breaking news
Diwali bash
-
ముద్దుల కోడలితో నీతా అంబానీ : బుల్లి బ్యాగ్ ధర ఎన్ని కోట్లో తెలుసా?
MMDiwali ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దివాలీ బాష్లో స్టన్నింగ్ లుక్తో అలరించారు. 61ఏళ్ల వయసులో కూడా ఆరోగ్యంగా, అందంగా తనదైన ఫ్యాషన్ స్టైల్తో ఆకట్టుకుంటారు. అటు వ్యాపారవేత్తగా రాణిస్తూ, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.అంతేకాదు మహిళలు 40 ఏళ్లు దాటిన తరువాత కనీసం వ్యాయామం యోగా లాంటివి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూమహిళలకు సందేశమిస్తారు. తాజాగా అరుదైన హెర్మేస్ జ్యువెలరీ బ్యాగ్ , కొలంబియన్ ఎమరాల్డ్స్తో సీక్విన్డ్ మనీష్ మల్హోత్రా చీరలో నీతా అంబానీ మరోసారి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్నారు.దీపావళి సమీపిస్తున్న తరుణంలో మనీష్ మల్హోత్రా ఎప్పటిలాగే తన ఇంట్లో బి-టౌన్ సెలబ్రిటీలతో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు మొత్తం బాలీవుడ్ పరిశ్రమ తరలివచ్చింది. అంబానీ ఫ్యామిలీకి చెందిన అత్తాకోడళ్ల ద్వయం చీరలలో అందరి దృష్టిని ఆకర్షించింది. (మూడు నెలలు ముహూర్తాలు లేవు..నగరానికి పెళ్లి కళ వచ్చేసింది!)బిలియనీర్ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ చైర్మన్,ముఖేష్ అంబానీ భార్య డిజైనర్ నీతా అంబానీ, చిన్నకోడలు రాధికా మర్చంట్తో చీరల్లో ఫెస్టివ్ల్ లుక్లో అదరగొట్టేశారు. ముఖ్యంగా నీతా బ్రైట్ సిల్వర్ వెండి సీక్విన్ సారీ, స్లీవ్లెస్ బ్లౌజ్తో క్లాసిక్ అండ్ ఫెస్టివ్ లుక్లో ఆకట్టుకున్నారు. దీనికి తగ్గట్టు స్పెషల్ హై జ్యువెలరీ కలెక్షన్ అద్భుతమైన ఎమరాల్డ్స్ చెవిపోగులు, వజ్రాల బ్రాస్లెట్తో హైలైట్గా నిలిచారు. ఇంకా తనదైన శైలిలో ధరించిన ప్రత్యేక ఎడిషన్ మినియేచర్ లగ్జరీ బిర్కిన్ మరో హైలైట్. వజ్రాలతో పొదిగి రోజ్ గోల్డ్తో తయారు చేసిన ఈ బ్యాగ్ ధర రూ.17.74 కోట్లు ఉంటుందని అంచనా. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) నీతా వెండి సీక్విన్ చీరను ధరించగా, కోడలు రాధిక ముత్యాలతో రూపొందించిన మనీష్ మల్హోత్రా చీరలో క్లాసీ వైబ్ను పంచారు. డీప్ నెక్లైన్ స్లీవ్లెస్ బ్లౌజ్, ఓపెన్ పల్లుతో స్టైల్ చేసింది. అలాగే అత్తగారిలాగానే తన లుక్కి మ్యాచింగ్ బ్యాగ్ ధరించింది. అత్తగారి చేయి పట్టుకుని నడిచి వచ్చిన తీరు అక్కడున్నవారినందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. -
Diwali Bash: దీపావళి వేడుకల్లో మెరిసిపోయిన బాలీవుడ్ తారలు ఫోటోలు
-
ఆటం బాంబులా చెలరేగిన ట్రంప్
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దివాళీ ఆటం బాంబులా చెలరేగారు. భారత సంతతికి చెందిన వారి గౌరవార్ధం వైట్హౌస్లో ఏర్పాటు చేసిన దివాళీ వేడుకల్లో రెచ్చిపోయారు. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్సీసీ) చైర్మన్, ఇండో అమెరికన్ అజిత్ పాయ్ టార్గెట్గా తనదైన శైలిలో మండిపడ్డారు. ఈ ఏడాది జులైలో ట్రిబ్యూన్ మీడియాను సిన్క్లెయిర్ బ్రాడ్కాస్ట్ గ్రూప్ టేకోవర్ చేయడానికి ఎఫ్సీసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఎఫ్సీసీ నిర్ణయం విచారకరం, అసమంజసమని అప్పట్లోనే అభివర్ణించారు. అయితే ఇదే విషయం మనసులో పెట్టుకున్న ట్రంప్ దివాళీ వేడకలకు హాజరైన అజిత్ పాయ్ను ఏకంగా పేరు పెట్టి పిలిచి మరీ ముందుకు పిలిపించుకున్నారు. అజిత్ తీసుకున్న ఓ నిర్ణయం తనకు ఎంతమాత్రం నచ్చలేదని, ఆయన నిర్ణయం అసలు నచ్చకపోయినా ఆయనకు ఆ స్వతంత్రత ఉందని అందరి సమక్షంలో వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి సూచనల మేరకు అధికారులు నామినేట్ అయినప్పటికీ ఎఫ్సీసీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. అజిత్ పాయ్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో నియమితులవగా, ఎఫ్సీసీ చీఫ్గా ట్రంప్ ఆయనను ప్రమోట్ చేశారు. ఇక ట్రిబ్యూన్ను కొనుగోలు చేయడం ద్వారా 70 శాతం అమెరికన్ లోగిళ్లలోకి రీచ్ను పెంచుకోవాలని టీవీ దిగ్గజం సిన్క్లెయిర్ ప్రణాళికలు రూపొందించుకుంది. సిన్క్లెయిర్ ట్రిబ్యూన్ డీల్కు ట్రంప్ సానుకూలంగా ఉండగా, ఎఫ్సీసీ ఈ ప్రతిపాదనకు చెక్ పెట్టడం దుమారం రేపింది. మరోవైపు ఫేక్న్యూస్ ప్రసారం చేసిన టీవీ న్యూస్ ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై 2017లో అధ్యక్షుడికి వ్యతిరేకంగా పాయ్ పనిచేశారు. ఆయా ఛానెళ్ల లైసెన్సుల పునరుద్ధరణపై ట్రంప్ సూచనలను పాయ్ పెడచెవినపెట్టారు. ఆయా సందర్భాల్లో తన నిర్ణయాన్ని అజిత్ పాయ్ గట్టిగా సమర్ధించుకున్నారు. -
శిల్ప ఇంట తారల సందడి
-
బచ్చన్ ఇంట్లో తారల దీపావళి సందడి
ముంబై: బాలీవుడ్ మెగా స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో దీపావళి రోజున బాలీవుడ్ స్టార్స్తో సందడి నెలకొంది. ప్రతి ఏడాదిలాగే ఈ దీపావళికి కూడా అమితాబ్ బాలీవుడ్ నటులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. నటులు షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, దీపికా పడుకొనే, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, శిల్పాశెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, టబు, షాహిద్ కపూర్, ఆలియా భట్, జాక్వేన్ ఫేర్నాండేజ్, కరణ్ జోహార్, సోనమ్ కపూర్, మాదవన్, వరుణ్ ధావణ్, క్రితిసనన్, తదితరులు అమితాబ్ కుటుంబంతో దీపావళి వేడుక జరుపుకున్నారు. సంప్రదాయక దుస్తుల్లో వచ్చిన నటీమణులు ఈ పార్టీకి ఆకర్షణగా నిలిచారు. తమ ఇంచికి వచ్చిన అతిథులను బిగ్ బీ కుటుంబసభ్యలు ఐశ్వర్యరాయ్బచ్చన్, అభిషేక్ బచ్చన్, జయ బచ్చన్లు కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు.