-
నెల్లూరు సరిహద్దుల్లో పార్ధిగ్యాంగ్..!
సాక్షి, నెల్లూరు(క్రైమ్) : దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్ చిత్తూరు–తమిళనాడు, చిత్తూరు–నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే అవకాశమున్న దృష్ట్యా గస్తీ సిబ్బంది విధిగా ఆయుధాలు (షాట్ వెపన్స్)ను వెంట ఉంచుకోవాలన్నారు. అవసరమైతే కాల్చివేయడానకి వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరీ పార్ధిగ్యాంగ్! మహారాష్ట్ర–మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, యాచకుల్లా జీవనం చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎం చుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో వారి కదలికలను ఎ వరూ గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడుతారు. ఆనవాళ్లు దొరక్కుండా.. వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీరి వ్యవహారశైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకొన్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులు తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు. పార్ధి గ్యాంగ్లు సుమారు 10 ఉండొచ్చని పోలీసులు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉంటారని సమాచారం. గ్యాంగ్లో పురుషులే కాదు మహిళలు సైతం చురుగ్గా వ్యవహరిస్తారు. ఈ గ్యాంగ్కు సంబంధించిన పలువురిని 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థిగ్యాంగ్ సభ్యులు తప్పించుకున్నారు. 2005లో నెల్లూరులో దొంగతనం పార్ధిగ్యాంగ్ గతంలో నెల్లూరులో దొంగతనానికి పాల్పడింది. 2005లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంజీ బ్రదర్స్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. రెండు రోజులు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఇంటి కుక్కలకు మత్తు బిస్కెట్లు వేసి వాచ్మన్ను హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద కలకలం సృష్టించింది. కావలిలోనూ ఇదే తరహాలో నేరానికి పాల్పడినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలి జిల్లా సరిహద్దులో పార్ధిగ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బం దిని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ -
మన్యం నుంచి మైదానానికి...గంజాయ్
అడ్డుకట్ట లేని వైపరీత్యం కేడీపేట మీదుగా యథేచ్ఛగా రవాణా దొరికితే దొంగ.. లేకపోతే దొర.. అన్న చందంగా గంజాయి రావాణా సాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు పరిమితమైన గంజాయి రవాణా ప్రస్తుతం మైదాన ప్రాంతాలకు అంచెలంచెలుగా విస్తరిస్తోంది. చింతపల్లి, జీకేవీధి, సీలేరు, పాడేరు ప్రాంతాల్లో పండించిన గంజాయిని మైదాన ప్రాంతాల గుండా రవాణా జరుగుతోంది. ఒకప్పుడు రోలుగుంట, రావికమతం మీదుగా వెళ్లే గంజాయి ప్రస్తుతం కేడీపేట మీదుగా అధిక సంఖ్యలో జరుగుతోంది. గొలుగొండ: గడచిన 14 నెలల వ్యవధిలో కేడీపేట, గొలుగొండ ప్రాంతాల్లో రూ. 2.64 కోట్లు విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. గంజాయి రవా ణా ఎంత విస్తరిస్తోందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనం. ఇది పోలీసులకు చిక్కిం ది మాత్రమే. పోలీసులకు తెలియకుండా మరెన్నో వాహనాలు జిల్లా సరిహద్దులు దాటిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి రవాణాకే కేడీపేట సులువైన మార్గంగా మారింది. రంపుల మీదుగా కేడీపేట చేరుకుంటే గంజాయి వాహ నం గమ్యం చేరినట్టే. ఎందుకంటే కేడీపేట మీదుగా ఏలేశ్వరం, రాజమండ్రి నుంచి ఇతర రాష్ట్రాలకు రవాణా చేయవచ్చు. దీన్ని గమనించిన స్మగ్లర్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. చింతపల్లి నుంచి ఏటిగైరంపేట మీదుగా చీడిగుమ్మల చేరుకుంటే గంజాయి స్మగ్లర్లకు పంట పండినట్టే. ఈ మార్గంలో ఎక్కడా చెక్పోస్టులు లేకపోవడం గమనార్హం. దీంతో గంజాయి స్మగ్లర్లకు ఇది రాజమార్గంగా మారిపోయింది. పాకలపాడు వద్ద ఏడాది క్రితం 2,800 కిలోలతో రెండు వాహనాలను సీజ్ చేశారు. కేడీపేటలో అధిక సంఖ్యలో పోలీసులే గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిలో ఆరు వాహనాలను సీజ్ చేసి వందలాది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేడీపేటలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ రంపుల మీదుగా గంజాయి కేడీపేట చేరాలంటే ఫైలట్లు తప్పనిసరి. గంజాయి వాహనానికి ముందు ఈ ఫెలైట్లు లైన్ క్లియర్ చేస్తారు. ఎవరూ లేకపోవడం చూసి వాహనాన్ని గమ్యస్థానానికి చేరుస్తారు. ఇలా గంజాయి రవాణా ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగడానికి కేడీపేటలో కొంతమంది స్మగ్లర్లకు చేయూతనిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ సంఖ్యలో ఈ ఏడాది ఈ మార్గంలో వాహనాలు పట్టుకోవడం విశేషం. పోలీసులు నిత్యం తనిఖీలు చేయాలంటే ఈ ప్రాంతం ఏజెన్సీకి ఆనుకుని ఉండడం వల్ల ఇబ్బందులెదురౌతున్నాయి. కేడీపేట పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనమవుతోంది. అదేవిధంగా శుక్రవారం నాడు వాహనాల తనిఖీలో భాగంగా అల్లూరి పార్కు వద్ద కుళ్లిపోయిన పనసకాయల మాటున ఉన్న గంజాయిని పట్టుకున్నారు. భీమవరం చెక్పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది శనివారం తెల్లవారుజామున కూడా గంజాయి తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement