-
సివిల్స్ టాపర్ ఆదిత్య
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ –2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్ రామ్కుమార్కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది. సివిల్స్–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc. gov. in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు సివిల్ సర్వీసెస్ పరీక్షలో నెగ్గి, కేంద్ర సర్వీసులకు ఎంపికైన విజేతలకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. వారి అంకితభావం, శ్రమకు తగిన ప్రతిఫలం లభించిందని పేర్కొన్నారు. విజేత కృషి, ప్రతిభ దేశ భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్ ►సివిల్స్ తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్ లో తన ఆప్షనల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ (బీటెక్) పూర్తిచేశారు. ►రెండో ర్యాంకర్ అనిమేశ్ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ అభ్యసించారు. సివిల్స్ మెయిన్స్ లో ఆప్షనల్గా సోషియాలజీని ఎంచుకున్నారు. ►తెలుగు యువతి, సివిల్స్ మూడో ర్యాంకర్ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్(ఆనర్స్) జాగ్రఫీ చదివారు. సివిల్స్ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ. -
తెలంగాణకే నా సర్వీస్: ధాత్రిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సేవలందించడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని సివిల్స్ 46వ ర్యాంకర్ ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. 2018 సివిల్స్లో 233వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న ఆమె త్వరలో ట్రైనీ ఏసీపీగా ఖమ్మంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. తాజాగా సివిల్స్–2019లో 46వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్న యాదాద్రిభువనగిరి జిల్లా ముద్దుబిడ్డ ధాత్రిరెడ్డి.. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా తెలంగాణకే సేవలందిస్తానని బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. ఈజీగానే ఇంటర్వ్యూ ఈ ఏడాది జూలై 10కి నేషనల్ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో ఫేజ్–వన్ ఐపీఎస్ శిక్షణ పూర్తయింది. తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో ఈ నెలాఖరుకు శిక్షణ పూర్తవుతుంది. అంతలోనే 2019 సివిల్స్కు ప్రిపేరై 46వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఎన్పీఏలో శిక్షణ సమయంలోనే 2019 సివిల్స్ ఇంటర్వ్యూకు ప్రిపేరయ్యా. కరెంట్ ఎఫైర్స్ కోసం రెగ్యులర్గా పత్రికలు ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ, హబీలు, ఇంట్రెస్ట్, ప్రీవియస్ వర్క్పై అడుగుతారని అందుకు తగ్గట్టు ప్రిపేరయ్యా. అయితే ఇంటర్వ్యూ ఈజీగానే అయిపోయింది. ఏదైనా ఇష్టమే.. లక్కీ ప్లేస్లో ఉన్నా సివిల్స్ రాయాలని ఎప్పుడైతే అనుకున్నానో.. ఐఏఎస్, ఐపీఎస్ ఏదొచ్చినా ఫర్వాలేదనుకున్నా. రెండు సర్వీసులూ ఇష్టమే. నిజానికి నేను చాలా లక్కీ ప్లేస్లో ఉన్నా. సాధారణంగా ఒకరికి ఒక్కటి రావడమే ఎక్కువ. నాకు చాయిస్ ఉంది. ఐపీఎస్ తెలంగాణ క్యాడర్ నాది. ఇక్కడే వర్క్ చేయాలని ఉంది. ఐఏఎస్లో కేటాయించే క్యాడర్ను బట్టి నిర్ణయం ఉంటుంది. ఏదేమైనా ప్రజాసేవకు మరింత చేరువవుతా. ఇంట్లోనే ప్రిపరేషన్ నాన్న పి.కృష్ణారెడ్డి, తల్లి పి.సుశీల, తమ్ముడు గ్రీష్మన్రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ కూడా గైడ్ చేసేవారు. హైదరాబాద్లోనే ఇంట ర్ వరకు చదివా. ఐఐటీ ఖరగ్పూర్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. ముంబై, లండన్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, డ్యూట్చి బ్యాంక్లో జాబ్ చేశా. ఆపై ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం తో చిన్నప్పటి కల సివిల్స్ వైపు అడుగులు వేశా. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్కు కూడా వెళ్లా. నచ్చకపోవడంతో వదిలేసి హైదరాబాద్ వచ్చేశా. సరూర్నగర్లోని మా ఇంటి పక్కనే ఓ ప్రైవేట్ లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నది లేదు. సేవంటే మహా ఇష్టం 2016లో ఫీడ్ ఇండియా ఎన్జీవో మొదలెట్టాం. హోటల్స్, క్యాంటీన్లలో ఆహారం మిగిలితే దాన్ని వృద్ధ, అనాథాశ్రమాల్లో పంచేవాళ్లం. ఇందుకోసం క్లింటన్ గ్లోబల్ ఫౌండేషన్ ఇండియా నుంచి మా ఐడియా రిప్రజెంట్ చేయడానికి మియామి వెళ్లాను. స్కూలింగ్ నుంచే ఐపీఎస్ కావాలనేది నా కల. అది నెరవేరడం సంతోషంగా ఉంది. -
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ మెయిన్స్ పరీక్ష 2018 ఫలితాలను గురువారం విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మెయిన్స్ పరీక్షలు 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. కమిషన్ విడుదల చేసిన ఫలితాలలో 1994 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరగనున్నాయి. అభ్యర్థులు upsc.gov.in, upsconline.nic.in వెబ్సైట్ల ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. -
సివిల్స్ మెయిన్స్..‘ఆప్షనల్’ ఎంపికలో..!
సివిల్స్ మెయిన్ ఎగ్జామినేషన్లో మెరిట్ జాబితా రూపకల్పనకు పరిగణనలోకి తీసుకునే ఏడు పేపర్లలో రెండు పేపర్లు ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించినవి. అభ్యర్థులు యూపీఎస్సీ నిర్దేశించిన ఆప్షనల్ సబ్జెక్టుల జాబితా నుంచి దీన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలపై ఆప్షనల్ సబ్జెక్టు చూపే ప్రభావం గురించి అభ్యర్థుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ‘ఫలానా ఆప్షనల్ స్కోరింగ్గా ఉందని లేదా ఫలానా ఆప్షనల్లో సిలబస్ సులభంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఏ సబ్జెక్టు అయినప్పటికీ యూపీఎస్సీ.. మూల్యాంకన కోణంలో స్కేలింగ్ విధానాన్ని అనుసరిస్తూ అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సమన్యాయం చేసేలా వ్యవహరిస్తోందని నిపుణులు అంటున్నారు. అందువల్ల ఆప్షనల్ విషయంలో ఆందోళనకు గురికాకుండా స్వీయ సామర్థ్యం మేరకు సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆసక్తికి ప్రాధాన్యం ఆప్షనల్ సబ్జెక్టు ఎంపిక విషయంలో అభ్యర్థులు ముందుగా తమ ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలనేది నిపుణుల అభిప్రాయం. వ్యక్తిగత ఆసక్తితో ఆప్షనల్ను ఎంపిక చేసుకుంటే ఆ సబ్జెక్టు సిలబస్ ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ విజయం సాధించొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మ్యాథమెటిక్స్ అంటే అకడమిక్ పరీక్షల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందికరంగా భావిస్తారు. అలాంటి సబ్జెక్టును సివిల్స్–2014 మెయిన్స్లో 351 మంది ఆప్షనల్గా ఎంపిక చేసుకున్నారు. వీరిలో 35 మంది విజేతలుగా నిలిచారు. మెడికల్ సైన్స్ సబ్జెక్టును 356 మంది ఎంపిక చేసుకోగా, 71 మంది విజేతలుగా నిలిచారు. ఆసక్తి ఉంటే ఏ సబ్జెక్టును ఎంపిక చేసుకున్నప్పటికీ విజయం సాధించొచ్చనే దానికి ఈ గణాంకాలే నిదర్శనం. సిలబస్ పరిశీలన తర్వాతి దశలో అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్ సిలబస్ను పరిశీలించాలి. అందులోని అంశాలపై పరీక్ష సమయానికి తాము సంసిద్ధత పొందగలమా? లేదా? అని బేరీజు వేసుకోవాలి. కేవలం స్కోరింగ్ పేరుతో ఒక ఆప్షనల్ను తీసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సిలబస్తో పాటు సదరు ఆప్షనల్ సబ్జెక్టు గత ప్రశ్నపత్రాలను కూడా పరిశీలించడం ద్వారా మరింత స్పష్టత వస్తుంది. మెటీరియల్ లభ్యత సాధారణంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, లాంగ్వేజ్ లిటరేచర్ వంటి ఆప్షనల్స్కు మార్కెట్లో ప్రామాణిక మెటీరియల్ లభ్యత బాగుంటుంది. మరోవైపు తమ అకడమిక్ నేపథ్యానికి అనుగుణంగా కోర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అభ్యర్థులకు మాత్రం మెటీరియల్ లభ్యత కొంత తక్కువే. వీరు తమ అకడమిక్ పుస్తకాలను, ఇతర ఐసీటీ టూల్స్ ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్ సాగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కొంత సమయం వృథా అవుతుంది. అయితే.. అకడమిక్స్ పరంగా అన్ని విభాగాల్లో మెరుగ్గా ఉన్న అభ్యర్థులు సంబంధిత ఆప్షనల్ను ఎంపిక చేసుకున్నప్పటికీ సులువుగానే విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. స్వీయ ప్రిపరేషన్ ఇటీవల కాలంలో కొందరు అభ్యర్థులు ఉద్యోగాలు చేస్తూనో, లేదా శిక్షణ పొందే అవకాశాలు లేకపోవడం కారణంగా స్వీయ ప్రిపరేషన్ సాగించి విజయం సాధిస్తున్నారు. వీరికి దోహద పడుతున్న అంశం ఆప్షనల్ ఎంపికలో శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించడం. ఈ అంశాన్ని ఔత్సాహికులు గుర్తించాలి. సరితూగే సబ్జెక్టు లేకుంటే.. ప్రస్తుతం సివిల్స్ మెయిన్ ఎగ్జామినేషన్లో భాషా సాహిత్యం సహా అందుబాటులో ఉన్న ఆప్షనల్ సబ్జెక్టుల సంఖ్య 27. ఈ సబ్జెక్టులను అకడమిక్గా అన్ని నేపథ్యాల వారికి సరితూగే విధంగా నిర్దేశించారు. అయితే వీటిలో ఏ సబ్జెక్టు కూడా నచ్చని అభ్యర్థులు లేదా కాంపిటీటివ్ ఎగ్జామ్ కోణంలో సదరు సబ్జెక్టుల సిలబస్ విషయంలో ఆందోళన చెందే అభ్యర్థులు... తాము హైస్కూల్ స్థాయిలో ఆసక్తి కనబరిచిన సబ్జెక్టును అవలోకనం చేసుకుని.. దాని ఆధారంగా ఆప్షనల్ సబ్జెక్టును ఎంపిక చేసుకోవడం ద్వారా కొంతమేరకు సమస్యను అధిగమించొచ్చు. భాషా సాహిత్యం ఆప్షనల్ ఎంపికలో ఇటీవల కాలంలో పలువురు భాషా సాహిత్యం సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. మెటీరియల్ లభ్యత, గైడెన్స్, సులువుగా అవగతం చేసుకునే అవకాశాలే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా మాతృభాషలో ప్రజెంటేషన్ వల్ల వేగం, కచ్చితత్వంతో వ్యవహరించొచ్చనే ఉద్దేశంతో లాంగ్వేజ్ లిటరేచర్ను ఆప్షనల్గా ఎంచుకుంటున్నారు. 2014లో తెలుగు లిటరేచర్ ఆప్షనల్తో 122 మంది హాజరవగా.. 2015లో ఆ సంఖ్య 132. సక్సెస్ రేటు కూడా రెండేళ్లకు కలిపి సగటున 10.5 శాతంగా నమోదైంది. మాతృభాష (తెలుగు)లో పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పరంగానూ తెలుగు లిటరేచర్ను ఆప్షనల్గా తీసుకునే వారి సంఖ్య దాదాపు పది శాతం వరకు ఉంటోంది. పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులు మెయిన్స్ ఆప్షనల్ ఎంపిక విషయంలో కొంత వినూత్నంగా వ్యవహరించడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు. ఈ క్రమంలో పోటీ తక్కువ ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకోవడం మేలు చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అకడమిక్ స్థాయిలో సదరు సబ్జెక్టుపై పూర్తి స్థాయిలో పట్టు సాధించిన అభ్యర్థులు అదే సబ్జెక్టును ఆప్షనల్గా ఎంపిక చేసుకుంటే పరీక్షలో మెరుగ్గా వ్యవహరించొచ్చు. ఉదాహరణకు ఎకనామిక్స్, మేనేజ్మెంట్, లా వంటి సబ్జెక్టులను తీసుకుంటే వీటిని ఎంపిక చేసుకునే వారి సంఖ్య సగటున 200 ఉంటోంది. అంతేకాకుండా వీటి సక్సెస్ రేటు కూడా ఇతర క్రేజీ సబ్జెక్టుల తరహాలోనే ఉంటోంది. పాపులర్ ఆప్షన్స్గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టులు ఇటీవల కాలంలో స్కోరింగ్ పరంగా పాపులర్ ఆప్షన్గా నిలుస్తున్న ఇతర సబ్జెక్టుల విషయానికొస్తే.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ముందు వరుసలో నిలుస్తున్నాయి. 15 వేల నుంచి 16 వేల మంది వరకు హాజరయ్యే మెయిన్ ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్టుల అభ్యర్థులే దాదాపు తొమ్మిది నుంచి పది వేల మంది వరకు ఉంటున్నారు. వీటికి సంబంధించి మెటీరియల్ లభ్యత, సరళీకృత అంశాలు, గైడెన్స్ పరంగా ఫ్యాకల్టీ లభ్యత వంటి అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు.. తాము ప్రిపరేషన్కు కేటాయించే మొత్తం సమయంలో 30 నుంచి 40 శాతం సమయాన్ని ఆప్షనల్ సబ్జెక్టుకు కేటాయించాలి. రిసోర్సెస్ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి ఆప్షనల్ ఎంపికలో అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు సిలబస్ అంశాలను బేరీజు వేసుకొని, దానికి సంబంధించి రిసోర్సెస్ లభ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. కొందరు అకడమిక్గా ఒక సబ్జెక్టులో మెరుగైన ప్రతిభ చూపినప్పటికీ.. పోటీ పరీక్షల కోణంలో రాణించలేరు. అలాంటి అభ్యర్థులు కొంచెం సులువుగా ఉండే హ్యుమానిటీస్కు సంబంధించిన ఆప్షనల్స్ తీసుకోవడం మేలు. అందుకే ఇటీవల కాలంలో బీటెక్, మ్యాథమెటిక్స్ నేపథ్యం ఉన్న అభ్యర్థులు కూడా పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. – వి.