breaking news
Cluster bombs
-
విధ్వంసకర క్లస్టర్ బాంబు
యుద్ధం మొదలైనప్పటి నుంచి తమపై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి విధ్వంసం సృష్టించిన ఇరాన్ ఇప్పుడు ఏకంగా క్లస్టర్ బాంబులను ప్రయోగిస్తూ దారుణాలకు ఒడిగడుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఎన్నో దేశాలు నిషేధం విధించిన క్లస్టర్ బాంబులను ఇరాన్ ఉద్దేశపూర్వకంగా భారీ పౌరనష్టం జరగాలని తమపై ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటించింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న సమరంలో ఇరాన్ క్లస్టర్ బాంబులను వినియోగించడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దీంతో డజన్లకొద్దీ దేశాల నుంచి నిషేధాన్ని ఎదు ర్కొంటున్న క్లస్టర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రత్యేకతలేంటి?ఏదైనా బాంబును జారవిడిస్తే అది ఒకేసారి పూర్తిగా పేలిపోతుంది. మొత్తం మందుగుండు అయిపోతుంది. కానీ క్లస్టర్ బాంబు అలా కాదు. అందులో గోళాకృతిలో చిన్న చిన్న బాంబులుంటాయి. వాటిని మోస్తున్న కస్టర్ బాంబు వార్హెడ్ను ప్రయో గించాక లక్ష్యాన్ని ఢీకొట్టడానికి కొంతదూరంలో అంటే గాల్లోనే అది పేలిపోతుంది. దాంతో అందులోని గోళాకార చిన్నపా టి బాంబులన్నీ చెల్లాచెదురు గా నలుదిక్కులా పడి పేలిపో తాయి. దీంతో వినాశనం విస్తృతస్థాయిలో ఉంటుంది. జన సమూహంపై ఈ బాంబు పడితే ఈ చిన్న బాంబులు సృష్టించే విధ్వంసం అంతాఇంతా కాదు. ఇష్టమొచ్చినట్లు అన్ని వైపులకు దూసుకెళ్లడంతో నలుచెరుగులా ఉన్న వారంతా తీవ్రస్థాయిలో లేదా మధ్యస్థాయిలో గాయపడటం ఖాయం. ఇంతటి ప్రమాదకర బాంబు కావడంతోనే చాలా దేశాలు ఈ క్లస్టర్ బాంబు వినియోగానికి దూరంగా ఉండిపోయాయి. ఇంట్లో కొంత ఎత్తు నుంచి ఒక గాజుముక్కను నేలపై పడేస్తే అది ముక్కలుచెక్కలై ఎలాగైతే గది మొత్తం పరుచుకుంటుందో ఈ క్లస్టర్ బాంబులోని పేలని ముక్కలు పరిసరాల్లోకి దూసు కెళ్లి దారుణ నష్టానికి కారణమవుతాయి. శుక్రవారం ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రయోగించిన ఒక క్లస్టర్ బాంబు ఆకాశంలో ఏడు కిలోమీటర్ల ఎత్తులో పేలిపోయి పెద్దసంఖ్యలో చిన్నబాంబులుగా మారి 8 కిలో మీటర్ల పరిధిలో వేర్వేరుచోట్ల బద్ధలయ్యాయి. బా లిస్టిక్ క్షిపణితో పోలిస్తే ఈ బాంబు తీవ్రత ఎక్కువ గా ఉంటుందని ఇజ్రాయెల్ సైనికాధికారిది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’ వార్తాసంస్థతో చెప్పారు.పొంచి ఉన్న మరో ప్రమాదంక్లస్టర్ బాంబు పేలాక అంతటా పడిపోయే చిన్న బాంబులు అన్నీ అదే సమయంలో పేలకపోవచ్చు. పేలని ఆ కొన్నింటిని నిర్వీర్యమైనట్లు భావించకూడదు. అవి కొంతకాలం తర్వాత పేలుతాయి. అంటే యుద్ధక్షేత్రంలో ఈ క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే ఆ తర్వాతకూడా అక్కడికి జవాన్లు వెళ్లాలంటే జంకాల్సిందే. ఎక్కడ పడిన బాంబు ఎప్పుడు పేలుతుందో ఎవరూ ఊహించలేరు. 2008లో వందకుపైగా దేశాలు ఐక్యరాజ్యసమితి సారథ్యంలో ఈ బాంబు వినియోగంపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. 111 దేశాలు, 12 ఇతర సంస్థలు ఈ ఒప్పందంపై సంతకాలుచేశాయి. క్లస్టర్ బాంబుల ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగంపై నిషేధం విధించారు. అయితే ఆనాడు ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, అమెరికా ఈ ఒడంబడికకు కట్టుబడతామని ప్రకటించలేదు. ఈ లెక్కన అమెరికా సైతం ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే ఈ బాంబులను ఉపయోగించే వీలుంది. లేదంటే పరోక్షంగా ఇజ్రాయెల్కు సరఫరా చేసే అవకాశముంది. చాన్నాళ్ల క్రితం సిరియాను ఏలిన బషర్ అల్ అసద్ ప్రభుత్వం సైతం తాము అంటే గిట్టనివారిపై వీటిని విపరీతంగా వాడిందని ఆరోపణలున్నాయి. అఫ్గాన్లో అమెరికా సైతం ఇదే బాటలో పయనించిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2006 లెబనాన్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఏకంగా 40 లక్షల క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఐక్యరాజ్యసమితి గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 19 ఏళ్ల క్రితం ప్రయోగించిన క్లస్టర్ బాంబుల్లో కొన్ని ఇప్పటికీ పేలుతూ లెబనాన్ పౌరుల ప్రాణాలు హరిస్తున్నాయని స్థానిక మీడియా గతంలో ఆరోపించింది.రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలోనూ...ఆనాడు ఒప్పందంలో భాగస్వామిగా లేని రష్యా నెలలతరబడి కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో దానిపై విచ్చలవిడిగా వాడుతోందని తెలుస్తోంది. దీంతో రష్యాతో పోరాటంచేస్తున్న ఉక్రెయిన్కు తమ వద్ద పేరుకుపోయిన లక్షలాది క్లస్టర్ బాంబులను సరఫరాచేయాలని అమెరికా భావిస్తోంది. సమరసమయంలో పేలితే అది యుద్ధనీతిగా భావించవచ్చు. కానీ యుద్ధం ముగిశాక కూడా పేలుతూ ఇవి ఒకరకంగా పౌరహక్కులను కాలరాస్తున్నా యని మానవహక్కుల సంఘాలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. -
పోటాపోటీగా దాడులు
టెల్ అవీవ్/టెహ్రాన్/జెనీవా: ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భీకరంగా బాంబులేసుకుంటూ పశ్చిమాసియాలో రావణకాష్టాన్ని మరింత రాజేసిన ఇజ్రాయెల్, ఇరాన్లు శుక్రవారం సైతం పోరుపంథాలోనే పయనించాయి. పోటాపోటీగా క్షిపణులు జారవిడుస్తూ రెండు దేశాల్లో ఉద్రిక్తతల్ని అమాంతం పెంచేశాయి. ఇజ్రాయెల్ను మరింత దెబ్బకొట్టేందుకు ఇరాన్ తన వద్ద పోగుబడిన క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ క్లస్టర్ బాంబుల్ని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్లోని టెల్అవీవ్, హైఫా, బీర్షెబా, రెహోవోట్ నగరాలు సహా పలు ప్రాంతాలపై క్లస్టర్ బాంబులను వేయడంతో పెద్దసంఖ్యలో భవనాలు ధ్వంసమయ్యాయి. తీరప్రాంత నగరమైన హైఫాలో భవంతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. రక్తమోడుతూ జనం వీధుల్లో పరుగులు పెడుతున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించారు. కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని నగర మేయర్ యొనా యాహవ్ చెప్పారు. రెహోవోట్లో దెబ్బతిన్న భవనాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్వయంగా వచ్చి పరిశీలించారు. కర్మేయిన్ పట్టణంలో షెల్టర్లో దాక్కున్న 51 ఏళ్ల మహిళ భయంతో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. ప్రతిగా ఇజ్రాయెల్ టెహ్రాన్లోని పలు క్షిపణి తయారీ కార్మాగారాలపై దాడులు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా సగం వరకు ఇరాన్ మిస్సైల్ లాంచర్లను నాశనంచేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఇయాల్ జమీర్ చెప్పారు. ఇరాన్ అణుపరిశోధనా ఏజెన్సీసహా పలు నగరాలపై తమ 60 యుద్దవిమానాలు బాంబుల వర్షం కురిపించాయని ఇజ్రాయెల్ ప్రకటించింది. శుక్రవారం నాటికి ఇరాన్లో 263 మంది పౌరులు, 154 మంది సైనికులు సహా 657 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఇరాన్ జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది చనిపోయారు. మరోవైపు ఇరాన్లో బుషెహర్ అణుకేంద్రంపై దాడితో అత్యంత ప్రమాదకర పరిస్థితి తలెత్తనుందని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ డైరెక్టర్ రఫేల్ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్లాంట్లో వేల కేజీల అణుపదార్థం ఉందని, అది బయటకొస్తే వినాశకర స్థాయిలో రేడియోధార్మికత వందలకిలోమీటర్ల పరిధికి విస్తరిస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు అవసరమైన సమయంలో పోరులో భాగస్వాములమవుతామని హెజ్బొల్లా ఉగ్రసంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసిమ్ అన్నారు. ఇన్నాళ్లూ ఇరాన్ రహస్యంగా గాజాలో హమాస్, లెబనాన్లో హెబ్బొల్లా, యెమెన్లో హూతీ తిరుగుబాటుదారులను పెంచి పోషించినప్పటికీ ఎవరూ ఇంతవరకు సాయపడేందుకు ముందుకురాలేదు. ఈ నేపథ్యంలో హెజ్బొల్లా స్పందించడం గమనార్హం. అయితే హెజ్బొల్లా స్పందించిన వెంటనే లెబనాన్లోని దాని స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబులు వేసింది.ఇజ్రాయెల్ వ్యతిరేక ర్యాలీలుతమపై దండెత్తిన ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్, ఇరాక్లో ముస్లింలు శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత వేలాదిగా రోడ్లమీదకొచ్చి భారీ నిరసనర్యాలీ చేపట్టారు. టెహ్రాన్, బాగ్దాద్, సదర్ సిటీల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. మరోవైపు ఇప్పటికే హమాస్తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కొత్తగా ఇరాన్తోనూ కయ్యం పెట్టుకోవడాన్ని ఇజ్రాయెలీలు తీవ్రంగా తప్పుబట్టారు. టెల్ అవీవ్లో వేలాది మంది ఆందోళనకారులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. మరోవైపు ఇరాన్లో మౌలికసదుపాయాలు దెబ్బతిని గత 48 గంటలుగా ఇంటర్నెట్ స్తంభించింది. కేవలం 3 శాతం ప్రాంతాల్లో ఇంటర్నెట్ను పునరుద్ధరించారు. ఇరాన్లోని బ్యాంక్ సెఫాపై ఇజ్రాయెలీ హ్యాకర్లు సైబర్ దాడులు చేశారు. దీంతో ఏటీఎంలు పనిచేయక జనం ఇబ్బందులు పడ్డారు.ఇరాన్కు విదేశీ ఆయుధసాయంపై అమెరికా ఆంక్షలుఇరాన్ సైనికరంగంపై అమెరికా శుక్రవారం మరికొన్ని ఆంక్షలు విధించింది. ఇరాన్ సైన్యం ఉపయోగించే పలు రకాల ఆయుధాల్లో విడిభాగాలు, సాఫ్ట్వేర్లను సరఫరాచేసే విదేశీ సంస్థలు, వ్యక్తులపై అమెరికా నిషేధం విధించింది. ఆంక్షలు ఎదుర్కొంటున్న వారిలో చైనా కంపెనీ, ఒక సరుకు రవాణా నౌక సంస్థ సైతం ఉన్నాయి. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, బాంబులను విక్రయించే సంస్థలనూ అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది.మరోదఫా చర్చలకు సిద్ధమన్న యూరప్ నేతలుస్విట్జర్లాండ్లోని జెనీవాలో శుక్రవారం బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతోపాటు యూరోపియన్ యూనియన్ విదేశీవిధానాల చీఫ్తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చర్చలు జరిపారు. చర్చల్లో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో వెల్లడించలేదు. మరోదఫా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, చర్చలు ముగిశాక యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు చెప్పారు. మరోవైపు తమ సేనలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలను మీడియా అత్యుత్సాహంతో ప్రసారం చేయొద్దని స్థానిక మీడియాకు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023 -
మా దగ్గరా బోలెడు క్లస్టర్ బాంబులు
కీవ్: ఉక్రెయిన్కు అమెరికా విధ్వంసకర క్లస్టర్ బాంబులను సరఫరా చేయడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. తమ వద్ద కూడా క్లస్టర్ బాంబుల నిల్వలు దండిగా ఉన్నాయని ప్రకటించారు. ఈ వివాదాస్పద ఆయుధాలను ఉక్రెయిన్ వాడిన పక్షంలో తగు రీతిలో స్పందించే హక్కు తమకుందని హెచ్చరించారు. ‘మా వద్ద క్లస్టర్ బాంబులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు వాటిని వాడలేదు. అటువంటి అవసరం కూడా మాకు రాలేదు’ అని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ ఇప్పటికే క్లస్టర్ బాంబులను వాడినట్లుగా పలు ఆధారాలను అసోసియేటెడ్ ప్రెస్, అంతర్జాతీయ మానవతావాద సంస్థలు చూపుతున్నాయి. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో, యుద్ధక్షేత్రంలో రష్యా ఆర్మీపై ఉక్రెయిన్ పైచేయి సాధించాలంటే విధ్వంసకర క్లస్టర్ బాంబులే మార్గమని అమెరికా అంచనా వేస్తోంది. క్లస్టర్ బాంబుల సరఫరాపై నెలలపాటు అమెరికా మల్లగుల్లాలు పడింది. ఉక్రెయిన్కు వీటిని అందజేయాలన్న నిర్ణయానికే అధ్యక్షుడు బైడెన్ చివరికి మొగ్గు చూపారు. ప్రమాదకరమైనవిగా భావించే క్లస్టర్ బాంబులను చివరిసారిగా అమెరికా 2003లో ఇరాక్ యుద్ధంలో వాడినట్లు చెబుతోంది. ప్రస్తుతం ఆ దేశం వద్ద 30 లక్షల క్టస్టర్ ఆయుధ నిల్వలున్నాయి. డొనెట్స్క్, ఖెర్సన్ ప్రాంతాలే లక్ష్యంగా గత 24 గంటల్లో రష్యా రెండు షహీద్ డ్రోన్లను, రెండు క్రూయిజ్ మిస్సైళ్లను, రెండు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతోపాటు 40 వైమానిక దాడులు, 46 రాకెట్ దాడులు జరిపిందని ఉక్రెయిన్ తెలిపింది. -
ఈ బాంబు ఒక్కటి వేస్తే.. 100 బాంబులు వేసినట్టే..
ఏదైనా బాంబును ప్రయోగిస్తే.. అది పడిన ప్రదేశంతోపాటు కొంతదూరం వరకు విధ్వంసం సృష్టిస్తుంది. అక్కడితో దాని పని అయిపోతుంది. అదే క్లస్టర్ బాంబును ప్రయోగిస్తే.. టార్గెట్ చేసిన ప్రదేశంతోపాటు చుట్టుపక్కల కొంత దూరం దాకా విధ్వంసం సృష్టిస్తుంది. అందులోని భాగాలు ఆ తర్వాత కూడా పేలుతూనే.. అక్కడికి వచ్చినవారి ప్రాణాలు తీస్తూనే ఉంటాయి. తాజాగా ఉక్రెయిన్కు అమెరికా క్లస్టర్ బాంబులను ఇవ్వడం, ప్రతిగా తమ వద్ద కూడా క్లస్టర్ బాంబులు ఉన్నాయని రష్యా హెచ్చరించడం నేపథ్యంలో.. క్లస్టర్ బాంబులు ఏమిటి? వాటితో ప్రమాదమేంటి? ఇప్పటివరకు ఎక్కడైనా ప్రయోగించారా? అన్న వివరాలు తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ ఒకటి కాదు వందల బాంబులు కలిపి.. సాధారణంగా క్షిపణులు అయినా, ఇతర బాంబులు అయినా వాటిలో పేలిపోయే భాగం (వార్ హెడ్) ఒకటే ఉంటుంది. ఒకే ప్రదేశంలో పెద్ద పేలుడు సంభవిస్తుంది. అదే క్లస్టర్ బాంబులో వందలకొద్దీ చిన్న బాంబులు (బాంబ్లెట్లు) ఉంటాయి. దీనిని ప్రయోగించాక నిర్దేశించిన ప్రాంతానికి చేరుకోగానే విచ్చుకుని.. అందులోని చిన్న బాంబులన్నింటినీ కొంతదూరం వరకు వెదజల్లుతుంది. ఇలా ఎక్కువ విస్తీర్ణంలో పేలుళ్లు జరుగుతాయి. అంత విస్తీర్ణంలో విధ్వంసం జరుగుతుంది. మిలటరీ స్థావరాలు, వాహనాలు, ఆయుధాలు నాశనమవుతాయి. ఆ ప్రాంతంలో ఉండే సైన్యం, సాధారణ ప్రజలకూ ప్రమాదం కలుగుతుంది. అప్పుడే పేలక.. తర్వాత ప్రాణాలు తీస్తూ.. క్లస్టర్ బాంబులు వెదజల్లే బాంబ్లెట్లలో అన్నీ అప్పటికప్పుడే పేలిపోవు. వాటిలో కొన్ని నేలపై చెల్లాచెదురుగా పడిపోతాయి. కొన్నిసార్లు ఏళ్లకేళ్లు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైనా సైనికులుగానీ, సాధారణ పౌరులుగానీ వాటిని తాకితే పేలిపోయి ప్రాణాలు తీస్తాయి. అంటే యుద్ధం ముగిసిపోయినా బాంబుల బాధ తప్పని పరిస్థితి. ♦ గతంలో వియత్నాం, లావోస్, ఇరాక్, అష్గానిస్తాన్ తదితర యుద్ధాల్లో అమెరికా ఈ కస్టర్ బాంబులను వినియోగించింది కూడా. వాటిలో పేలిపోకుండా ఉన్న బాంబులు ఇప్పటికీ తరచూ విస్ఫోటం చెందుతూ ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉన్నాయి. ♦ క్లస్టర్ బాంబులు భారీగా జన హననానికి దారి తీస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీటి వాడకాన్ని నిషేధిస్తూ ఒప్పందం చేసుకున్నాయి. అయితే ఆ ఒప్పందంపై అమెరికా, ఉక్రెయిన్, రష్యా సంతకం చేయకపోవడం గమనార్హం. ‘డడ్ రేటు’తో ఎఫెక్ట్ క్లస్టర్ బాంబు ప్రయోగించినప్పుడు పేలకుండా ఉండిపోయే బాంబ్లెట్ల శాతాన్ని ‘డడ్ రేటు’గా పిలుస్తారు. ఈ డడ్ రేటు ఎంత ఎక్కువగా ఉంటే.. భవిష్యత్తులో ప్రజలు వాటి బారినపడే ప్రమాదం అంత ఎక్కువగా ఉంటుంది. రష్యాకు చెందిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు 4శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుందని అంచనా. తాజాగా ఉక్రెయిన్కు ఇచ్చిన క్లస్టర్ బాంబుల డడ్ రేటు చాలా తక్కువగా 2.35 శాతమేనని అమెరికా అధికారులు ప్రకటించడం గమనార్హం. క్లస్టర్ బాంబుల ప్రత్యేకతలివీ.. ♦ క్లస్టర్ బాంబు బరువు సాధారణంగా 450 కిలోల నుంచి 500 కిలోల వరకు ఉంటుంది. అందులో ఒక్కోటీ ఏడెనిమిది అంగుళాల పొడవున్న 200 వరకు బాంబ్లెట్లు ఉంటాయి. ♦ క్లస్టర్ బాంబు నిర్దేశిత లక్ష్యానికి చేరువకాగానే.. అతి వేగంగా తిరగడం మొదలవుతుంది. తర్వాత దశలవారీగా బాంబ్లెట్లను విడుదల చేస్తుంది. దీనివల్ల బాంబ్లెట్లు దూరదూరంగా, వేగంగా పడిపోతాయి. ♦ క్లస్టర్ బాంబుల్లోని బాంబ్లెట్లకు కిందివైపు ఫ్యాన్ తరహా ప్రత్యేకమైన రెక్కలు, లేకుంటే చిన్నపాటి ప్యారాచూట్లను అమర్చుతారు. దీనితో అవి ఓ క్రమంలో నేలను తాకి పేలిపోతాయి. ♦ పేలిపోకుండా ఉండిపోయిన బాంబ్లెట్లను గుర్తించి నిర్విర్యం చేయడం కూడా ప్రమాదకరమైన పనే. ఎవరైనా తాకగానే పేలిపోయే అవకాశాలు ఎక్కువ. అందువల్ల బాంబ్ డిస్పోజల్ యూనిట్లు, రోబోలతో వాటిని గుర్తించి, నిర్విర్యం చేయాల్సి ఉంటుంది. 1 మిలటరీ వాహనం నుంచి క్లస్టర్ బాంబు ప్రయోగం 2 నిర్దేశిత లక్ష్యానికి సమీపంలో ఉండగా క్లస్టర్ బాంబు నుంచి బాంబ్లెట్లు విడుదల అవుతాయి. 3 చాలా వరకు బాంబ్లెట్లు నేలను తాకగానే పేలిపోతాయి. 4 కొంత మేర బాంబ్లెట్లు పేలిపోకుండా నేలపై పడి ఉంటాయి. వాటిని ఎవరైనా తాకితే వెంటనే పేలిపోయి విధ్వంసం సృష్టిస్తాయి. -
ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబులు
-
మా నిర్ణయంలో తప్పులేదు.. ఉక్రెయిన్కు సాయంపై బైడెన్
వాషింగ్టన్: రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఆయుధ నిల్వలుతరిగిపోయిన కారణంగా ఉక్రెయిన్ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంతో వారు ఉక్రెయిన్ దేశానికి క్లస్టర్ బాంబులను పంపించనున్నట్లు ప్రకటించింది. క్లస్టర్ బాంబులు తీవ్రస్థాయిలో ప్రాణనష్టం చేకూరుస్తాయని తెలిసి కూడా అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ సమర్ధించుకున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంది. సుదీర్ఘ కాలంగా యుద్ధం చేస్తోన్న నేపథ్యంలో ఉక్రెయిన్ వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి. అందుకే అగ్రరాజ్యాన్ని సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షులు వ్లాదిమిర్ జెలెన్స్కీ జో బైడెన్ పై ఒత్తిడి చేశారు. దీంతో చాలాకాలంగా వారి ఆయుధ కర్మాగారంలో నిల్వ ఉండిపోయిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్కు పంపించాలన్న నిర్ణయానికి వచ్చింది అగ్ర రాజ్యం. ఈ నిర్ణయాన్ని పలు మానవ హక్కుల సంఘాలు, డెమొక్రాట్లు తప్పుబట్టిన కూడా జో బైడెన్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. క్లస్టర్ బాంబుల తీవ్రత గురించి తెలుసు.. అందుకే ఇన్నాళ్లు వాటిని ఉక్రెయిన్కు పంపలేదు. కానీ ఇప్పుడు వారి వద్ద ఆయుధ నిల్వలు బాగా తగ్గిపోయాయి. ఈ సమయంలో వారిని అలా వదిలేయలేము. నాటో మిత్రదేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. సాధారాణ ఆయుధాలతో పోలిస్తే ఈ క్లస్టర్ బాంబులు పెను విధ్వాంసాన్ని సృష్టిస్తాయి. వీటి కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. అందుకే వీటిని ఉక్రెయిన్కు పంపే విషయమై తీవ్ర జాప్యం చేశామని అన్నారు. ఆయుధాలు కొరవడిన సమయంలో మిత్రదేశాన్ని అలా వదిలేయకూడదని బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు. క్లస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి? ఒక క్లస్టర్ బాంబు అంటే అది అనేక బాంబుల సముదాయం. దాన్ని ఒక రాకెట్ ద్వారా గానీ ఫిరంగుల ద్వారా గానీ ఈ క్లస్టర్ బాంబును సంధిస్తే సుమారు 24-32 కిలోమీటర్ల దూరాన ఉన్న లక్ష్యాన్ని కూడా తునాతునకలు చేయవచ్చు. ఒక్కటే బాంబుగా రిలీజైన ఈ క్లస్టర్ గాల్లో చిన్న చిన్న బాంబులుగా విడిపోయి అక్కడక్కడా చెదురుముదురుగా పడి పేలతాయి. కాబట్టే వీటివలన భారీగా ప్రాణనష్టం కూడా వాటిల్లుతుంది. పైగా ఇవి నేల మీద పడిన వెంటనే విస్ఫోటం చెందవు. కొన్ని అప్పుడే పేలగా కొన్ని మాత్రం ఎప్పుడో పేలుతుంటాయి. అందుకే ఐక్యరాజ్యసమితి 2008లో ఈ క్లస్టర్ బాంబుల వాడకాన్ని నిషేధిస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బ్రిటన్, ఫ్రాన్స్ సహా 120 దేశాలు వీటి వినియోగాన్ని నిషేధిస్తూ సంతకాలు కూడా చేశాయి. 2003లో ఇరాక్ పై చేసిన యుద్ధంలో అమెరికా ఈ క్లస్టర్ బాంబులనే అధికంగా ప్రయోగించింది. అటు తర్వాత అమెరికా వాటిని మళ్ళీ ఎక్కడా ఉపయోగించలేదు. అందుకే వారి వద్ద లక్షల సంఖ్యలో క్లస్టర్ బాంబుల నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్కు సాయం చేస్తూ నిల్వలను తగ్గించుకుంటోందని అమెరికా చెబుతుంటే.. అందులో రష్యాపై గెలవాలన్న వారి కాంక్షే కనిపిస్తోందని అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రెజిల్లో పేకమేడలా కూలిన భవనం, 8 మంది మృతి -
‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల్లో ఎస్బీఐ
క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణం న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ‘హాల్ ఆఫ్ షేమ్’ బ్యాంకుల జాబితాలోకి భారత్ బ్యాంకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎక్కింది. ఈ జాబితాలోకి ఎక్కిన ఏకైక భారత్ బ్యాంకు కేవలం ఎస్బీఐ కావడం గమనార్హం. క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు రుణాలను ఇచ్చినందుకుగానే ఈ ‘షేమ్’ జాబితాలో ఎస్బీఐ చేరింది. అంతర్జాతీయంగా క్లస్టర్ బాంబు తయారీ కంపెనీలకు బిలియన్ డాలర్ల రుణాలు ఇచ్చిన 158 బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేర్లతో పీఏఎక్స్ అనే డచ్ గ్రూప్ ఒక నివేదిక రూపొందించింది. ఈ జాబితాలో జేపీ మోర్గాన్, బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, క్రెడిట్ సూసీ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ఏడు క్లస్టర్ బాంబుల తయారీ కంపెనీలకు 2012 జూన్-2016 ఏప్రిల్ మధ్య 28 బిలియన్ల అమెరికా డాలర్లను రుణంగా అందించాయి. స్థానిక చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే తమ రుణ విధానం ఉంటుందని ఎస్బీఐ పేర్కొనగా, అంతర్జాతీయంగా నిషేధం ఉన్నప్పటికీ ఈ కంపెనీలకు రుణ మంజూరీలు జరిగినట్లు పీఏఎక్స్ 275 పేజీల నివేదికలో తెలిపింది. కాగా ఈ కంపెనీలకు రుణాలిచ్చిన దేశాల జాబితా(బ్యాంకులు)లో తొలుత అమెరికా(74) నిలిచింది. వరుసలో చైనా (29), దక్షిణ కొరియా (26) ఉన్నాయి. అమెరికాకు చెందిన ఆర్బిటర్ ఏటీకేకు ఎస్బీఐ రుణం ఇచ్చింది.