-
‘కేజ్రీవాల్ ఒక అడాల్ఫ్ హిట్లర్’
చంఢీఘర్: పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. ఇప్పటికే.. హర్యాణలోని చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తాయని ఇటు ఆప్ నేత రాఘవ్ చద్దా.. అటు కాంగ్రెస్ నేత పవన్ కుమార్ బన్సల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నేడు కొన్ని గంటల ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేజ్రీవాల్ భేటీ కూడా అయ్యారు. వారి భేటీ ముగిసిన అనంతరమే పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ను నియంత అడాల్ఫ్ హిట్లర్తో పోల్చాడు. కేజ్రీవాల్ పాలన హిట్లర్ నియంత పాలన వలే ఉంటుందని మండిపడ్డారు. మొదట ఆప్ పార్టీ కార్యాలయాల్లో డా.బీఆర్ అంబేద్కర్, భగత్సింగ్ల వంటి మహనీయుల ఫొటోలను తొలగించాలని.. వాటి స్థానంలో నియంత అడాల్ఫ్ హిట్లర్ ఫొటోలు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. ఆప్ నేతలంగా అడాల్ఫ్ హిట్లర్ వలే ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యలు ఇరు పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. చంఢీఘర్ మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమిలో భాగంగా కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. ఆప్కు మేయర్ పదవి, కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ పదవి అని కూడా చర్చించుకున్నారు. అయితే ఇప్పటివరకు ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవటం గమనార్హం. ఇక.. ప్రతాప్ సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు రావొచ్చని ఇరు పార్టీల కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. చదవండి: Flight Delays: శశి థరూర్కు సింధియా కౌంటర్ -
ప్రియుడితో పారిపోయేందుకు భర్తను...
చండీగఢ్ : ప్రియుడితో పారిపోయేందుకు ఓ మహిళ భర్తను కిరాతకంగా హతమార్చిన ఘటన పంజాబ్లో వెలుగుచూసింది. తరన్తరన్ జిల్లాలో ఆదివారం రాత్రి నిందితురాలు తన భర్తకు విషం కలిపిన ఆహారం ఇచ్చిన అనంతరం అతను మరణించలేదనే భయంతో మెడకు తాడు బిగించి ఊపిరిఆడకుండా చేసి ప్రాణాలు తీసింది. భర్త మరణించిన తర్వాత తన ఇద్దరు పిల్లలను తండ్రి ఇంటివద్ద విడిచిపెట్టి ప్రియుడితో పారిపోయింది. కాగా మహిళ పిల్లలు జరిగిన ఘటనను తాతకు వివరించడంతో ఈ ఉదంతం వెలుగుచూసింది. తమ తల్లి సిమ్రాన్ తండ్రి రాజ్ప్రీత్ను మెడకు తాడును బిగించి చంపిందని పిల్లలు జరిగిన ఘోరాన్ని కళ్లకు కట్టారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన తమ తల్లిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు పోలీసులను కోరారు. నిందితురాలు సిమ్రాన్, ఆమె ప్రియుడు లవ్లీపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు. -
దట్టమైన పొగమంచు.. ఏడుగురు దుర్మరణం
చంఢీగడ్: రహదారిని కమ్మెసిన దట్టమైన పొగమంచు ఏడుగురిని బలితీసుకుంది. అంబలా, చంఢీగడ్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు జాతీయ రహదారిని కమ్మివేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని మరో వాహనంపైకి దూసుకుపోయ్యాయి. మృతులంతా చంఢీగడ్కు చెందిన వారిగా గుర్తించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. కాగా పొగమంచు కారణంగా సోమవారం ఛండీగడ్లోనే జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందిన విషయం తెలిసిందే. గత వారం రోజులుగా ఉత్తర భారతాన్ని పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మంచు కారణంగా ఎదురుగావచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు చేసుకుంటున్నాయి. -
హర్యానా గవర్నర్కు త్రుటిలో తప్పిన ముప్పు
విమానం టేకాఫ్ అవుతుండగా పొగలు చండీగఢ్: హర్యానా గవర్నర్ జగన్నాథ్ పహాడియాకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో అత్యవసరంగా దించేశారు. దీంతో గవర్నర్తో పాటు పది మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో విమానంలో ఇద్దరు సిబ్బంది కాక గవర్నర్ పహాడియా, ఆయన భార్య శాంతి, ఇద్దరు ఏడీసీలు, ఓ డాక్టర్, ఓ సహాయకుడుతో పాటు ఎనిమిది మంది ఉన్నారు. గురువారం ఉదయం 11.37 గంటలకు గవర్నర్ పహాడియా ఛండీగఢ్ నుంచి ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ విమానంలో బయలుదేరారు. విమానం 30 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని రన్వే సమీపంలో అత్యవసరంగా దించేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న వైమానికదళ అధికారులు గవర్నర్ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పైలట్ వింగ్ కమాండర్ బీ నందా వెల్లడించారు. -
అండర్-19 విజేత సిరిల్ వర్మ
చండీగఢ్: కృష్ణ ఖేతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 విభాగంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21-10, 21-13 స్కోరుతో అరింతప్ దాస్ గుప్తాపై ఘన విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో ఏపీ అమ్మాయి డి. పూజకు చుక్కెదురైంది. ఫైనల్లో టాప్ సీడ్ రేవతి దేవస్థలే 21-16, 21-15తో పూజను ఓడించింది. అండర్-17 విభాగంలో రాష్ట్ర షట్లర్లు రెండు కేటగిరీల్లోనూ విజేతలుగా నిలిచారు. హోరాహోరీగా సాగిన బాలుర విభాగం ఫైనల్లో రాహుల్ యాదవ్ 18-21, 21-8, 21-16 తేడాతో ఏపీకే చెందిన రెండో సీడ్ ఎం. కనిష్క్పై గెలుపొంది టైటిల్ నెగ్గాడు. బాలికల ఫైనల్లో ఐదో సీడ్ వృషాలి 16-21, 21-14, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ మహిమా అగర్వాల్పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫలితాలు... అండర్-17 బాలుర డబుల్స్లో జి.కృష్ణ ప్రసాద్-సాత్విక్...బాలికల డబుల్స్లో కె.వైష్ణవి-సోనికా సాయి విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర డబుల్స్లో విఘ్నేశ్ -గంగాధర రావు...బాలికల డబుల్స్లో పూజ-నింగ్షీ బ్లోక్ టైటిల్ నెగ్గారు. అండర్-19 మిక్స్డ్ డబుల్స్లో రోహన్ కపూర్-డి. పూజ జోడి విజేతగా నిలిచింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement