breaking news
compact car
-
ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది. (ఇదీ చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) ఒక్క ఛార్జ్తో 150-200 కిలోమీటర్ల రేంజ్తో కామెట్ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్తో అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది. -
కియా సోనెట్ ఆగయా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ‘సోనెట్’ కాంపాక్ట్ ఎస్యూవీని శుక్రవారం భారత్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ 1.0 టి–జీడీఐ, స్మార్ట్స్ట్రీమ్ పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ డబ్ల్యూజీటీ, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ ఇంజన్ ఆప్షన్స్తో మొత్తం 17 వేరియంట్లలో ఈ కారును రూపొందించింది. అయిదు ట్రాన్స్మిషన్ రకాలు ఉన్నాయి. ధర వేరియంట్నుబట్టి ఎక్స్షోరూంలో రూ.6.71 లక్షలు మొదలుకుని రూ.11.99 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల లోపు ఉండే సోనెట్.. హ్యూందాయ్ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, టాటా మోటార్స్, నెక్సన్, హోండా డబ్ల్యూఆర్–వి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉన్న కియా అత్యాధునిక ప్లాంటులో సోనెట్ తయారు కావడం విశేషం. 70 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయనున్నారు. ఇవీ సోనెట్ విశిష్టతలు.. ఫైవ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్స్, సెవెన్ స్పీడ్ డీసీటీ, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్ స్పీడ్ స్మార్ట్స్ట్రీమ్ ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాల్లో ఇది లభిస్తుంది. తొలిసారిగా సెగ్మెంట్లో 30కి పైగా కొత్త ఫీచర్లను జోడించినట్టు కంపెనీ ప్రకటించింది. నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్తో 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణకు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్, సబ్ వూఫర్స్తో బోస్ ప్రీమియం సెవెన్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, యువో కనెక్ట్, స్మార్ట్ కీతో రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఆటోమేటిక్ మోడళ్లకు మల్టీ డ్రైవ్, ట్రాక్షన్ మోడ్స్, కూలింగ్ ఫంక్షన్తో వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జర్ ఏర్పాటు ఉంది. ఎనమిది మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగుల్లో సోనెట్ లభిస్తుంది. ఆరు ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ వంటివి పొందుపరిచారు. సెగ్మెంట్లో తొలిసారిగా డీజిల్ సిక్స్–స్పీడ్ ఆటోమేటిక్, ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రవేశపెట్టారు. మైలేజీ వేరియంట్నుబట్టి 18.4 నుంచి 24.1 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. తొలి ఏడాది 1,50,000 యూనిట్లు.. కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ విభాగంలో సోనెట్ సంచలనం సృష్టిస్తుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా కారు సోనెట్కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, 25,000 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని అన్నారు. తొలి రోజే 6,500 బుకింగ్స్ నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 1,000 వస్తున్నాయని గుర్తు చేశారు. సరఫరా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని, ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో రెండవ షిప్ట్ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. కరోనా ఉన్నప్పటికీ ఈ కారు ప్రవేశపెట్టడం వెనుక ఉద్యోగుల కఠోర శ్రమ ఉందన్నారు. ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్లు అని గుర్తుచేశారు. భారత్ను తయారీ హబ్గా చేసుకున్నామన్నారు. దేశీయం గా తొలి ఏడాది ఒక లక్ష యూనిట్ల సోనెట్ కార్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఈడీ టే జిన్ పార్క్ పేర్కొన్నారు. అలాగే 50,000 యూనిట్లు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. భారత్లో కనెక్టెడ్ కార్స్ విభాగంలో 60,000 పైచిలుకు యూనిట్ల మైలురాయిని అధిగమించిన తొలి కంపెనీగా నిలిచినట్టు కియా తెలిపింది. -
4.55 లక్షల ధరతో మార్కెట్ లోకి ఫియట్ బుల్లికారు!
న్యూఢిల్లీ: మార్కెట్ లో ఎదురవుతున్న పోటీని ఎదుర్కోవడానికి పుంటో ఏవో పేరుతో మార్కెట్ లోకి చిన్నకారును ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా విడుదల చేసింది. పుంటో ఏవో కారు విలువ 4.55 లక్షల నుంచి 7.19 (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర) లక్షల వరకు ఉంటుందని ఫియట్ కంపెనీ వెల్లడించింది. మారుతి స్విఫ్ట్, హుందాయ్ ఐ20, హోండా బ్రియోలకు పోటీగా డీజిల్, పెట్రోల్ వెర్షన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. డీజీల్ వెర్షన్ 5.27 లక్షల నుంచి ప్రారంభమై.. 7.19 లక్షల వరకు ఉంటుందని ఫియట్ ఇండియా అధ్యక్షుడు, ఎండీ నాగేశ్ బసవ్వన్ హల్లీ తెలిపారు. కస్టమర్ల అవసరాలకు దృష్టిలో ఉంచుకుని, భారతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కార్లను డిజైన్ చేస్తున్నామని ఫియట్ కంపెనీ తెలిపింది. ఫియట్ కంపెనీకి దేశవ్యాప్తంగా 93 పట్టణాల్లో 116 అవుట్ లెట్లు ఉన్నాయని నాగేశ్ తెలిపారు.