-
సబ్సిడీలా!
సాక్షి, మెదక్: కప్పుడు ఆర్టీసీ సంస్థ మనుగడకే ముప్పు వాటిళ్లే విధంగా ప్రైవేట్ వాహనాలు ఉనికి చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులను అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు, ఆర్టీసీ వైపు మళ్లించేందుకు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టి కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ప్రయాణికులు కోరిన చోట ఆపడం, ఎక్స్ప్రెస్, లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కాలక్షేపం కోసం టీవీలను ఏర్పాటు చేయటంతో పాటు పలురకాల వసతులు పెంచింది. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం ప్రారంభమైంది. వీటికి తోడు సబ్సిడీతో కూడిన నవ్య, వనిత, విహారి కార్డులను ప్రయాణికులకు అందించింది. మొదటిసారి నవ్య కార్డు ధర రూ.280 కాగా ఆ మరుసటి ఏడాది రూ.180కి ఇచ్చింది. పల్లెవెలుగు మొదలుకుని సూపర్ లగ్జరీవరకు అన్ని బస్సుల్లో పదిశాతం సబ్సిడీ పొందే వెసులుబాటు కల్పించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.100కే వనిత కార్డును అందించింది. కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పదిశాతం రాయితీపై ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయణించే వారికోసం విహారి కార్డులను సైతం ప్రవేశపెట్టింది. రూ.610 చెల్లిస్తే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సూపర్ లగ్జరీ బస్సులతో పాటు అన్ని బస్సుల్లో సగం చార్జీలకే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకాలతో సంస్థకు ఎలాంటి లాభం లేదని, పదిశాతం నష్టమేనని తేల్చుకున్న ఆర్టీసీ మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాటిని ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,260 సబ్సిడీ కార్డులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మెదక్ డిపోలో మొత్తం 103 బస్సులు ఉండగా 7 ఎక్స్ప్రెస్, 6 లగ్జరీ, 13 డీలక్స్తో పాటు 77 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి నిత్యం 39,000 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిస్తుంటాయి. వీటి ద్వారా నిత్యం రూ.11 లక్షలు రావాల్సి ఉండగా రూ.10 లక్షలు మాత్రమే వస్తోంది. ఈలెక్కన నెలకు రూ.30 లక్షల ఆదాయం తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉందని పేర్కొంటున్నారు. సబ్సిడీ కార్డులను ఎత్తివేçయాలని రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో నష్టాల నుంచి కొంత బయట పడే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. రూ.7 కోట్ల నష్టాల్లో ఉంది ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉంది. డిపోలను నష్టాల ఊబి నుంచి బయట పడేయాలనే ఆలోచనతో సబ్సిడీ కార్డులను ఎత్తివేస్తున్నారు. ఇక నుంచి సంస్థ నష్టాలను అధిగమించి లాభాల బాటలో నడుస్తుందని ఆశిస్తున్నాం.– జాకీర్హుస్సేన్, మెదక్ డిపో మేనేజర్ -
కీలక విదేశీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు రాయితీ రుణాలు
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలకమైన ఇన్ఫ్రా ప్రాజెక్టులకు బిడ్డింగ్ చేసే దేశీ కంపెనీలకు రాయితీపై రుణాలు అందించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ రుణాల రీపేమెంటుకు సదరు దేశ ప్రభుత్వం హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్కీము కింద దేనికి రాయితీ రుణం అందించవచ్చన్నది ఆయా ప్రాజెక్టును బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగ్జిమ్ బ్యాంకు కాకుండా ఇతరత్రా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా వ్యూహాత్మక ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేసే యోచనను పరిశీలిస్తున్నట్లు వివరించింది. రెండేళ్ల తర్వాత ఈ స్కీమును పునఃసమీక్షించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement