breaking news
devagudi
-
దేవగుడి సక్సెస్.. ఆనందంగా ఉందన్న డైరెక్టర్
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం దేవగుడి. ఈ మూవీని బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ను నిర్వహించారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..'మా సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా ఆకట్టుకుందని ప్రశంసలు వస్తున్నాయి. రివ్యూస్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. అభినవ శౌర్య నరసింహ, అనుశ్రీ నటనతో కూడా అందరిని ఆకట్టుకున్నారు. కొందరు ఆడియెన్స్ సినిమా చూసి బయటకు వస్తూ భావోద్వేగానికి గురవుతున్నారని' అన్నారు.హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ..' కొన్నేళ్లుగా హీరో కావాలనే కలను ఈ సినిమాకు వస్తున్న స్పందనతో మర్చిపోయాను. థియేటర్స్లో నన్ను నేను చూసుకుంటూ ఉంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఈ క్రెడిట్ అంతా మా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డికే చెందుతుంది. మీ ఆదరణ మా సినిమా పట్ల ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారు.హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ.. 'ఒక తెలుగు అమ్మాయి హీరోయిన్గా మీ ముందుకు వచ్చా. తిరుపతిలో మా సినిమా చూసి బయటకు వస్తుంటే శ్వేతా రెడ్డి అని పిలుస్తున్నారు. ఇది నటిగా నాకు దక్కిన రియల్ గుర్తింపు. ఈ చిత్రంలో శ్వేతారెడ్డిగా నన్ను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బెల్లం రామకృష్ణారెడ్డి గారు సినిమాలోని ప్రతి పాత్రను అంత బాగా తెరకెక్కించారు' అని అన్నారు. -
'దేవగుడి' సినిమా రివ్యూ
బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన నిర్మించిన సినిమా 'దేవగుడి'. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రలు చేశారు. ఈరోజు(జనవరి 30) ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?దేవగుడికి చెందిన వీరారెడ్డి (రఘు కుంచె) ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరులలో ఒకరి కొడుకు అయిన ధర్మ (అభినవ్ శౌర్య), తన కుమారుడితో (నరసింహ) స్నేహంగా ఉండడాన్ని సహించడు. తన కుమార్తె శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలిసి అతడిని ఊరు నుంచి గెంటేస్తాడు. వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా ఇద్దరు అనుచరులని ప్రత్యర్థులు మట్టుపెడతారు. మరోపక్క శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతకు ఏమైంది? ధర్మ-శ్వేత ఒక్కటయ్యారా? వీరారెడ్డి చివరికి ఏం చేశాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సమాజంలో ప్రధాన సమస్యల్లో ఒకటైన కుల వ్యవస్థని ప్రశ్నిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. చిన్నప్పుడే అన్నాచెల్లెళ్లు.. తండ్రి అనుచరుడిగా పనిచేసే వ్యక్తి కొడుకుతో మంచి బాండింగ్ ఏర్పరచుకుంటారు. అబ్బాయిలు, స్నేహితులుగా మారితే.. అమ్మాయి మాత్రం ఆ కుర్రాడి మీద మనసు పడుతుంది. తక్కువ కులానికి చెందిన అతన్ని ప్రేమించడం నచ్చని ఆమె తండ్రి.. అతన్ని ఊరి నుంచి పంపేస్తాడు. ర్వాత ఏం జరిగింది అనేది మెయిన్ ఫ్లాట్.రాయలసీమలోని దేవగుడి అనే ఒక గ్రామం నేపథ్యంలో కథ అంతా సాగుతుంది. రాయలసీమ టచ్తో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. చంద్రమండలం వరకు వెళ్లి పరిశోధనలు చేస్తున్నారు కానీ ఇంకా రాతియుగపు నాటి కుల వ్యవస్థను మాత్రం వదలలేకపోతున్నారు. ఏదేమైనా చేయండి కానీ పెళ్లి విషయంలో చావు విషయంలో మాత్రం కులాల ప్రస్తావన కచ్చితంగా తీసుకొస్తున్నారు. ఇందులోనూ అదే అంశాన్ని చూపించారు.సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునేలానే సాగుతుంది. కాకపోతే స్టోరీలా ఊహించేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ప్రేక్షకుడికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ ఉన్నంతలో బాగానే తీశారు.నటీనటుల విషయానికి వస్తే హీరోగా నటించిన అభినవ్ శౌర్య, హీరోయిన్గా చేసి అనుశ్రీ.. ఆమె సోదరుడి పాత్రలో నరసింహ ఆకట్టుకున్నారు. దేవగుడి వీరారెడ్డిగా రఘు కుంచె ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. టెక్నికల్ టీమ్లో మదిన్ సంగీతం బాగుంది. నిడివి కూడా పర్లేదు. నిర్మాణ విలువలు ఓకే ఓకే. -
నా పక్కన ఇరవై సుమోలు, జీపులు .. గర్వంగా అనిపించేంది: రఘు కుంచె
‘యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను’ అని అన్నారు సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె. ఆయన ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘దేవగుడి’. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో శౌర్య, నరసింహ, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామకృష్ణారెడ్డితో కలిసి రఘు కుంచె మీడియాతో ముచ్చటించారు.నటుడు రఘుకుంచె మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆ పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి గారు ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. నేను జీపులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది. ఈ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేసి పాడాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా’ అన్నారు.దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘ఫ్యాక్షన్ నేపథ్యంలో ఇప్పటిదాకా మనకు చాలా సినిమాలు వచ్చాయి. 30 ఏళ్ల క్రితం ట్రెండ్ అది. అయితే మా మూవీలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నా, అది కొంత వరకే చూపించాం. మెయిన్ గా స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ మీద కథ ట్రావెల్ అవుతుంది. సినిమాకు సెన్సార్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాస్త వయలెన్స్, రొమాంటిక్ సాంగ్ ఉందని రెండు కట్స్ తో ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. నేనే దర్శకుడిని, నిర్మాతను కావడం వల్ల అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాను. సినిమా చూడాలని అనుకునే ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకు టికెట్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. సినిమాకు వీళ్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు. -
అప్పుడు చాలా బాధపడ్డా..ఇప్పుడు గర్వంగా ఉంది: నటి అనుశ్రీ
అభినవ శౌర్య, అనుశ్రీ హీరో హీరోయిన్లుగా, రఘు కుంచె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అభినవ్ శౌర్య మాట్లాడుతూ– ‘‘చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తే, మాలాంటి కొత్త టాలెంట్ బయటకొస్తుంది’’ అన్నారు. ‘‘నిజజీవిత సంఘటన ఆధారంగా షార్ప్ స్క్రీన్ప్లేతో ఈ సినిమా తీశాం. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలోని ప్రధానాంశాలు. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుంది’’ అని చెప్పారు బెల్లం రామకృష్ణా రెడ్డి. ‘‘నటుడిగా నా కెరీర్లో ఎప్పుడూ చేయనటువంటి యాక్షన్ సీక్వెన్స్ను ఈ సినిమా కోసం చేశాను’’ అని తెలిపారు రఘు కుంచె. ‘‘అమ్మాయి సినీ ఇండస్ట్రీలోకి వస్తే ఎంత నెగటివ్గా మాట్లాడతారో తెలుసు. నేనీ సినిమా చేస్తున్నప్పుడు అలా నెగటివ్గా మాట్లాడినవారే, ఇప్పుడు తమ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. ఒకప్పుడు బాధపడిన నేను ఇప్పుడు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాను’’ అన్నారు అనుశ్రీ. సంగీతదర్శకుడు ఎస్కే మదీన్, ఛాయాగ్రాహకుడు లక్ష్మీకాంత్ కనిక మాట్లాడారు. -
తిరుపతిలో దేవగుడి చిత్ర యూనిట్ సందడి
పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం దేవగుడి . ఈ చిత్రం డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుపతి , గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది .ఈ సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో ప్రదర్శించారు. హీరో కావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. Dఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం రామ కృష్ణారెడ్డి.సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు. -
వాస్తవ ఘటనలతో...
అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘దేవగుడి’. బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 19న విడుదల కానుంది. హైదరాబాద్లో నిర్వహించిన ఈ చిత్రం టీజర్ లాంచ్ ఈవెంట్కి శ్రీకాంత్ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘2013లో రామకృష్ణా రెడ్డిగారు నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా? అనేవాడిని. ఆ తర్వాత ఆయన డైరెక్టర్గా మారారు.ఆయన దర్శకత్వంలో వాస్తవ ఘటనలతో రూపొందిన ‘దేవగుడి’ చిత్రం అందర్నీ అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అని చెప్పారు. బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో నిర్మించిన ‘దేవగుడి’తో హిట్ కొట్టబోతున్నాం. స్క్రీన్ ప్లే ఆశ్చర్యపరుస్తుంది. రఘు కుంచెగారు చక్కనిపాత్ర చేశారు’’ అని తెలిపారు. ‘‘మా సినిమాని సక్సెస్ చేయాలి’’ అని అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, కెమెరామేన్ లక్ష్మీకాంత్ కనికే మాట్లాడారు. -
‘దేవగుడి’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
దేవగుడి విజయం సాధించాలి: మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి
‘‘దేవగుడి’ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ బాగున్నాయి. ఈ చిత్రంలోని డైలాగులు మా కడప మాండలికంలో ఉండటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించి, దర్శక–నిర్మాత రామకృష్ణారెడ్డిగారికి, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరు తీసుకు రావాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి చెప్పారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధానపాత్రలుపోషించిన చిత్రం ‘దేవగుడి’.బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆదివారం నిర్వహించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్కి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ విప్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ– ‘‘సినిమాలు వినోదం కోసమే కాదు... ప్రేక్షకులకు మంచి సందేశాన్నిచ్చేలా ఉండాలి’’ అన్నారు. ‘‘నవంబరులో విడుదల కానున్న మా సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అని బెల్లం రామకృష్ణారెడ్డి కోరారు. సంగీత దర్శకుడు షేక్ మదీన్, కెమెరామేన్ లక్ష్మీకాంత్, నటుడు నాగేశ్వరరావుపాల్గొన్నారు. -
దేవగుడిలో 90 శాతం రీపోలింగ్
జమ్మలమడుగు,న్యూస్లైన్: నియోజకవర్గంలోని దేవగుడిలో జరిగిన రీపోలింగ్లో 90శాతం ఓటింగ్నమోదైంది. ఈనెల 7వతేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రీపోలింగ్ నిర్వహించాలని టీడీపీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని స్థానిక అధికారులు తెలిపినా దేవగుడి గ్రామంలోని 80,81,82 పోలింగ్కేంద్రాల్లో రీపోలింగ్కు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం దేవగుడిలోని మూడు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించారు. మూడు పోలింగ్కేంద్రాల్లో 2982 మంది ఓటర్లు ఉండగా 2682 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గతంలో దాదాపు 93శాతం వరకు పోలింగ్జరిగింది. భారీ బందోబస్తు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సొంత గ్రామమైన దేవగుడిలో రీపోలింగ్ జరుగుతుండటంతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆశోక్కుమార్ ఉదయంనుంచి సాయంత్రం వరకు మకాం వేసి పోలింగ్ను స్వయంగా పర్యవేక్షించారు. ఐఏఎస్ కేడర్కు చెందిన సెంట్రల్, రాష్ర్ట పరిశీలకులు ఆర్కే మిశ్రా, హరీంద్ర వీర్సింగ్, ఆర్ఓ రఘునాథరెడ్డి కూడా పోలింగ్ను పర్యవేక్షించారు. ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలతోపాటు 200 మందిపోలీసులు బందోబస్తు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి, ఎంపీ అభ్యర్థి వైఎస్ఆవినాష్రెడ్డి ఆదేవిధంగా టీడీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసుల రెడ్డి పోలింగ్ సరళిని పరశీలించారు. నల్లబ్యాడ్జీలతో నిరసన గ్రామంలో ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరుగకున్నా రీపోలింగ్ నిర్వహించినందుకు నిరసనగా ఓటర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ఓటింగ్లో పాల్గొన్నారు. గ్రామంలో చిచ్చుపెట్టడానికి టీడీపీ నాయకులు ప్రయత్నించారని ఈ సందర్భంగా ఓటర్లు పేర్కొన్నారు.


