breaking news
charges dropped
-
ఎయిరిండియాకు డ్రీమ్లైనర్ క్రాష్ సెగ
న్యూఢిల్లీ: గతవారం బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానం కుప్పకూలిన నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా బుకింగ్స్, చార్జీలు పడిపోయాయి. దేశ, విదేశీ రూట్లలో బుకింగ్స్ 20 శాతం పడిపోగా, చార్జీలు సైతం సగటున 8–15 శాతం తగ్గాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జూన్ 12న 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్కి బైల్దేరిన కాస్సేపటికే ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఉదంతం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ తగ్గడాన్ని గమనించామని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) ప్రెసిడెంట్ రవి గోసాయి తెలిపారు. అంతర్జాతీయ రూట్లలో బుకింగ్స్ 18–22 శాతం, దేశీయంగా 10–12 శాతం మేర తగ్గినట్లు వివరించారు. అయితే, ఇదంతా తాత్కాలికమే కావచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక ఇండిగో, ఆకాశతో నేరుగా పోటీ ఉన్న దేశీ రూట్లలో ఎయిరిండియా టికెట్ల చార్జీలు 8–12 శాతం తగ్గినట్లు గోసాయి చెప్పారు. అంతర్జాతీయంగా, ముఖ్యంగా యూరప్, ఆగ్నేయాసియా రూట్లలో చార్జీలు 10–15 శాతం క్షీణించినట్లు వివరించారు. పలువురు ప్రయాణికులు ఎయిరిండియా ఫ్లయిట్స్లో ప్రయాణాలను రద్దు కూడా చేసుకున్నట్లు చెప్పారు. ప్రధానంగా కార్పొరేట్, హై–ఎండ్ లీజర్ ప్రయాణికులు ప్రత్యామ్నాయ విమాన సంస్థలకు మళ్లినట్లు వివరించారు. గత వారం రోజులుగా అంతర్జాతీయ రూట్లలో క్యాన్సిలేషన్లు 15–18 శాతం, దేశీ రూట్లలో 8–10 శాతం స్థాయిలో ఉన్నట్లు గోసాయి చెప్పారు. అయితే, ఎయిరిండియా విమానాలు అంతర్జాతీయ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నట్లుగా నియంత్రణ సంస్థలు ధృవీకరిస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి మారొచ్చని వివరించారు. మరోవైపు, ఎయిరిండియా ఫ్లయిట్స్ బుకింగ్స్ 15–20 శాతం వరకు, చార్జీలు కొన్ని రూట్లలో 10 శాతం వరకు తగ్గినట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా చెప్పారు. -
నెట్ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్స్క్రిప్షన్ చార్జీలు
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గించింది. భారత్తో పాటు మరో 115 దేశాలలో సబ్స్క్రిప్షన్ చార్జీలను తగ్గిస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. నెట్ఫ్లిక్స్ 2021లో భారతదేశంలో తక్కువ-ధర సబ్స్క్రిప్షన్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇక్కడ కస్టమర్ ఎంగేజ్మెంట్లో 30 శాతం పెరుగుదలను, వార్షిక ఆదాయంలో 24 శాతం పెరుగుదలను నమోదు చేసింది. భారతీయ మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టిన నెట్ఫ్లిక్స్ మొదటిసారిగా సబ్స్క్రిప్షన్ చార్జీలను 20 నుంచి 60 శాతం తగ్గించింది. ఇదీ చదవండి: కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు గతంలో నెలకు రూ.199 ఉన్న నెట్ఫ్లిక్స్ మొబైల్-ఓన్లీ ప్లాన్ ఇప్పుడు రూ.149లకు తగ్గింది. అలాగే టీవీలు, కంప్యూటర్లు, మొబైల్స్ ఇలా ఎందులో అయినా యాక్సెస్ చేసుకోగలిగే బేస్ సబ్స్క్రిప్షన్ చార్జ్ గతంలో రూ.499 ఉండగా ప్రస్తుతం రూ.199 మాత్రమే. ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ చార్జీలు తగ్గాయి. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా కుటుంబాలు వినోదాలకు చేసే ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. దీంతోపాటు ప్రత్యర్థి కంపెనీ నుంచి గట్టి పోటీని నెట్ఫ్లిక్స్ ఎదుర్కొంటోంది. ప్రస్తుతం చార్జీలు తగ్గించిన దేశాల నుంచి 2022 ఆర్థిక సంవత్సరంలో నెట్ఫ్లిక్స్ వచ్చిన ఆదాయం కేవలం 5 శాతం మాత్రమే. ఇదీ చదవండి: Mukesh Ambani Birthday: వ్యాపారంలోకి రాకముందు ముఖేష్ అంబానీ ఏమవ్వాలనుకున్నారో తెలుసా? -
లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా అరవై మందికి పైగా బాధితులు ఆ సీనియర్ నటుడిపై లైంగిక ఆరోపణలు చేశారు. 2018లో నాటకీయ పరిణామాల మధ్య ఓ కేసులో ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడింది. మూడేళ్లు జైల్లోనూ మగ్గాడు. చివరికి జడ్జి అనూహ్య నిర్ణయంతో ఆయనకు ఊరట లభించింది. ఉన్నపళంగా నటుడు, హాలీవుడ్ నటుడు బిల్ కాస్బీ బుధవారం జైలు నుంచి విడుదల కావడం, తీర్పుపై బాధితుల అసహనంతో తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు. హారిస్బర్గ్: హాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ బిల్ కాస్బీ(83)ని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది పెన్సిల్వేనియా అత్యున్నత న్యాయస్థానం. 2018లో లైంగిక నేరారోపణల కేసులో ఆయనకు మూడు నుంచి పదేళ్ల కారాగార శిక్ష పడింది. అయితే ఈ కేసులో శిక్ష విధించిన జడ్జి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారించాడని, కాస్బీకి శిక్ష విధించబోనని ఒప్పందం కుదుర్చుకుని మరీ శిక్ష విధించడం సరికాదని పెన్సిల్వేనియా ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాదు లిఖిత పూర్వకంగా బాధితుల తరపున ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. కాగా, ఈ కేసులో ఇంతకు ముందు జడ్జి, కాస్బీ నుంచి లైంగిక నేరారోపణలపై స్టేట్మెంట్ రికార్డు చేసి మరీ శిక్ష విధించబోనని బెంచ్ సాక్షిగా ప్రకటించాడు(నేరస్థులకు ఉన్న ఐదవ సవరణ హక్కు ప్రకారం). అయినప్పటికీ పదేళ్ల గరిష్ఠ జైలుశిక్ష విధించడాన్ని ఇప్పుడు తప్పు బట్టింది న్యాయస్థానం. అంతేకాదు తాజా పరిణామాలతో ఆయనకు వ్యతిరేకంగా బాధితులు అమెరికా సుప్రీం కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. మరోవైపు ఈ తీర్పుపై బాధితులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము చేసిన న్యాయ పోరాటాన్ని.. అమెరికా చట్టంలోని లొసుగులు నీరుగారుస్తున్నాయని వాపోయారు. తదుపరి కార్యాచరణపై న్యాయ నిపుణులతో సంప్రదించి ముందుకు వెళ్తామని ప్రకటించారు. ఆండ్రియాతో మొదలు.. టెంపుల్ యూనివర్సిటీ బాస్కెట్ బాల్ టీంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన ఆండ్రియా కాన్స్టాండ్.. తనకు మత్తు మందిచ్చి మరీ కోస్బీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని 2005లో పోలీసులను ఆశ్రయించింది. ఏడాది తర్వాత మూడున్నర మిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించి ఆమెతో కేసు క్లోజ్ కోసం డీల్ కుదుర్చుకున్నాడు కోస్బీ. అయితే 11 ఏళ్ల తర్వాత (12 ఏళ్లు గడిస్తే.. లైంగిక ఆరోపణలు చెల్లవు) మళ్లీ ఆమె తెర మీదకు వచ్చింది. ఈసారి మరో ఐదుగురు ఆమెతో కలిసి కేసు వేశారు. అదే టైంలో 60వ దశకం నుంచి ఆయనపై వినిపించిన ఆరోపణలనూ పరిగణనలోకి తీసుకుంది పెన్సిల్వేనియా లోకల్ కోర్టు. చివరికి విచారణ జరిపి 2018 సెప్టెంబర్లో కోస్బీకి శిక్ష విధించింది. అమెరికన్ డాడ్ స్టాండప్ కమెడియన్గా కెరీర్ ప్రారంభించిన కోస్బీ.. సుమారు ఆరు దశాబ్దాలపాటు ఆడియొన్స్ను అలరించారు. 1984లో టెలికాస్ట్ అయిన ది కోస్బీ షో.. గొప్ప టీవీ షోగా గుర్తింపు దక్కించుకుంది. ఈ షో ద్వారా ఆయనకు ‘అమెరికాస్ డాడ్’ అనే ఐడెంటిటీ దక్కింది. ఆ తర్వాత సినిమాల ద్వారా ఫేమ్ దక్కించుకున్నాడీయన. అయితే కెరీర్ తొలినాళ్ల నుంచే పలు అఘాయిత్యాలకు పాల్పడినట్లు కోస్బీ ఆరోపణలు ఉన్నాయి. ఇక సంచలనం సృష్టించిన #metoo ఆరోపణల్లో మొట్టమొదట జైలు శిక్షకు గురైంది ప్రముఖుడు కూడా ఈయనే. చదవండి: అత్యాచార కేసులో బాధితురాలి అరెస్ట్!. గుండెపగిలి.. -
ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త
సాక్షి, ముంబై: అతిపెద్ద దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ విస్తరణ, లాక్డౌన్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది. వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని బ్యాంకు తెలిపింది. అంతేకాదు ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా ఎస్బీఐ ప్రకటించింది. (యాపిల్ ఐఫోన్ ఎస్ఈ వచ్చేసింది..) Good news for all ATM card holders! SBI has decided to waive the ATM Service Charges levied on account of exceeding the number of free transactions, until 30th June.#SBI #Announcement #ATM #Transactions pic.twitter.com/d34sEy4Hik — State Bank of India (@TheOfficialSBI) April 15, 2020 -
జవాన్లకు కేంద్రం దీపావళి కానుక
న్యూఢిల్లీ: దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే సాయుధ, పారామిలటరీ బలగాలకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్ ఫోన్లు వాడుకున్నందుకు జవాన్లు ప్రతి నెలా చెల్లిస్తున్న రూ.500 చార్జీలను నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్ సిన్హా ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఫోన్ల కాల్ చార్జీలను నిమిషానికి రూ.5 నుంచి రూ.1కి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. జవాన్లు తమ కుటుంబ సభ్యులతో మరింత ఎక్కువ సమయం మాట్లాడటానికి ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. తాజా నిర్ణయం వల్ల కేంద్రంపై రూ.3 నుంచి 4 కోట్ల భారం పడుతుందన్నారు. -
మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి
న్యూఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడులో 37 మంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్లంతా గత అయిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు.