-
కాక్పిట్లోకి గర్ల్ఫ్రెండ్.. వరుస వివాదాల్లో ఎయిరిండియా!
ప్రముఖ దేశీయ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియా (airindia) వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. మధ్యం మత్తులో ప్రయాణంలో తోటి ప్రయాణికులపై తప్పతాగి మూత్రం పోయడం, ఒకరినొకరు కొట్టుకోవడం,కాక్పిట్లో స్నేహితురాలిని ఆహ్వానించడం వంటి ఘటనలతో తరచు వార్తల్లో కెక్కుతుంది. తాజాగా, గత వారం ఎయిరిండియా విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లు తన స్నేహితురాలని కాక్పిట్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఎయిరిండియాకు చెందిన ఏఐ-445 విమానం ఢిల్లీ నుంచి లేహ్కు (లద్దాఖ్) వెళ్లిన విమానంలో పైలెట్, కో-పైలెట్ తన స్నేహితురాల్ని కాక్పిట్(cockpit)లో కూర్చోబెట్టుకున్నారు. అయితే, ఎంత సేపు కాక్పిట్లో ఉన్నారనే అంశంపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఎయిరిండియా యాజమాన్యం ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు, దీనిపై డీజీసీఏ స్పందించింది. నియమ నింబంధనల్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఎయిరిండియా విచారణ నిమిత్తం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయలేదు. దేశంలో అత్యంత సున్నిత ప్రాంతమైన లేహ్ వైమానిక మార్గం అత్యంత సున్నితమైంది. క్లిష్టమైనది. ఈ మార్గంలో ప్రయాణించే విమానంలో పైలట్లు నిబంధనలను ఉల్లంఘించడంపై వైమానిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఫిబ్రవరి 27న దుబాయ్ నుంచి ఢిల్లీ మార్గంలో ఎయిర్ ఇండియా విమానం ఏ1-915 కాక్పిట్లోకి తన మహిళా స్నేహితురాలిని స్వాగతించిన ఎయిర్ ఇండియా పైలట్ లైసెన్స్ను డీజీసీఏ సస్పెండ్ చేసింది. కాక్పిట్ ఉల్లంఘన ఘటనలో సత్వర, సమర్థవంతమైన చర్య తీసుకోలేదని ఆరోపించినందుకు డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఇదీ చదవండి : వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా? -
నేపాల్ విమాన ఘటన: కోపైలట్ విషాద గాథ..నాడు భర్తలాగే భార్య కూడా..
నేపాల్ విమాన ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలతో బయటపడక పోవడం అందర్నీ తీవ్రంగా కలిచి వేసింది. ఐతే ఈ ఘటనలో చనిపోయిన కో పైలెట్ అంజు ఖతివాడ విషాద గాథ అందర్నీ కంటతడి పెట్టేలా చేసింది. ఆమె 2006లో పైలట్ అయిన తన భర్తను ఇదే విమాన ప్రమాదంలో పోగొట్టకుంది. అయినా ఆ బాధను దిగమింగుకుని తన భర్త మాదిరిగా పైలట్ అవ్వాలని 2010లో ఎయిర్లైన్స్లో చేరింది. అందుకోసం ఎంతో ప్రయాసపడి ఏదోలా కో పైలట్ ఉద్యోగం సాధించింది. ఇంకా కొద్దిగంటల్లో పైలట్ అయిపోతుంది అనంగా ఈ ఘోర ప్రమాదం బారినపడింది. వాస్తవానికి నేపాల్ నిబంధనల ప్రకారం కోపైలట్ పైలట్ అవ్వాలంటే సుమారు 100 గంటల పాటు విమానాన్ని నడిపిన అనుభవం ఉండాలి. అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన యతి ఎయిర్లైన్స్ విమానంలో పయనించింది. ఈ మేరకు 72 మంది ప్రయాణికులతో వెళ్తున్న యతి ఎయిర్లైన్స్ ఏటీఆర్ 72 విమానానికి కమల్ కేసీ పైలట్గా ఉండగా..అంజు ఖతివాడ కో పైలట్గా వ్యవహరించారు. అంతేగాదు అంజుకి కోపైలట్గా ఇది చివరి విమానం. ఇప్పటివరకు అంజు నేపాల్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లో కోపైలట్గా.. విజయవంతంగా అన్ని విమానాలను ల్యాండ్ చేశారు. ఇంకొద్దిసేపులో తన కల నెరవేరుతుందనంగా విధికి ఆమెపై కన్నుకుట్టిందేమో! తెలియదుగానీ ఆమె కలల్ని కల్లలు చేస్తూ..ఆమెను చిదిమేసింది. నాడు అంజు భర్త 16 ఏళ్ల క్రితం ఇదే యతి ఎయిర్లైన్స్లో కోపైలట్ విధులు నిర్వర్తిస్తూ..ఎలాగైతే మరణించారో ఆమె కూడ అలానే మరణించడం బాధకరం. అంజు భర్త 2006లో కోపైలట్గా యతి ఎయిర్లైన్స్ విమానంలో ఉండగా.. నేపాల్గంజ్ నుంచి జుమ్లా వెళ్తుండగా జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. నాడు భర్త లాగే..నేడు భార్యను కూడా విధి తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఐతే ఈ ఘటనలో పైలట్ కమల్ కేసి మృతదేహాన్ని గుర్తించామని, కానీ కోపైలట్ అంజు మృతదేహనికి సంబంధించిన అవశేషాలను ఇంకా గుర్తించలేదని ఎయిర్లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. ఇదిలా ఉండగా, ఆదివారం నేపాల్ యతి ఎయిర్లైన్స్ ఏటీఆర్-72 విమానం దుర్ఘటనలో విమానం కూలిపోవడానికి కొద్ది క్షణాల ముందు అటు ఇట్లు దొర్లినట్లు ప్రత్యక్ష సాక్షలు చెబుతున్నారు. అలాగే విమానంలోని కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్, స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి క్రాష్ కావడానికి కారణమేమిటో గుర్తించడంలో సహాయపడవచ్చునని చెబుతున్నారు. (చదవండి: వీధి కుక్కులకి ఆహారం పెడుతుండగా..ర్యాష్గా దూసుకొచ్చిన కారు) -
సింధు ‘తేజస్’ విహారం
సాక్షి, బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు ‘ఏరో ఇండియా’ వైమానిక ప్రదర్శనలో సందడి చేసింది. తేజస్కు కో పైలెట్గా గగన విహారం చేసింది. ఇక్కడి యలహంక ఎయిర్బేస్ స్టేషన్లో ఈ వైమానిక ప్రదర్శన జరుగుతోంది. ఇందులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాక్పిట్లో కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్తో కలిసి సింధు కో పైలెట్గా విమానాన్ని నడిపింది. ఇలా తేజస్ ఎయిర్క్రాఫ్ట్లో కో పైలెట్గా విహరించిన తొలి మహిళగా ఆమె ఘనతకెక్కింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తేజస్లో విహరించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. వైమానిక రంగంలో మహిళలు సాధించిన ఘనతలు అమోఘమని కొనియాడింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ యుద్ధ విమానం ఇటీవలే వాయుసేనలో చేరింది. గురువారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా తేజస్ను నడిపి చూశారు. -
నచ్చిన మహిళా కో పైలెట్ కోసం పట్టు..
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా పైలట్ల తీరు మారడం లేదు. ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా, ఎంతమందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నా పైలట్లు మాత్రం విధి నిర్వహణలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పైలట్ తన డిమాండ్ కోసం 110 మంది ప్రయాణీకులను సుమారు రెండు గంటలపాటు విమానంలో వేచి చూడాల్సిన పరిస్థితి కల్పించాడు. అసలు విషయానికి వస్తే... తనకు నచ్చిన మహిళా పైలట్ను కో-పైలట్గా ఇవ్వలేదన్న కారణంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. పైలట్ మంకుపట్టుతో ఎయిర్ ఇండియా విమానంలో 110 మంది ప్రయాణీకులు రెండున్నర గంటలపాటు బలవంతంగా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో మాలే నుంచి చెన్నై మీదగా తిరువనంతపురం వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో ఈ సంఘటన జరిగింది. ప్రత్యేకంగా తాను కోరిన మహిళా కో పైలట్నే Al 263/264 విమానంలో తనతోపాటు విధులకు పంపించాలంటూ పైలట్ పట్టుబట్టడంతో అసలు గొడవ ప్రారంభమైంది. అయితే ఆమె అప్పటికే ఢిల్లీ ఫ్లైట్కు వెళ్ళాల్సిన రోస్టర్ లో ఉందని, అతడి డిమాండ్ తీర్చడం కుదరదని రోస్టర్ సెక్షన్ అధికారులు తేల్చి చెప్పారు. గురువారం ఉదయం విధులకు హాజరైన అతడు రోస్టర్ సెక్షన్ లో అదేతీరులో వ్యవహరించాడు. తనకు బీపీ పెరిగిందని, అనారోగ్యం పేరుతో కాలయాపన చేశాడు. అయితే అతడి ప్రయత్నం ఫలించకపోవటంతో...తాను కోరిన కో పైలట్ను పంపించనిదే విధులకు వెళ్లేది లేదంటూ తెగేసి చెప్పాడు. ఈ ఘటనతో ఉదయం ఏడు గంటలకు బయలుదేరాల్సిన విమానం తొమ్మిది గంటల తర్వాత బయలుదేరింది. కాగా ఇంత హంగామా చేసిన ఈ పైలట్ వారం క్రితం ఎయిర్ ఇండియాకు రాజీనామా చేసి, ప్రస్తుతం నోటీసు కాలంలో పని చేయటం గమనార్హం. అయితే ఈ విషయంపై పూర్తి వివరణ ఇచ్చేందుకు వైమానిక ప్రతినిధులు ఎవ్వరూ అందుబాటులో లేరు. -
గాల్లో విమానం.. పైలెట్ చనిపోయాడు
సిరాకస్(అమెరికా): కొన్ని వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోంది. అది కూడా గమ్యస్థానానికి ఇంకా చాలా దూరంలో ఉంది. అనుకోకుండా పైలెట్కు అస్వస్థత.. కొద్ది సేపటికే మృతి. దీంతో తొలుత కంగారు పడిన కో పైలెట్ తిరిగి ధైర్యంగా వ్యవహరించి సురక్షితంగా విమానం దించేశాడు. అమెరికాకు చెందిన విమానం పైలెట్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై గాల్లోనే ప్రాణాలు విడిచాడు. దీంతో కో పైలెట్ జాగ్రత్తతో వ్యవహరించి ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా విమానాన్ని దించివేశాడు. అయితే, ఈ విషయం ముందుగా ప్రయాణీకులకు తెలియకుండా అతడు జాగ్రత్తపడటంతో ఓ భారీ ఆందోళన, భయానికి తావివ్వకుండా చేసినట్లయింది. ఆదివారం రాత్రి 11.55 గంటలకు అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం 550 ఫోనిక్స్ నుంచి బోస్టన్కు బయలు దేరింది. అయితే ప్రయాణం మధ్యలోనే పైలెట్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యి, ఆ వెంటనే ప్రాణాలుకోల్పోవడంతో వెంటనే విమానం బాధ్యతలు పూర్తి స్థాయిలో కో పైలెట్ తీసుకున్నాడు. మధ్యలోనే సిరాకస్కు చెందిన విమానాశ్రయ అధికారులను సంప్రదించి మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, వెంటనే విమానాన్ని దించివేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతివ్వాలని కోరాడు. దీంతోపాటు రన్ వే దగ్గరికి వెంటనే ఎమర్జెన్సీ అంబులెన్స్ను పంపించాలని కోరాడు. ఇందుకు సిరాకస్ అధికారులు అంగీకరించడంతో దానిని సోమవారం ఉదయం 7గంటల ప్రాంతంలో సురక్షితంగా దించివేశాడు. అలా దించిన తర్వాతనే పైలెట్ చనిపోయాడని, అందుకే విమానం అత్యవసరంగా దిగిందని, తోటి ప్రయాణీకులకు, సిరాకస్ విమానాశ్రయ అధికారులకు తెలిసింది. కో పైలెట్ నిర్వహించిన బాధ్యతలను విమానాశ్రయ అధికారులు మెచ్చుకోగా.. అందులోని ప్రయాణీకులు మాత్రం ఒక్క క్షణం గుండెలపై అమ్మో అని చేతులేసుకున్నారు. ఎయిర్ బస్ ఏ 320 ద్వారా ప్రయాణీకులను బోస్టన్ నగరానికి తరలించారు. ఇందులో మొత్తం 147మంది ప్రయాణీకులు ఉన్నారు. కాగా, కో పైలెట్ కూడా పైలెట్కు ఉండే సామర్థ్యతను కలిగి ఉంటాడని, అతడు ప్రమాదాలను నివారించగలడని అమెరికా ఎయిర్ లైన్స్ అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు అమెరికా ఎయిర్ లైన్స్లో ప్రయాణంలో ఉండగా ఏడుగురు పైలెట్లు, ఒక చార్టర్ పైలెట్ మరణించాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement