clashes between
-
దళితులకు.. ‘దేశం’ వర్గం దండన
కందుకూరు: అధికార టీడీపీ పెత్తందారులు దళితులపై విచక్షణారహితంగా దాడిచేయడమే కాక వారు గ్రామంలోకి రాకుండా.. వారికి తాగునీరు, వ్యవసాయ, ఉపాధి పనులు లేకుండా, చివరికి.. పాల కేంద్రంలో వారు పాలు కూడా పోయనీయకుండా సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ మేరకు గ్రామంలో మైకులో బహిరంగంగా కూడా ప్రకటించారు. దీంతో.. బాధితులు రెండ్రోజులుగా అల్లాడిపోతున్నారు. పైగా.. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వారు వాపోతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడ్రోజుల క్రితం గ్రామంలో అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని యువకులు ఈలలు వేసుకుంటూ వెళ్లారు.ఇది చేసింది గ్రామానికి చెందిన దళిత యువకులేనని భావించిన గ్రామస్తులు మరుసటి రోజు గ్రామంలోకి వచ్చిన జడా చక్రి, చెరుకూరి కార్తీక్ (నాని) అనే యువకులపై దాడిచేసి కొట్టారు. దీంతో వారు జరిగిన విషయాన్ని పెద్దలకు చెప్పారు. దళితులంతా కలిసి తమ యువకులను ఎందుకు కొట్టారంటూ గ్రామస్తులను ప్రశ్నించారు. ఈ విషయం ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఎవరు గొడవ చేశారో వారిని పట్టుకుని నిలదీయాలేగానీ అకారణంగా తమ పిల్లలను పట్టుకుని కులం పేరుతో తిడుతూ ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. ఇది ఆ గ్రామ టీడీపీ పెత్తందార్లకు కోపాన్ని తెప్పించింది. అంతే.. రెండ్రోజులుగా దళితులను గ్రామం నుంచి పూర్తిగా సాంఘిక బహిష్కరణ చేశారు. మాదిగపల్లెకు చెందిన వారెవరూ గ్రామంలోకి రావద్దంటూ, గ్రామంలో ఎవరూ వారికి తాగునీరు ఇవ్వొదని.. పొలాల్లోకి కూడా రానీయకూడదంటూ దేవాలయంపై ఉండే మైక్లో ప్రకటించారు.ఆర్వో ప్లాంట్ మూసివేత.. పొలాల్లో పనులకూ నో ఎంట్రీ..ఈ ప్రకటన నేపథ్యంలో.. గ్రామంలోని ఆర్వోప్లాంట్ వద్ద దళితులెవరూ నీరు పట్టుకోవడానికి వీల్లేదంటూ హుకుం జారీచేశారు. ఇది తెలీక నీరు పట్టుకోవడానికి వెళ్తున్న యువకులను గ్రామస్తులు ఆపి బలవంతంగా వెనక్కి పంపారు. పైగా.. ఆర్వో ప్లాంట్ను పూర్తిగా మూసేశారు. అదే సమయంలో పక్క గ్రామాలకు కూడా ఫోన్చేసి దప్పళంపాడుకు చెందిన మాదిగలు ఎవరైనా నీరుకోసం వస్తే వారికి ఇవ్వొద్దని బెదిరించారు. దీంతో బాధితులు రెండ్రోజులుగా తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. వీరెవరూ పాల కేంద్రంలో పాలు పోయకుండా కూడా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఆదివారం రాత్రి కొందరు దళిత మహిళలు పాలుపోయడానికి కేంద్రానికి వెళ్లగా.. ‘మీ పాలు తీసుకోం, మా వద్దకు రావొద్దు’ అని తేల్చిచెప్పారు. ఇక పొలాల్లో పనులకు దళితులు ఎవర్ని రానివ్వొద్దంటూ కట్టుబాటు పెట్టారు.మీకు ఉపాధి పనులూ లేవు.. రావద్దు..ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకు కూడా దళితులను రానివ్వకుండా గ్రామంలోని పెత్తందారులు అడ్డుకుంటున్నారు. పనులు చేయించే ఫీల్డ్ అసిస్టెంట్ పైడి ప్రసాద్ ఉపాధి పనులకు వెళ్లిన మహిళలను పనులకు రావొద్దంటూ వెనక్కి పంపారు. మాదిగోళ్లు ఎవరికీ ఉపాధి పనులులేవు.. ఎవరూ పనులకు రావద్దంటూ హుకుం జారీచేశారు. దీంతో చేసేదేమీ లేక పనులకు వెళ్లిన మహిళలు ఉసూరుమంటూ ఇంటికి తిరిగొచ్చారు. ఇలా.. రెండ్రోజులుగా దప్పళంపాడు పెత్తందారులు అంతా కలిసి మాదిగపల్లెను అష్టదిగ్బంధం చేశారు.సబ్కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు..ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక బాధితులందరూ సోమవారం సబ్కలెక్టర్ తిరుమణి శ్రీపూజను ఆశ్రయించి తమ ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. ఆమె స్పందిస్తూ.. తహసీల్దార్కు ఆదేశాలు జారీచేస్తానని, యథావిధిగా ఆర్వో ప్లాంట్ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవాలని, అన్ని పనులు చేసుకోవాలని సూచించారు. ఉపాధి పనులకు రానీయకపోతే తనకు సమాచారం ఇవ్వాలన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే మంగళవారం గ్రామానికి వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం.. దళితులంతా కలిసి డీఎస్పీ బాలసుబ్రమణ్యంను కలిసి ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.చంపేస్తామని బెదిరిస్తున్నారు..ఈ గొడవ జరిగిన తరువాత ఉపాధి పనులకు వెళ్తే.. మాదిగోళ్లు ఎవరికీ పనులులేవు, రావొద్దంటూ ఫీల్డ్ ఆఫీసర్ చెప్పాడు. నన్ను పనిలోకి రానీయలేదు. ఇంకేమీ చేయలేక ఇంటికొచ్చేశాను. రెండ్రోజులుగా కులం పేరుతో తిడుతూ.. ‘చంపేస్తాం, మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’.. అంటూ బెదిరిస్తున్నారు. – అంగలకుర్తి ప్రభావతి, దళిత మహిళకేంద్రంలో పాలు పోయించుకోలేదు.. ఆదివారం రాత్రి పాలు పోసేందుకు గ్రామంలోని పాల కేంద్రం వద్దకు పాలు తీసుకెళ్లాను. మీ పాలు మేం తీసుకోం. మాదిగలు పాలుపోయడానికి రావొద్దంటూ కేంద్రం నుంచి వెనక్కి పంపించేశారు. దీంతో చేసేదేమి లేక ఇంటికొచ్చేశాను. – కంకిపాటి మేరి, దళిత మహిళమంచినీళ్లు తెచ్చుకోకుండా ప్లాంట్ ఆపేశారు..రెండ్రోజులుగా పూర్తిగా మంచినీళ్లు ఆపేశారు. ఆర్వో ప్లాంట్ వద్దకు రానీయకుండా ట్రాక్టరు అడ్డుపెట్టి అడ్డుకుంటున్నారు. అదేమని అడిగితే.. ‘ప్లాంట్ మాది, మీకు నీళ్లులేవు’.. అంటూ చెబుతున్నారు. అంతేకాక.. చుట్టుపక్కల గ్రామాలకు ఫోన్చేసి మాదిగోళ్లు వస్తే ఎవరూ నీళ్లు ఇవ్వొద్దంటూ చెబుతున్నారు. నీళ్లులేక రెండ్రోజులుగా అల్లాడుతున్నాం.– చెరుకూరి ఏసు, దళితుడు -
శ్రీకాళహస్తిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీల రగడ
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ, జనసేన ఫ్లెక్సీల రగడ తారస్థాయికి చేరింది. జనసైనికుల ఫ్లెక్సీలను పురపాలక సంఘ టౌన్ప్లానింగ్ అధికారి తొలగించడంతో జనసేన ఇన్చార్జ్ కోట వినుత భర్త చంద్రబాబు ఆధ్వర్యంలో స్థానిక బాలుర జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద నిరసనకు దిగారు. తమ ఫ్లెక్సీలను మాత్రమే ఎందుకు తీశారని కమిషనర్ను నిలదీశారు. టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు తీయలేదని మండిపడ్డారు.గంటకుపైగా నిరసన వ్యక్తం చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఎమ్మెల్యే సు«దీర్రెడ్డి ఫ్లెక్సీని అధికారులు తొలగించారు. అనంతరం వినుత కటౌట్ను శరవణ సూపర్ మార్కెట్ వద్ద ఉండగా దానిని తొలగించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పురపాలక సంఘ అధికారులు తొలగించకుంటే తామే తొలగిస్తామని అధికారులతో రచ్చకు దిగారు. మీడియా ప్రతినిధులపై దాడి శరవణ సూపర్మార్కెట్ సమీపంలో టీడీపీ నాయకులు జనసేన నాయకుల ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేస్తుండగా.. అక్కడ కవరేజీకి వచి్చన సాక్షి విలేకరి, మరో రిపోర్టర్పై టీడీపీ నాయకులు దాడికి దిగారు. అక్కడి నుంచి తప్పించుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్న విలేకరులపై స్టేషన్ బయట దాదాపు 30 మంది దాడికి తెగబడ్డారు. చివరకు రిపోర్టర్లు పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తి ఫిర్యాదు స్వీకరించాలని కోరారు. అయితే రిపోర్టర్లపైనే కేసు నమోదు చేస్తామని పోలీసులు బెదిరించారు. ఈ విషయంపై కొందరు డీఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో డీఎస్పీ అర్ధరాత్రి స్టేషన్ వద్దకు చేరుకున్నారు. రిపోర్టర్లపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
తెలంగాణలో " కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ "
-
కొండపల్లి ‘పోడుభూమి’ రణరంగం
సాక్షి, పెంచికల్పేట్: కొండపల్లి ‘పోడుభూమి’రణరంగమైంది. గిరిజనులకు, పోలీసులకు మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. పోలీసులపైకి గిరిజన రైతులు, మహిళలు రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అటవీ భూముల్లో ప్లాంటేషన్ నిలిపివేయాలని, పోడు రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత పాల్వాయి హరీశ్బాబు రెండురోజులుగా నిరవధిక దీక్ష చేపట్టారు. అర్ధరాత్రి దీక్షా శిబిరం వద్దకు జిల్లాస్థాయి అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.హరీశ్బాబుతోపాటు పార్టీ జిల్లా కార్యదర్శి కొంగ సత్యనారాయణను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించడంతో మహిళలు, రైతులు తిరగబడి రాళ్ల దాడికి దిగారు. దీంతో కాగజ్నగర్ రూరల్ సీఐ, పెంచికల్పేట్ ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. పోలీసులను అడ్డుకున్న గ్రామస్తులు హరీశ్బాబును రెబ్బెన వైపు వాహనంలో తరలించగా.. మరో పోలీసు అధికారుల బృందం కొండపల్లి మీదుగా పెంచికల్పేట్ చేరుకోవటానికి బయలుదేరింది. దీంతో కొండపల్లి పొలిమేర్లలో పోలీసుల వాహనాలను మహిళలు అడ్డుకున్నారు. హరీశ్బాబును విడిచిపెట్టాలని భీష్మించుకు కూర్చున్నారు. పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం వేకువజాము 4 గంటల వరకూ పోలీసులను ఘెరావ్ చేశారు. ఆసిఫాబాద్ ఏఎస్పీ అచ్చేశ్వర్రావు అదనపు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన మహిళా కానిస్టేబుల్స్ తిరుపతిబాయి, కోమలి రెబ్బెనలో పోలీసు వాహనాల అడ్డగింపు బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామం మీదుగా పోలీసులు హరీశ్బాబును తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న గ్రామస్తులు అదే రాత్రి 12 గంటల సమయంలో పెద్దసంఖ్యలో రోడ్డుకు అడ్డుగా నిలిచారు. పోలీసు వాహనాలను ఆపేసి టైర్లలో గాలిని తీసేశారు. వాహనంలో ఉన్న హరీశ్బాబును తీసుకునివెళ్లారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారని, మహిళల కళ్లలో కారం చల్లి ఇష్టారీతిన వ్యవహరించారని హరీశ్బాబు విమర్శించారు. పలువురిపై కేసు నమోదు కొండపల్లిలో పోలీసులపై దాడికి పాల్పడి, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లు పెంచికల్పేట ఎస్సై రమేశ్ తెలి పారు. బీజేపీ నేతలు పోలీసుల కళ్లలో కారంకొట్టి దాడి చేశారని, కాగజ్నగర్ రూరల్ సీఐ, ఎస్సై, ఇద్దరు మహిళాకానిస్టేబుళ్లు, ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆరు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారని, దాడులకు పాల్పడిన వారిపై కేసు నమెదు చేశామని వివరించారు. -
ఒంగోలులో టీడీపీ అరాచకం
సాక్షి, ఒంగోలు సిటీ: ఒంగోలు అగ్జిలీయం పాఠశాలలోని పోలింగ్ బూత్ల్లో తెలుగుదేశం ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్లో కూర్చుని పోలింగ్ ఆపించారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు బాలినేని శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొని పోలింగి తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు. గోరంట్ల కాంప్లెక్సు వద్ద బాలినేని వాహనాలు, దామచర్ల వాహనాలు ఎదురయ్యాయి. అక్కడ వారి అభిమానులు, కార్యకర్తలు గుమిగూడారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ నాయకుడు ప్రసాద్పై దౌర్జన్యం చేయడంతో పాటు పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయమై గొడవ జరిగింది. డీఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. దామచర్లను అక్కడి నుంచి పంపించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గొడవకు దిగకుండా బాలినేని వారిని నియంత్రించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఒంగోలు ఏబీఎం కళాశాల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను పోలీసుల సహకారంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు భయభ్రాంతులకు గురి చేశారు. డీఎస్పీ అక్కడికి చేరుకొని వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు గుమిగూడారు. ముగ్గురు ఏజెంట్లను అరెస్టు చేశారు. బాలినేని డీఎస్పీతో మాట్లాడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను విడిపించారు. ఒంగోలులో దామచర్ల జనార్దన్ అనుచరులు కొన్ని ప్రాంతాల్లో దౌర్జన్యాలకు దిగారు. వారికి ఉన్న పోలీసు పలుకుబడిని ఉపయోగించి కార్యకర్తలపై కేసులు పెట్టించారు. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దౌర్జన్యానికి దిగారు. బాలినేని, కాకుమాని రాజశేఖర్ వంటి నాయకులు టీడీపీ అరాచకాలను దీటుగా ఎదుర్కొన్నారు. అగ్జిలియం, ఏబీఎం వద్ద జరిగిన సంఘటనలు కొద్దిపాటి ఉద్రిక్తలకు దారి తీశాయి. టీడీపీ నాయకులు బెదిరింపులకు దిగారు. ఓపీఎస్ పోలింగ్ బూత్ వద్ద కొందరు టీడీపీ మహిళలు వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకొనే పనిలో పడ్డారు. దీన్ని అక్కడున్న నాయకులు భాస్కర్రెడ్డి, నాగిరెడ్డి తదితరులు టీడీపీ మహిళా కార్యకర్తలను అడ్డుకున్నారు. పోలీసుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఓపీఎస్ వద్దకు చేరుకున్నారు. -
జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస
-
ఎస్వీయూలో విద్యార్ధుల ఘర్షణ
-
పరిటాల సునీత,సూరి వర్గాల మధ్య ఘర్షణ
-
వైఎస్ఆర్ సీపీ,టీడీపీ మధ్య బాహాబాహీ
-
ఆయన... ఈయన... మధ్యలో పొరపొచ్చాలు
కొనసా...గుతున్న తాత్కాలిక ఈవో పాత ఈవో, కొత్త ఈవో మధ్య పొరపొచ్చాలు నేడు కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష విజయవాడ : రాజధాని ప్రాంతంలో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి ప్రస్తుతం తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ అధికారి పాలనలో ఉంది. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో సీహెచ్ నర్సింగరావు మార్చి రెండో వారంలో పక్షం రోజులు సెలవు పెట్టి వెళ్లారు. ఆ పక్షం రోజులకు తాత్కాలిక ఈవోగా చంద్రశేఖర్ ఆజాద్ను నియమించారు. నర్సింగరావు తిరిగి విధుల్లోకి చేరినా ఆయన్ను ఈవోగా నియమించలేదు. కనీసం చంద్రశేఖర్ ఆజాద్ను పర్మినెంట్ ఈవోగా ప్రకటించలేదు. ఈ ఇద్దరు కాకుండా మరొకరిని నియమించాలని ప్రభుత్వం భావించినా ఆ నిర్ణయం వేగవంతంగా తీసుకోవడం లేదు. దుర్గగుడి ఈవో నియామకంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరలో మూడు ప్రధాన ఉత్సవాలు ఆగస్టులో కృష్ణానది పుష్కరాలు, ఆ తరువాత అక్టోబర్లో దసరా ఉత్సవాలు, డిసెంబర్లో భవానీ దీక్షలు జరుగనున్నాయి. ఉత్సవాలకు కొద్ది రోజులు ముందుగా పర్మినెంట్ ఈవోను నియమిస్తే ఆయనకు దేవస్థానంపై అవగాహన ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సులభమవుతుంది. గురువారం కృష్ణా పుష్కరాలపై చర్చించేందుకు దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో పర్మినెంట్ ఈవో నియామకంపై నిర్ణయం తీసుకుంటే మేలని పలువురు సూచిస్తున్నారు. అభివృద్ధి పనుల్లో ఇన్చార్జీదే నిర్ణయం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇన్చార్జి ఈవో చంద్రశేఖర్ ఆజాద్ నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఇందులో కొన్ని వివాదాస్పదమవుతున్నాయి. ము ఖ్యంగా దేవస్థానం ఎదురుగా ఓ భక్తుడు లక్షలు వెచ్చిం చి నిర్మించిన షెడ్ను ఆ భక్తుడి చేతే తొలగించాలని తీసుకున్న నిర్ణయంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. అలాగే అమ్మవారి కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రపరిచే స్ట్రాంగ్రూం కొండ దిగువకు మార్చాలనే తాత్కాలిక ఈవో ఆజాద్ నిర్ణయాన్ని గత ఈవో సీహెచ్ నర్సింగరావు తిరస్కరించారు. అమ్మవారి విలువైన ఆభరణాలు భద్రత లేని చోట పెట్టేందుకు తాను సుముఖంగా లేనని తిరస్కరించారు. మల్లికార్జున మహామండంలో పనులు పూర్తి కాలేదు. నాణ్యత సరిగా లేదని గత ఈవో బిల్లులు నిలిపివేశారు. అన్నదాన భవ నం, ప్రసాదాల తయారీ భవనాలను తరలించాలనే నిర్ణయాలపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్మినెంట్ ఈవో ఉంటే బాగుంటుందనే భావన అందరిలోనూ నెలకొంది. దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.