breaking news
community building
-
సూపర్ సప్పర్.. నగరంలో కొత్త తరహా కల్చర్ హవా
ఓ ఆదివారం ఆహ్లాదకరమైన సాయంత్రపు వేళ, తరచూ వెళ్లే కేఫ్లకు బదులు, ఓ అపరిచిత వ్యక్తి ఇంటికి వెళ్లడం, ఎప్పుడూ కలవని మరికొందరితో కలిసి టేబుల్ పంచుకోవడం ఎలా ఉంటుంది?.. ఈ ఊహ నగరంలో వాస్తవరూపం దాలుస్తోంది.. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో ట్రెండ్గా మారి ఇప్పుడిప్పుడే నగరంలోనూ అంకురిస్తున్న సప్పర్ క్లబ్లు రేపటి అనుభవాలను మాత్రమే కాదు కొత్త స్నేహాలను తీర్చిదిద్దే వేదికలుగా అవతరిస్తున్నాయి. రుచికరమైన ఆహారం ప్రశాంతమైన సంభాషణ, కొత్త రుచులను కనుగొనడం, ఒత్తిడి లేకుండా ముచ్చట్లు.. వీటన్నింటినీ అపరిచితులతో పంచుకోవడమే సప్పర్ క్లబ్స్ ప్రత్యేకత. – సాక్షి, సిటీబ్యూరో నగరంలో విస్తరిస్తున్న కొత్త తరహా కల్చర్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న ఈ క్లబ్స్ ప్రత్యేకమైన అనుభవం కోసం అతిథులను ఆహ్వానిస్తున్నాయి. ‘సప్పర్ క్లబ్లు తరచూ ఇళ్లలో నిర్వహించే సన్నిహిత భోజన అనుభవాలు. ఇక్కడ ఆహారంతోపాటు సంభాషణలు, పరిచయాలే ప్రధానం. రెస్టారెంట్ల మాదిరిగా స్థిరమైన మెనూ ఉండదు. వ్యక్తులు తమ కథలు చెప్పడం, కాలానుగుణ రుచులతో కొత్త వ్యక్తులను కలవడంపై మాత్రమే దృష్టి పెడతారు. తద్వారా వారు వండిన వంటకాలను కలిసి తినడం, భాగస్వామ్య టేబుల్పై కనెక్ట్ అవ్వడంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.’ అని సప్పర్ క్లబ్స్ నిర్వహించే జైపూర్కు చెందిన సీమా సేథి అంటున్నారు. ఈ కొత్త ట్రెండ్కు సోషల్ మీడియా ప్రధాన ప్రేరకంగా మారింది. ప్రతి ఒక్కరూ తాము పంచుకోగల ప్రత్యేకమైన అనుభవాన్ని కోరుకుంటుండడం సప్పర్ క్లబ్స్కు ఊపునిస్తోంది. ‘ఎప్పుడూ కలవని వ్యక్తులతో ఓ ఇంట్లో జరిగే విందు పార్టీలో ఉన్నట్లు ఊహించుకోండి.. సప్పర్ క్లబ్.. కేవలం విందు కాదు.. ఇది ఒక వైబ్.. ఆకర్షణ వ్యక్తిగతంగా లీనమయ్యేలా చేస్తుంది. సాధారణ విందు విహారయాత్రకు భిన్నంగా ఉంటుంది.’ అని ముంబైలో సప్పర్ క్లబ్ హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు ప్రాచి గుప్తా అంటున్నారు. హోమ్లీగా.. జాలీగా.. ‘చెఫ్ తాజాగా క్యూరేట్ చేసిన ఆహారాన్ని తినాలనుకునే డైనర్లలో ఈ ఫార్మాట్ ఆదరణ పొందుతోంది. డైనర్లు ఒకే టేబుల్ వద్ద కూర్చునే కుటుంబ–శైలి విందు కావడం కూడా ఆకర్షణను పెంచుతుంది.’ అని పుణెకు చెందిన యాంపిల్ సప్పర్ క్లబ్ వ్యవస్థాపకురాలు చెఫ్ కౌసల్య పాటిల్ అన్నారు. నేటి తరం ప్రజలు కేవలం భోజనం కంటే ఎక్కువ కోరుకుంటున్నారని హౌస్ ఆఫ్ మాలా సహ వ్యవస్థాపకురాలు సలోని గుప్తా అభిప్రాయపడ్డారు. నిర్ణీత మెనూ లేకపోవడం లాంటి ప్రత్యేకతలు సప్పర్ క్లబ్ల వైపు ఆకర్షించే బలమైన కారకాలుగా సీమా సేథి అంగీకరిస్తున్నారు. ‘ఇది ఆ నిర్దిష్ట సాయంత్రం కోసం మాత్రమే రూపొందిన అనుభవం..వ్యక్తిగతమైనది’ అని ఆమె చెప్పారు. ‘కోవిడ్–19 టైమ్లో దాదాపు రెండేళ్లు ఒంటరిగా ఇంట్లోనే గడిపాము. దీంతో మానవ సంబంధాలను పెంచుకోవడంపై ఆసక్తి పెరిగింది.’ అని గురుగ్రామ్లో బెంగాలీ సప్పర్ క్లబ్ టూంటూనీస్ టేబుల్ వ్యవస్థాపకురాలు టూనికా గుహా అంటున్నారు. వలస యువతతో ఊపు.. చదువుకోడానికి లేదా పని చేయడానికి వలస వచి్చన యువత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లాంటి నగరాల్లో తమ ఇళ్లను కుటుంబాలను విడిచిపెట్టిన వారు.. కొత్త వ్యక్తులను పరిచయం చేసుకోడానికి సప్పర్ క్లబ్లు గొప్ప మార్గంగా మారాయి.. ‘ఇవి రెస్టారెంట్లు, బార్ల కంటే భిన్నమైన అనుభవాన్ని ఇస్తాయి. నగరాల్లోని ప్రజలు మంచి ఆహారం తినాలని, అలాగే మంచి స్నేహానుభవాన్ని పొందాలని కోరుకుంటారు’ అని నగరంలో సప్పర్ క్లబ్కు శ్రీకారం చుట్టిన ప్రణవి చెప్పారు. విభిన్న సంస్కృతులలో కమ్యూనల్ డైనింగ్ ఒక సంప్రదాయం. ప్రతి సమావేశం, దానితో ఆలోచనల మార్పిడి, విభిన్న ఆచారాలు, సంస్కృతులను మనకు పరిచయచేస్తాయి.’ అని మరో క్లబ్ నిర్వాహకులు కౌశల్య పాటిల్ అన్నారు. డిజిటల్ సంబంధాలపై ఆధారపడుతున్న యుగంలో సప్పర్ క్లబ్లు అవసరమైన పరస్పర సాన్నిహిత్యాన్ని అందిస్తున్నాయి. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ఇలా ప్రారంభించి.. అలా లీనమై.. ఈ విందులో పాల్గొన్నప్పుడు తొలుత ప్రతి ఒక్కరూ కొంచెం ఇబ్బందికరంగా ప్రారంభిస్తారు. ఇక్కడికి చేరుకోడానికి వారు ఎంత ట్రాఫిక్ను ఎదుర్కొన్నారనే విషయాలనే మాట్లాడతారు. కానీ అలా అలా నగరంలో రుచికరమైన, ఉత్తమమైన మటన్ థాలీని ఎక్కడ దొరుకుతుందనే సంభాషణ నుంచి అలా అలా చర్చలు లోతుగా మారతాయి.. ‘దీనికి ఫ్యాన్సీ రెస్టారెంట్ అంత స్థలం అవసరం లేదు. ఇది సోషల్ మీడియా బజ్కు సరైనది. దీని ద్వారా నగరాల్లో హోస్ట్ల నెట్వర్క్ను నిర్మించవచ్చు. ‘ఆదాయాన్ని పొందడం కంటే మిన్నగా వ్యక్తిగత బ్రాండ్ కమ్యూనిటీని సప్పర్ క్లబ్లు నిర్మిస్తాయి’ అని సీమా సేథి అంటున్నారు. ఇదీ చదవండి : Karur stampede tragedy మొన్ననే ఎంగేజ్మెంట్..త్వరలో పెళ్లిప్రతి సమావేశం కంటెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగల కథగా మారుతుంది. సొంత నిబంధనల ప్రకారం ఆతిథ్యం ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది. మరింత ముఖ్యంగా, ఇది ఆహారం కోసం మాత్రమే కాకుండా పరిచయాల కోసం వచ్చే అతిథుల సర్కిల్ను సృష్టిస్తుంది, వర్క్షాప్లు, సహకారాలు, ప్రయాణ అనుభవాలు తదితర భవిష్యత్తు అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. (నో మెడిసిన్స్, నో ఫ్యాన్సీ సప్లిమెంట్స్.. నేహాధుపియా 21 డేస్ చాలెంజ్)కేర్ ఫుల్.. కమ్యూనిటీ చిల్.. అపరిచితులతో కాబట్టి నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. టేబుల్లో హద్దులను నిర్దేశిస్తారు. వస్తువులను సురక్షితంగా ఉంచుతారు. హాజరవుతున్నవారు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడుతున్నారో? సప్పర్ క్లబ్ డిన్నర్ టేబుల్ సీటు బుక్ చేసుకోవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారో? అర్థం చేసుకోవడానికి విందుకు ముందే అవసరమైన సంప్రదింపులు ఉంటాయి. -
‘మాఫీ’ మోసగాడా.. కట్టిస్తావా ‘ఇసుకమేడ’!
- బాబుపై నిప్పులు కక్కిన రావులపాలెం డ్వాక్రా మహిళలు - మొన్న రుణాలరద్దు నాటకం.. ఇప్పుడు ర్యాంపుల డ్రామా - బేషరతుగా మాఫీ చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక రావులపాలెం : రైతులైనా, తామైనా..అడగకుండానే రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక రోజుకో మాట మాట్లాడుతూ మోసగిస్తున్నారని డ్వాక్రా మహిళలు దుయ్యబట్టారు. బేషరతుగా రుణాలు మాఫీ చేయకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసలే చంద్రబాబు మాట నమ్మి దగా పడ్డామన్న నిస్పృహతో ఉన్న మహిళలు నిప్పులు కక్కడానికి రావులపాలెం ఇందిరా కాలనీ కమ్యూనిటీ భవనం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం స్థానిక కమ్యూనిటీ భవనం వద్ద సమావేశం ఉందని మండలంలోని మహిళా శక్తి సంఘాల సభ్యులను అధికారులు ఆహ్వానించారు. దాదాపు 40 మంది మహిళలు వచ్చి, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఎదురు చూసినా సమావేశానికి రావలసిన ఉన్నతాధికారులు రాలేదు. దీంతో అసలు సమావేశం దేనికి, తమను ఎందుకు పిలిచారు అంటూ మహిళలు డ్వాక్రా ఏపీఎం విశ్వనాథాన్ని నిలదీశారు. ఇసుక ర్యాంపుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిపై మహిళల అభిప్రాయ సేకరణకు హైదరాబాద్లోని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ నుంచి నలుగురు డెరైక్టర్లు రావలసి ఉందని ఏపీఎం చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము మహిళలను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకల్లా రమ్మని కోరామన్నారు. అయితే ఇసుక ర్యాంపులున్న ఇతర ప్రాంతాల్లో సమావేశాలకు హాజరైన డెరైక్టర్లు రావులపాలెం రాలేకపోయారని చెప్పారు. శుక్రవారం ఇక సమావేశం జరగదని చెప్పడంతో మహిళలు ఆగ్రహోదగ్రులయ్యారు. ఇప్పటికే చంద్రబాబు రుణమాఫీపై మాటలు మార్చి మోసం చేస్తున్నారని, ఇప్పుడు ఇసుక ర్యాంపుల నిర్వహణ అని కొత్తనాటకానికి తెర తీశారని తీవ్రంగా నిరసించారు. చంద్రబాబు మాటలు వినడం వల్ల ఐదు నెలల నుంచి రుణాలు కట్టకుండా నిండా మునిగిపోయామని ఆక్రోశించారు. బకాయి పడ్డ మొత్తం సొమ్మును ఒకేసారి కట్టమని ఒత్తిడి చేస్తున్నారని, అయితే చాలా మంది మహిళలు కట్టలేని స్థితిలో ఉన్నారని వాపోయారు. మొత్తం బాకీ కడితేనే వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీనే నిలబెట్టుకోని చంద్రబాబు ఇప్పడు ఇసుక ర్యాంపుల నిర్వహణ అంటూ మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేయకుండా ఇసుక ర్యాంపులపై మీటింగులంటూ తమ సహనాన్ని పరిక్షించొద్దన్నారు. 15 రోజుల్లోగా చంద్రబాబు డ్వాక్రా, రైతు రుణమాఫీలపై స్పష్టమైన విధివిధానాలు ప్రకటించి, షరతులు లేని రుణమాఫీ చేయాలని, లేని పక్షంలో మహిళా సంఘాలు సంఘటితమై ఉద్యమిస్తాయని హెచ్చరించి, వెనుదిరిగారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంక్ నోటీసులు గండేపల్లి : డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ హామీలతో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం ఆ హామీని అమలు చేస్తుందో లేదో తెలియక ఆయా సంఘాల సభ్యులు ఆందోళనలకు గురవుతున్నారు. రూ.