breaking news
Centre rules
-
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన సీనియర్ అధికారిపై చేయి చేసుకున్నారన్న కారణంగా ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయడంతో ఢిల్లీలోని అరవింద్ కేజ్రివాల్ ప్రభుత్వంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధిస్తుందన్న వదంతులు వ్యాపించాయి. కేజ్రివాల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిందేనంటూ బీజేపీ ఢిల్లీ శాఖ ఓ పక్క బలంగా డిమాండ్ చేస్తుండడం, ఢిల్లీలో ప్రభుత్వం కుప్పకూలి పోయిందంటూ ‘అసోసియేషన్స్ ఆఫ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్స్’ ప్రకటన విడుదల చేయడం ఈ వదంతులకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంగానీ, బీజేపీ కేంద్ర నాయకులుగానీ ఇంతవరకు నోరు విప్పలేదు. చర్చల ద్వారానే ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది. కేజ్రివాల్ అధికార నివాసంలో ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం ఆప్ ఎమ్మెల్యేలు అమానతుల్లా ఖాన్, ప్రకాశ్ జార్వల్లు తనపై చేయి చేసుకున్నారంటూ ఆ మరుసటి రోజు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అంషు ప్రకాష్ ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ను కలుసుకొని ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసు స్టేషన్లో కేసు పెట్టడం, ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేయడం, జుడీషియల్ కస్టడీకి పంపించడం తదితర పరిణామాలు తెల్సినవే. ఫిబ్రవరి 23వ తేదీన ఢిల్లీ పోలీసులు అనూహ్యంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ అధికార నివాసంలో సోదాలు నిర్వహించి, సీసీటీవీ కెమేరాల ఫుటేజ్ పట్టుకెళ్లడం సంక్షోభం ముదురుతున్న సంకేతాలనిచ్చింది. ఇది రాష్ట్రపతి పాలన విధిస్తారన్న వదంతులకు దారితీసింది. ఓ రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందంటూ సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అవసరమైతే కేంద్రమే రాష్ట్ర గవర్నర్ నుంచి అడిగిన నివేదిక తెప్పించుకోవచ్చు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాం ఉందా ? అని ఢిల్లీ బీజేపీ యూనిట్ను ప్రశ్నించగా, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించడం ఒక మార్గం మాత్రమేనని, తాము మాత్రం ఇప్పుడు రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయడం లేదని ఢిల్లీ బీజీపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ తెలిపారు. రాజీనామా చేయాల్సిందిగా మాత్రమే డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. కేజ్రివాల్ ఓ అరాచక వాదని, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయిందని ఢిల్లీ పార్టీ వ్యవహారాలు చూస్తున్న బిజేపీ ఉపాధ్యక్షుడు శ్యామ్ జాజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు చేయి చేసుకున్నంత మాత్రాన ఢిల్లీలో రాష్ట్రపతి పాలన వి«ధించాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని రాజ్యాంగ సంక్షోభంగా బీజేపీ పరిగణించడం, ఇలాంటి సందర్భాంల్లో కేంద్రం నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది కనుక రాష్ట్రపతి పాలన గురించి వినిపిస్తోంది. -
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
-
రుణమాఫీకి కేంద్రం నిధులివ్వదు!
► రాజ్యసభలో ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టీకరణ ► రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని సూచన ► ఈ సమావేశాల్లోనే జీఎస్టీ ఆమోదం పొందాలన్న జైట్లీ న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి రాష్ట్రాలకు కేంద్రం నిధులిచ్చే ఆలోచనే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రాష్ట్రాలే నిధులు సమకూర్చుకోవాలని తేల్చిచెప్పారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ.. ఒక రాష్ట్రానికి నిధులిచ్చి మరో రాష్ట్రానికి మొండిచేయి చూపే విధానాన్ని ఆవలంబించబోమని పేర్కొన్నారు. ‘పలు రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నాయి. అందుకు ఆయా రాష్ట్రాలే నిధులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయంపై కేంద్రం ఓ విధానంతో ముందుకెళ్తోంది. రైతు రుణాల వడ్డీలో కొంత భరిస్తున్నాం. దీన్ని కొనసాగిస్తాం’ అని జైట్లీ వెల్లడించారు. రుణమాఫీ చేయాల్సిందేనని సంకల్పిస్తే దానికి ఆయా రాష్ట్రాలే నిధులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా.. అక్కడి రైతులకు యోగి సర్కారు రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే.. 2006లో యూపీఏ సర్కారు అన్ని రాష్ట్రాల్లో రుణమాఫీ చేసిందని ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. లేదంటే పరోక్షపన్ను కోల్పోతాం! ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లును ఆమోదించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని జైట్లీ రాజ్యసభలో చెప్పారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 15 తర్వాత కేంద్రం, రాష్ట్రాలు పరోక్షపన్నును నష్టపోతాయని ఆయన తెలిపారు. జీఎస్టీకి అనుబంధంగా ఉన్న నాలుగు బిల్లులను తర్వలోనే లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. యూఎస్ ‘అక్రమ’ జాబితా తిరస్కరణ అమెరికాలో 271 మంది అక్రమంగా నివాసం ఉంటున్నారంటూ ఆ దేశం ఇచ్చిన జాబితాను భారత్ తిరస్కరించింది. సరైన ధ్రువీకరణ జరిగేంతవరకు అమెరికా నుంచి భారతీయులను తరలించేది లేదని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులడిగిన ప్రశ్నలకు సుష్మ సమాధానం ఇచ్చారు. ‘మేం ఆ జాబితాను అంగీకరించటం లేదు. అందుకే మరిన్ని వివరాలడిగాం. వాటిని ధ్రువీకరించుకున్నాకే వారిని తరలించేందుకు అత్యవసర సర్టిఫికెట్ జారీచేస్తాం’ అని సుష్మ స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల కుటుంబానికి న్యాయం జరగలేదని కాంగ్రెస్ ఎంపీ పునియా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.