలీవుడ్ స్టార్స్తో సందడి నెలకొంది. ప్రతి ఏడాదిలాగే ఈ దీపావళికి కూడా అమితాబ్ బాలీవుడ్ నటులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నటులు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, టబు, షాహిద్ కపూర్, ఆలియా భట్, జాక్వేన్ ఫేర్నాండేజ్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, మాదవన్, వరుణ్ ధావణ్, క్రితిసనన్, తదితరులు అమితాబ్ కుటుంబంతో దీపావళి వేడుక జరుపుకున్నారు. సంప్రదాయక దుస్తుల్లో వచ్చిన నటీమణులు ఈ పార్టీకి ఆకర్షణగా నిలిచారు. తమ ఇంచికి వచ్చిన అతిథులను బిగ్ బీ కుటుంబసభ్యలు ఐశ్వర్యరాయ్బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయ బచ్చన్లు కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. -
శిల్ప ఇంట్లో దీపావళి అదిరింది
-
శిల్ప ఇంట్లో దీపావళి అదిరింది
సినిమాల్లో ఎంత మోడ్రన్ గా కనిపించినా పండుగలప్పుడు మాత్రం బాలీవుడ్ తారలు సంప్రదాయాలను పాటిస్తూ చూడముచ్చటగా ఉంటారు. పండుగలను ఘనంగా జరుపుకుంటారు. అయితే శిల్పాశెట్టి నివాసంలో దీపావళి పండుగ ముందుగానే వచ్చింది. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడు ప్రముఖ తారలతో కుంద్రా ఇల్లు వెలిగిపోయింది. శిల్ప ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు హాజరైన పలువురు తారలు తమ ట్విట్టర్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో తమ ఎంజాయ్మెంట్ను ఫొటోల రూపంలో పంచుకుంటున్నారు. దీపావళి వేడుకలకు హాజరైనవారిలో శ్రీదేవి, కూతురు ఖుషీ, ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, ఈషా డియోల్ దంపతులు, షాహిద్ కపూర్, సోనమ్ కపూర్, సునీల్ శెట్టి, కరణ్ జొహార్, మనీష్ మల్హోత్ర, మికా సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారలంతా కలిసి దిగిన సెల్ఫీలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.