గోపాలకృష్ణ, బ్రెయిన్ ట్రీ అకాడమీ. సత్తాను బేరీజు వేసుకోవాలి అకడమిక్ నేపథ్యానికి సంబంధించిన ఆప్షనల్ను ఎంపిక చేసుకునే క్రమంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందులో రాణించే సత్తాను బేరీజు వేసుకోవాలి. అకడమిక్స్కు పూర్తి భిన్నమైన సబ్జెక్టును ఆప్షనల్గా ఎంచుకుంటే (ఉదాహరణకు ఇంజనీరింగ్ విద్యార్థులు సోషియాలజీ, సైకాలజీ వంటివి) ప్రిపరేషన్ పరంగా అన్వయ సామర్థ్యంపై అవగాహన పెంపొందించుకొని నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా తెలుగు మీడియంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు.. ఇంగ్లిష్ మీడియంలో ఉండే మెటీరియల్ను తెలుగులోకి అనువాదం చేసుకోవడంలో సులభంగా ఉండే సబ్జెక్ట్లను ఎంపిక చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. – పి.అన్వేష రెడ్డి, సివిల్స్ విజేత. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
సివిల్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో ‘రాయడం ప్రాక్టీస్’ చేయడమనేది కీలకమైన అంశం. ఎందుకంటే ఓ అంశానికి సంబంధించి ఎంతటి పరిజ్ఞానం, అవగాహన ఉన్నప్పటికీ రాతపూర్వకంగా సరిగా వ్యక్తీకరించకుంటే ఫలితం శూన్యం! వీలైనన్ని మాక్టెస్ట్లు రాయడం ద్వారా లోపాలను అధిగమించి, రాత తీరును మెరుగుపరుచుకోవచ్చు. సమకాలీన అంశాలపై ఎస్సేలు రాసి, నిపుణులతో దిద్దించుకోవాలి. దీనివల్ల బలాలు, బలహీనతలు తెలుస్తాయి. మెరుగుపరచుకోవాల్సిన అంశాలపై స్పష్టత వస్తుంది. రోజూ జనరల్ స్టడీస్, ఆప్షనల్ ప్రిపరేషన్కు సమయం కేటాయించాలి. ఉదయం జనరల్ స్టడీస్ చదివితే, సాయంత్రం ఆప్షనల్ సబ్జెక్టు చదవాలి. సమయం ఎక్కువగా అందుబాటులో ఉండదు కాబట్టి ఒకట్రెండు పేపర్లతోపాటు ఒక ప్రామాణిక మ్యాగజైన్కు పరిమితమవ్వాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ చదివామనే దానికంటే చదివిన విషయం ఎంత వరకు గుర్తుంది అనేది ప్రధానం. అందుకే పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. సామాజిక, ఆర్థిక సర్వే; బడ్జెట్, ముఖ్యమైన కమిటీల నివేదికలు వంటి వాటిని అధ్యయనం చేయడం ముఖ్యం. రాష్ట్రపతి, ప్రధానిమంత్రి ప్రసంగాలపై దృష్టికేంద్రీకరించాలి. ఎందుకంటే వీటి ద్వారా వివిధ అంశాలకు సంబంధించిన ప్రభుత్వ ఆలోచన ధోరణి తేటతెల్లమవుతుంది. సమాధానం రాసేటప్పుడు ఒక ‘ఆఫీసర్’గా రాయాలి. ఆఫీసర్ అయినట్లు ఊహించుకుని సమాధానం రాస్తే మరింత ప్రాక్టికల్గా రాసే అవకాశం లభిస్తుంది. ఏదైనా సమస్య పరిష్కారానికి సూచనలు ఇచ్చేటప్పుడు క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా అమలు చేయడానికి వీలయ్యే వాటిని సూచించాలి. సమాధానాల్లో నెగిటివ్ అభిప్రాయాలను రాయొద్దు. అన్నీ సమస్యలే.. అంతా అవినీతిమయం, ఏమీ చేయలేం.. వంటి నిరాశాజనక అభిప్రాయాలను కాకుండా ‘‘తప్పులున్నాయి.. వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశముంది..’’ అనే సానుకూల ధోరణిని ప్రతిబింబించాలి. జనరల్ స్టడీస్ పేపర్-4 ప్రిపరేషన్కు ఇగ్నో మెటీరియల్ను సేకరించి వాటిలోని కేస్ స్టడీలను అధ్యయనం చేయాలి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
చెన్నైకి గేమ్
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement