death hoax
-
ఆ నవ్వుల రారాజు నిక్షేపంగా ఉన్నాడు
డైలాగులు లేకుండా స్లాప్స్టిక్ కామెడీ(ఫిజికల్ మూమెంట్స్), తన మైమ్ యాక్టింగ్తో నవ్వులు పండించి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు నటుడు రోవాన్ ఎట్కిన్సన్. తన మెస్మమరైజింగ్ యాక్టింగ్తో మిస్టర్ బీన్ క్యారెక్టర్ను ఒక ఐకానిక్ క్యారెక్టర్గా తీర్చిదిద్దడంతో పాటు నవ్వుల రారాజు ట్యాగ్ లైన్ దక్కించుకున్నాడు. అలాంటి రోవాన్ చనిపోయాడంటూ ఓ వార్త ఫేస్బుక్లో.. అది కూడా మిస్టర్ బీన్ ఫేస్బుక్ పేజీ నుంచే విపరీతంగా షేర్ అయ్యింది. బ్రిటిష్ యాక్టర్ రోవాన్ ఎట్కిన్సన్ అలియాస్ మిస్టర్ బీన్ చనిపోయాడంటూ మే 29న వార్త ఫేస్బుక్లో స్ప్రెడ్ అయ్యింది. అది మిస్టర్బీన్ ఫేస్బుక్ పేజీ కావడంతో ఆ వార్తను వేల మంది షేర్ చేస్తారు. తీరా ఆరా తీస్తే తేలింది ఏంటంటే.. అది బోగస్ పేజీ అని. చాలాకాలం నుంచి రన్ అవుతుండడంతో ఆ పేజీని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ వార్త, ఆ పేజీ ఫేక్ అని తెలియగానే ఆ పోస్ట్పై కొందరు తిడుతూ కామెంట్లు పెట్టారు. దీంతో ఆ పేజీ నిర్వాహకులు ఆ పోస్ట్ను పేజీ నుంచి డిలీట్ చేశారు. కాగా, నైంటీస్లో మిస్టర్ బీన్ క్యారెక్టర్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు ఎట్కిన్సన్. పోగో ఛానెల్ ద్వారా మిస్టర్ బీన్ మన టీవీ ఆడియొన్స్కు రీచ్ అయ్యింది కూడా. 66 ఏళ్ల రోవాన్ చనిపోయాడంటూ వార్తలు రావడం ఇదేం కొత్త కాదు కూడా. 2012, 2013, 2015, 2016, 2017, 2018.. ఇక ఇప్పుడు ఆయన చావుపై ఫేక్ న్యూస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. కాగా, రోవాన్ ఎట్కిన్సన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇద్దరూ క్లాస్మేట్స్ కూడా. మరిన్ని హాలీవుడ్ వార్తల కోసం క్లిక్ చేయండి -
జైట్లీ అనారోగ్యంపై అవన్నీ వదంతులే
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు అబద్ధం, నిరాధారాలని కేంద్రం కొట్టిపారేసింది. ఇలాంటి పుకార్లకు దూరంగా ఉండాలని మీడియాను కోరింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం, తదితర కీలక పరిణామాల నేపథ్యంలో అరుణ్ జైట్లీ బయటకు కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న ఊహాగానాలను ప్రభుత్వ ప్రతినిధి సితాన్షు కర్ ట్విట్టర్లో ఖండించారు. ‘కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఒక వర్గం మీడియాలో వస్తున్న కథనాలు అసత్యం, నిరాధారాలు. ఇలాంటి వదంతులకు మీడియా దూరంగా ఉండాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. అయితే, జైట్లీని సంప్రదించేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్లో ఉండే అవకాశాలు లేవని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్లో చేరారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయినప్పటికీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. ‘నా మిత్రుడు జైట్లీ అనారోగ్యంపై వస్తున్న వార్తలన్నీ వదంతులు. శనివారం సాయంత్రమే ఆయన్ను కలిశాను. ఆయన కోలుకుంటున్నారు. తన మంత్రిత్వ శాఖకు చెందిన ఐదుగురు కార్యదర్శులతో శుక్రవారం జైట్లీ తన నివాసంలో సమావేశం నిర్వహించారని అధికార వర్గాలు తెలిపాయి. -
‘నన్ను చంపినవారిని పట్టించండి’
మాస్కో: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా మాజీ సారథి డీగో మారడోనాకు చిర్రెత్తుకొచ్చింది. అర్జెంటీనా- నైజీరీయా మ్యాచ్ అనంతరం స్వల్ప అస్వస్థతకు గురైన ఈ దిగ్గజం.. స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పోందిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే మారడోనా గుండె పోటుతో మరణించాడంటూ కొందరు పుకార్లు సృష్టించారు. సోషల్ మీడియాలో పోస్ట్లతో హల్ చల్ చేశారు. అవికాస్త వైరల్ కావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. స్పందించిన దిగ్గజం.. ‘మరణ వార్త’పై మారడోనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించారు. చనిపోలేదని చెప్పుకోవాల్సిన పరిస్థితిని కొందరు కల్పించారు అని మండిపడ్డారు. ఇక అంతటితో ఆగకుండా తనను చంపిన వారిని(చనిపోయినట్టు మెసేజ్ చేసినవారిని) పట్టించినవారికి పది వేల అమెరికన్ డాలర్లు బహుమతిగా ఇస్తానని ఆయన ప్రకటించారు. మరోవైపు ఆ కథనాలు ప్రచురించిన వెబ్సైట్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని మారడోనా వ్యక్తిగత న్యాయవాది తెలిపారు. ఉత్కంఠభరితంగా సాగిన అర్జెంజీనా- నైజీరియా మ్యాచ్ సందర్భంగా మారడోనా ప్రవర్తించిన తీరు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ దిగ్గజ ఫుట్బాలర్ ప్రేక్షకులను గేలి చేస్తూ చేతితో అసభ్యకర సంజ్ఞలు చేయండపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో మారడోనాపై కోపంగానే కోందరు ఆకతాయిలు ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
మా అమ్మ బతికే ఉంది: నటి
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ మరణ వార్త గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కుమార్తె, నటి కమ్ మోడల్ అయిన తన్యా మద్వాని స్పందించారు. ‘మా అమ్మ గురించి ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె చనిపోయారంటూ వార్తలు వస్తున్నాయి. అది రూమర్. ఆమె బతికే ఉంది. ఆమె ఆరోగ్యవంతంగా ఉన్నారు. నాతోపాటే ఉంటూ షాపింగ్లు చేస్తూ.. తన పనులను ఆమె చేసుకుంటున్నారు అని తన్యా వివరణ ఇచ్చారు. ఓ వీడియో సందేశాన్ని, ముంతాజ్ ఫోటోను తన్యా తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. 70 ఏళ్ల ముంతాజ్.. చైల్డ్ ఆర్టిస్ట్గా సోనె కి చిదియాతో కెరీర్ను ప్రారంభించారు. దో రాస్తే.. బంధన్.. మేలా, అపరాధ్, నాగిన్ తదితర చిత్రాలతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఖిలోనా(1970) చిత్రంలో వేశ్య పాత్రకు ప్రశంసలతోపాటు.. ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు దక్కింది. 1977 తర్వాత చిత్రాలకు దూరమైన ఆమె.. చివరగా 1990లో ఆందియాన్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె కూతురితోపాటు ఇటలీలో ఉన్నట్లు తెలుస్తోంది. Rumor about my mother’s death ! Not true. #mumtaz #bollywood #press #actress #mumtazactress A post shared by Tanya Madhvani (@tanyamadhvani) on Apr 28, 2018 at 2:57am PDT -
దావూద్ రైట్ హ్యాండ్.. రకరకాల కథలు
సాక్షి, న్యూఢిల్లీ : దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు, గ్యాంగ్స్టర్ ఛోటా షకీల్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దావూద్ కుడి భుజంగా మెదులుతూ దశాబ్దాలుగా డీ-గ్యాంగ్ కార్యకలాపాలను షకీలే చూసుకుంటున్నాడు. అయితే అతను ఇప్పుడు ప్రాణాలతో లేడనేది దాని సారాంశం. దీనికి రకరకాల కథనాలు వినిపిస్తుండగా.. అందులో ఓ కోణం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. పాక్ నిఘా సంస్థ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) అతన్ని ప్రాణాలు తీసిందంట. షకీల్కు, దావూద్కు మనస్ఫర్థలు వచ్చాక.. వారి మధ్య సయోధ్య కోసం ఐఎస్ఐ మధ్యవర్తిత్వం వహించిందని... అయితే అది విఫలం కావటంతో షకీల్ ఏక్షణానైనా తమ దేశానికి వ్యతిరేకంగా మారి భారత్కు సహకరిస్తాడన్న ఉద్దేశంతోనే చంపిందన్నది ఆ కథనం సారాంశం. చంపేశాక శవాన్ని సీ-130 రవాణా విమానంలో కరాచీకి తరలించి. గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారని.. ఈ విషయం ప్రపంచానికి తెలీకుండా చాలా జాగ్రత్త పడ్డారంట. ఇక షకీల్ కుటుంబ సభ్యులను లాహోర్లోని ఓ ఇంటికి తరలించారని... దావూద్కు కూడా ఈ సమాచారం ఆలస్యంగా చేరిందనేది అందులో పేర్కొని ఉంది. ఇక మిగతా కథల్లో.. జనవరి 6, 2017న ప్రత్యర్థులు అతన్ని చంపారని.. ఈ మేరకు అతని గ్యాంగ్కు చెందిన బిలాల్కు ముంబైకి చెందిన ఓ గ్యాంగ్ స్టర్కు మధ్య జరిగిన ఆడియో సంభాషణల టేపు ఒకటి చక్కర్లు కొడుతోంది. గుండెపోటుతో మరణించాడనేది మరో కథనం వినిపిస్తోంది. మరో కథలో అతను ప్రాణాలతోనే ఉన్నాడని.. దావూద్తో సంబంధాలను తెగదెంపులు చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాడని చెబుతున్నారు. కానీ, గతంలో ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో షకీల్ మాట్లాడుతూ.. తన తుది శ్వాస వరకు భాయ్(దావూద్) తోనే ఉంటాడని చెప్పటం చూశాం. ఏది ఏమైనా ప్రస్తుతం అతని జాడ అంతుచిక్కకపోవటంతో అతను బతికున్నాడా? లేదా? అన్న విషయంపై భారత నిఘా వర్గాల్లో కూడా స్పష్టత కొరవడింది. గతంలో దావూద్ విషయంలో కూడా ఇలాగే అనారోగ్యం.. చావుబతుకుల్లో ఉన్నాడంటూ వార్తలు రావటం చూశాం. దావూద్ కోసం భారత్ మాస్టర్ ప్లాన్ ఇది కూడా చదవండి -
నేను బతికే ఉన్నా: సింగర్ సుశీల
-
నేను బతికే ఉన్నా: సింగర్ సుశీల
సాక్షి, సినిమా : లెజెండరీ గాయని పీ సుశీల క్షేమంగా ఉన్నారు. ఆరోగ్యం క్షీణించటంతో గురువారం రాత్రి ఆమె చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయ్యింది. దీంతో పలువురు నివాళులర్పిస్తూ తమ సంతాపం తెలియజేశారు. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆమె ఓ వీడియో సందేశంలో తాను పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని.. శనివారం తిరిగి ఇండియాకు వస్తానని ఆమె అందులో చెప్పారు. మరోవైపు కోలీవుడ్కు చెందిన పబ్లిక్ రిలేషన్ అధికారిణి రియాజ్ అహ్మద్ కూడా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందంటూ ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమె డల్లాస్లో ఉన్నట్లు ఆయన తెలియజేశారు. 81 ఏళ్ల సుశీల దక్షిణా భాషలతోపాటు హిందీ, సింహళంలో కూడా పాటలు పాడిన విషయం తెలిసిందే. -
నేను బతికే ఉన్నా : బాలీవుడ్ గాయకుడు
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తాను మరణించినట్లు ప్రసారమైన వార్తలపై ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఇన్దీప్ భక్షి స్పందించారు. తనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, అవన్నీ పుకార్లే అని ఆయన చెప్పారు. రోడ్డు ప్రమాదంలో భక్షి మరణించినట్లు సోషల్ మీడియాలో గురువారం విస్తృతంగా ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయం తన మిత్రుల ద్వారా తెలుసుకున్న భక్షి దీనిపై వివరణ ఇచ్చారు. తాను ఎటువంటి రోడ్డు ప్రమాదానికి గురికాలేదని, క్షేమంగా ఉన్నట్లు ఇన్దీప్ ప్రకటించారు. ఇటువంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని ఆయన అభిమానులకు సూచించారు. తన కుటుంబీకులు ఈ విషమయై తీవ్రంగా మదనపడినపట్లు చెప్పారు. ‘సాటర్డే..సాటర్డే’, ‘కాలచస్మా’ లాంటి హిట్ పాటలకు భక్షి నేపథ్యగానం అందించారు.