-
అరుణతారకు తుది వీడ్కోలు
ముగిసిన ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలు శాంటియాగో డి క్యూబా: క్యూబా మాజీ అధ్యక్షుడు, విప్లవ యోధుడు ఫిడెల్ క్యాస్ట్రో అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. వేలాది మంది ప్రజలు ‘వివా ఫిడెల్’ అనే నినాదాలు చేస్తుండగా.. ఇక్కడి శాంటా ఇఫిజెనియా శ్మశానంలోకి ఆయన చితాభస్మాన్ని ఉంచిన వాహనం ప్రవేశించింది. అక్కడ ఆయన చితాభస్మాన్ని సమాధి చేశారు. కాగా, శనివారం రాత్రి ఫిడెల్ సోదరుడు, ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో శాంటియాగో రివల్యూషన్ ప్లాజా వద్ద ఫిడెల్ గౌరవార్థం భారీ బహిరంగ సభ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిడెల్ లేని భవిష్యత్లో తమ దేశాన్ని, సోషలిజాన్ని రక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఆత్మవిశ్వాసమే పరమావధిగా క్యూబాలో సోషలిజాన్ని ఫిడెల్ పాదుగొల్పారని చెప్పారు. కాగా, ఫిడెల్ క్యాస్ట్రో వ్యక్తి పూజను తీవ్రంగా వ్యతిరేకించేవారు. తన తదనంతరం విగ్రహాలుగానీ, వీధులకు, భవంతులకు తన పేరు పెట్టడంగానీ చేయవద్దని కోరారు. ఆ కోరిక ప్రకారం క్యూబా ప్రభుత్వం త్వరలో సమావేశమై ఓ చట్టం చేయనుంది. నవంబర్ 25న ఫిడెల్ క్యాస్ట్రో మృతి చెందిన తర్వాత ఆయన చితాభస్మాన్ని వారం పాటు దేశవ్యాప్తంగా తిప్పారు. ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలు వీధుల్లో పోటెత్తారు. -
చర్చకు ప్రధాని సిద్ధం
నోట్ల రద్దుపై చర్చ ప్రారంభిస్తే మోదీ మాట్లాడతారన్న రాజ్నాథ్ - ఓటింగ్ నిబంధనకు ఒప్పుకోవాలని లోక్సభలో ప్రతిపక్షాల పట్టు - మోదీ సభకు రావాలంటూ రాజ్యసభలో ప్రతిపక్షాల నినాదాలు - నిరసనల మధ్యే లోక్సభలో ఐటీ చట్టం సవరణ బిల్లు న్యూఢిల్లీ: వరుసగా ఎనిమిదో రోజు సోమవారం కూడా నోట్ల రద్దు అంశం పార్లమెంట్ ఉభయ సభల్ని కుదిపేసింది. చర్చ మొదలుపెడితే ప్రధాని మోదీ మాట్లాడతారని ప్రభుత్వం వాగ్దానం చేసినా... ఓటింగ్కు వీలు కల్పించే నిబంధన కిందే చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టారుు. దీంతో లోక్సభ రెండు సార్లు, రాజ్యసభ మూడుసార్లు వారుుదా పడింది. తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభలు మంగళవారానికి వారుుదా పడ్డారుు. లోక్సభ ప్రారంభమయ్యాక తమ వారుుదా తీర్మానాల్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ విపక్ష నేతలు మల్లికార్జున్ ఖర్గే(కాంగ్రెస్), సుదీప్ బంధోపాధ్యాయ్(తృణమూల్), ములాయం సింగ్ యాదవ్(ఎస్పీ) డిమాండ్ చేశారు. చర్చ సమయంలో ప్రధాని సభలోనే ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిపక్షం కోరితే నోట్ల రద్దుపై ప్రధానమంత్రి తప్పకుండా మాట్లాడతారని, చర్చకు సహకరించాలని, ఏ నిబంధన కింద చర్చించాలనేది మాత్రం స్పీకర్ నిర్ణరుుస్తారని హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాజ్నాథ్ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు ఒక్కసారిగా పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ‘చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీల ఫిర్యాదులు, సలహాలు వినేందుకు సిద్ధం. ప్రధాని సభకు రావడమే ప్రతిపక్షాల డిమాండైతే, ప్రతిపక్షం కోరితే చర్చలో ప్రధాని పాల్గొంటారు’ అని రాజ్నాథ్ చెప్పారు. వాయిదా తీర్మానంపై చర్చకు పట్టు అంతకుముందు ఖర్గే మాట్లాడుతూ... నోట్ల రద్దు నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు చేటు చేసిందని, రైతులు, యువత, కార్మికులు, మహిళలు నిస్పృహలో ఉన్నారన్నారు. నిర్ణయం అమలులో లోపాల వల్ల 70 మంది చనిపోయారన్నారు. సభలో గందరగోళానికి తెరపడాలంటే ప్రధాని తప్పకుండా సభకు రావాలని, తామిచ్చిన వారుుదా తీర్మానం చర్చకు చేపట్టాలని డిమాండ్ చేశారు. ములాయం మాట్లాడుతూ.. ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు రాకపోతే... ప్రధాని ఇంకెప్పుడు వస్తారని ప్రశ్నించారు. క్యాో్ట్ర మృతికి సంతాపం.. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమయ్యాక... ఆదాయపు పన్ను శాఖ చట్టంలో సవరణల బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు నిరసన కొనసాగించడంతో సభ మంగళవారానికి వారుుదా పడింది. అంతకుముందు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో మృతికి సభ్యులు సంతాపం ప్రకటించారు. చర్చ ఎప్పుడో మొదలైంది: వెంకయ్య రాజ్యసభ సభ ప్రారంభం కాగానే క్యాస్ట్రో మృతికి సంతాపం తెలిపారు. అనంతరం సమాజ్ వాదీ ఎంపీ నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ... నోట్ల రద్దు నిర్ణయం సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే దేశ వ్యాప్తంగా ఆక్రోశ్ దివస్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాయావతి, డెరెక్ ఒబ్రియాన్, సీతారాం ఏచూరి, ఆనంద్ శర్మలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ , తృణమూల్ ఎంపీలు వెల్లోకి వెళ్లి ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే నోట్ల రద్దుపై చర్చ మొదలైందని, తిరిగి కొనసాగించాలని మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యుల నిరసనలు కొనసాగడంతో డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ సభను అరగంట వారుుదా వేశారు. అనంతరం సమావేశమయ్యాక కూడా నిరసనలు కొనసాగారుు. చర్చను కొనసాగించాలని, చర్చ ప్రారంభమయ్యాక ప్రధాని సభకు వస్తారంటూ సభ్యుల్ని కురియన్ వారించారు. కాగా, అరుణ్ జైట్లీ తరఫున వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ పీవోఎస్ మిషన్లపై ఎక్సైజ్ పన్ను మినహారుుంపు నోటిఫికేషన్ను సభలో ప్రవేశపెట్టారు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నా: స్పీకర్ ఒకట్రెండు రోజుల్లో లోక్సభలో పరిస్థితి చక్కపడుతుందని, సభ సజావుగా సాగుతుందని లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. ఏ నిబంధన మేరకు చర్చించాలనేది నిర్ణరుుంచాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే ‘నగదు రహితం’ : సిబల్ న్యూఢిల్లీ: ప్రజలంతా నగదు రహిత లావాదేవీలకు మళ్లాలన్న ప్రధాని మోదీ సూచనను కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వ్యంగ్యంగా విమర్శించారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇప్పటికే ప్రజల వద్ద నగదు లేకుండా పోరుుందని అన్నారు. ‘దేశంలో 70 కోట్లకు పైగా ప్రజల నెలవారీ ఆదాయం రూ.10 వేలకు దిగువనే ఉంది. బ్యాంకుల్లో నగదును జమచేయలేని ప్రజలంతా ఇప్పుడేం చేయాలి. చాలా చోట్ల ఇంకా బ్యాంకులు, ఏటీఎంలు లేవు’ అని అని సోమవారమిక్కడ విలేకర్లతో అన్నారు. -
ధిక్కారానికి ప్రతీక..ఉడుకు రక్తానికి ఉత్తేజం
కాలపరీక్షకు నిలిచి గెలిచిన శిఖరం కాలంతోపాటే మార్పులు సహజం. ఇరవయ్యో శతాబ్దంలోనే ఉచ్ఛస్థితికి చేరిన కమ్యూనిజం ప్రపంచవ్యాప్తమై... అదే శతాబ్దంలో ప్రభావం కోల్పోయే దశకు చేరింది. కమ్యూనిస్టుల కంచుకోటలు కూలిపోయారుు. సోవియట్ ముక్కలైంది. చైనా సైతం కమ్యూనిస్టు పంథా నుంచి ఓపెన్ మార్కెట్ వైపు మళ్లింది. రెండు కమ్యూనిస్టు ప్రబల శక్తులు ప్రపంచీకరణ ప్రభంజనంలో మనుగడ సాగించడానికి తమ సిద్ధాంతాలను వదులుకొన్నా... పెట్టుబడిదారుల పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికాకు పక్క నుంచే సవాలు విసురుతూ.. ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం కమ్యూనిజాన్ని శ్వాసించిన ధీశాలి! గుబురు గడ్డం, ఆలివ్గ్రీన్ మిలటరీ దుస్తులు, నోట్లో సిగార్... ఆ రూపం ధిక్కారానికి ప్రతీక! తిరగబడే ఉడుకురక్తానికి ఒక ఉత్తేజం!! అంతా తానే అనుకునే అమెరికా గుండెల్లో దశాబ్దాలుగా మోగుతున్న ‘ఫిరంగి’. ఆయనే ఫిడెల్ క్యాస్ట్రో. పాశ్చాత్యదేశాల్లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పి.. కాల పరీక్షకు నిలబడి గెలిచాడు. - సాక్షి నాలెడ్జ సెంటర్ మిత్రులతో కలిసి మిలటరీ స్థావరంపై దాడి 1952 మార్చి 10న దేశాధ్యక్షుడు కార్లోస్ ప్రియో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు జరిగింది. ఫుల్జెన్షియో బటిస్టా అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. అమెరికాకు సన్నిహితంగా ఉంటూ సోషలిస్టు సంస్థ, ఉద్యమాలపై ఉక్కుపాదం మోపడం మొదలుపెట్టాడు. సాయుధ తిరుగుబాటు ద్వారానే మిలటరీ పాలకులను దించగలమని భావించిన ఫిడేల్.. ఒరియెంటే ఫ్రావిన్సలోని మోంకాడా మిలటరీ స్థావరంపై అనుచరులతో కలిసి దాడి చేశాడు. మిలటరీ సాయుధ సంపత్తిని కొల్లగొట్టి ప్రభుత్వంపై తిరుగుబాటుకు ఆయుధాలను సమకూర్చుకోవాలనేది ఆయన ఆలోచన. అరుుతే ఈ ప్రయత్నంలో అతని బృందం విఫలమైంది. ఫిడేల్ ప్రభుత్వ బలగాలకు పట్టుబడ్డాడు. 15 ఏళ్ల శిక్ష..19 నెలలకే విడుదల ప్రభుత్వ బలగాలకు పట్టుబడిన క్యాస్ట్రోను విచారించారు. 15 ఏళ్ల జైలుశిక్ష విధించారు. అరుుతే విచారణ సందర్భంగా సైన్యం అరాచకాలను ఎలుగెత్తి చాటడం, దానికి విదేశీ మీడియా మంచి ప్రాధాన్యం ఇవ్వడంతో ఫిడేల్ ప్రాచుర్యంలోకి వచ్చాడు. 19 నెలల జైలు జీవితం తర్వాత 1955లో ప్రభుత్వ క్షమాభిక్ష ద్వారా విడుదలయ్యాడు. జైల్లో ఉన్నకాలంలోనే భార్య బలార్ట్కు విడాకులిచ్చాడు. మార్క్సిజాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. విడుదలయ్యాక మెక్సికో వెళ్లాడు. అక్కడే యువ పోరాటయోధుడు ఎర్నెస్టో చేగువెరాను కలిశాడు. బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చే లక్ష్యంతో జూలై ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. 1956 డిసెంబరు 2న 82 మందితో చిన్న నౌకలో బయలుదేరి క్యూబాలోని ఒరియెంటే ఫ్రావిన్సకు చేరుకున్నాడు. బటిస్టా సైన్యంతో జరిగిన పోరాటంలో ఫిడేల్ క్యాస్ట్రో, చేగువెరా, రౌల్ క్యాస్ట్రోలతోపాటు మరో 9 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగతా వారు దొరికిపోవడమో లేదా ప్రాణాలు కోల్పోవడమో జరిగింది. తోటి విప్లవకారులతో కలిసి సైన్యం కంటపడకుండా ఫిడేల్... సియర్రా మాయెస్ట్రా పర్వతశ్రేణిలో ఆశ్రయం పొందాడు. అక్కడి నుంచే రెండేళ్లపాటు బటిస్టా ప్రభుత్వంపై గెరిల్లా దాడులు కొనసాగించాడు. ఈ క్రమంలో బటిస్టాను వ్యతిరేకించే శక్తులు, సంస్థలకు ఫిడేల్ తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన జీవితం ఓ దర్పణం క్యాస్ట్రో జీవితం...20వ శతాబ్దంలో చోటుచేసుకున్న ఎన్నో పరిణామాలకు దర్పణం. విప్లవోద్యమాలు, ప్రజా తిరుగుబాట్లు, ప్రచ్చన్న యుద్ధం, పాశ్చాత్య-తూర్పు దేశాల మధ్య అంతరాలు, ఉత్తర అమెరికా-దక్షిణ అమెరికా మధ్య వైరం, కమ్యూనిజం- పెట్టుబడిదారీ విధానం మధ్య ఘర్షణ... ఇలా ఎన్నో పరిణామక్రమాలు. వీటన్నింటినీ చూశాడాయన. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లు.. కుట్రలు కుతంత్రాలు.. కానీ క్యాస్ట్రోలో మార్పులేదు. నేటికీ ఆయన తిరుగుబాటు ప్రతీక. కమ్యూనిజం పతనమైనా.. తట్టుకొని నిలబడ్డ కమ్యూనిస్టు. వలసొచ్చిన స్పానిష్ రైతు బిడ్డ స్పెరుున్ నుంచి వలస వచ్చిన ధనిక రైతు ఏంజెల్ మరియా బౌటిస్టా క్యాస్ట్రో క్యూబాలోని ఓరియెంటే ఫ్రావిన్సులోని బిరాన్ సమీప ప్రాంతంలో స్థిరపడ్డాడు. లీనా రుజ్ గొంజాలెజ్ ఇతని తోటల్లో పనిచేసేది. ఈమెకు ఏంజెల్ మరియాతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఫలితంగా 1926 ఆగస్టు 13న ఫిడేల్ అలెజాండ్రో క్యాస్ట్రో రుజ్ (ఫిడేల్ క్యాస్ట్రో) జన్మించాడు. ఫిడేల్ పుట్టాక అతని తల్లిదండ్రులు పెళ్లిచేసుకున్నారు. క్యాస్ట్రో చదువుల్లో చురుకుగా ఉండేవాడు.. మంచి అథ్లెట్ కూడా. బేస్బాల్పై అమితాసక్తి. 1945లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి హవానా యూనివర్సిటీలో చేరాడు. అక్కడే యువ క్యాస్ట్రోకు పలు రకాల భావాజాలాలతో, సిద్ధాంతాలతో పరిచయం ఏర్పిడింది. కమ్యూనిజంపై వర్సిటీ ప్రాంగణంలో విసృ్తత చర్చలు జరిగేవి. లా చదువును మధ్యలోనే వదిలేసి 1948లో కొలంబియాలో అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో పాల్గొన్నాడు. కొలంబియా అధికారుల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో క్యూబా విద్యార్థులు కొలంబియాలోని తమ దేశ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారు. అనంతరం క్యాస్ట్రో హవానాకు తిరిగి వచ్చి ‘లా’ కోర్సును కొనసాగించాడు. ఆర్టాడోక్సో పార్టీకి చెందిన జనాకర్షక నేత ఎడ్యురాడో చిబాస్కు అభిమానిగా మారాడు. ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయ స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అవినీతి నిర్మూలన చిబాస్ పార్టీ ప్రధాన ఆశయాలుగా ఉండేవి. న్యాయశాస్త్రం చదువుతుండగానే క్యాస్ట్రో ఫిలాసఫీ విద్యార్థిని మిర్టా డియాజ్ బలార్ట్ను పెళ్లాడాడు. ఈమె సంపన్న రాజకీయవేత్త కూతురు. ఉన్నతవర్గాలతో పరిచయం ఏర్పడినా... అటువైపు కాకుండా క్యాస్ట్రో కమ్యూనిజం వైపు మళ్లాడు. దేశ ఆర్థిక సమస్యలన్నింటికీ విశృంఖల పెట్టుబడిదారీ వ్యవస్థే కారణమని విశ్వసించేవాడు. లా కోర్సు పూర్తయ్యాక ప్రాక్టీసు ప్రారంభించినా పెద్దగా నడవలేదు. క్యాస్ట్రోపై అప్పుల భారం ఉండేది. అరుునా ఏ దశలోనూ రాజకీయ కార్యకలాపాలను వదల్లేదు. హింసాత్మకంగా మారిన పలు నిరసన ప్రదర్శనల్లో క్యాస్ట్రో పాల్గొన్నాడు. తిరుగుబాటుతో అధికారం హస్తగతం 1959 జనవరి 2న క్యాస్ట్రో నేతృత్వంలో 9 వేల మందితో కూడిన తిరుగుబాటు దళాలు రాజధాని హవానాలోకి ప్రవేశించారుు. అధికారాన్ని హస్తగతం చేసుకున్నారుు. బటిస్టా పారిపోగా... వందల కొద్దీ అతని మద్దతుదారులకు మరణశిక్ష పడింది. క్యాస్ట్రో ప్రధానమంత్రి అయ్యారు. 1976లో రాజ్యాంగాన్ని మార్చి ఫిడేల్ అధ్యక్షుడయ్యారు. 1959 ఫిబ్రవరి 15న తన తమ్ముడు రౌల్ క్యాస్ట్రోను సైనికదళాల చీఫ్ కమాండర్గా నియమించాడు. అత్యంత జనాకర్షక నేతగా, అనర్గళంగా ఉపన్యాసాలిచ్చే ఫిడేల్... ప్రజలకు భూమిని తిరిగి ఇచ్చేస్తానని, పేదల హక్కులు కాపాడతానని హామీ ఇచ్చాడు. బటిస్టా అనుచరులు చట్టవిరుద్ధంగా కూడబెట్టిన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1960లో క్యూబాలోని అమెరికా వ్యాపారాలన్నింటినీ జాతీయం చేశాడు. ప్రతిచర్యగా 1961 జనవరి 3న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఐసన్హోవర్ క్యూబాపై ఆంక్షలు విధించారు. అమెరికాకు కొరకరాని కొయ్యలా.. 1961లో ప్రవాస క్యూబన్లతో తిరుగుబాటు సైన్యాన్ని ఏర్పరచి ఫిడేల్ క్యాస్ట్రో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమెరికా ప్రయత్నించి విఫలమైంది. ఇక అప్పటినుంచి క్యాస్ట్రో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. బటిస్టాకు వ్యతిరేకంగా పనిచేసిన సాయుధ గ్రూపులు, సంస్థలన్నింటినీ క్యాస్ట్రో ఏకం చేశాడు. ఇవన్నీ కలిసి 1965లో ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ క్యూబా’ ఏర్పడింది. ఏకపార్టీ వ్యవస్థ నెలకొంది. మరోవైపు అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా ఇతర దేశాలతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. సోవియట్ యూనియన్ అధ్యక్షుడు కృశ్చేవ్తో క్యాస్ట్రో బంధం బలపడింది. 1962లో రష్యా ... కూబ్యా గడ్డపై క్షిపణులను మొహరించడంతో 13 రోజుల పాటు ప్రపంచం అణుయుద్ధం భయంతో వణికిపోరుుంది. మూడో ప్రపంచయుద్ధం వస్తుందనే ఆందోళన నెలకొంది. అరుుతే అమెరికాతో కుదిరిన రహస్య సయోధ్య కారణంగా రష్యా మిస్సైల్స్ను ఉపసంహరించడంతో ఉద్రిక్తలు తగ్గారుు. అరుుతే ప్రపంచ రాజకీయ చిత్రపటంపై కమ్యూనిస్టు యోధుడిగా క్యాస్ట్రో ప్రతిష్ట పెరిగింది. అలీనోద్యమంలో ముఖ్య పాత్ర చక్కెర పరిశ్రమలను జాతీయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ముఖ్యంగా ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో క్యూబన్లలో క్యాస్ట్రో ప్రతిష్ట ఇనుమడించింది. మరోవైపు సోవియట్తో సన్నిహితంగా ఉంటూనే అలీనోద్యమంలో క్యూబా ముఖ్యపాత్ర పోషించింది. లాటిన్ అమెరికా దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తిరుగుబాట్లకు మద్దతు ఇవ్వకుండా 1964 తర్వాత రష్యా కొంతవరకు క్యూబాను కట్టడి చేసింది. అరుుతే క్యాస్ట్రో ఇతర ఖండాల్లో విప్లవోద్యమాలకు మద్దతును ఆపలేదు. 1966లో ఆసియా- ఆఫ్రికా, లాటిన్ అమెరికా సాలిడారిటీ ఆర్గనైజేషన్ను ప్రారంభించారు. బొలీవియాలో 1967లో చేగువెరా తిరుగుబాటు విఫలమైంది. చే హతమయ్యాడు. క్యాస్ట్రో తన పంథా వీడలేదు. అంగోలాలో మార్క్సిస్టు గెరిల్లాలకు మద్దతుగా 15 వేల మంది సైన్యాన్ని పంపాడు. 1977లో ఇథియోపియాకు సైనికులను పంపాడు. పలుదేశాలకు వైద్యులను పంపి సాయం చేశాడు. అండగా సోవియట్ అమెరికా ఆంక్షల నేపథ్యంలో సోవియట్ యూనియన్ 1960ల నుంచే క్యూబాకు దన్నుగా నిలిచింది. ఆర్థిక సహాయం చేయడమే కాకుండా... క్యూబా ఉత్పత్తి చేసిన చక్కెరలో (దేశానికి ఇదే ప్రధాన ఆదాయవనరు) సింహభాగాన్ని కొనుగోలు చేసింది. అమెరికా మిత్రదేశాల వ్యాపార ఆంక్షల వల్ల ఇబ్బందిపడుతున్న క్యూబాకు కావాల్సిన ఆహారపదార్థాలు, వస్తువులు అందజేసింది. దీంతో రగిలిపోయిన అమెరికా హత్యాయత్నాలకు తెగించింది. సోవియట్ పతనం తర్వాత.. గోర్బచేవ్ సమయానికి సోవియట్ పరిస్థితి తారుమారైంది. క్యూబా నుంచి చక్కెర కొనుగోలును నిలిపివేసింది. సోవియట్ పతనం తర్వాత క్యూబా ఆర్థిక పరిస్థితి దిగజారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయారుు. దీనికి అమెరికా ఆంక్షలే కారణమని క్యాస్ట్రో విమర్శించేవాడు. క్యాస్ట్రో పాలన ముగిస్తే తప్ప ఆంక్షల ఎత్తివేత ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2000 జూలైలో అమెరికా ఆంక్షలకు వ్యతిరేకంగా క్యాస్ట్రో క్యూబా చరిత్రలోనే పెద్ద ర్యాలీ తీశారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకులు లేకుండా చూసు కోవడంలో క్యాస్ట్రో నిర్దయగా వ్యవహరించారు. క్యూబా పర్యటనకు వెళ్లిన పోప్ జాన్పాల్-2 మానవ హక్కుల ఉల్లంఘటనపై క్యాస్ట్రో సమక్షంలోనే విమర్శలు సంధించారు. తర్వాత క్యూబా మనుగడ కోసం క్యాస్ట్రో కొన్ని రంగాల్లో సంస్కరణలను ప్రవేశపెట్టారు. అమెరికా ‘పక్కలో బల్లెం’ ఆదిలోనే బెడిసికొట్టాయి.. క్యూబాలో అంతర్భాగమైన గాంటనామా బేను అమెరికాకు శాశ్వతంగా లీజుకు అద్దెకిచ్చాక.. దాదాపు 50 ఏళ్లపాటు అమెరికా ప్రభుత్వం, కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి, తిరుగుబాట్లు రాకుండా చూశారుు. 