-
బాల్య వివాహానికి బ్రేక్
ధర్మసాగర్ : తమ కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణరుుంచిన తల్లిదండ్రులు ఆదివారం నిశ్చితార్థం చేసేందుకు సిద్ధం కాగా అంగన్వాడీ కార్యకర్తలు, స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కూతాటి సారయ్య, రజిత దంపతుల కూతురు సునీత(14)కు కరీంనగర్ జిల్లా భీమదేవపల్లి మండలం ఎర్రబెల్లికి చెందిన యువకుడితో వివాహం చేయూలని కుటుంబ సభ్యులు ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబ సభ్యులు ధర్మసాగర్లో పూలుపండ్ల కార్యక్రమం నిర్వహిస్తుండగా అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు చేరుకుని అడ్డుకున్నారు. బాల్య వివాహం చేయడం సరికాదని వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అమ్మాయి మేజర్ అయ్యాకే వివాహం చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులతో హామీ తీసుకున్నారు. సర్పంచ్ కే.రజిత, అంగన్వాడీలు వసంత, బేబిరాణి, మహిళలు జుబేదా బేగం, రాధిక పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల బాధ చూడలేక కుమారుడి ఆత్మహత్య
దుబ్బాక : కుమార్తె పెళ్లి, వ్యవసాయ పొలంలో వేసిన బోర్లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో మదనపడుతున్న తల్లిదండ్రుల బాధ చూడలేక కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన దుబ్బాక మండలం నగరం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కోనాపురం రాజవ్వ, దుబ్బ రాజయ్య దంపతులకు స్వామి, రమేష్, చామంతి సంతానం. స్వామికి పెళ్లి కావడంతో వేరుగా ఉంటున్నాడు. ఏడాది కింద కుమార్తె చామంతికి అప్పు చేసి వివాహం చేశారు. రమేష్ సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే సెలవు దినాల్లో అప్పుడప్పుడూ తండ్రికి వ్యవసాయంలో చేదోడు, వాదోడుగా ఉండేవాడు. కాగా రాజయ్య తనకున్న 1.20 ఎకరాల్లో రెండు బోర్లు వేశాడు. చుక్క నీటి బొట్టు రాలేదు. సాగు చేసిన వరి చేను కూడా నీళ్లు లేక కళ్ల ముందే ఎండిపోయింది. కుమార్తె వివాహానికి, వేసిన బోర్లకు కలిసి రూ. 2 లక్షల వరకు అప్పు అయ్యింది. వరి పంట చేతికి వస్తే అప్పు తీర్చ వచ్చన్న దీమా కూడా లేకుండా పోయింది. దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో రాజవ్వ, రాజయ్య దంపతులు ఇంట్లో తరచూ మదనపడుతుండే వారు. ఈ విషయాన్ని గమనించిన కుమారుడు రమేష్ (21) కలత చెందాడు. ఈ మేరకు శుక్రవారం ఉదయం పది గంటల ప్రాంతంలో వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టంత ఎదిగిన కొడుకు కళ్లముందే కూలిపోవడంతో తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. అప్పుల పాలైన రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ వార్డు సభ్యులు శ్రీనివాస్, ఎల్కపల్లి రాంచంద్రం, ఉడత మల్లేశం, సిద్దిరాములు ప్రభుత్వాన్ని కోరారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement