BSNL office
-
వరంగల్: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత
-
అగ్నిపథ్: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత..
సాక్షి, వరంగల్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా దాడులు జరిగిన విషయం తెలిసిందే. దాడుల నేపథ్యంలో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో వరంగల్కు చెందిన రాకేశ్ మృతిచెందాడు. కాగా, వరంగల్ ఎంజీఎం నుంచి స్వగ్రామానికి శనివారం ఉదయం రాకేశ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుండగా ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. అంతిమ యాత్రలో పాల్గొన్న ఆందోళనకారులు.. ఒక్కసారిగి వరంగల్లోని బీఎస్ఎన్ఎల్(BSNL) ఆఫీసుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆఫీసుకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ విధ్వంసంపై ఇలా ప్లాన్! -
బీఎస్ఎన్ఎల్ కార్యాలయం సీజ్
జగ్గయ్యపేట అర్బన్ : ఇంటి పన్ను చెల్లించకపోవటంతో స్థానిక బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజినల్ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లకు వచ్చిన పురపాలక సంఘ రెవెన్యూ అధి కారులు.. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపివేసి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి సీల్ వేశారు. పన్ను చెల్లింపునకు ఈనెల 31 వ తేదీ డెడ్లైన్ కావటంతో మున్సిపల్ కమిషనర్ పి.రమేష్ ఆదేశాల మేరకు పన్ను బకాయిల వసూలు లక్ష్యంతో రెవెన్యూ విభాగం సిబ్బంది స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో భాగంగా బీఎస్ఎన్ఎల్ గత 18 ఏళ్లుగా రూ.5.13 లక్షల ఇంటి పన్నును చెల్లించకపోవటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాతరు చేయలేదు. దీంతో బుధవారం కార్యాలయానికి వచ్చి మరొకసారి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్ ఆర్. వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ కేజే శంకర్, టీమ్ లీడర్ చావా ప్రేమ్చంద్, సీనియర్ అసిస్టెంట్ ఆంజనేయులు, బిల్ కలెక్టర్లు నాగరాజు, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని సీజ్ చేస్తున్నట్లు నోటీస్ జారీ చేసి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి సీల్ వేశారు. కాగా ఒక దశలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు, సిబ్బందికి.. మున్సిపల్ అధికారులు, సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు ససేమిరా అనటంతో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మున్సిపల్ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. -
వామ పక్షాలు BSNL కార్యాలయం ముట్టడి
-
బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో చోరీ
విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలో చోరీ జరిగింది. పట్టణంలోని రంజనీ థియేటర్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ ప్రాంచైజీలో శుక్రవారం రాత్రి దొంగలు చొరబడిరూ. 40 వేల నగదు, రూ. 45 వేల విలువ చేసే రీచార్జ్ కార్డులు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై శనివారం ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు ప్రారంభించారు. -
ప్రత్యేక హోదా డిమాండ్తో సెల్టవర్ ఎక్కిన యువకుడు
- పదిగంటలుగా సాగుతున్న ఆందోళన పెదకాకాని : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని, సంబంధిత అధికారులు హామీ ఇవ్వాలని కోరుతూ ఉదయం 9.30 గంటలకు సెల్టవర్ ఎక్కిన వ్యక్తి కిందకు దిగకపోవడంతో ఉత్యంఠ కొనసాగుతోంది. గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని గుంటూరు ఆటోనగర్ సమీపంలో బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, మైక్రోవేవ్ బిల్డింగ్ ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ రోడ్డు పక్కనే ఉన్న మైక్రోవేవ్ బిల్డింగ్ వెనుక ఉన్న సెల్టవర్పైకి గుంటూరు సీతానగరానికి చెందిన మామిళ్ళపల్లి సంజీవరావు ఎక్కారు. ఎప్పటి మాదిరిగానే శనివారం ఉదయం 10 గంటలకు ఆఫీసు సిబ్బంది వచ్చారు. అప్పటికే టవర్ ఎక్కిన సంజీవరావు అతని స్నేహితుడు పిచ్చయ్యనాయుడుకు సమాచారం అందజేయడంతో వారు కూడా అక్కడికి చేరుకున్నారు. వారు తెలిపిన సమాచారంతో పెదకాకాని పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సంజీవరావు మాత్రం అతని స్నేహితుడు నాయుడుతో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఒక్కరితోనే మొదలైందని, చిన్నతనం నుంచి ఒక మంచిపని చేయాలనే కోరిక ఉంది. నా చావుతో నైనా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందని 5 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందని, తన బార్య పిల్లలు బాధ పడుతున్నారు జాగ్రత్త అంటూ ఫోన్ ద్వారా మాట్లాడుతున్నాడు. సంజీవరావుకు బార్య కవిత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల్లూరు జిల్లా, కొండాపురం మండలం, పార్లపల్లికి చెందిన సంజీవరావు ఎమ్మెస్సీ వరకూ చదువుకున్నాడు. ఏడాది క్రితం గుంటూరు చేరుకుని సూర్యా కన్సల్టెన్సీ పేరుతో రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. సంఘటనా స్థలానికి పెదకాకాని సీఐ కాకర్ల శేషారావు, ఎస్ఐ పి కృష్ణయ్య, అగ్నిమాపకశాఖ అధికారులు, గుంటూరు తహశీల్ధార్ మూర్తి ఆయన్ను క్షేమంగా కిందకు దించేందుకు బుజ్జగిస్తున్నారు. ఇంకా ఆయన కిందకు దిగలేదు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయం మద్ధతుదారుల ధర్నా పలువురు మద్దతు దారులు కార్యాలయం ముందు టెంట్ వేసి ధర్నా చేపట్టారు. అనంతరం రోడ్డు పైకి చేరుకుని ధర్నా చేయడంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదంతో కూడిన ఆందోళనలు మంచిది కాదని, క్షేమంగా కిందికి దిగిరావాలని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా కోరారు. ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. -
నిమజ్జనంలో అపశ్రుతులు
జిల్లా వ్యాప్తంగా వినాయక శోభాయాత్రల్లో పలు అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. విద్యుదాఘాతంతో ముగ్గురు మరణించగా, పాత కక్షలతో ఊరేగింపులో జరిగిన ఘర్షణలో ఒకరు దారుణహత్యకు గురయ్యారు. పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. హుజూరాబాద్, న్యూస్లైన్ : గణపతి బప్పా మోరియా అంటూ భక్తిపారవశ్యంలో మునిగిన ఆ శోభాయాత్రలో ఒక్కసారిగా శోకం అలుముకొంది. నవరాత్రుల పాటు పూజించిన వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా ఇద్దరి నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. హుజూరాబాద్ పట్టణంలోని మెకానిక్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని ఊరేగింపు స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి సూపర్బజార్ వైపు వెళ్తుండగా రాత్రి 11 గంటలకు దారిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన హైపవర్ వైర్లు వినాయకుడి రథాన్ని తగిలాయి. రథాన్ని ఆనుకుని ఉన్న జనరేటర్ ఆటోకు విద్యుత్ ప్రభావం తాకడంతో ఆటోను పట్టుకుని ఉన్న పట్టణంలోని మామిండ్లవాడకు చెందిన మహ్మద్ బాబా(28), కొమ్ము ప్రశాంత్(20) అక్కడికక్కడే మరణించగా, కొలుగూరి ప్రవీణ్(25) తీవ్రంగా గాయపడ్డాడు. రథానికి విద్యుత్ తీగలు తగిలిన వెంటనే రథానికి సంబంధించిన జనరేటర్ను తరలిస్తున్న ఆటోకు ప్రమాదవశాత్తు విద్యుదాఘతం చెందడంతోనే ఆ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలాన్ని సీఐ నాగేం దర్గౌడ్ పరిశీలించారు. సంఘటన స్థలాన్ని మృతుల కుటుంబాలను ఆర్డీవో పద్మాకర్ పరిశీలించారు. బాబా సౌండ్స్తో... ప్రమాదంలో చనిపోయిన మహ్మద్ బాబా స్థానికంగా బాబా సౌండ్స్ను నిర్వహిస్తూ ప్రజల్లో మంచిపేరు పొందాడు. గోదావరిఖనికి చెందిన బాబా చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోగా ఆయన మేనమామ ఇక్కడికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం కలిగిన బాబాకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇదే ప్రమాదంలో మరణించిన కొమ్ము ప్రశాంత్ది ఆదిలాబాద్ జిల్లా కడెం. కొద్దిరోజులక్రితం తన చిన్నా న అంకూస్ ఇంటికి చుట్టపు చూపుగా వచ్చాడు. ఈ క్రమంలో బాబా సౌండ్ సెంటర్లో పనిచేస్తున్న అంకూస్తో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ ఊరేగింపునకు హాజరై ప్రమాదంలో చనిపోవడంతో అతని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. విద్యుదాఘాతంతో యువకుడు మృతి మంచిర్యాల టౌన్ : మంచిర్యాల హమాలీవాడ పరిధిలోని 7వ వార్డు విష్ణునగర్ ఏ క్యాబిన్ ఏరియాకు చెందిన చింతకింది రాజు(19) శోభాయూత్రలో విద్యుదాఘాతానికి గురై మృతి చెం దాడు. రామగుండం మండలం కుక్కలగూడూరుకు చెందిన చంద్రయ్య కుటుంబం మంచిర్యాలకు వలస వెళ్లింది. చంద్రయ్య కూలి పనిచేస్తుండగా భార్య లక్ష్మి, కుమారులు రాజు(19), శేఖర్, మహేశ్వరి ఉన్నారు. ఏ క్యాబిన్ ఏరియాలో విష్ణుసాయి గణేశ్ మండలి శోభాయాత్రను బుధవారం సాయంత్రం నిర్వహిస్తుం డగా మూలమలుపు వద్ద విద్యుత్ లైన్ వాహనానికి అడ్డుగా వచ్చింది. రాజు దానిని కర్ర సహాయంతో తొలగించే క్రమంలో లారీ వెనక భాగంలో ఉన్న ఇనుప పోల్కు తగిలి ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో విద్యుత్ లైన్ తెగి రాజుపై పడింది. విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుమారుడిని రక్షించే ప్రయత్నంలో తండ్రి చంద్రయ్యకు కూడా షాక్ తగలడంతో వెనకకు పడగా తలకు గాయమైంది. రాజును 108 ద్వారా మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందగా.. చంద్రయ్య చికిత్స పొందుతున్నాడు. రాజు మరణించిన విషయం తల్లిదండ్రులకు రాత్రి వరకు తెలియలేదు. రాజు ఐటీఐ పూర్తి చేసి వైండింగ్ దుకాణంలో పని చేస్తున్నాడు.