-
Central Vigilance Commission: ఆ శాఖల అధికారులపైనే అత్యధిక ఫిర్యాదులు
న్యూఢిల్లీ: దేశంలో 2022లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా కేంద్ర హోంశాఖ అధికారులపైనే వచ్చాయి. ఆ తర్వాత రైల్వే శాఖ, బ్యాంకు అధికారులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో వెల్లడించారు. గత ఏడాది అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన అన్ని కేటగిరీల అధికారులు, ఇతర సిబ్బంది విషయంలో మొత్తం 1,15,203 ఫిర్యాదులు అందాయని తెలియజేసింది. వీటిలో 85,437 కేసులను పరిష్కరించామని, మిగిలినవి పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. అత్యధికంగా హోంశాఖ అధికారులపై 46,643, రైల్వే శాఖ అధికారులపై 10,580, బ్యాంకుల అధికారులపై 8,129 ఫిర్యాదులు తమకు అందాయని సీవీసీ స్పష్టం చేసింది. ‘నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ’ ప్రభుత్వ అధికారులపై 7,370 ఫిర్యాదులు వచ్చాయని వివరించింది. ఇన్సూరెన్స్ సంస్థల్లో పనిచేసేవారిపై 987, ఉక్కుశాఖలో పనిచేసేవారిపై 923 కంప్లైంట్లు వచ్చినట్లు వెల్లడించింది. -
దేశ ద్రోహులకు విదేశాల్లో..
కేవాడియా: మన దేశానికి ద్రోహం చేసినవారికి ప్రపంచంలో ఇంకెక్కడా స్వర్గధామాలు లేకుండా చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. భారత్లో నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయి తలదాచుకొనే పరిస్థితి లేకుండా చూడాలన్నారు. ‘దేశానికి ద్రోహం చేసిన వారికి, ఇక్కడ నేరాలకు పాల్పడిన వారికి విదేశాల్లో నిలువ నీడ లేకుండా చేయాలి’ అని అధికారులను ఉద్దేశించి పేర్కొన్నారు. గుజరాత్లోని కేవాడియాలో బుధవారం సీవీసీ, సీబీఐ ఉమ్మడి సదస్సులో మోదీ వర్చువల్గా మాట్లాడారు. దేశ ప్రయోజనాలకు, దేశ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే వారు ఎంతటి బలవంతులైనా ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారిని వెనక్కి రప్పించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అవినీతి.. పేదల హక్కులను హరిస్తుంది కేంద్ర ప్రభుత్వం గత ఆరేడేళ్లుగా సాగిస్తున్న నిరి్వరామ కృషితో దేశ ప్రజల్లో విశ్వాసం ఏర్పడిందని, అవినీతిని అడ్డుకోవడం సాధ్యమేనని వారు నమ్ముతున్నారని ప్రధాని మోదీ చెప్పారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల బెడద లేకుండా ప్రభుత్వ పథకాలతో నుంచి తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని ప్రజలు భావిస్తున్నారని గుర్తుచేశారు. అవినీతి.. అది చిన్నదైనా, పెద్దదైనా పేద ప్రజల హక్కులను హరిస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి నిరోధిస్తుందని చెప్పారు. మన సమ్మిళిత శక్తిని ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అవినీతిని నియంత్రించే దిశగా గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రస్తుతం రాజకీయ సంకల్పం, పాలనాపరమైన సంస్కరణలతో అవినీతికి చెక్ పెడుతున్నామని మోదీ తెలియజేశారు. ప్రజలపై నియంత్రణ చర్యలను తగ్గిస్తున్నామని, తద్వారా వారి జీవితాలను సరళతరం చేస్తున్నామని చెప్పారు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పాలన అనే విధానాన్ని తాము విశ్వసిస్తున్నాని వెల్లడించారు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్వంశ్ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
సీబీఐ చీఫ్గా మళ్లీ అలోక్ వర్మ
