-
పరస్పర సహకారంతోనే విపత్తులపై విజయం
న్యూఢిల్లీ/లండన్: విపత్తులను ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య పరస్పర సహకారం కచ్చితంగా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షిప్పింగ్ లైన్లు, వైమానిక నెట్వర్క్స్ వంటివి ప్రపంచమంతటా విస్తరించి ఉంటాయని వెల్లడించారు. ఎక్కడైనా విపత్తు సంభవిస్తే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా వెంటనే కనిపిస్తుందన్నారు. విపత్తుల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతులను పునరుద్ధరించడానికి, పూర్వ స్థితికి తీసుకురావడానికి అన్ని దేశాలు కలిసి పని చేయాలని సూచించారు. డిజాస్టర్ రిసైలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై బుధవారం జరిగిన అంతర్జాతీయ సదస్సు (ఐసీడీఆర్ఐ–2021) ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్లాంటి దేశాలు మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. విపత్తుల నుంచి కోలుకోవడానికి కూడా నిధుల కేటాయింపులు అవసరమన్నారు. కరోనా నేర్పిన పాఠాలు మరవొద్దు కోవిడ్–19 మహమ్మారి ఒక ఊహించని విపత్తు అని నరేంద్ర మోదీ అభివర్ణించారు. వందేళ్లకు ఒకసారి సంభవించే ఇలాంటి విపత్తుకు మనం సాక్షీభూతంగా నిలిచామన్నారు. ఈ మహమ్మారి వల్ల పేద–ధనిక, తూర్పు–పడమర, ఉత్తరం–దక్షిణం అనే తేడా లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలూ నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకచోట మొదలైన విపత్తు ప్రపంచాన్ని ఎంతో వేగంగా ప్రభావితం చేస్తుందన్న పాఠాన్ని కరోనా వైరస్ మనకు నేర్పిందన్నారు. ఉమ్మడి శత్రువును ఎదిరించడానికి ప్రపంచమంతా ఒక్కతాటిపైకి ఎలా రావాలో తెలియజేసిందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలు ప్రపంచంలో ఎక్కడైనా పురుడు పోసుకోవచ్చని వివరించారు. 2021లో కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం వేగంగా కోలుకుంటుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా నేర్పిన పాఠాలను మర్చిపోవద్దని సూచించారు. ఈ పాఠాలను ప్రజారోగ్య విపత్తులకే కాకుండా ఇతర విపత్తులకు కూడా అన్వయించుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక ప్రపంచం పాలిట పెనుభూతంగా మారిన వాతావరణ మార్పుల నుంచి గట్టెక్కడానికి ఉమ్మడి కృషి కావాలని ప్రధానమంత్రి మోదీ సూచించారు. ఈ సదస్సులో ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘీ, యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తదితరులతోపాటు పలు అంతర్జాతీయ సంస్థల, విద్యా సంస్థల ప్రతినిధులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. మోదీ పాత్ర ప్రశంసనీయం వాతావరణ మార్పులపై జరుగుతున్న అంతర్జాతీయ పోరాటంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఆయన నాయకత్వం విస్మరించలేనిదని అన్నారు. తాను వచ్చే నెలలో భారత్లో పర్యటించబోతున్నానని, వాతావరణ మార్పులతోపాటు ఇతర కీలక అంశాలపై తన మిత్రుడు మోదీతో చర్చిస్తానని చెప్పారు. ఐసీడీఆర్ఐ సదస్సులో బోరిస్ జాన్సన్ మాట్లాడారు. ఈ సదస్సును నిర్వహించిన నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. -
జిల్లాలో విపత్తు సహాయక సెల్
కరీంనగర్: వరదలు, విపత్తులు సంభవిస్తే తక్షణం స్పందించేందుకు 24 గంటలూ పనిచేసే సెల్ను కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్ ఏర్పాటు చేశారు. ఈ సెల్లో 120 మంది రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందిని నియమించారు. ఈ సెల్ సోమవారం నుంచి పనిచేయటం ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800-4254-731, 0878-2234-731 ఫోన్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లకు అందిన ఫిర్యాదును వెంటనే తహశీల్దార్లకు, ఆర్డీవోలకు అందిస్తారు. వారు తీసుకున్న చర్యలపై కలెక్టర్ నీతూప్రసాద్ సమీక్షించనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement