Chopra pariniti
-
అక్టోబర్ 22 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు... పరిణీతి చోప్రా (నటి), కిటూ గిద్వానీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. వీరు పుట్టిన తేదీ 22. ఇది కూడా రాహు సంఖ్యే. రాహుగ్రహ అనుకూల ప్రభావం వల్ల వీరు ఈ సంవత్సరం సాంకేతిక, వైజ్ఞానిక రంగాలలో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. సొంత ఇంటికల నెరవేరుతుంది. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. కొత్త బంధాలు ఏర్పడి, వాటిని లాభదాయకంగా మార్చుకోగలుగుతారు. అయితే రాహుగ్రహ ప్రతికూల ప్రభావం వల్ల కోర్టు వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సామరస్య ధోరణి మంచిది. అవివాహితులకు మంచి సంబంధాలు కుదిరి, అనుకూలమైన జీవిత భాగస్వామి లభిస్తారు. అయితే, ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు. ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారి కోరిక నెరవేరుతుంది. రాజకీయనాయకులకు పదవులు వరిస్తాయి. అయితే మితిమీరిన క్రమశిక్షణ పాటించడం వల్ల తోటి ఉద్యోగుల అసహనానికి, విమర్శలకు గురవుతారు.అధికారుల ఆగ్రహానికి కూడా గురై ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి రావచ్చు కాబట్టి అతి అనర్థదాయకం అని గ్రహించి, దూకుడు తగ్గించుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1, 2, 4,5,6; లక్కీ కలర్స్: వయొలెట్, క్రీమ్, పర్పుల్, బ్లూ, ఎల్లో; లక్కీడేస్: శని, ఆది, బుధవారాలు. సూచనలు: అహంకారాన్ని తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవటం, దుర్గాదేవిని ఆరాధించడం, పేదవితంతువులకు సాయం చేయడం, వీధికుక్కలకు రొట్టెలు తినిపించడం మంచిది. పొట్లకాయకు, చికెన్కు దూరంగా ఉండటం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
యప్ టీవీ ఇంటర్నెట్ టీవీ ప్రసారాలు ఇండియాలో ప్రారంభం
ఇండియాలో యప్టీవీ ప్రసారాలను ప్రారంభించిన బ్రియన్ లారా ఈ ఏడాది వ్యాపార లక్ష్యం 195 కోట్లు దక్షిణాసియా దేశాలపై దృష్టి యప్టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇండియాలో ఇంటర్నెట్ టీవీ ప్రసారాలను యప్ టీవీ లాంఛనంగా ప్రారంభించింది. దీంతో 12 భాషల్లో 200కి పైగా చానల్స్ కార్యక్రమాలను ఎప్పుడైనా చూసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. బుధవారం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో యప్టీవీ ఇండియా ప్రసారాలను వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ బ్రియన్ లారా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యప్ టీవీ ఫౌండర్, సీఈవో ఉదయ్ రెడ్డి మాట్లాడుతూ 5,000కు పైగా సినిమాలు, 100కుపైగా టీవీషోలతో పాటు, గత వారం రోజుల నాటి కార్యక్రమాలను మీకు నచ్చిన సమయంలో చూసుకోవచ్చన్నారు. ప్రస్తుతం 150కిపైగా దేశాల్లో యప్ టీవీ ప్రసారాలు అందుబాటులో ఉన్నాయని, రానున్న కాలంలో దక్షిణాసియా, స్పానిష్ దేశాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. విస్తరణ కార్యక్రమాల కోసం రూ. 325 కోట్లు (50 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ నిధుల సేకరణ చర్చల దశలో ఉందని, వచ్చే నాలుగైదు నెలల్లో ఇది పూర్తవుతుందన్నారు. ఇంత వరకు రూ. 72 కోట్లు (11 మి.డాలర్లు) సమీకరించినట్లు తెలిపారు. ఈ ఏడాది మరిన్ని దేశాలకు విస్తరించడంతో ఆదాయంలో రెట్టింపు వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. గతేడాది రూ.104 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది రూ.195 కోట్లకు చేరవచ్చన్నారు. ఎలాంటి బఫరింగ్ లేకుండా టీవీ ప్రసారాలను చూసేలా టెక్నాలజీని అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడతూ వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ బ్రాడ్బ్యాండ్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. -
ఆ వీక్నెస్ను వదులు కోలేకపోతున్నా!
ఇప్పుడంతా జీరోసైజ్ ట్రెండ్. స్లిమ్గా ఉండే కథానాయికలకే సూపర్క్రేజ్. అందుకే బాలీవుడ్లో చాలా మంది హీరోయిన్లు సన్నబడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడా లిస్ట్లో పరిణీతి చోప్రా కూడా చేరారు. ఇటీవలే తన లేటెస్ట్ ఫొటోలతో చక్కనమ్మ చిక్కినా అందమే అనేలా మునపటి కన్నా అందంగా తయారయ్యారు. ఇక బొద్దుగా కాకూడదని ఫిక్స్ అయి డైటింగ్ చేస్తున్నారట. డైలీ రొటీన్ నుంచి తనకెంతో ఇష్టమైన చాక్లెట్స్, కేక్స్ను తీసేశారట. కానీ ఎప్పటి నుంచో తనకున్న పిజ్జా వీక్నెస్ను మాత్రం వదులుకోలే కపోతున్నారు. ఎక్కడైనా పిజ్జా కనిపిస్తే చాలు, ఆమె తన జిహ్వ చాపల్యాన్ని అదుపుచేసుకోలేకపోతున్నారట. అందుకే ఇంత స్ట్రిక్ట్గా డైటింగ్ను ఫాలో అవుతున్నా సరే, పిజ్జా తినాలనిపించి నప్పుడు మెల్లగా లాగించేస్తున్నారు. తీరా తిన్నాక మాత్రం ‘అయ్యో’ అంటూ బాధపడుతున్నారట.