లక్ష లోపు ఉన్న రుణాలను కూడా తీర్చాలని బ్యాంకుల నుంచి వారికి నోటీసులు అందాయి. మండలంలోని మురారి, గండేపల్లి గ్రామాలకు చెందిన సుమారు 25 డ్వాక్రా సంఘాల వారికి తక్షణమే తీసుకున్న రుణం, వడ్డీ చెల్లించాలని బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా నోటీసులు ఎందుకు అందాయా అని దుర్గాలక్ష్మి, ఈశ్వరి, శ్రీనివాస, సత్యసాయి, సాయిబాబా, దుర్గ, భవాని, సుగుణ, సత్యసాయి, భారతి, ఇందిర, మల్లేశ్వరి తదితర శక్తి సంఘాల మహిళలు మల్లగుల్లాలు పడుతున్నారు. తాము కట్టాల్సిన బాకీ రూ. లక్ష లోపే ఉందని, రుణమాఫీ ప్రకారం తాము కట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ నోటీసులు అందాయని బి. అప్పలనర్స, ఆర్. జ్యోతి, బి. అప్పయ్యమ్మ, ఎన్. సత్యవతి, సత్య తదితరులు చెబుతున్నారు. -
కలిసి కట్టుగా.. కన్న ఊరి కోసం..
మరిపెడ, న్యూస్లైన్ : పుట్టిన ఊరికి సేవ చేసేందుకు విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కటయ్యారు. అభివృద్ధికి దూరంగా ఉన్న తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ప్రతినబూనారు. ఇందుకు మండలంలోని జయ్యారం గ్రామం వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జయ్యారంలో కనీస వసతు లు కరువయ్యాయి. దీంతో గ్రామాభివృద్ధి కోసం విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు ఒక్కటయ్యారు. గ్రామం లో ఆదివారం జరిగిన సమ్మేళనంలో వారం తా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ రోజంతా ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో పుట్టి పెరిగిన వారు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారని, అలాంటి వారంతా ఒక వేదికపైకి రావడం ఆనందంగా ఉందన్నారు. తీసుకున్న నిర్ణయాలు.. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిపోను మిగిలిన అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు చేశారు. గ్రామంలో గ్రంథాలయం, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు చేయాలని, క్రీడామైదానం కోసం స్థలం సేకరించాలని, రవాణ సౌకర్యం మెరుగుపరచుకోవాలని, కమ్యూనిటీ భవన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా గ్రామస్తులను ప్రోత్సహించ డం, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి పాలకులతో పని చేయించాలని నిర్ణయించారు. గ్రామాభివృద్ధి కమిటీ ఇదే.. జయ్యారం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా పానుగంటి శ్రీనివాస్రెడ్డి, ఉపాధ్యక్షుడు గాడిపెల్లి సుధాకర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా యాకూబ్మియా, సహాయ కార్యదర్శి పూసపాటి విజయ్కుమార్, కోశాధికారి జగన్నాథరెడ్డి, సభ్యులుగా సి. ప్రసాద్, వెంశెట్టి సోమేష్, ఈశ్వరప్రసాద్ను ఎన్నుకున్నారు. సత్యనారాయణరావు, జగన్మోహన్రావు, శౌరి బిక్షమయ్య, మాకుల స్వరూపరెడ్డి, పాఠశాల హెచ్ఎం రమేష్కుమార్, వల్లూరి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.