సంస్థ డైరెక్టర్గా ఆయననుతిరిగి నియమించిన సుప్రీంకోర్టు తొలగించే, బదిలీ చేసే అధికారం కేంద్రానికి లేదని స్పష్టీకరణ ప్రధాన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అధికారాలకు కోత రఫేల్ దర్యాప్తు నుంచి మోదీ తప్పించుకోలేరు: రాహుల్ సమతూకం ఉన్న తీర్పు ఇది: అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: సీబీఐ అంతఃకలహం కేసులో కేంద్రా నికి మంగళవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను పునఃనియమిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అలోక్వర్మ ఎలాంటి ప్రధాన విధానప రమైన నిర్ణయాలూ తీసుకోకుండా కోర్టు నిలు వరించింది. సీబీఐ చీఫ్ను నియమించేందుకు, తొలగించేందుకు అధికారం ఉన్న ప్రధాని నేతృ త్వంలోని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీ అలోక్ వర్మ కేసును పరిశీలించి, ఆయనను సీబీఐ డైరెక్టర్ పదవిలో కొనసాగించాలా, వద్దా అన్నది నిర్ణయించేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయంది. ఈ నెలాఖరుతో అలోక్ వర్మ పదవీకాలం ముగియనుండటంతో మరో వారంలోపు కేసుపై నిర్ణయం తీసుకోవాలని కమిటీని కోర్టు ఆదేశించింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాలు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవ డం, ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరడంతో కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సిఫారసుల ఆధా రంగా గతేడాది అక్టోబర్ 23 అర్ధరాత్రి కేంద్రం వీరిద్దరినీ పదవుల నుంచి తప్పించి సెలవుపై పంపడం తెలిసిందే. ప్రభుత్వం తనను అక్ర మంగా పదవి నుంచి తప్పించిందంటూ అలోక్ వర్మ వేసిన పిటిషన్పై విచారించిన కోర్టు తాజా తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు అలోక్ వర్మకు మళ్లీ డైరెక్టర్ పదవిని ఇచ్చినప్పటికీ అధికారాలను కోర్టు కత్తిరించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. తొలగించలేరు, బదిలీ చేయలేరు.. సీబీఐ డైరెక్టర్ను ఒకసారి నియమించాక ప్రభు త్వం రెండేళ్లలోపు తొలగించడం కుదరదనీ, ఒకవేళ తొలగించాలంటే నియామకం చేపట్టిన అత్యున్నత స్థాయి కమిటీనే ఆ పని చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ అత్యున్నత స్థాయి కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ సంస్థ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎంపిక కమిటీ ఆమోదం లేకుండా సీబీఐ డైరెక్టర్ను బదిలీ చేయడానికీ వీల్లేదని కోర్టు పేర్కొంది. అలోక్వర్మపై సీవీసీ ఇంకా విచారణ జరుపు తున్నందున, వారంలోపు సమావేశమై ఈ కేసు ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని అత్యున్నతస్థాయి త్రిసభ్య కమిటీని కోర్టు ఆదే శించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించిం ది. అయితే తీర్పును జస్టిస్ గొగోయ్ రాసి నప్ప టికీ ఆయన మంగళవారం కోర్టుకు హాజరుకా లేదు. అలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించే అధికారం సీవీసీకి, కేంద్రానికి ఉందా లేదా అన్న దానిపైనే ఈ కేసులో వాద నలు జరిగాయి. పదవి నుంచి అలోక్, అస్థానా.. ఇద్దరినీ కేంద్రం తప్పించినా అలోక్ మాత్రమే కేంద్రంపై కోర్టులో కేసు వేశారు. సీబీఐ డైరెక్టర్పై మధ్యంతర చర్యలు తీసుకునే అధికారాన్నీ ప్రభుత్వానికి చట్టం ఇవ్వలేదనీ, సీబీఐని బయటి ప్రలోభాలు, ప్రభావాలకు దూరంగా ఉంచి స్వేచ్ఛ ఇవ్వగలిగితేనే ఆ సంస్థ ఏ భయం, ఆశ్రిత పక్షపాతం లేకుండా ప్రజా ప్రయోజనార్థం పనిచేయగలదని కోర్టు పేర్కొంది. కాబట్టి సీబీఐ డైరెక్టర్ విధుల్లో ఏ అధికారీ, సంస్థా జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసింది. ఒకవేళ సీబీఐ డైరెక్టర్పై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే అందుకు తగ్గ తీవ్ర కారణం, ప్రజాప్రయోజనం ఉండాలనీ, ఈ విషయాన్ని పరిశీలించే అధికారం కూడా ఎంపిక కమిటీకే ఉంటుందంది. ప్రభుత్వానికి గుణపాఠం: ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రభుత్వానికి