breaking news
Call Money Racket
-
మదనపల్లిలో బుస కొడుతున్న కాల్ నాగులు
సాక్షి, అన్నమయ్య జిల్లా: కాల్ నాగులు మళ్లీ బుస కొడుతున్నారు. మదనపల్లిలో వడ్డీ జలగలు రెచ్చిపోతున్నాయి. కాల్ మనీ వేధింపులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధిక వడ్డీల పేరుతో కాల్ మనీ గ్యాంగ్ దోచుకుంటున్నారు. లక్ష అప్పు ఇచ్చి.. పది లక్షలు వడ్డీ వ్యాపారులు వసూలు చేస్తున్నారు.అప్పు తీర్చకుంటే లైంగికంగా వేధిస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్ట్లు పెడుతూ వేధింపులకు దిగుతున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ బాధితురాలు గౌరీ ఆవేదన వ్యక్తం చేశారు.కాల్ మనీ బాధితుల్లో టీడీపీ కార్యకర్త నాగమణి కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నా కూడా తనకు న్యాయం జరగడం లేదని ఆమె వాపోతుంది. కాల్మనీపై హోం మంత్రి అనిత దృష్టికి తీసుకెళ్లినా కానీ ఇంత వరకు చర్యలు లేవని బాధితురాలు నాగమణి అంటున్నారు. -
విజయవాడలో పడగ విప్పిన టీడీపీ కాల్నాగులు
-
విజయవాడలో మళ్లీ కాల్మనీ కలకలం.. పోలీసుల సీరియస్
సాక్షి, విజయవాడ: విజయవాడలో టీడీపీ 'కాల్' నాగులు పడగవిప్పారు. అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులిచ్చి ముక్కుపిండి మరీ వసూలు చేస్తూ ప్రజల రక్తం పీలుస్తున్నారు. నగరంలో ఓ టీడీపీ కార్పొరేటర్ కుమారుడు సొంత పార్టీ కార్యకర్తలనే వేధిస్తున్నాడు. 61వ డివిజన్కు చెందిన కార్పొరేటర్ దుర్గ కొడుకు ధనశేఖర్.. ఫణికుమార్ అనే వ్యక్తికి రూ.50వేలు అప్పుగా ఇచ్చి ఇప్పటివరకూ రెండున్నర లక్షలు వసూలు చేశాడు. అంతేకాక బాధితుడు ఫణికుమార్ భార్యను సైతం వేధించాడు. టీడీపీ నేతల కాల్మనీ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ధనశేఖర్ను అరెస్ట్ చేసి.. 386, 509, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ధనశేఖర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్కు తరలించారు. బాధితుడు ఫణికుమార్ బాధితుడు ఫణికుమార్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కోసం దశాబ్దకాలంగా పనిచేశాను. టీడీపీ కార్యక్రమాలకు ఉచితంగా ఫోటోలు తీశాను. అయినప్పటికీ తీసుకున్న రూ.50 వేలకు రెండున్నర లక్షల వరకు వడ్డీ కట్టాలని వేధించారు. విడతల వారీగా చాలా సొమ్ము చెల్లించాము. నా భార్యని సైతం అనేక విధాలుగా వేధించారు. టీడీపీ నేత ధనశేఖర్ వేధింపులు తాళలేక నా భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. వాళ్లు చేసిన అన్యాయాలు, అక్రమాలు అన్ని నాకు తెలుసు. ధనశేఖర్ బాధితులు చాలామంది ఉన్నారు. అందరూ త్వరలోనే బయటకు వస్తారు అని బాధితుడు ఫణికుమార్ తెలిపారు. చదవండి: (‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం) -
నిండు ప్రాణం తీసిన కాల్మనీ అరాచకాలు
-
'ఈ కేసులో అకారణంగా ఇరికించారు'
విజయవాడ : కాల్మనీ కేసులో అకారణంగా తనను ఇరికించారని డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో డీఈ సత్యానందం మాట్లాడుతూ... తాను ఉద్యోగ సంఘం నేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏ బి వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిపారు. కాల్మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా డీఈ సత్యానందం స్పష్టం చేశారు.