breaking news
dhobi ghat
-
ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లల పనీ, పాటా : వైరల్ వీడియో
పిల్లలు పెంపకంలో తల్లిదండ్రులకు కచ్చితంగా కొన్ని సూత్రాలను పాటించాలి. తమలాగా తమ పిల్లలు కష్టపడకూడదనే ఉద్దేశంతో వాళ్లకి ఏ కష్టం తెలియకుండా, అడిగిందల్లా క్షణాల్లో కళ్ల ముందర ఉంచుతూ, కాలు కందకుండా పెంచాలని భావిస్తుంటారు. నిజానికి ఈ విధానం వల్ల పిల్లల్లో సోమరితనం, కష్టపడి సాధించాలనే తపన సామర్థ్యం, తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయంటారు చైల్డ్ సైకియాట్రిస్టులు. అందుకే పిల్లలకు బాల్యం నుంచే శ్రమ విలువ, గౌరవం తెలిసేలా చేయాలి. ఒక విదేశీ మహిళ, తన బిడ్డలతో ఇలానే చేస్తోంది అంటే నమ్ముతారా? దీనికి సంబంధించి ఒక వీడియో నెట్టింట విశేషంగా నిలిచింది.‘వోనీ_బ్రదర్స్' అనే ఇన్స్టా ఖాతాలో భారతీయ పనిపద్ధతులు, జీవనశైలిని కొరియన్ కుటుంబానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీని ప్రకారం వివిధ భారతీయ అనుభవాలు, ఆహారాలు, లేదా ప్రయాణ విశేషాలు కాకుండా ఆ కుటుంబం తమ పిల్లలకు చేతులతో బట్టలు ఉతకడంలో ఉండే కష్టాన్ని చూపించాలని నిర్ణయించుకుంది. అలా ఇద్దరు చిన్న కొరియన్ పిల్లలు ముంబైలోని ప్రసిద్ధ ధోబీ ఘాట్కి వచ్చి, మురికి బట్టలకు బండకేసి బాది ఉతికారు. తల్లి కూడా దగ్గరే నిలబడి, వారితో పాటు బట్టలు ఉతకడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి ముందు అక్కడి కార్మికులు బట్టలను శుభ్రం చేయడం, ఉతకడం లాంటి పనులను పిల్లలు జాగ్రత్తగా పరిశీలించడం విశేషం. "ధోబీ ఘాట్లో కొరియన్ పిల్లలు. నిజమైన భారతీయ జీవితాన్ని గడుపుతున్నారు. ధోబీ ఘాట్. నిజమైన పని, నిజమైన గౌరవం," అనే క్యాప్షన్తో షేర్ అయిన ఈ వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Jung ae Um🇰🇷 living in India🇮🇳 (@wonny_brothers)> ఇదీ చదవండి: క్రూర హంతకుల జైలు ప్రేమ, పెళ్లి : 15 రోజుల పెరోల్కాగా వోనీ_బ్రదర్స్ భారతదేశంలో మొదటిసారిగా పానీ పూరీని ప్రయత్నించిన వీడియో వైరల్ అయింది. అలాగే ఈ బ్రదర్స్లో ఒకరు సూపర్ సింగర్ జూనియర్ 9 పోటీదారు మైత్రేయన్తో కలిసి "కనిమా"అనే తమిళ పాటకు డాన్స్ చేస్తూ ఆన్లైన్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. దీనిపై ఇది కేవలం రీల్స్ కోసం చేసినట్లు అనిపించవచ్చు గానీ, తల్లిదండ్రులు పిల్లలకు నేర్పే ఒక జీవిత పాఠం. దీనిని తేలికగా తీసుకోకూడదు," అని వ్యాఖ్యానించారు. -
సీఎం కేసీఆర్ గుడ్న్యూస్.. 250 యూనిట్ల కరెంట్ ఫ్రీ
హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హెయిర్ కటింగ్ షాపులు, లాండ్రీలు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, నాయీ బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వానికి ఇప్పటికే చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన మీదట సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తక్షణమే జీవో జారీ చేయాల్సిందిగా సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం ఆదివారం జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రానున్నది. అత్యంత బలహీన వర్గాల అభ్యున్నతే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ స్థాయినుంచి జీహెచ్ఎంసీ వరకు ఉన్న కటింగు షాపులు, లాండ్రీ షాపులకు, ధోబీఘాట్లకు నెలకు 250 యూనిట్ల వరకు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందుబాటులోకి రానున్నదన్నారు. కులవృత్తిని ఆధారం చేసుకుని జీవనం సాగిస్తున్న తెలంగాణలోని లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. -
ధోబి ఘాట్లో పడి యువకుడి మృతి
హైదరాబాద్: ధోబిఘాట్లో ఈత కొట్టేందుకు వెళ్లి ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫలక్నుమా ఫారూక్నగర్లోని ధోబి ఘాట్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ యువకుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు దానమ్మ జోఫ్డి ప్రాంతంలో తిరిగే నదీం (19) అని కొందరు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.