ఓ గుణపాఠమనీ, చెంపదెబ్బ లాంటిదన్నారు. రఫేల్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభించను న్నారనే కారణంతోనే అలోక్ వర్మను ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి విధుల నుంచి తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. ఈ తీర్పుతో కొంత న్యాయం జరిగిందనీ, రఫేల్పై విచారణ నుంచి మోదీ తప్పించుకోలేరని హెచ్చరిం చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రధాని, ఆయన కార్యాలయంపై నేరారోపణ చేసినట్లుగా ఉందనీ సీపీఎం, ఆర్జేడీ, పీడీపీ, ఆప్ తదితర పార్టీలు పేర్కొన్నాయి. కాబట్టి మోదీ నైతిక బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. అలోక్ వర్మకు తిరిగి పదవి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆయన అధికారా లను తగ్గించింది కాబట్టి ఇది సమతూకంతో ఉన్న తీర్పు అని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను కాపాడేం దుకు తాము అలోక్, అస్థానాలను సీవీసీ సిఫారసుల ఆధారంగానే సెలవుపై పంపా మనీ, తమ నిర్ణయం పూర్తిగా సదుద్దేశంతో కూడుకున్నదేనని జైట్లీ సమర్థించుకున్నారు. ఇద్దరు అధికారులు గొడవ పడినందున తమ ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా చట్టబద్ధమైనదేననీ జైట్లీ చెప్పుకొచ్చారు. ఆ పరిస్థితి దురదృష్టకరం అలోక్పై అవినీతి ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీ సీవీసీకి పంపడం, ఆ తర్వాత సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి అలోక్ను తప్పించాలంటూ సీవీసీ ఆదేశించేలా పరిస్థితులు రావడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘సీవీసీ చెబుతున్న దాని ప్రకారం.. అలోక్పై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. అయితే అలోక్ సీవీసీకి సహకరించడంపోయి, ఈ ఫిర్యాదును కేబినెట్ సెక్రటరీకి ఎవరు చేశారో చెప్పాలని కోరా రు. అస్థానాపై ఆరోపణలు చేసేవరకు ఆయన వెళ్లారు. అస్థానాపై అవినీతి ఆరోపణలున్న అనేక కేసులను అలోక్ సీవీసీకి అందించారు. అలాగే అలోక్ వర్మపై అస్థానా ఆరోపణలు చేశారు. ఈ తీవ్ర పరిస్థితుల్లోనే అలోక్, అస్థానా ఇద్దరినీ బాధ్యతల నుంచి తప్పించడం సరైన చర్య అని సీవీసీ భావించి, సీవీసీ చట్టంలోని సెక్షన్–8, 11ల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది’ అని కోర్టు తన తీర్పులో పేర్కొంది. సీబీఐ ‘ఫైట్’లైన్! ►2017 అక్టోబర్: సీబీఐ స్పెషల్ డైరెక్టర్గా రాకేశ్ అస్థానాను నియమించడంపై సీవీసీ ముందు అలోక్ వర్మ అభ్యంతరం. ►2018 జూలై 12: సీబీఐలో ప్రమోషన్లపై జరిగిన సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా అస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ►ఆగస్టు 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి అలోక్ వర్మ, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్కు చెందిన వ్యాపారి సతీష్ సానా 2 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రటరీకి అస్థానా లేఖ. ►అక్టోబర్ 4: సానాను సీబీఐ అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు సానా ఆరోపించారు. ►అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై అస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. ►అక్టోబర్ 23: రాకేశ్ అస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్కు ఏడు రోజుల సీబీఐ రిమాండ్కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న అస్థానాపై నమోదు చేసిన ఎఫ్ ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. ►అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో అలోక్, అస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. ►అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్ను నియమించిన సుప్రీంకోర్టు. ►నవంబర్ 12: సుప్రీంకోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. -
అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ చర్య
న్యూఢిల్లీ: అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ చర్యలు అవసరమవుతాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) పేర్కొంది. తనను సెలవులో పంపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ పెట్టుకున్న పిటిషన్పై గురువారం వాదనలు ముగియగా సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం.. సీబీఐ డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నట్లు చెబుతూనే రాత్రికి రాత్రే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతలతో కూడిన ఎంపిక కమిటీని సంప్రదించకుండా డైరెక్టర్ అధికారాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏమున్నాయి? ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యా ఉత్తమ ఫలితం సాధించేదిగా, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేసేదిగా ఉండాలి’ అని పేర్కొంది. సీబీఐలో విభేదాలకు జూలైలోనే బీజాలు పడ్డాయన్న అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనపై ధర్మాసనం పైవిధంగా స్పందించింది. సీవీసీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. సీబీఐలో సంభవించిన ఆశ్చర్యకర, అసాధారణ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రభుత్వ సూచన మేరకు సీవీసీ విచారణ చేపట్టిందన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘అలోక్ వర్మ, రాకేశ్ ఆస్తానాలు కేసుల విచారణ మానేసి, ఒకరిపై మరొకరు దర్యాప్తు చేసుకోవడం మొదలుపెట్టినందునే కేంద్రం జోక్యం చేసుకుంది. వారిపై దర్యాప్తు చేపట్టే అధికారం సీవీసీకి ఉంది. అలోక్ ఆరోపణలపై విచారణ చేపట్టనట్లయితే, సీవీసీ విధులను నిర్లక్ష్యం చేసినట్లే అవుతుంది. దీనిపై రాష్ట్రపతికి, సుప్రీంకోర్టుకు సీవీసీ సమాధానం చెప్పుకోవాల్సి ఉండేది. దర్యాప్తునకు అవసరమైన పత్రాలను సీవీసీకి చాలా రోజుల దాకా అలోక్ వర్మ అందివ్వలేదు’ అని తుషార్ మెహతా అన్నారు. అలోక్ వర్మపై సీవీసీ దర్యాప్తునకు కేంద్రం న్యాయబద్ధమైన ముగింపు ఇవ్వాలని ఆస్తానా తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అన్నారు. సీబీఐ డైరెక్టర్కు రెండేళ్ల పదవీకాలానికి అర్థం అధికారాలు లేని హోదా, విజిటింగ్ కార్డు కాదని అలోక్ వర్మ తరఫు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ వ్యాఖ్యానించారు. నిర్ణీత పదవీ కాలమైన ఆ రెండేళ్లలో సీబీఐ డైరెక్టర్ ఏం చేసినా కేంద్రం, సీవీసీ ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఎక్కడైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్పై చర్యలు తీసుకునే అధికారం కేంద్రం, సీవీసీలకు లేదంటూ లాయర్ ఫాలి ఎస్.నారిమన్తోపాటు కామన్కాజ్ అనే ఎన్జీవో తరఫున వాదించిన దుష్యంత్ దవే పేర్కొనడంపై స్పందించిన ధర్మాసనం.. ‘రెండేళ్ల పదవీ కాలం ఉన్నంత మాత్రాన సీబీఐ డైరెక్టర్ అతీతుడా? ఆయనకు నిబంధనలు వర్తించవా? పార్లమెంట్ ఉద్దేశం ఇదేనా అని నిలదీసింది. సీబీఐ అధికారులను బాధ్యతల నుంచి తప్పించడం/సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వరాదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ప్రత్యేక పరిస్థితుల్లో సీబీఐ డైరెక్టర్ను బదిలీ చేసే అధికారం మాత్రమే ప్రభుత్వానికి ఉండాలన్నారు. అలోక్వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్ 23న సెలవుపై పంపిన విషయం తెలిసిందే.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement