breaking news
deccan cement factory
-
కొండా సుస్మిత ఎపిసోడ్.. స్పందించిన రోహిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూబ్లీహిల్స్లో ఉన్న మంత్రి కొండా సురేఖ(konda Surekha) ఇంటి పోలీసులు వెళ్లడంపై బుధవారం రాత్రి హైడ్రామా నెలకొంది. ఈ సందర్బంగా పోలీసులు, డెక్కన్ సిమెంట్, రోహిన్ రెడ్డిపై(Congress DCC Rohin Reddy) కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత(Konda Sushmitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్పై తాజాగా ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి స్పందించారు.కొండా సుస్మిత పటేల్ ఆరోపణలను రోహిన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘నాపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. డెక్కన్ సిమెంట్స్ అంశం చెప్తే నేను ఇలాంటి వాటిలో వేలు పెట్టను అని సుమంత్కి ముందే చెప్పి పంపేశాను. నేను ఎలాంటి అసాంఘిక పనుల్లో తల దూర్చను.. ఈ విషయంలో నా ప్రమేయం లేదు’ అని చెప్పుకొచ్చారు.సుస్మిత ఆరోపణలు..ఇక, అంతకుముందు.. కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సుస్మిత మాట్లాడుతూ.. సుమంత్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు ఇచ్చారని తెలిసింది. డెక్కన్ సిమెంట్ వాళ్లను సుమంత్ గన్తో బెదిరించారని ఫిర్యాదు ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో అరెస్టు చేసేందుకు వచ్చామని పోలీసులు తెలిపారు. ఆధారాలు ఉంటే చూపించాలని పోలీసులను అడిగాను. ఆధారాలు అడిగితే వరంగల్ నమోదైన మరో కేసులో అరెస్టు చేసేందుకు వచ్చామని అన్నారు. మమ్మల్ని పార్టీలోంచి బహిష్కరించేందుకు చూస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రోహిణ్ రెడ్డి కూడా ఈ ఎపిసోడ్లో ఉన్నారని ఆరోపించారు. ఆయన వెనుక ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉందా? అంటూ ప్రశ్నించారు. సుమంత్ను అడ్డం పెట్టుకుని తన తల్లిని అరెస్టు చేసేందుకే మహిళా పోలీసులు కూడా వచ్చారంటూ కామెంట్స్ చేశారు.బీసీ లీడర్లయిన తమ తల్లిదండ్రుల్ని పార్టీ నుంచి బహిష్కరించేందుకు యత్నిస్తున్నారని ఇదంతా రెడ్డి నాయకులు చేస్తున్న కుట్రగా తెలుస్తోందని కొండా సుస్మిత ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రోహిణ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ నక్సలైట్ అయిన తన తండ్రికి హాని ఉన్నప్పటికీ బందోబస్తును తొలగించారని అలాంటప్పుడు సీఎం సోదరులకు మాత్రం గన్మెన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
నేటి నుంచి జాన్పహాడ్ దర్గా ఉర్సు
నేరేడుచర్ల, న్యూస్లైన్: మత సామరస్యానికి ప్రతీక అయిన నేరేడుచర్ల మండలంలోని జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటినుంచి మూడు రోజులపాటు జరగనుంది. అందుకోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఉర్సులో భాగంగా గురువారం గుసుల్ షరీఫ్ నిర్వహిస్తారు. దర్గాలోని సైదులు బాబా సమాధులను గంధంతో, నూతన వస్త్రాలు (దట్టీలు), పూలదండలతో అలంకరిస్తారు. దర్గాలో కొవ్వొత్తులతో దీపాలు వెలి గించి బాబాకు నైవేద్యం సమర్పిస్తారు. 24వ తేదీన హైదరాబాద్లోని వక్ఫ్బోర్డు కార్యాలయం నుంచి పవిత్ర గంధాన్ని జాన్పహాడ్లోని సందల్ఖానాకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. పవిత్ర గంధాన్ని గుర్రంపై ఊరేగించడం ఇక్కడ అనవాయితీ. ఉదయం 9:30గంటలకు పవిత్ర గంధాన్ని సందల్ఖానా నుండి గుర్రంపై జాన్పహాడ్ పురవీధులలో ఊరేగించి నమాజ్ చేసే సమయానికి దర్గాకు తీసుకువస్తారు. నమాజ్ పూర్తయిన అనంతరం గంధాన్ని బాబా సమాధులపైకి ఎక్కిస్తారు. అనంతరం దర్గాకు వచ్చిన భక్తులకు గం ధాన్ని పంచుతారు. ఈ పవిత్ర గంధాన్ని తాకడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా పేద భక్తులకు వక్ఫ్బోర్డు ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తారు. 25వ తేదీన బాబా సమాధుల వద్ద దీపాలు వెలిగించి (చిరాగా) నైవేద్యం (ఫాతెహా) సమర్పిస్తారు. దింతో ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి. ఉర్సుకు సర్వం సిద్ధం... గురువారం నుండి మూడు రోజుల పాటు జరగనున్న జాన్పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు వక్ఫ్బోర్డు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉర్సు సందర్భంగా భక్తులకు మంచినీటి సరఫరా చేయడానికి దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ట్యాంకర్లను సిద్ధం చేసింది. ఎస్బీహెచ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటుచేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో దర్గా సమీపంలో భక్తులకు సేవలందించడానికి స్టాళ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్య లేకుండా మిర్యాలగూడ డీఎస్పీ సుభాష్చంద్రబోసు హుజూర్నగర్ సీఐ పి. బలవంతయ్యల ఆధ్వర్యంలో ఏడుగురు సీఐలు, 27గురు ఎస్ఐలు, 27గురు ఏఎస్ఐలు, 150మంది పోలీసులు, 135మంది హోంగార్డులు, 21మంది మహిళా కానిస్టేబుళ్లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉర్సుకు వచ్చే వాహనాల పార్కింగ్ కోసం దామరచర్ల రోడ్డుకు పెట్రోలు బంకు పక్కన, నేరేడుచర్ల రోడ్డుకు పెట్రోలు బంకు పక్కన స్థలాన్ని కేటాయించారు. మిర్యాలగూడ డిపో నుండి 25 ఆర్టీసీ బస్సులను దామరచర్ల మీదుగా జాన్పహాడ్కు.. కోదాడ నుండి నేరేడుచర్ల మీదుగా జాన్పహాడ్ దర్గాకు 25 బస్సులను నడుపుతున్నట్లు మిర్యాలగూడ డిపో మేనేజర్ గిరిష్కుమార్ తెలిపారు.