breaking news
clay ganesh statue
-
మట్టి విగ్రహాల పంపిణీ
-
మట్టి గణపతికి జైకొడదాం..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ సిటీలో జరిగే వినాయక నవరాత్రి ఉత్సవాలను ఈసారి పర్యావరణ హితంగా జరపుకోవాలన్న స్పృహ అన్ని వర్గాల్లో పెరిగింది. గురువారం వేడుకలకు మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి పీసీబీ ఏర్పాట్లు చేసింది. మహానగరంలో కాలుష్య ఆనవాళ్లు లేకుండా చూసేందుకు ఈసారి సుమారు 2 లక్షల మట్టి వినాయక ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు పీసీబీ సభ్య కార్యదర్శి సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఇందులో 8 అంగుళాలు మొదలు 18 అంగుళాల పరిమాణంలో తయారు చేసిన ప్రతిమలున్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సహజ రంగులతో వీటిని తీర్చిదిద్దామన్నారు. చిన్న ప్రతిమలను జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలో 26 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. హైకోర్టు, సచివాలయంలో కూడా విగ్రహాల పంపిణీ ఉంటుందన్నారు. ఇదిగాక హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మరో 40 వేల మట్టి ప్రతిమల పంపిణీకి శ్రీకారం చుట్టడం విశేషం. పీసీబీ ఉచిత మట్టిగణపతులను పంపిణీ కేంద్రాలివీ.. ⇔ గణేష్ టెంపుల్, వైఎంసీఏ, సికింద్రాబాద్ ⇔ అమీర్పేట్, సత్యం థియేటర్ ⇔ కోఠి ఉమెన్స్ కాలేజ్ ⇔ మెహిదీపట్నం రైతు బజార్ బస్టాప్ ⇔ ఉప్పల్ ఎక్స్రోడ్, పోలీస్స్టేషన్ సమీపంలో ⇔ ఎల్బీనగర్, నాగోల్ చౌరస్తా ⇔ కూకట్పల్లి జేఎన్టీయూ ⇔ జీడిమెట్ల రైతుబజార్ ⇔ బాలానగర్ బీవీ ఆస్పత్రి ⇔ సుచిత్ర క్రాస్రోడ్స్ ⇔ హైకోర్టు, ఇన్కంట్యాక్స్ ఆఫీస్ ⇔ రామచంద్రాపురం పీసీబీ కార్యాలయం ⇔ బొల్లారం కెన్నడీ ఇంటర్నేషనల్ స్కూల్ విగ్రహాల పంపిణీ చేసే జీహెచ్ఎంసీ క్షేత్రస్థాయి కార్యాలయాలు.. ఎల్బీనగర్ జోన్: కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిల్స్ చార్మినార్జోన్: మలక్పేట్, సనత్నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్నుమా, రాజేంద్రనగర్ సర్కిల్స్ ఖైరతాబాద్ జోన్: బల్కంపేట్ వార్డు ఆఫీస్, ఖైరతాబాద్ వార్డ్ ఆఫీస్, కుందన్బాగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాలనీ కూకట్పల్లి జోన్: మూసాపేట్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిల్స్ సికింద్రాబాద్ జోన్: బేగంపేట్, సికింద్రాబాద్ సర్కిల్స్ శేరిలింగంపల్లి జోన్: పటాన్చెరు, శేరిలింగంపల్లి, చందానగర్ (పీజేఆర్ స్టేడియం),యూసుఫ్గూడ హెచ్ఎండీఏ పంపిణీ కేంద్రాలు పర్యవరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో తయారు చేసిన 40 వేల మట్టి గణపతుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మట్టి గణపతికి జై కొడుతున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు విగ్రహాలను పంపిణీ చేసిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు వ్యక్తిగతంగా కావాల్సిన వారికి అందించేందుకు ఏర్పాట్లు చేసింది. లుంబినీ పార్కులో 5 వేలు, అమీర్పేట మైత్రీవనం కాంప్లెక్స్లో 3 వేలు, తార్నాకలోని హెచ్ఎండీఏ కార్యాలయంలో 4 వేలు, సరూర్నగర్లోని ప్రియదర్శిని పార్క్లో 2 వేలు, వనస్థలిపురం ఫేజ్–5 రాజీవ్ గాంధీ పార్క్లో 5 వేలు, నారాయణగూడలోని డాక్టర్ మెల్కొటే పార్కులో 2 వేల విగ్రహలను పంపిణీ చేయనున్నారు. ప్రతిమలు కావాల్సిన వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి తీసుకోవచ్చని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. -
మట్టి వినాయకులు రెడీ
సాక్షి, సిటీబ్యూరో: వినాయక చవితి సందర్భంగా మండపాల్లో ప్రతిష్టించే మట్టి వినాయక ప్రతిమలను 50% సబ్సిడీ ధరపై అందించేందుకు హెచ్ఎండీఏ ఏర్పా ట్లు చేసింది. నగరంలోని 25 ప్రాంతా ల్లో ఈ నెల 6 నుంచి 8 వరకు విక్రయానికి పెడుతున్నట్లు అధికారులు ప్రకటించారు. 8 అంగుళాల మట్టి గణపతి ధర రూ.12.50. అలాగే 3 అడుగుల విగ్రహానికి రూ.1500 ధర నిర్ణయించినట్లు బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు ఓఎస్డీ పి.రాజేందర్రెడ్డి తెలిపారు. నగరంలో ఎ క్కువగా డిమాండ్ ఉండే 8 అంగుళాల చిన్న సైజ్ మట్టి విగ్రహాలు 30వేలు, 3 అడుగుల విగ్రహాలను 300 విక్రయానికి సిద్ధం చేశామన్నారు. 3 అడుగుల విగ్రహాలు కావాల్సిన వారు ముందస్తుగా హెచ్ఎండీఏ వెబ్సైట్ ( www.hmda.gov.in)లో తమ పేరు నమోదు చేసుకోవాలన్నారు. నగరంలోని 25 ప్రాంతాల్లో చిన్న విగ్రహాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే 3 అడుగుల విగ్రహాలను లుంబినీ పార్కులోని లేజర్ షో కాంప్లెక్స్ వద్ద మాత్రమే విక్రయిస్తామని తెలిపారు. ‘మీ వినాయకుడిని సహజసిద్ధ రంగులతో అలంకరించండి’ అన్న నినాదంతో ఈ నెల 8న నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజా వద్ద హోంసైన్స్ కాలేజీ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓఎస్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆ కళాశాల వారు సహజ రంగులను ఉచితంగా పంపిణీ చేస్తారన్నారు. మట్టి గణపతులకు జై... పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులు, ఇతర జలాశయాలు కలుషితం కాకుండా చూసేందుకు మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హెచ్ఎండీఏ కృషి చేస్తోందని రాజేందర్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కూడా ప్రత్యేకంగా రూ.7.5 లక్షల నిధులు కేటాయించి మట్టి వినాయక విగ్రహాల తయారీ బాధ్యతను ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. పెద్ద విగ్రహాల వల్ల చెరువుల్లో పూడిక పేరుకుపోతుందన్న ఉద్దేశంతో వాటి ఎత్తును ఈ ఏడాది 3 అడుగులకే పరిమితం చేశామన్నారు. కొసమెరుపు: మూడేళ్లుగా మండపాల్లో ప్రతిష్టించే మట్టి విగ్రహాలను ఉచితంగా సరఫరా చేసిన హెచ్ఎండీఏ ఈ ఏడాది రూ.1500 (3 అడుగులు) ధర నిర్ణయించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.