1946లో అరుుతే అమెరికా నేర సామ్రాజ్య నేతలు క్యూబా రాజధాని హవానాలో సమావేశాలు జరిపేవారు. 1959లో క్యూబా నియంత ఫల్జెన్సియో బటిస్టా ప్రభుత్వాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన క్యాో్ట్ర సర్కారును మొదట అమెరికా గుర్తించింది. క్యాస్ట్రో కమ్యూనిస్టు పోకడలు, 500 మందికి పైగా బటిస్టా మద్దతుదారులను విప్లవకారులు కాల్చి చంపడంతో అమెరికాకు అనుమానాలు ఎక్కువయ్యారుు. అప్పట్లోనే అధికార పీఠమెక్కిన క్యాస్ట్రో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆయన్ను కలవడానికి అగ్రరాజ్య నేత ఐసెన్హోవర్ నిరాకరించారు. చివరికి ఉపాధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ను కలిసి క్యాస్ట్రో హవానాకు వెనుదిరిగివచ్చారు. అలా ఆదిలోనే మంచి సంబంధాలకు పునాదులు పడలేదు. అమెరికా ఆస్తుల జాతీయం! 1960లో అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత క్యాస్ట్రో సర్కారు.. క్యూబాలోని ప్రైవేటు భూములను హస్తగతం చేసుకుంది. అమెరికా బడా కార్పొరేషన్ల అనుబంధ కంపెనీలు సహా వందలాది ప్రైవేటు కంపెనీలను జాతీయం చేసింది. దాంతో 1961లో క్యూబాతో అమెరికా అన్ని దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. ఐసెన్హోవర్ తర్వాత అధ్యక్షుడైన జాన్ కెన్నడీ1962 ఫిబ్రవరిలో క్యూబాపై ఆంక్షలు విధించారు. బే ఆఫ్ పిగ్స్ లో దెబ్బపడింది! 1961 జనవరి 20న అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే జాన్ ఎఫ్ కెన్నడీ సీఐఏ తోడ్పాటుతో జరిపిన ‘బే ఆఫ్ పిగ్స’ దాడి ఘోరంగా విఫలమైంది. 1961 ఏప్రిల్ 17న ‘బ్రిగేడ్ 2506’ పేరుతో క్యూబా నుంచి గతంలో పారిపోరుు వచ్చిన సాయుధులతో ఓ పారామిలటరీ దళాన్ని సీఐఏ ఏర్పాటు చేసింది. ఆ దళాన్ని క్యూబాలోని బే ఆఫ్ పిగ్స ప్రాంతంలో దింపి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అరుుతే క్యూబా దళాలు మూడు రోజుల్లో ఈ కిరారుు సేనలను ఓడించాయి. తప్పిన అణుయుద్ధం సోవియట్ యూనియన్ క్యూబాలో క్షిపణుల మోహరింపు పరిణామాల తర్వాత 13 రోజులపాటు రెండు అగ్రరాజ్యాలు, క్యూబా ప్రజలేగాక యావత్ ప్రపంచం తీవ్ర ఉత్కంఠకు గురైంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య అణు యుద్ధం తప్పదని అందరూ భయపడ్డారు. క్యూబాలోకి మరిన్ని సోవియట్ క్షిపణులు ప్రవేశించకుండా అమెరికా యుద్ధనౌకలు క్యూబాను చుట్టుముట్టారుు. మోహరించిన క్షిపణులను కమ్యూనిస్ట్ రష్యాకు తిరిగి పంపేయాలని అమెరికా షరతు పెట్టింది. క్యూబా నుంచి క్షిపణులు తొలగిస్తే.. టర్కీ, ఇటలీ నుంచి అమెరికా క్షిపణులు తొలగిస్తామన్న కెన్నడీ ప్రతిపాదనను సోవియట్ నేత నికితా క్రుశ్చేవ్ అంగీకరించడంతో అణుయుద్ధ ప్రమాదం తప్పింది. చివరికి 2008లో అమెరికాలో రిపబ్లికన్ల పాలనకు తెరపడి ఒబామా అధ్యక్షుడవ్వడంతో అమెరికా, క్యూబాల మధ్య మామూలు సంబంధాలకు మార్గం సుగమమైంది. ఒబామా క్యూబా గడ్డపై అడుగుపెట్టారు. దీంతో రెండు దేశాల మధ్య దశాబ్దాల వైరానికి తెరపడింది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మనం విన్న మాటలు.. అమెరికా పక్కలో బల్లెం క్యూబా. అమెరికా అట్లాంటిక్ తీర రాష్ట్రం ఫ్లోరిడాకు 90 మైళ్ల దూరంలో క్యూబా ఉండడం ఇందుకు కారణం. 50 ఏళ్లపాటు ఈ కరీబియన్ ద్వీప దేశాన్ని పాలించిన ఫిడెల్ క్యాస్ట్రో అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే అమెరికా శత్రువుగా మారారు. అంటే 1961 ఆరంభంలో రెండు దేశాల మధ్య తెగిన దౌత్య సంబంధాలు 2015 జూలై 20 వరకూ మళ్లీ అతుక్కోలేదు. అరుుతే ఈ రెండు పరిణామాలూ క్యాో్ట్ర బతికుండగానే జరిగాయి. అనారోగ్యం.. సోదరుడికి పగ్గాలు 2006 జూలైలో క్యాస్ట్రో పేగులకు అత్యవసర శస్త్రచికిత్స అవసరమైంది. అప్పుడే తన సోదరుడు రౌల్ క్యాస్ట్రోకు తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తాను అధ్యక్ష బాధ్యతలు చూడలేనని స్పష్టం చేయడంతో 2008లో రౌల్ పూర్తిస్థారుు అధ్యక్షుడయ్యారు. తదనంతరం ప్రజాజీవితం నుంచి పూర్తిగా తెరమరుగైన ఫిడేల్ క్యాస్ట్రో అనారోగ్యం పాలైన నాలుగేళ్ల తర్వాత తొలిసారి సాధారణ ప్రజానీకానికి కనిపించారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. జాతీయ అసెంబ్లీలోనూ మాట్లాడారు. తర్వాత అప్పుడప్పుడు మీడియాకు ఆయన వీడియోలు, ఫోటోలను క్యూబా ప్రభుత్వం విడుదల చేసింది. క్యాస్ట్రో పరిస్థితి విషమంగా ఉందని పలుమార్లు వదంతులు వ్యాపించారుు. చివరకు ఈ కమ్యూనిస్టు యోధుడు శుక్రవారం సాయంత్రం (భారతకాలమానం ప్రకారం శనివారం ఉదయం) తుదిశ్వాస విడిచారు. -
కోల్డ్క్రీమ్లో విషపు గుళికలు దాచి..
దాదాపు ఐదు దశాబ్దాలు (1959 నుంచి 2008 దాకా). ఫిడెల్ క్యాస్ట్రోపై ఎన్నెన్ని కుట్రలు చేసినా.. ఎంత గింజుకున్నా అమెరికా ఏమీ చేయలేకపోరుుంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది. ప్రపంచ గతి మారింది. 10 మంది అమెరికా అధ్యక్షులూ మారారు. కానీ క్యాస్ట్రో ఎదురు నిలిచాడు. అగ్రరాజ్యం కుట్రలకూ, కుతంత్రాలకు ఎదురునిలిచాడు. ఫిడెల్ క్యాస్ట్రో ప్రేయసి మారిటా లోరెంజ్. ఆమె గర్భం దాల్చినపుడు అమెరికాకు వెళ్లింది. అక్కడ సీఐఏ ఏజెంట్లు ఆమెను సంప్రదించి.. అమెరికా కోసం క్యాస్ట్రోను నిర్మూలించాల్సిందేనని ఆమెను ఒప్పించారు. కోల్డ్క్రీమ్లో విషపు గుళికలను దాచి పంపారు. వాటిని ఆమె రహస్యంగా క్యాస్ట్రో గదిలోకి తీసుకెళ్లి అతను తీసుకునే డ్రింక్లో కలపాలి. ఈ కుట్ర గురించి తెలిసిన క్యాస్ట్రో... లోరెంజ్ను చూసి ‘నన్ను చంపడానికి వచ్చావా?’ అంటూ గన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. గట్టిగా సిగార్ను పీల్చి వదిలి షూట్ చేయమన్నట్లుగా చూశాడు. అంతే ఆమె గన్లోంచి బుల్లెట్లను తీసేసి.. కన్నీళ్లతో క్యాస్ట్రోపై వాలిపోరుుంది. ‘ఫిడెల్కు తెలుసు నేనతన్ని కాల్చలేనని.. ఎందుకంటే నేనతన్ని ప్రేమించాను. ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. అతనూ అంతే..’ అని లోరెంజ్ స్వయంగా ఈ ఘటనను తర్వాతి కాలంలో వెల్లడించింది. శంఖంలో బాంబు... క్యాస్ట్రోకు స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టం. కాబట్టి డైవ్ చేసినపుడు సముద్ర గర్భంలో ఆకర్షణీయమైన శంఖం పెడితే... దాని దగ్గరకు వెళతాడని, పేలి చనిపోతాడని ప్లాన్ వేసింది సీఐఏ. తను తరచుగా స్కూబా డైవింగ్కు వెళ్లే ప్రదేశంలో దీన్ని ప్లాన్ చేసింది. అరుుతే అమలులో ఇబ్బందులతో దీన్ని ప్రయత్నించలేదు. అలాగే స్కూబా డైవింగ్ సూట్కు విషపూరిత రసాయనాలు పూసి ఓ మిత్రుడి ద్వారా దాన్ని ఫిడెల్ క్యాస్ట్రోకు అందించే ప్రయత్నం చేసింది. కానీ క్యూబా అధ్యక్షుడితో మంచి సాన్నిహిత్యమేర్పడిన ఆ లాయర్ విషపూరితమైన సూట్కు బదులు మామూలు సూట్ను అందజేశాడు. -
ఇందిర.. నా సోదరి!
అలీనోద్యమం జోరుగా నడుస్తున్న రోజులవి.. భారత రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ఏడో అలీనోద్యమ సదస్సుకు వేదికగా నిలిచింది. వందకు పైగా దేశాధినేతలు, పరిశీలకులు పాల్గొన్న ఈ సదస్సులో ఫిడెల్ క్యాస్ట్రో చర్య.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరుకున పెట్టేసింది. అప్పటివరకూ అలీనోద్యమానికి చైర్మన్గా వ్యవహరించిన క్యాస్ట్రో... ఢిల్లీ సదస్సులో ఆ బాధ్యతలను ప్రధాని ఇందిరాగాంధీకి అప్పగించాలి. ‘‘నా సోదరికి ఈ బాధ్యతలు అప్పగించడం నాకు ఆనందం కలిగిస్తోంది’’ అని క్యాస్ట్రో ప్రకటించారు. వేదికపైనే ఉన్న ఇందిర అధికార దండం (న్యాయమూర్తుల వద్ద ఉండే కలప సుత్తి లాంటిది)ను అందుకునేందుకు దగ్గరకు వచ్చారు. చేయి చాచారు. కానీ క్యాస్ట్రో వైపు నుంచి అసలు కదలిక లేదు. చేతిలో దండం అలాగే ఉంది. రెండోసారి చేయి చాచినా.. స్పందన లేదు. క్యాస్ట్రో ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది కానీ దండం మాత్రం చేతులు దాటి రావడం లేదు. ఏం చేయాలబ్బా అని ఇందిర తటపటాయిస్తున్న సమయంలో క్యాస్ట్రో హఠాత్తుగా ముం దుకు కదిలారు. ఇందిరను రెండు చేతులతో గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో అధికార దండాన్ని ఆమె చేతుల్లో పెట్టాడు. ఈ పరిణామంతో ఇందిర ఒకింత షాక్కు గురైనా... ఆ వెంటనే తేరుకుని... చిరునవ్వులు చిందిస్తూ నిలబడిపోరుుంది. ఈలోపు... విజ్ఞాన్ భవన్ మొత్తం చప్పట్లతో మారుమోగిపోరుుంది. అలిగిన అరాఫత్ 1983లో ఢిల్లీలో జరిగిన అలీనోద్యమ సదస్సులో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పాలస్తీనా విమోచనోద్యమ నేత యాసర్ అరాఫత్ ఏదో ఒక విషయమైన అలక వహించారు. సదస్సు నుంచి వాకౌట్ చేసేందుకు సిద్ధమయ్యారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నట్వర్ సింగ్కు ఆ విషయం తెలిసింది. ఆతిథ్య దేశంగా భారత్కు చెడ్డపేరు వస్తుందని, వెంటనే ఆ విషయాన్ని ప్రధాని ఇందిరకు తెలియజేశారు. అరాఫత్ను సముదారుుంచాలని సూచించారు. వెంటనే ఇందిర రంగంలోకి దిగారు. క్యాస్ట్రోను వెంటబెట్టుకుని అరాఫత్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత సంభాషణ ఇలా సాగింది... క్యాస్ట్రో: మిత్రమా.. ఇందిర నీ స్నేహితురాలేనా? అరాఫత్: మిత్రమా... ఇందిరాగాంధీ నా పెద్దక్కతో సమానం. ఆమె కోసం ఏమైనా చేస్తా క్యాస్ట్రో: అరుుతే మంచి తమ్ముడి మాదిరిగా... సదస్సులో పాల్గొను అంతే... అరాఫత్ తన వాకౌట్ ఆలోచనలన్నింటినీ పక్కనబెట్టేశారు. సదస్సులో పాల్గొన్నారు. నెహ్రూ మెచ్చిన సాహసి.. 1960లో ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనేందుకు భారత ప్రధాని నెహ్రూ న్యూయార్క్ వెళ్లారు. ఆ సందర్భంలో క్యాస్ట్రోను స్వయంగా వెతుక్కుంటూ వెళ్లి మరీ కలిశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని.. ‘ప్రపంచంలోనే అత్యంత సాహసిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. అప్పుడు క్యాస్ట్రో 34 ఏళ్ల కుర్రాడు!!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్
అకాయ్ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్డే సెలబ్రేషన్స్
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని ఫొటో ఎటు పోయింది: మీసా భారతి
ఈ ఎన్నికల్లో ఓటు ఎందుకు వేయలేదంటే: జ్యోతిక
గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
తప్పక చదవండి
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
- పవన్, చంద్రబాబుకు ముద్రగడ చురకలు..
Advertisement