breaking news
cooperation minister
-
ఉగ్ర దుర్బేధ్యంగా భారత్ను నిర్మిస్తా
న్యూఢిల్లీ: భారత దేశాన్ని అజేయ శక్తిగా మలుస్తానని నూతన హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మంగళవారం ఢిల్లీలో హోం శాఖ కార్యాలయంలో అమిత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ‘ దేశం, దేశ ప్రజల భద్రతే నాకు అత్యున్నతం. మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని భద్రత విషయంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం, నక్సల్ ప్రభావం బారిన పడకుండా దుర్బేధ్యంగా మారుస్తా’ అని అన్నారు. మరోసారి కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాలు.. భారతీయ న్యాయ సంహిత–2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత–2023, భారతీయ సాక్ష్యా అధినియం–2023ల సమర్థ అమలును అమిత్షా పర్యవేక్షించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన కేంద్ర మంత్రులు మంత్రులుగా ప్రమాణంచేసిన నేతలు మంగళవారం ఢిల్లీలో తమతమ శాఖల కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి కర్తవ్య నిర్వహణ మొదలెట్టారు. కొందరు నేతలు పూజాకార్యక్రమాలు చేసి మంత్రి కుర్చిల్లో కూర్చుంటే కొందరు కమలదళ నినాదాలు చేస్తూ కుర్చిల్లో ఆసీనులయ్యారు. జైశంకర్ భారత విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఆరోగ్య శాఖ మంత్రిగా, అశ్వనీ వైష్ణవ్ రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కిరెన్ రిజిజు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిగా ప్రహ్లాద్ జోషి, విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్, పర్యావరణ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రిగా ఎల్జేపీ(రాంవిలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తన కుటుంబసభ్యుల సమక్షంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులూ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.మహిళా మంత్రులూ.. వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తానని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ అన్నపూర్ణాదేవి చెప్పారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా అనుప్రియా పటేల్, క్రీడలు, యువజన వ్యవహారాల సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రిగా శోభా కరంద్లాజె, మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సావిత్రీ ఠాకూర్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా నిమూబెన్ బంభానియా బాధ్యతలు స్వీకరించారు. -
మంత్రి కంట్లో నల్లసిరా
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ధన్గర్ల ఆందోళన రోజురోజుకు తీవ్రమవుతోంది. ధన్గర్లు శుక్రవారం చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్ర సహకారశాఖ మంత్రి హర్షవర్ధన్ పాటిల్ కంట్లో ఓ ఆందోళనకారుడు నల్లసిరా పోయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పుణే జిల్లా, ఇంద్రాపూర్లోని భిగవణ్లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకెళ్తే... తమను షెడ్యూల్డ్ ట్రైబల్స్(ఎస్టీ) జాబితాలో చేర్చాలంటూ కొన్నిరోజులుగా ధన్గర్లు రకరకాల రూపాల్లో తమ డిమాండ్ను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా పుణేలోని ఇంద్రాపూర్ తాలూకా, భిగవణ్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి హర్షవర్ధన్ పాటిల్ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ధన్గర్ సామాజికవర్గానికి చెందిన కొందరు అక్కడకు చేరుకున్నారు. కార్యక్రమం ముగిసేంతవరకు వేచి చూసి, తిరిగి వస్తుండగా ఆయన కారును చుట్టుముట్టారు. తమను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు చొరవ చూపాలంటూ నినాదాలు చేశారు. వారితో మంత్రి మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి మంత్రి ముఖంపై నల్లసిరా పోశాడు. ఒక్కసారిగా సిరా గుమ్మరించడంతో అది మంత్రి కంట్లో పడింది. దీంతో మంత్రి కంటికి గాయమైంది. సిరాలో యాసిడ్ ఉంటుందని, ఫలితంగానే ఇబ్బంది కలిగి ఉండవచ్చని స్థానిక వైద్యుడొకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రిని అక్కడ నుంచి పంపేశారు. ఇరువర్గాల వాగ్వాదం.. తమ పార్టీకి చెందిన మంత్రిపై సిరా పోయడంతో ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులైన కాంగ్రెస్ కార్యకర్తలు, మంత్రి అనుచరులు ఆందోళనకారులపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంలో ఇరువర్గాలు కొట్టుకున్నారు కూడా. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు కొనసాగాయి. భిగవణ్ బంద్కు కాంగ్రెస్ పిలుపు... మంత్రి కంట్లో సిరా పోయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రాపూర్, భిగ్వణ్ బంద్కు పిలుపునిచ్చారు. అనంతరం పుణే-ఇంద్రాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైనే భైటాయించి నినాదాలు చేశారు. దీంతో ఈ ర హదారిపై దాదాపు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.