-
గోడపై ‘కోడ్’?
మీ ఇల్లు లేదా ఆఫీసు గోడపై ఎక్కడో ఓ చోట ఒకటి, రెండంకెల నంబర్లు లేదా అక్షరాల రూపంలో ఏమైనా రాసి ఉన్నాయా? అయితే చెడ్డీ గ్యాంగ్ కన్నేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంకెలు, అక్షరాల రూపంలో కోడ్ భాషలోనే చెడ్డీ గ్యాంగ్ కమ్యూనికేషన్ చేసుకుంటుందని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇటీవల మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్ రూ.7.8 లక్షలు చోరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో సాంకేతిక అంశాల ఆధారంగానే దర్యాప్తు సాగుతోంది. టవర్ డంప్ సాంకేతికతతో రెండు అనుమానిత కాల్స్ను పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు ఇళ్లలో చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్.. పాఠశాలలు, కార్యాలయాలపై కూడా కన్నేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇటీవల జరిగిన చోరీ కేసులో తొలుత ఇది చెడ్డీ గ్యాంగ్ పని కాదని మియాపూర్ పోలీసులు భావించారు. చోరీ జరిగిన రోజున పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మీటింగ్ (పీటీఎం) జరగడంతో పాటు సెలవు దినం కావడంతో పాఠశాల యాజమాన్యం, అక్కడి పరిస్థితుల గురించి అవగాహన ఉన్నవాళ్ల పనై ఉంటుందని భావించారు. కానీ, పోలీసుల డేటా బేస్ ఆధారంగా చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సిమెంట్ ఫ్యాక్టరీ, ఓ ప్రైవేట్ ఆఫీసులోనూ చెడ్డీ గ్యాంగ్ ఇదే తరహా చోరీలు చేసినట్లు గుర్తించారు. తాజా కేసులో గుజరాత్లోని దాహోద్ ప్రాంతానికి చెందిన చెడ్డీ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. అర్ధరాత్రే తర్వాతే చోరీలు.. సాధారణంగా ఈ ముఠాలో ముగ్గురు నుంచి నలుగురు సభ్యులుంటారు. ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి రైలు మార్గంలో హైదరాబాద్కు చేరుకుంటారు. స్టేషన్ లోపలి నుంచి బయటికి రావడం, ఆటో లేదా ఇతరత్రా ప్రజా రవాణాలను వీరు వినియోగించరు. సీసీ టీవీ కెమెరాలకు చిక్కకుండా రైలు పట్టాలను పట్టుకొని నడుచుకుంటూ బయటికి వెళ్లిపోతారు. రైల్వే ట్రాక్కు సమీపంలో ఉన్న ఇళ్లు, స్కూళ్లు, ఆఫీసులను రెక్కీ చేస్తారు. చోరీకి బయలుదేరే ముందు సమీప చెట్ల పొదలు, నిర్మానుష్య ప్రాంతాలలో ఒంటి మీద దుస్తులను విప్పేసి, కేవలం లోదుస్తులు మాత్రమే వేసుకుంటారు. ముఖం కనిపించకుండా క్లాత్ను చుట్టుకుంటారు. అర్ధరాత్రి 1–2 గంటల తర్వాతే దొంగతనాలు చేస్తుంటారు. ఆపైన నిర్మానుష్య ప్రాంతాలలో లేదా శివారు ప్రాంతాలలో తాత్కాలికంగా అద్దె ఇళ్లలో తలదాచుకుంటారు. పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి రైలులో సొంతూళ్లకు పరారవుతారు. రెక్కీ, చోరీకి వేర్వేరు బృందాలు.. ముఠా నాయకుడు రెక్కీ, చోరీలను పక్కాగా ప్లాన్ చేస్తాడు. ముఠాలోని ప్రతీ సభ్యుడూ చురుగ్గా, తనకు కేటాయించిన విధులను పక్కాగా నిర్వర్తిస్తాడు. రెక్కీ చేసేందుకు ఇద్దరు, చోరీకి దిగేది ఇద్దరేసి సభ్యుల చొప్పున రెండు వేర్వేరు బృందాలుగా విడిపోతారు. రెక్కీ చేసిన బృందం ఆ సమాచారాన్ని ముఠాలోని ఇంకో గ్రూప్కు చేరవేసేందుకు టార్గెట్ చేసిన ఇల్లు లేదా ఆఫీసు, స్కూల్ గోడల మీద ఒక చోట అంకెలు, అక్షరాల రూపంలో రాతలు రాస్తారు. దీంతో ముఠాలోని చోరీ చేసే బృందం అర్ధరాత్రి చీకట్లో కూడా టార్గెట్ చేసిన ఇంటిని సులువుగా గుర్తిస్తారు. తాళాలను తెరిచేందుకు ఇనుప రాడ్లు, స్క్రూడ్రైవర్ వంటి పదునైన ఆయుధాలను వెంట తీసుకెళ్తారు. ఎవరైనా ఎదురు తిరిగితే వాటితో దాడి చేసేందుకూ వెనుకాడరు. -
మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
మియాపూర్: మియాపూర్ పరిధిలోని ఓ పాఠశాలలో రూ.7.85 లక్షల నగదును చెడ్డీ గ్యాంగ్ దొంగిలించుకుపోయింది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూ హాపీజ్ పేట వరల్డ్ వన్ స్కూల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలోంచి పాఠశాలలోకి చొరబడి రిసెప్షన్లో లాకర్ను పగులగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం పాఠశాల సిబ్బంది వచ్చి చూడగా లాకర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముఖానికి నల్లటి మాస్క్లను ధరించి, చెడ్డీలు వేసుకుని శనివారం అర్ధరాత్రి పాఠశాలలో చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వామ్మో..! చెడ్డీ గ్యాంగ్..! జర జాగ్రత్త..!!
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దొంగల ముఠా సంచారం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు చెడ్డీ గ్యాంగ్ను తలపిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు హెచ్చరించారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలోని కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయాలకు కూత వేటు దూరంలో ఉన్న జయశంకర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీధి కుక్కలు అరవడం మొదలు పెట్టాయి. కొందరు కాలనీవాసులు బయటకు వచ్చి చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఇళ్లలోకి వెళ్లిపోయారు. అనుమానంతో ఉదయాన్నే ఇండ్లలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించగా ఉదయం 3 నుంచి 3.30 ప్రాంతంలో కాలనీలోని శివాలయం, చుట్టూ పక్కల గల్లీలలో ఏడుగురు సభ్యులు గల ఓ దొంగల ముఠా సంచరించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ, రూరల్ పోలీసులు కాలనీవాసులతో మాట్లాడారు. పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తామని, ఆయా కాలనీల్లో గస్తీ దళాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఏవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వాట్సప్ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జయశంకర్ కాలనీకి సమీపంలోని ఓం శాంతి మందిర ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అదే సమయంలో దొంగతనం జరిగింది. ఇంటి యజమాని దేవయ్య ఇటీవలే కుటుంబంతో కలిసి ముంబాయికి వెళ్లాడు. దొంగలు తాళం పగులగొట్టి ఇళ్లంతా చిందరవందర చేశారు. ఇంటిని పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఇక్కడ లేకపోవడంతో ఎలాంటి వస్తువులు చోరీకి గురియ్యాయో తెలియరాలేదు. ఈ చోరీకి పాల్పడింది కూడా చెడ్డీ గ్యాంగే అని భావిస్తున్నారు. జయశంకర్కాలనీ ప్రాంతంలో సీసీ కెమెరాలు చాలా చోట్ల లేవు. ఉన్న కెమెరాలు సైతం సక్రమంగా పనిచేయడం లేదని, ఏవరూ పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కోరుతున్నారు. -
TS Crime News: 'చెడ్డీ గ్యాంగ్' ప్రధాన నిందితుడి అరెస్ట్..!
హైదరాబాద్: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న చెడ్డీ గ్యాంగ్ ప్రధాన నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు గురువారం వివరాలు వెల్లడించారు. హఫీజ్పేట్లోని వసంత విల్లాస్లో 75వ విల్లాలో నివాసం ఉంటున్న రాంసింగ్ కుటుంబంతో సహా ఈ నెల 6న సంగారెడ్డికి వెళ్లాడు. 7న సాయంత్రం అతను తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుజరాత్, ఆంబ్లీ ఖాజురియా గ్రామానికి చెందిన మినమ ముఖేష్ బాయ్ని ఆదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్, మోహనియా నితిన్బాయ్, సుర్మల్ అలియాస్ సుమోతో కలిసి ఆగస్టు 5న లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేసుకున్న వారు రెండు రోజుల పాటు అమీన్పూర్, మియాపూర్ పీఎస్ల పరిధిలో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించారు. 6వ తేదీ రాత్రి అమీన్పూర్ పీఎస్ పరిధిలో మూడు ఇళ్లలో చోరీ చేశారు. ఆ తర్వాత 7న తెల్లవారుజామున వసంత విల్లాస్లో చోరీకి పాల్పడ్డారు. చోరీ సొత్తుతో గుజరాత్కు పారిపోయారు. గుజరాత్లో ఓ చోరీ కేసులో నిందితుడిగా ఉన్న విక్రం బాయ్ దరియా బాయ్ పార్మర్ను దాహోడ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నితిన్ బాయ్, సుర్మల్ అలియాస్ సుమో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల్లో చిక్కకుండా.. నిందితులు మొదట అమీన్పూర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దుస్తులు విప్పి అండర్ వేర్పై తాళ్లసాయంంతో మూడు ఇళ్లలో ప్రవేశించి తాళాలు పగులగొట్టి అందినకాడికి దోచుకున్నారు. అనంతరం దుస్తులు ధరించి హఫీజ్పేట్లోని వసంత విల్లాస్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ కూడా దుస్తులు విప్పి విల్లా వెనక నుంచి లోపలికి ప్రవేశించి రాడ్లతో తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎవరైనా వీరిని అడ్డుకుంటే దాడి చేసేందుకు వెనకాడరని డీసీపీ తెలిపారు. మిగిలిన నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ నంద్యాల నర్సింహా రెడ్డి, మియాపూర్ ఏసీపీ నర్సింహ్మ రావు, సీసీఎస్ ఏసీపీ శశాంక్ రెడ్డి, సీఐలు ప్రేమ్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సినిమా తియ్యడం అనేది మనిషి పుట్టుకతో సమానం: నాగ్ అశ్విన్
సినిమాలలో చిన్న, పెద్ద అనే తేడా ఉండదు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానం. ఒక తల్లి గర్భం దాల్చి నవమాసాలు మోసి జన్మించే వరకు పడే తపనే సినిమా’అని దర్శకుడు నాగ్ అశ్విన్ అన్నారు. అబుజా ఎంటర్టైన్మెంట్ , శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ని యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘చెడ్డి గ్యాంగ్ తమాషా"టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా టీజర్ చూస్తుంటే యంగ్ టీం తో మేము తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమా లాగే ఈ ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’అని అన్నారు. కొత్త టీంతో మేం తీసిన ఈ సినిమా కంటెంట్ నాలుగు గంటలు వస్తే దానిని 2 గంటల 40 నిమిషాలకు తగ్గించడానికి మేము చాలా గర్భ శోకను అనుభవించాం. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని నిర్మాత క్రాంతి కిరణ్ అన్నారు. ‘నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీ వచ్చాను. ఈ సినిమాతో నా 15 ఏళ్ల కల నెరవేరింది. అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా ‘చెడ్డి గ్యాంగ్ తమషా’ చిత్రం ఉంటుంది’అని హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ అన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement