-
ఢిల్లీలో శబ్దాలు చేస్తే రూ. లక్ష జరిమానా
న్యూఢిల్లీ : ఢిల్లీలో ఇకపై ఎవరైనా శబ్ద కాలుష్యానికి పాల్పడితే రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా విధిస్తారు. ముందుగా అనుమతి లేకుండా పెళ్లిళ్లు, పండుగల్లో బాణాసంచా పేల్చినా, లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్స్ వాడితే విధించే జరిమానాలను సవరించినట్టుగా ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) వెల్లడించింది. ఈ కొత్త నిబంధనల్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తూ శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) సవరించిన జరిమానాల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటి వేళల్లో 55 డెసిబల్, రాత్రి వేళల్లో 45 డెసిబల్ శబ్దాలకు మాత్రమే అనుమతి ఉంది. పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, కోర్టుల చుట్టూ 100 మీటర్ల పరిధి వరకు సైలెంట్ జోన్లగా ప్రకటించారు. పెళ్లిళ్లు, పండుగల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా కాల్చి శబ్ద కాలుష్యానికి పాల్పడితే మొదటిసారి రూ. 20 వేలు జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే రూ. 40 వేలు, అంతకంటే ఎక్కువగా నిబంధనల్ని ఉల్లంఘిస్తే లక్ష రూపాయల జరిమానా విధిస్తారని డీపీసీసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు వాడితే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. ఆ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకుంటారు. 1,000 కేవీఏకి మించి డీజీ సెట్స్ వినియోగిస్తే రూ.లక్ష, 62.5 నుంచి 1,000 కేవీ మధ్య డీజీ సెట్స్ వాడితే రూ. 25 వేలు, 62.5 కేవీఏ వరకు డీజీ సెట్స్పై రూ.10 వేలు జరిమానా విధించాలని నిబంధనల్ని సవరించారు. -
కాలుష్యకారక పరిశ్రమల్ని అనుమతించకండి
డీపీసీసీని ఆదేశించిన జాతీయ హరిత ధర్మాసనం న్యూఢిల్లీ: యుమునా నదిలోకి కాలుష్యాలను వదిలే పరిశ్రమలను ఆ పరిసర ప్రాంతాల్లో అనుమతించొద్దని జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ)... ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీని ఆదేశించింది. ఆల్ ఇండియా లోక్ అధికార్ సంఘటన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం శుక్రవారం పైవిధంగా స్పందించింది. గంగానదిలోకి కాలుష్యకారకాలను వదులుతున్న చక్కెర మిల్లుపై కొరడా ఝళిపించిన మరుసటి రోజే ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. నదిలోకి నేరుగాగానీ లేదా పరోక్షంగాగానీ కాలుష్యానికి దారితీసే ఎటువంటి పరిశ్రమలను అనుమతించొద్దని జస్టిస్ పి.జ్యోతిమణి నేతృత్వంలోని ధర్మాసనం.... డీపీసీసీని ఆదేశించింది. ‘కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించే సమయంలో కాలుష్య కారక పరిశ్రమలకు అనుమతించకూడదని మేము స్పష్టం చేస్తున్నాం. కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రక్రి యను వీలైనంత త్వరగా పూర్తిచేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టయితు సదరు సంస్థ యజమానిని గుర్తించి అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసే బాధ్యత డీపీసీసీదేనంది. గతంలోనూ ఆదేశాలు పరిశ్రమలను త నిఖీచేసిఅవి కాలుష్యాలను వదులుతున్నాయా లేదా అనే విషయాన్ని గుర్తించాలంటూ జాతీయ హరిత ధర్మాసనం గతంలోనూ డీపీసీసీని ఆదేశించింది. నిబంధనలను పాటించని పరిశ్రమలపై న్యా యపరమైన చర్యలు తీసుకోవాలని కూడా సెప్టెంబర్ 10న ఎన్జీటీ.... డీపీసీసీని ఆదేశించిన సంగతి విదితమే. ఇందుకు స్పందించిన డీపీసీసీ...వజీర్పూర్ ప్రాంతంలోని అనేక పరిశ్రమలను తనిఖీ చేసింది. ఈ పరిశ్రమలన్నీ యుమనా నదిలోకి నేరుగా కాలుష్యకారకాలను వదులుతున్నట్టు గుర్తించింది. దీంతో ఆయా పరిశ్రమలకు మూసివేత నోటీసులను జారీచేసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement